పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం | post card moment of podupu women | Sakshi
Sakshi News home page

పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం

Nov 25 2016 11:02 PM | Updated on Sep 4 2017 9:06 PM

పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం

పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు గ్రూపుల ఖాతాల్లో వెంటనే రూ. 7 వేలు వేయాలని నగరంలోని 47వ వార్డు మహిళలు డిమాండ్‌ చేశారు.

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు గ్రూపుల ఖాతాల్లో వెంటనే రూ. 7 వేలు వేయాలని నగరంలోని 47వ వార్డు మహిళలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక హెడ్‌ పోస్టాఫీసు ఆవరణలో వారు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు సుమలత, జరీనాబీ మాట్లాడుతూ పొదుపు మహిళల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేస్తానని చెప్పి రూ. 3 వేలతోనే సరిపెట్టుకోవడం విచారకరమన్నారు. అలాగే ప్రధాని జన్‌ధన్‌ ఖాతాల్లో రూ. పది వేలు జమ చేయాలని కోరారు. సీఎం పొదుపు మహిళలకు తక్షణమే రూ. 7 వేలు వేయకపోతే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఆందోళనలో ఫరీదా, జంబావతి, ఈశ్వరమ్మ, సుమతి, శేషమ్మ, లలితమ్మ, రామలక్ష్మి, చిట్టెమ్మ, సుబ్బలక్షమమ్మ, 47వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement