
3న తిరుమలకు రానున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 3వ తేదీన తిరుమలకు రానున్నారు.
తిరుమల: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 3వ తేదీన తిరుమలకు రానున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్తారు. మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మంగళవారం తిరుమలలో కోయిళ్ ఆల్వార్ తిరుమంజనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 7 కంపార్ట్మెంట్లలో ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, కాలిబాట భక్తులకు 3 గంటల సమయం పట్టింది.