అనంతపురం న్యూసిటీ : తాడిపత్రిలోని 23వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని ఫిర్యాదు చేస్తూ ఆ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డి బుధవారం పబ్లిక్ హెల్త్ ఈఈ సీహెచ్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఎస్ఈ కార్యాలయంలో ఈఈకి వినతిపత్రం ఇచ్చారు. నాణ్యత లోపించిన పనుల ఫొటోలను వినతిపత్రంతో జతపరిచారు. ఈ పనులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.