వీర సైనికులారా వందనం
కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళిగా సోమవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. లోక్సత్తా విద్యార్థి విభాగం, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. హన్మకొండ జూనియర్ కళాశాల నుంచి పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు ర్యాలీ సాగింది.