తగ్గిన తుఫ్రాన్ టోల్గేట్ ఛార్జీలు | NHAI Orders issued on toopran toll gate charges decrease | Sakshi
Sakshi News home page

తగ్గిన తుఫ్రాన్ టోల్గేట్ ఛార్జీలు

Published Wed, Jan 13 2016 5:26 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM

NHAI Orders issued on toopran toll gate charges decrease

హైదరాబాద్ : మెదక్ జిల్లా తుఫ్రాన్ (మనోహరాబాద్) టోల్గేట్ వద్ద వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోల్గేట్ వద్ద వాహనాల నుంచి ఇకపై ఒకసారి వెళ్లడానికి రూ. 70 వసూలు చేస్తారని ... అలాగే వాహనానికి రాను పోను ఛార్జీ అయితే రూ. 105 వసూలు చేస్తారని ఎన్హెచ్ఏఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఈ టోల్గేట్ వద్ద ఇప్పటి వరకు కారు, జీపు, వ్యాను, ఇతర లైట్ మోటర్ వాహనాలు ఒకసారి వెళ్లడానికి రూ. 125... అలాగే రానుపోనుకూ రూ. 180 వసూలు చేస్తున్నారు. దీంతో తక్కువ దూరం ప్రయాణించే స్థానికులకు చాలా వ్యయం అవుతుంది. దీంతో ఈ అంశాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.

దాంతో ఈ అంశంపై కేసీఆర్...  నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నతాధికారులు ఛార్జీలు తగ్గిస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement