విద్యార్థిని నుంచి స్మృతికి ఊహించని ప్రశ్న | student asks smriti irani about special status for ap | Sakshi
Sakshi News home page

విద్యార్థిని నుంచి స్మృతికి ఊహించని ప్రశ్న

Published Tue, Jun 7 2016 2:00 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

విద్యార్థిని నుంచి స్మృతికి ఊహించని ప్రశ్న - Sakshi

విద్యార్థిని నుంచి స్మృతికి ఊహించని ప్రశ్న

విజయవాడ: విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. మంగళవారం కేబీఎన్ కాలేజీలో స్మృతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా దుర్గ అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వని కేంద్ర మంత్రి తన శాఖ పరిధిలోనే విషయాలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్కు ఏడాదిలోనే 11 కేంద్ర విద్యాసంస్థలను మంజూరు చేశామని స్మృతి చెప్పారు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రతి ఒక్క అభ్యర్థనను నెరవేర్చుతామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement