జులై 17 నుంచి తరగతుల నిర్వహణ | july 17th to classes | Sakshi
Sakshi News home page

జులై 17 నుంచి తరగతుల నిర్వహణ

Published Thu, Jun 29 2017 10:31 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్‌ క్యాంపస్‌ కళాశాలల్లో జులై 17 నుంచి పీజీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్‌ ప్రొఫెసర్‌ సీఎన్‌ కృష్ణా నాయక్, ప్రొఫెసర్‌ రంగస్వామి తెలిపారు.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్‌ క్యాంపస్‌ కళాశాలల్లో జులై 17 నుంచి పీజీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్‌ ప్రొఫెసర్‌ సీఎన్‌ కృష్ణా నాయక్, ప్రొఫెసర్‌ రంగస్వామి తెలిపారు. జులై 3 నుంచి తరగతులు పునప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, వర్సిటీలో ఏర్పడిన తాగునీటి ఎద్దడి నేపథ్యంలో వాయిదా వేశామన్నారు. బోధన సిబ్బంది మాత్రం జులై 3 నుంచే హాజరు కావాలన్నారు. ఇదిలా ఉండగా, హాస్టళ్లలో చేపడుతున్న మరమ్మతులను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజగోపాల్, రిజిస్ట్రార్‌ కె.సుధాకర్‌బాబు పరిశీలించారు. గడువులోపు చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement