Smriti Irani
-
నా ఇన్సిపిరేషన్ అమ్మ.. ఎందుకంటే..
‘నాకు ఏడేళ్లప్పడు మా అమ్మ నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని నాన్న దగ్గర్నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు ‘మనం ఊరెళ్లిపోతున్నాం’ అని చెప్పింది అమ్మ. ‘ఎందుకు?’ అడిగాను. ‘నేను కొడుకును కనివ్వలేను కాబట్టి’ అంది. నాన్న వాళ్లింట్లోంచి వచ్చేప్పుడు అనుకున్నాను ‘ఎప్పటికైనా ఆ ఇంటిని కొంటాను’ అని! అనుకోవడమే కాదు అమ్మతో చెప్పాను కూడా! చాలెంజెస్ ఫేస్ చేయడం ఆ రోజునుంచే మొదలైంది. డబుల్, ట్రిబుల్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించాను. ఆ ఇంటిని కొనేంత కూడబెట్టాను. ఒకరోజు అక్కడికి వెళ్లి అమ్మకు ఫోన్ చేశాను. ‘చిన్నప్పుడు వదిలి వచ్చేసిన ఇంటి దగ్గరున్నానమ్మా’ అని! అప్పుడు అమ్మ ‘ప్రతీకారకాంక్ష మనల్ని దహించేస్తుంది.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. మన ఎనర్జీని నిరుపయోగమైన వాటివైపు మళ్లిస్తుంది. అందుకే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించి, మరచిపోవాలి. మనకు కోపం తెప్పించే వాటిని ఇగ్నోర్ చేయాలి. మన ఎనర్జీని పదిమందికి ఉపయోగపడే విషయాలపై వెచ్చించాలి’ అని చెప్పింది. ఆ మాట నా దిశను మార్చేసింది. అందుకే మా అమ్మే నా ఇన్సిపిరేషన్, టీచర్, గైడ్, ఫిలాసఫర్!’ -
మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్
బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. బహ్రెయిన్కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారుబహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్ భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ 180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవంఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది. 500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు. -
స్మృతి ఇరానీకి ఢిల్లీ పగ్గాలు?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా..నూతన ముఖ్యమంత్రి ఆతిశి ప్రమాణస్వీకారం.. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలన్న గట్టి పట్టుదలతో ముందుకు కదులుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోనే తన నిజాయితీని నిరూపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానంటూ కేజ్రీవాల్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించడంతో ఆయనకు గట్టి పోటీనిచ్చే నేతను రంగంలోకి దించే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే మాజీ కేంద్రమంత్రి, ఫైర్బ్రాండ్ స్మృతి ఇరానీని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సభ్యత్వ నమోదు బాధ్యతలను ఆమెకు కట్టబెట్టిన కమలదళం, మున్ముందు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.పీఠమెక్కాలన్న కసితో బీజేపీ.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను ఎదుర్కొనే క్రమంలో బీజేపీ మాజీ ఐపీఎస్ కిరణ్బేడీని తమ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కిరణ్బేడీ ఏమాత్రం ప్రభావం చూపకపోగా, ఆమె నాయకత్వాన్ని ఏమాత్రం లెక్కపెట్టని బీజేపీ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలో మౌనం వహించాయి. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు గానూ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో సీఎం అభ్యరి్థని ప్రకటించకుండానే బీజేపీ పోటీకి దిగింది. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. అదే 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్కు తిరిగి అధికారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ ముందునుంచే ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే స్మృతి ఇరానీని ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలం చేసే పనిలో పడింది. ఢిల్లీ బీజేపీకి చెందిన 14 జిల్లా యూనిట్లలోని ఏడింటిలో సభ్యత్వ నమోదు బాధ్యతలను పార్టీ ఆమెకు కట్టబెట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి ఢిల్లీలోని ప్రతి వార్డులో ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభ్యత్వ కార్యక్రమాలలో బూత్ స్థాయి కార్యకర్తల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టారు. దక్షిణ ఢిల్లీలో ఇప్పటికే ఆమె ఒక ఇంటిని సైతం కొనుగోలు చేశారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో అమేధీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో ఓటమి అనంతరం ఎక్కడా కనిపించని ఆమెకు తాజాగా ఢిల్లీ బాధ్యతలు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, ఎంపీ బాసూరీ స్వరాజ్ క్రియాశీలంగా ఉన్నప్పటికీ ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు ఎంపీలు మనోజ్ తివారీ, ప్రదీప్ ఖండేల్వాల్, కామజీత షెరావత్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా వంటి సీనియర్లు ముఖ్యమంత్రి ముఖాలుగా ఉన్నప్పటికీ వాక్చాతుర్యం, గాంధీ కుటుంబ వ్యతిరేక భావజాలమున్న ఇరానీనే సరైన మార్గమని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఆప్ కొత్త ముఖ్యమంత్రి ఆతిశిని ఎదుర్కొనేందుకు ఇరానీ సరితూగుతారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహరచన, ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను ఆమెకు అప్పగించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -సాక్షి, న్యూఢిల్లీ -
రాహుల్ రాజకీయం మారింది.. స్మృతి ప్రశంస
లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ అదరగొడుతున్నారు. పార్లమెంట్లో ఇప్పటికే పలు అంశాలపై ఎన్డీయే కూటమి సర్కార్కు రాహుల్ చుక్కలు చూపించారు. ప్రస్తుతం రాజకీయంగా ప్రతీ విషయంలోనూ యాక్టివ్గా ఉంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. దీంతో, రాజకీయ విమర్శకులు, ప్రత్యర్థుల నుంచి కూడా రాహుల్ ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక, ఆ జాబితాలోకి మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా చేరిపోయారు.తాజాగా రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గురించి స్మృతి ఇరానీ ప్రస్తావిస్తూ..‘రాజకీయంగా రాహుల్ గాంధీ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తన గెలుపును రాహుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో అలా మాట్లాడటం ఎంతో కీలకం. పార్లమెంట్లోకి తెల్ల టీషర్ట్ వేసుకుని హాజరు కావడం ద్వారా యువతకు ఓ సందేశం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తోంది అంటూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇక, ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు షాక్లోకి వెళ్లిపోయారు. Whether you like it or not, but Rahul Gandhi’s politics has changed. He is giving a message to the youths of the country through his white T-shirt. — BJP leader Smriti Irani pic.twitter.com/qsdCIwFE2z— Shantanu (@shaandelhite) August 28, 2024రాహుల్ వ్యాఖ్యలే కారణమా?పార్లమెంట్ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి స్మృతి ఇరానీ ఓటమిని చవిచూశారు. రాహుల్ గాంధీ ఆఫీసులో పనిచేస్తున్న కిషోరీ లాల్ శర్మ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం, కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా స్మృతి ఇరానీని టార్గెట్ చేశారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ.. స్మృతి ఇరానీకి మద్దతుగా నిలిచారు. జీవితంలో గెలుపోటములు సహజం. ఈ విషయంలో స్మృతీ ఇరానీతోపాటు ఇతర నేతలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు. దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలి. ఇతరులను కించపరచడం, అవమానించడం బలహీనతకు సంకేతం అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. అందుకే రాహుల్ విషయంలో ప్రస్తుతం స్మృతి ఇరానీ ఇలా మాట్లాడారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. After Rahul Gandhi gave his speech, Smriti Irani roaring now in loksabha🔥🔥.Smriti Irani : "You are not India, for India is not corrupt. India believes in merit not in dynasty & today of all the days people like you need to remember what was told to the British - Quit India.… pic.twitter.com/E3RtczdW0g— Times Algebra (@TimesAlgebraIND) August 9, 2023 నాడు విమర్శలు..అయితే, రాహుల్ గాంధీకి రాజకీయ ప్రత్యర్థి అయిన స్మృతి ఇరానీ అంతకుముందు ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అమేథీలో పోటీ చేసేందుకు రాహుల్ భయపడుతున్నారని పలు సందర్భాల్లో సెటైర్లు వేశారు. తనను చూసి రాహుల్ వయనాడ్ పారిపోయారని కూడా ఎద్దేవా చేశారు. ఇక, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా సభలో రాహుల్పై స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. రాహుల్ అసలు భారతీయుడే కాదంటూ మండిపడ్డారు. అంతేకాకుండా.. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీతో డిబేట్ చేసే స్థాయి రాహల్ గాంధీకి ఉందా?. రాహల్ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా? అంటూ కూడా కామెంట్స్ చేశారు. Modi Govt has an absolute majority, they have 353 MPs. In Manipur, there is a BJP CM. But when a question on Manipur was asked, the Women and Child Development minister @smritiirani said that @RahulGandhi’s actions put Manipur on fire. How shameless & obsessed one can be,… pic.twitter.com/MyDK8VGZP2— Shantanu (@shaandelhite) July 26, 2023 -
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన స్మృతీ ఇరానీ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆమె గత పదేళ్లుగా ఈ బంగ్లాలో ఉంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ప్రభుత్వం కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలంతా జూలై 11లోగా తమ నివాసాలను ఖాళీ చేయాల్సివుంది. దీనిపై స్మృతీ ఇరానీకి నోటీసు రావడంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.2024 లోక్సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె నివాసం ఉంటున్న ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ ఆమెకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టేట్ డైరెక్టర్ నుంచి నోటీసు వచ్చింది. దీంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు. -
లండన్కు స్మృతి ఇరానీ.. ‘మోదీ 3.0’ విజయోత్సవాలకు హాజరు
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వారిలో స్మృతి ఇరానీ ఒకరు. ఓటమి తర్వాత ఆమె చాలా అరుదుగా బహిరంగంగా కనిపించారు. ఈ నేపధ్యంలో స్మృతి ఇరానీ ప్రస్తుతం ఎక్కడున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ ప్రస్తుతం బ్రిటన్లో ఉన్నారు. అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ‘మోడీ 3.0’ విజయోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్మృతీ ఇరానీ లండన్ చేరుకున్నారు. అక్కడి అభిమానులు ఆమెకు ఘస స్వాగతం పలికారు. ఈ సమయంలో పలు దేశభక్తి నినాదాలు చేశారు.స్మృతి ఇరానీ సభలో మాట్లాడుతూ తనకు ఇక్కడ బెంగాలీ, గుజరాతీ స్నేహితులు ఉన్నారని తెలిపారు. తరువాత మలయాళంలో మాట్లాడుతూ కేరళకు చెందినవారిని పలుకరించారు. అలాగే మహారాష్ట్ర ప్రజలను మరాఠీలో పలకరించారు. ఈ సమయంలో అక్కడున్న వారిలో కొందరు జై మహారాష్ట్ర, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్మృతి మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతుల మిళితం అని, తాను భారతీయురాలిని అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. #WATCH लंदन, ब्रिटेन: भाजपा नेता स्मृति ईरानी ने कहा, "...विभिन्न आवाजों और संस्कृतियों के इस सम्मिश्रण के बावजूद, एक आवाज ही आवाज गूंज रही है, 'मैं भारतीय हूं'..." https://t.co/U6IBYD822w pic.twitter.com/P9ZCATcHJx— ANI_HindiNews (@AHindinews) June 23, 2024 -
ఓటమి దిశగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2024 ఎన్నికల్లో ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తున్న అమేధీ నుంచి ఆమె వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిదిశగా పయనిస్తున్నారు.. కి కాంగ్రెస్ అభ్యర్థి, గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ 28వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో ఉత్కంఠగా మారింది.శర్మకు గత 40 సంవత్సరాలుగా అమేథీతో అనుబంధం ఉంది. అమేథీలో ప్రియాంక గాంధీ వాద్రా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమేథీకి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన రాహుల్ 2019లో ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇండియా కూటమి దాదాపు226పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 2019లో భారీ మెజార్జీసాధించిన బీజేపీ గతంతో పోలిస్తే 61 సీట్లతో నష్టంతో కేవలం 291 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారం పీఠం ఎవరికి దక్కనుంది అనేదానిపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమేథీ చరిత్ర ఇదీ1980లో సంజయ్ గాంధీ విజయంతో వారసత్వం ప్రారంభమైంది. అతని ఆకస్మిక మరణం తరువాత, అతని సోదరుడు రాజీవ్ గాంధీ 1981 ఉప ఎన్నికలలో విజయం సాధించారు మరియు 1984, 1989 , 1991లో విజయం సాధించారు. రాజీవ్ హత్య తర్వాత, కుటుంబ విధేయుడైన సతీష్ శర్మ 1991 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో సోనియాగాంధీ, 2004, 2009, 2014లో రాహుల్గాంధీ అమేథీ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. -
లోక్సభ ఎన్నికలు 2024: ముగిసిన ఐదో విడత పోలింగ్
Updatesసాయంత్రం 7 గంటలవరకు నమోదయిన సగటు పోలింగ్ శాతం 57.38బీహార్ - 52.35%జమ్మూ-కాశ్మీర్ - 54.21%జార్ఖండ్ - 61.90%లఢఖ్ - 67.15%మహారాష్ట్ర - 48.66%ఒడిస్సా- 60.55%ఉత్తరప్రదేశ్ - 55.80%పశ్చిమబెంగాల్ - 73%మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం పోలింగ్..లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు తమ ఓటు హక్కు వినియోంగిచుకోవడానికి తరలి వస్తున్నారు.మధ్యాహ్నం 3 గంటల వరకు సగటున 47.53 శాతం పోలింగ్ నమోదుబీహార్ 45.33 శాతంజమ్మూ అండ్ కాశ్మీర్ 44.90 శాతంఝార్ఖండ్ 53.90 శాతంలడఖ్ 61.26 శాతంమహారాష్ట్ర 38.77 శాతంఒడిశా 48.95శాతంఉత్తర ప్రదేశ్ 47.55 శాతంవెస్ట్ బెంగాల్ 62.72 శాతంమధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 36.73 శాతం పోలింగ్ నమోదైంది.బీహార్ 34.62%జమ్మూ కశ్మీర్ 34.79%జార్ఖండ్ 41.89%లడఖ్ 52.02%మహారాష్ట్ర 27.78%ఒడిశా 35.31%ఉత్తరప్రదేశ్ 39.55%పశ్చిమ బెంగాల్ 48.41%#LokSabhaElections2024 | 36.73% voter turnout recorded till 1 pm, in the fifth phase of elections. Bihar 34.62% Jammu & Kashmir 34.79%Jharkhand 41.89%Ladakh 52.02% Maharashtra 27.78% Odisha 35.31% Uttar Pradesh 39.55%West Bengal 48.41% pic.twitter.com/6cxi2tJsHq— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రబాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆయన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకీ రోషన్, సోదరి సునైనా రోషన్తో కలసి ఓటు వేశారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Actor Hrithik Roshan, his sister Sunaina Roshan & their parents Rakesh Roshan and Pinkie Roshan cast their votes at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5h8XFTRMvA— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రశివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.Uddhav Thackeray, his wife Rashmi and son Aaditya cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/Ljg2V0qtYc#UddhavThackeray #AadityaThackeray #LokSabhaElections2024 pic.twitter.com/8nSagjge6V— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్రనటుడు మనోజ్ బాజ్పాయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Mumbai: After casting his vote, actor Manoj Bajpayee says, "This is the biggest festival and everyone should vote as you will get this opportunity after 5 years. If you haven't voted then you have no right to complain..."#LokSabhaElections2024 pic.twitter.com/ECZH5TeBU8— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రక్రికెటర్ అజింక్య రహానే దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.LS Polls 2024: India cricketer Ajinkya Rahane, wife cast their vote in MumbaiRead @ANI Story | https://t.co/MyHmMbTF55#AjinkyaRahane #LokSabhaElections2024 pic.twitter.com/EUkJ5a0ZGR— ANI Digital (@ani_digital) May 20, 2024 దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.Sachin Tendulkar, son Arjun, cast vote in Lok Sabha electionsRead @ANI Story | https://t.co/Lz7fVhAoT0#SachinTendulkar #LokSabhaPolls #cricket #LSPolls #Elections2024 #TeamIndia pic.twitter.com/Vq2cgSgYCE— ANI Digital (@ani_digital) May 20, 2024 ఢిల్లీ:ఐదో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 23.66 శాతం ఓటింగ్ నమోదైంది.బీహార్- 21.11%జమ్మూ కశ్మీర్- 21.37%జార్ఖండ్- 26.18%లడఖ్- 27.87%మహారాష్ట్ర- 15.93%ఒడిశా- 21.07%ఉత్తరప్రదేశ్- 27.76%పశ్చిమ బెంగాల్- 32.70%#LokSabhaElections2024 | 23.66% voter turnout recorded till 11 am, in the fifth phase of elections. Bihar 21.11% Jammu & Kashmir 21.37% Jharkhand 26.18% Ladakh 27.87% Maharashtra 15.93% Odisha 21.07% Uttar Pradesh 27.76%West Bengal 32.70% pic.twitter.com/wr9kbCIwYN— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్రమహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.థానేలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Maharashtra CM Eknath Shinde casts his vote at a polling booth in Thane. #LokSabhaElections2024 pic.twitter.com/RZvG01iVyY— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర:బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Veteran actor Dharmendra casts his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/FqXmZ5jFPG— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: ఎంపీ హేమా మాలిని, ఆమె కూమార్తె ఇషా డియోల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.#WATCH | Mumbai, Maharashtra: Actress and BJP MP Hema Malini, her daughter and actress Esha Deol show indelible ink marks on their fingers after casting their votes at a polling booth in Mumbai #LokSabhaElections2024 pic.twitter.com/T3I2wmA0H0— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్:కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ కుటుంబసభ్యులతో వచ్చిన ఓటు వేయాలని కోరుతున్నా.#WATCH | Lucknow, Uttar Pradesh: "I appeal to the voters of the country to cast their vote along with their family members...," says Defence Minister and BJP candidate from Lucknow Lok Sabha seat, Rajnath Singh after casting his vote #LokSabhaElections2024 pic.twitter.com/tf5Pz7hjO8— ANI (@ANI) May 20, 2024 ఉత్తర ప్రదేశ్: అమేథీ బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.అమేథీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Amethi Lok Sabha seat, Smriti Irani arrives at a polling station in Amethi to cast her vote for #LokSabhaElections2024Congress has fielded KL Sharma from this seat. pic.twitter.com/yAeOMBZZxP— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Bollywood actor Paresh Rawal shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/5FVCXjNMqn— ANI (@ANI) May 20, 2024 ఢిల్లీ: ఐదో విడత పోలింగ్ కొనసాగుతోందిప్రజలు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు.ఉదయం 9 గంటల వరకు 49 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్ శాతం 10.28 శాతం బీహార్ - 8.86% జమ్మూ-కాశ్మీర్ - 7.63% జార్ఖండ్ - 11.68% లఢఖ్ - 10.61% మహారాష్ట్ర - 6.33% ఒడిస్సా- 6.87% ఉత్తరప్రదేశ్ - 12.89% పశ్చిమబెంగాల్ - 15.35% #LokSabhaElections2024 | 10.28% voter turnout recorded till 9 am, in the fifth phase of elections.Bihar 8.86% Jammu & Kashmir 7.63%Jharkhand 11.68%Ladakh 10.51%Maharashtra 6.33%Odisha 6.87%West Bengal 15.35% pic.twitter.com/bNP5RqOg7d— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Actor Sanya Malhotra shows the indelible ink mark on her finger after casting her vote at a polling booth in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/ajbM69mtqJ— ANI (@ANI) May 20, 2024మహారాష్ట్ర: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాలో మాట్లాడారు.ఈ ఎన్నికల నాకు గొప్ప అవకాశం ఇచ్చాయి. ప్రజలను కలిసి.. ఆశీస్సులు తీసుకున్నా.#WATCH | Union Minister and BJP candidate from Mumbai North Lok Sabha seat, Piyush Goyal shows his inked finger after casting his vote at a polling station in Mumbai.#LokSabhaElections2024Congress has fielded Bhushan Patil from the Mumbai North seat. pic.twitter.com/81pfeAEiav— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబై పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.భారత్ అభివృద్ధి చెందాలిదానిని దృష్టితో పెట్టుకొని ఓటు వేశానుప్రజలు ఓటు వేయడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు.#WATCH | Actor Akshay Kumar shows the indelible ink mark on his finger after casting his vote at a polling booth in Mumbai.He says, "...I want my India to be developed and strong. I voted keeping that in mind. India should vote for what they deem is right...I think voter… pic.twitter.com/mN9C9dlvRD— ANI (@ANI) May 20, 2024 మహారాష్ట్ర: బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, డైరెక్టర్ జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Maharashtra: Actor Farhan Akhtar and Director Zoya Akhtar show their inked fingers after casting their votes at a polling station in Mumbai.#LokSabhaElections pic.twitter.com/ESpxvZNuGN— ANI (@ANI) May 20, 2024 ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేయండి: ప్రధాని మోదీప్రజాస్వామ్య పండుగలో ఓటు హక్కు వినియోగించుకోండిఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి"Vote in record numbers": PM Modi appeals voters to cast franchise in festival of democracyRead @ANI Story | https://t.co/CDSpNQxl1l#PMModi #LokSabhaElection2024 pic.twitter.com/pQIC7v0YRP— ANI Digital (@ani_digital) May 20, 2024 మహారాష్ట్ర: వ్యాపారవేత్త అనిల్ అంబాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Industrialist Anil Ambani casts his vote at a polling booth in Mumbai, for the fifth phase of #LokSabhaElections2024 pic.twitter.com/2CpXIZ6I0l— ANI (@ANI) May 20, 2024ఉత్తర ప్రదేశ్:మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.లక్నోలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చుంటున్నారు.#WATCH | Former Uttar Pradesh CM and BSP chief Mayawati shows her inked finger after casting her vote for #LokSabhaElections2024 at a polling station in Lucknow. pic.twitter.com/ZmtmwJg8Yq— ANI (@ANI) May 20, 2024 బిహార్బిహార్లోని ముజఫర్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటు వేయడానికి మహిళలు క్యూలైన్లో నిల్చున్నారు. #WATCH | Bihar: Women queue up in large numbers at a polling booth in Muzaffarpur as they wait for voting to begin. #LokSabhaElections2024 pic.twitter.com/AgOrKHB8FX— ANI (@ANI) May 20, 2024 ఐదో విడత పోలింగ్ ప్రారంభమైందిVoting for the fifth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 49 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 35 Assembly constituencies in Odisha. pic.twitter.com/EZ1yEm7LJG— ANI (@ANI) May 20, 2024 లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తదితర కీలక నేతలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజే పోలింగ్ చేపడుతున్నారు. ఏడు దశలను చూస్తే ఈ ఐదో దశలోనే అత్యంత తక్కువ(49) స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కిపైగా చోట్ల విజయం సాధించడం విశేషం. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భారీగా పాలుపంచుకోవాలని ముంబై, థానె, లక్నో నగర ఓటర్లకు ఈసీ ఆదివారం విజ్ఞప్తి చేసింది. బరిలో కీలక నేతలుకేంద్ర మంత్రులు రాజ్నాథ్(లక్నో), పియూశ్ గోయల్( నార్త్ ముంబై), కౌశల్ కిశోర్(మోహన్లాల్గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేపూర్), శంతను ఠాకూర్ (పశ్చిమబెంగాల్లోని బంగావ్), ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (బిహార్లోని హాజీపూర్), శివసేన శ్రీకాంత్ షిండే(మహారాష్ట్రలోని కళ్యాణ్), బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య( బిహార్లోని సరణ్), ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్(ముంబై నార్త్ సెంట్రల్)ల భవితవ్యం సోమవారమే ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. విపక్షాలు అధికారంలోకి వస్తే అయోధ్య బాలరామాలయం పైకి బుల్డోజర్లను పంపిస్తారని మోదీ తీవ్ర విమర్శలు, ఎన్డీఏ 400 చోట్ల గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టమొచ్చినట్లు మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ విమర్శలతో ఐదో దశ ప్రచారపర్వంలో కాస్తంత వేడి పుట్టించింది. ఒడిశాలో ఐదు లోక్సభ స్థానాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ కింద 35 ఎమ్మెల్యే స్థానాల్లోనూ సోమవారం పోలింగ్ జరగనుంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పోటీచేస్తున్న హింజీలీ అసెంబ్లీ స్థానంలో ఈరోజే పోలింగ్ ఉంది. లోక్సభ ఎన్నికల్లో నాలుగోదశ ముగిశాక 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో ఇప్పటిదాకా 379 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది.ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనుంది. -
అమేథీలో బీజేపీకి ఎదురుగాలి?
యూపీలోని అమేథీలో బీజేపీ మహిళానేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతీ ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు వాపోతున్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదహరిస్తూ.. ద్రౌపదిని అవమానించనప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తరువాత బాధ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్పుత్ సమాజానికి చెందినవారెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు.స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ మహిళా ఎంపీగా ఆమె మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె పార్లమెంట్లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్సింగ్ను కూడా తొలగించారని, హర్యానాలో మనోహర్లాల్ ఖట్టర్ను కూడా తొలగించారని, రమణ్సింగ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్నాథ్సింగ్ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్నాడ్లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
Amethi: స్మృతి వర్సెస్ కిశోరీ
అమేథీ. ఉత్తరప్రదేశ్లోని ఈ లోక్సభ స్థానం గాంధీ కుటుంబానికి పెట్టని కోట.. కాంగ్రెస్కు కంచుకోట. అలాంటి దీర్ఘకాల రాజకీయ వారసత్వానికి 2019లో బీజేపీ గట్టి షాకే ఇచి్చంది. ఏకంగా గాంధీ కుటుంబ వారసుడు రాహుల్గాంధీనే ఓడించి కాంగ్రెస్ కుంభస్థలం మీద కొట్టింది. పార్టీ తరఫున నెగ్గి జెయింట్ కిల్లర్గా అవతరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈసారి కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్కు బదులు గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీలాల్ శర్మ బరిలోకి దిగారు. ఓటమి భయంతోనే అమేథీని వదిలి రాయ్బరేలీకి మారారంటూ సోషల్ మీడియాలో రాహుల్ ఒక రేంజ్లో ట్రోలింగ్కు గురయ్యారు. ఈ నెల 20న ఐదో విడతలో పోలింగ్ జరగనున్న అమేథీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.గాందీల అనుబంధం అమేథీ లోక్సభ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. నాటినుంచీ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. 1977 ఎన్నికల్లో మాత్రం ఎమర్జెన్సీ ప్రభావంతో జనతా పారీ్టకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ గెలుపొందారు. ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాం«దీని 75,000కు పైగా ఓట్లతో ఓడించారు. 1980 ఎన్నికల్లో సంజయ్ పుంజుకుని రవీంద్ర ప్రతాప్ సింగ్ను 1,28,545 తేడాతో ఓడించారు. అదే ఏడాది జూన్లో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో రాజీవ్ గాంధీ 2,37,696 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో రాజీవ్పై సంజయ్ భార్య మేనకా గాంధీ స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. రాజీవ్ దేశవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయన తరపున భార్య సోనియాగాంధీ తొలిసారి ఎన్నికల ప్రచార బరిలో దిగారు. తలపై చీరకొంగు, నుదుటన బొట్టు, చేతికి ఎర్రటి గాజులు, స్వచ్ఛమైన హిందీతో సామాన్యులను బాగానే ఆకట్టుకున్నారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయకున్నా ఇటు పార్టీ నాయకులకు, అటు ప్రజలకు చేరువయ్యారు. ప్రధానిగా రాజీవ్ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోరన్న ప్రచారం జరిగినా అమేథీ ప్రజలు ఆయనవైపే నిలిచారు. మేనకపై ఏకంగా 3.14 లక్షల మెజారిటీతో రాజీవ్ ఘనవిజయం సాధించారు. అమేథీలో నేటికీ అదే రికార్డు మెజారిటీ. రాజీవ్ మరణించేదాకా అమేథీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. తరవాత ఆయన స్థానంలో గాంధీ కుటుంబ సన్నిహితుడు సతీశ్ శర్మ విజయం సాధించి పీవీ కేబినెట్లో పెట్రోలియం మంత్రిగా కూడా చేశారు. బీజేపీ ఎంట్రీ... 1998లోనే బీజేపీ అమేథీలో పాగా వేసింది. సతీశ్ శర్మ రెండుసార్లు గెలిచిన తర్వాత 1998లో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. 1999లో సోనియా అమేథీ నుంచే గెలిచి ఎన్నికల అరంగేట్రం చేశారు. తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గెలిచారు. 2019 దాకా దశాబ్దన్నర పాటు ఆయన హవాయే సాగింది. 2014 ఎన్నికల్లో రాహుల్ చేతిలో ఓడిన స్మృతి వ్యూహాత్మకంగా నియోజకవర్గంపై బాగా దృష్టి పెట్టారు. దీనికి మోదీ మేనియా తోడై 2019లో రాహుల్ను స్మృతీ ఓడించగలిగారు. ఎస్పీ పూర్తి మద్దతు అమేథీలో కాంగ్రెస్ నుంచి రాహుల్ బరిలో దిగుతారా, లేదా అన్నదానిపై చిట్టచివరి నిమిషం దాకా ఉత్కంఠే కొనసాగింది. ఒకానొక దశలో అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక బరిలోకి దిగుతారన్న ప్రచారమూ జరిగింది. ఎట్టకేలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజున రాహుల్ రాయ్బరేలీ నుంచి బరిలో దిగడం ఖాయమైంది. అ మేథీ నుంచి పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ పోటీకి దింపింది. 40 ఏళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శర్మ అందరికీ సుపరిచితుడు. దీనికి తోడు ఇండియా కూటమి భాగస్వామి సమాజ్వాదీ ఈసారి కాంగ్రెస్కు అన్నివిధాలా దన్నుగా నిలుస్తోంది. అమేథీ, రాయ్బరేలీల్లో కాంగ్రెస్ విజయం కోసం రెండు పారీ్టల కార్యకర్తలు కలసికట్టుగా పని చేస్తున్నారు. కుల సమీకరణాలు కూడా పని చేస్తున్నాయి. ఈ సారి యాదవులంతా ఒక్కతా టిపైకి వచ్చారు. అఖిలేశ్ చెప్పినవైపే తమ ఓటంటున్నారు. ఈ సానుకూలత సాయంతో కాంగ్రెస్ తన కంచు కోటను తిరిగి కైవసం చేసుకుంటుందా, స్మృతీయే మళ్లీ గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.ఓటర్లు.. ఓట్ల శాతం..అమేథీ లోక్సభ స్థానం పరిధిలో జిల్లాలోని అమేథీ, తిలోయి, జగదీశ్పూర్, గౌరీగంజ్, రాయ్బరేలి జిల్లాలోని సలోన్ అసెంబ్లీ స్థానాలున్నాయి. నియెజకవర్గ జనాభా 20 లక్షల పై చిలుకు. 1999, 2004, 2009ల్లో కాంగ్రెస్ అత్యధిక ఓట్ల శాతంతో గెలిచింది. 2014లో బొటా»ొటిగా గట్టెక్కింది. 2019లో 49.7 శాతం ఓట్లతో బీజేపీ గెలిచింది. స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో రాహుల్ను ఓడించారు. అమేథీలో ఏకంగా 96 శాతం ఓటర్లు గ్రామీణులే!స్మృతి టెంపుల్ రన్...ఇక ఈసారి స్మృతి ఇరానీ ఆరునెలల ముందునుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అమేథీలో అత్యధిక సంఖ్యాకులైన గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేందుకు నవరాత్రి సందర్భంగా ఆలయాలు సందర్శించారు. అమేథీలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ దర్శించుకున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 42 దేవాలయాలకు తన ఫొటోతో కూడిన బహుమతి ప్యాక్లను పంపి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉంటూ అమేథీకి ప్రాతినిధ్యం వహించబోనంటూ గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇటీవలే అమేథీలో ఇల్లు కొని గృహ ప్రవేశం చేశారు. నియోజకవర్గంలో శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకున్నారు. నెహ్రూ–గాంధీ కుటుంబం వల్లే నియోజకవర్గం ఇంతకాలం వెనుకబడి ఉందంటూ ప్రత్యరి్థపై మాటల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ అయితే రాహుల్ తమకు భయపడే అమేథీ వదిలి రాయబరేలీ పారిపోయారంటూ ప్రచారం చేస్తోంది. -
మీరేమైనా ప్రధాని అభ్యర్థినా?.. రాహుల్పై స్మృతి ఇరానీ విమర్శలు
ఢిల్లీ: ఎన్నికల అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో డిబేట్ చేయడానికి రాహుల్ గాంధీ ఏమైనా విపక్షాల కూటమికి పీఎం అభ్యర్థిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆమె ఓ జాతీయా మీడియాతో మాట్లాడారు. ‘మొదటిగా.. తమ కంచుకోట అని భావించే స్థానంలో ఓ సాధారణ బీజేపీ కార్యకర్తపై కూడా పోటీ చేసే ధైర్యం లేనివ్యక్తి ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. రెండోది.. ప్రధానిమోదీతో భేటీ అయిన ఆయనతో డిబేట్ చేసే స్థాయి రాహల్ గాంధీకి ఉందా?. నేను సూటిగా అడుగుతున్నా.. రాహల్ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా?’’ అని స్మృతి ఇరానీ నిలదీశారు.పలు లోక్సభ న్నికల అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బహిరంగ చర్చ ఆహ్వానానికి తాను సిద్ధమేనని శనివారం రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మా పార్టీ విజన్ను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ డిబేట్ సాయం చేస్తుంది. సరైన సమాచారం ప్రజలకు చేరుతుంది’ అని రాహల్ గాంధీ అన్నారు. ఈ డిబేట్లో తాను లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొనడానికి సిద్ధమని తెలిపారు. ఇక.. ఈ బహిరంగ చర్చకు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకూర్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్ ఆహ్వానం పలికారు. -
స్మృతితో రాహుల్ ఎందుకు పోటీ పడలేదు?.. గెహ్లాట్ వివరణ!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ సరిపోతారని గెహ్లాట్ అన్నారు.రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్ వివరించారు. -
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
పాక్తో రాహుల్కు సంబంధం ఏంటి: స్మృతి ఇరానీ
లక్నో: పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ప్రశంసల అంశంపై స్పందిసస్తూ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. అమెథీలో ప్రస్తుతం ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఉందని అన్నారు. వాటిని ఉపయోంగించి దేశ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదలను అంతం చేస్తామని తెలిపారు.‘‘పాక్ మాజీ మంత్రి ఆయన దేశం గురించి ఆందోళన పడాలి కానీ, అమేథీ కోసం కాదు. లోక్సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ నేతతో పోటీ పడుతుంటే.. పాకిస్తాన్ నేత మాత్రం నన్ను ఓడించాలంటున్నారు. పాకిస్తాన్ను పాలించటం చేతకాని వాళ్లు.. అమేథీ గురించి ఆందోళన పడుతున్నారు.నా మాటలు పాక్ మంత్రికి చేరితే.. నేను ఒక్కటి చెప్పదల్చుకున్నా. అమేథీలో ప్రధాని మోదీ ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. వాటితో హరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను అంతం చేస్తాం’’ అని స్మృతి ఇరానీ అన్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి వ్యాఖ్యల రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటని నిలిదీశారు. భారత్లో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు పొరుగు దేశాల మద్దతు కోరుతున్నారని విమర్శించారు. అమేథీలో స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ కిషోరి లాల్ సింగ్ను బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ పోటీ నిర్ణయంపై బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పశ్చిమ బెంగాల్లో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. వయనాడ్లో ఓడిపోతాడని తెలిసే రాహుల్ రాయ్బరేలీకి పారిపోయారన్నారు. ఇవాళ ఆయనకు ఒక్కటే చెప్పదల్చుకున్నా. భయం వద్దు(డరో మత్).. పారిపోవద్దు(భాగో మత్).. అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. (బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆరోపించే క్రమంలో తరచూ ‘భయం వద్దు డరో మత్’ అంటూ రాహుల్ గాంధీ చెబుతుంటారు).‘‘వాళ్ల అగ్రనేత పోటీకి భయపడతాడని నేను ముందే చెప్పా. ఆయన మాత్రమే కాదు.. ఆమె (సోనియా గాంధీ) కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు. అందుకే ఆమె రాజ్యసభ వంకతో రాజస్థాన్ పారిపోయారు. ఇదే జరిగింది. ఇంతలా భయపడే వీళ్లు దేశమంతా తిరుగుతూ ప్రజల్ని భయపడొద్దని చెబుతున్నారు.వయనాడ్లో ఆయన ఓడిపోతారని నేను చెప్పా. ఆయన తన ఓటమిని గానే గుర్తించారు. అందుకే ఇప్పుడు మరో చోట పోటీ చేస్తున్నారు. నేను చెబుతున్నా.. భయపడకు, పారిపోకు’’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలంతా స్పందిస్తున్నారు . అమేథీలో ఏం చేయని వారు.. రాయ్ బరేలీలో ఏం చేస్తారు? అని బీజేపీ అమేథీ అభ్యర్థి స్మృతి ఇరానీ నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమేథీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అది చూసే సోనియా కుటుంబం పోటీ చేయకుండా పారిపోయింది. -
స్కూటర్పై తిరుగుతూ.. స్మృతీ ఇరానీ సందడి!
ఉత్తరప్రదేశ్లోని తన లోక్సభ నియోజకవర్గం అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటర్పై తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. అలాగే పలువురితో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ మీడియాకు కనిపించారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు.స్మృతి ఇరానీ ఈరోజు (సోమవారం) అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019లో ఆమె కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, ఈ సీటును సొంతం చేసుకున్నారు. స్మృతి ఇరానీ ఆదివారం నాడు అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకున్నారు. కాగా అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే విషయాన్ని కాంగ్రెస్ ఇంతవరకూ వెల్లడించలేదు. అమేథీ.. కాంగ్రెస్కు కంచుకోటగా పేరొందింది. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
సీటు కోసం కర్చీఫ్ వేసుకోవాలేమో.. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ సెటైర్లు
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమేథీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రాపై విమర్శలు గుప్పించారు. 15ఏళ్ల పాటు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ గాంధీ అమోథీలో ఎలాంటి అభివృద్ది చేయలేదు. అలాంటిది రాబర్ట్ వాద్రా వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అధికారంలో ఉండగా చేయంది.. తాను కేవలం ఐదేళ్లలో చేసినట్లు తెలిపారు. బస్సులో సీటు కోసం ఖర్చీఫ్ వేసుకున్నట్లు అమోథీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడారు. జమనాలో బస్సు ప్రయాణంలో మరొకరు కూర్చోకుండా సీట్లలో కర్చీఫ్ వేసేవాళ్లు. రాహుల్ గాంధీ కూడా తన అమోథీ ఎంపీ సీటు కోసం కర్చీఫ్ వేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే రాబర్ట్ వాద్రా అదే సీటుపై కన్నేశారని ఎద్దేవా చేశారు. పట్టుమని నెలరోజులు లేవు అమోథీలో ఎన్నికల పోలింగ్ సమయం పట్టుమని నెలరోజుల కూడా లేదు. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఇలాంటి చోద్యం ఎప్పుడూ చూడలేదు. ఎస్. రాహుల్ గాంధీ 15 ఏళ్లలో చేయంది నేను కేవలం ఐదేళ్లలో చేశాను అని స్మృతి ఇరానీ అన్నారు. పార్టీ ఆదేశిస్తే.. నేను ఆచరిస్తా అంతకుముందు.. కేరళలోని వయనాడ్ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని పలు మీడియా ప్రతినిధులు ‘మీరు అమేథీ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అని ప్రశ్నించారు. అందుకు పార్టీ ఆదేశాలకు ప్రకారం తాను పనిచేస్తాను’ అని బదులిచ్చారు. అమోథీలో నేనూ పోటీ చేస్తా రాబర్ట్ వాద్రా సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడితే అది అమోథీని ఎంచుకుంటానని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు. నా ఎంట్రీతో.. ఓటర్లు చేసిన తప్పును ఈ సందర్భంగా అమేథీలో పోటీ చేస్తే.. ప్రస్తుతం అమేథీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఎన్నుకుని తప్పు చేశామని భావిస్తున్న ఓటర్లు.. నేను అమోథీ నుంచి పోటీ చేస్తే వారు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. నేను పోటీ చేస్తే ఓటర్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస రాజకీయ పరిణామాలపై స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. -
అమేథీ నుంచి బరిలోకి.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే!
దేశంలో ప్రస్తుతం ఎన్నికల సందడి నెలకొంది. లోక్సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వేడి నెలకొంది. నువ్వా-నేనా అన్నట్లు అధికార ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలో పార్టీలో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానం నుంచి పోటీపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలోక్సభ స్థానానికి హస్తం పార్టీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ మీళ్లీ పోటీ చేస్తారా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో అమేథీలో బీజేపీ నుంచి బరిలో దిగిన స్మృతి ఇరానీపై పోటీకి కాంగ్రెస్ నుంచి ఎవరూ నిలబడుతున్నారనే ప్రశ్న రాహుల్కు ఎదురైంది. దీనిపై ఆయన మాట్లాడుతూ... తాను పార్టీలో ఓ సైనికుడు మాత్రమేనని తెలిపారు. ఎన్నికల్లో పోటీ నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుందని అన్నారు. ‘ఇది బీజేపీ ప్రశ్న. చాలా బాగుంది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చినా ఏ ఆదేశాన్ని అయినా నేను అనుసరిస్తాను. మా పార్టీలో అభ్యర్థుల ఎంపిక నిర్ణయాలు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది’ అని తెలిపారు. కాగా ఒకప్పుడు అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట. గతంలో రాహుల్ చిన్నాన్న సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, ఆ తర్వాత తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో రాహుల్ హాట్రిక్ విజయం సాధించారు అయితే 2019 ఎన్నికల్లో ఫలితాలు తారుమరయ్యాయి. కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన రాహుల్పై బీజేపీ నుంచి స్మృతి ఇరానీ గెలుపొందారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ అక్కడ గెలిచి.. పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.మరోవైపు దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయాలంటూ రాహుల్కు స్మృతి ఇరానీ సవాల్ విసురుతున్నారు.ఇక కాంగ్రెస్ కంచుకోటలో ఎవరూ బరిలో దిగుతారో? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
Smriti Zubin Irani: క్యోం కి స్మృతీ భీ కభీ అభినేత్రీ థీ
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్కు సవాల్ విసురుతున్నారు... రాజకీయ ప్రయాణం.. నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్పై, రాహుల్పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్ను ఓడించి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి. బహుభాషా ప్రావీణ్యం... స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. వివాదాలకు కేరాఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు. 2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు. -
స్మృతి ఇరానీ Vs ప్రియాంక.. యూపీలో ఆసక్తికర సమరం!
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలియాల్సి ఉంది. కాగా, ముందు నుంచి ఈ స్థానంలో రాబర్ట్ వాద్రా పోటీ ఉంటారనే వార్తలు వినిపించినప్పటికీ అది జరగపోవచ్చు అని సమాచారం. కాగా, గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఈ విషయంలో ఒక హింట్ ఇచ్చారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు. కాగా, ఆంటోని బుధవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమేథీ, రాయబరేలీ సీట్లపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. యూపీ నుంచి గాంధీ కుటుంబమే పోటీ చేస్తారు. రాబర్ట్ వాద్రా అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కామెంట్స్ చేశారు. దీంతో, ప్రియాంక లేదా రాహుల్ గాంధీ యూపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక, అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొట్టేందుకు ప్రియాంకు బరిలోకి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రియాంక కనుక అమేథీ నుంచి పోటీలో నిలిస్తే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా అమేథీ స్థానం కాంగ్రెస్కు దక్కిన విషయం తెలిసిందే. -
స్మృతి ఇరానీని ప్రశంసిస్తూ అరుణ్ గోవిల్ ఏమన్నారు?
రామాయణం సీరియల్లో రాముని పాత్రలో నటించి జనాదారణ పొందిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. తనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నని అరుణ్ గోవిల్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రశంసించారు. ఆమెను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఆమె మంచి వక్తగా రాణిస్తున్నారని అన్నారు. మీరట్లో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన సునీతా వర్మ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి దేవవ్రత్ త్యాగి (బీఎస్పీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఏప్రిల్ 26న మీరట్లో రెండో దశలో లోక్సభ ఓటింగ్ జరగనుంది. మీరట్లో సమాజ్వాదీ పార్టీ తన అభ్యర్థిని రెండుసార్లు మార్చింది. ముందుగా భాను ప్రతాప్ సింగ్ను రంగంలోకి దించింది. తరువాత అతుల్ ప్రధాన్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. చివరిగా సునీతా వర్మకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. #WATCH | Meerut, Uttar Pradesh: BJP leader Arun Govil says, "I am getting very good response from the public..." On his meeting with Union Minister Smriti Irani, he says, "It was nice to meet her... She is a very good speaker..." pic.twitter.com/vDybXaoMH7 — ANI (@ANI) April 7, 2024 అరుణ్ గోవిల్ టీవీ సీరియల్ రామాయణంలో శ్రీరాముని పాత్రను పోషించారు. ఈ సీరియల్ తర్వాత, అరుణ్ గోవిల్ ప్రేక్షకాదరణ పొందారు. ముగ్గురు దిగ్గజ నేతలు బరిలోకి దిగిన మీరట్ లోక్సభ స్థానానికి గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య. సునీతా వర్మ 2017లో బీఎస్పీ నుంచి మీరట్ మేయర్గా ఎన్నికయ్యారు. త్యాగి వర్గం నుండి వచ్చిన దేవవ్రత్ త్యాగిని బిఎస్పీ తన అభ్యర్థిగా ఎన్నిక చేసింది. -
రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు
చెన్నై: లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలుపొందే దిశగా కీలక నేతలు, అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ మొదలైనవారు బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి కీలకోపన్యాసాలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి 'స్మృతి ఇరానీ' చెన్నైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చెన్నైలోని వెప్పేరి జిల్లాలోని వైఎంసీఏ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్ పీ సెల్వంకు మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ స్మృతి ఇరానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ మాదిరిగా ఎందరో వచ్చారు, పోయారు. అయితే హిందూస్తాన్ మాత్రం అలాగే ఉందని స్మృతి ఇరానీ అన్నారు. జై శ్రీరామ్ అంటూనే ప్రజలను చంపినవారు ఇండియా కూటమిలో ఉన్నారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా వీరు దూరంగా ఉన్నారని అన్నారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ దేశాన్ని మోదీ చేతికి అప్పగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 'యోగి ఆదిత్యనాథ్' కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నారు. -
వయనాడ్లో బీజేపీకి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం!
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేంద్రన్ నామినేషన్ కార్యకమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. నామినేషన్కు ముందు జరిగే రోడ్ షోలో స్మృతి ఇరానీ కూడా పాల్గొననున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. వయనాడ్ నుంచి సీపీఐ డి రాజా భార్య అన్నీ రాజాను ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో వయినాడ్లో త్రిముఖ పోటీ నెలకొంది. వయనాడ్ నుండి కె సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని గత వారం బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్నారు. బుధవారం ఆయన ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2019లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి గెలిచారు. అదేసమయంలో యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు. కోజికోడ్ జిల్లాలోని ఉలయేరి నివాసి అయిన కున్నుమేల్ సురేంద్రన్ 2020 నుంచి కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా యువమోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కె సురేంద్రన్ కేంద్ర మంత్రి వి మురళీధరన్కు అత్యంత సన్నిహితుడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో సురేంద్రన్ ఓడిపోయారు. -
ఇల్లు.. ఓటు.. మాట నిలబెట్టుకున్న స్మృతి ఇరానీ!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని స్థానిక ఓటరుగా మారారు. ఎంపీ ప్రతినిధి విజయ్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీగంజ్లోని మెదన్ మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్న స్మృతి ఇరానీ అక్కడ ఓటరు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడామె ఆ గ్రామంలో ఓటరుగా మారారని విజయ్ గుప్తా తెలిపారు. స్మృతి ఇరానీ అమేథీని తన కుటుంబంగా భావిస్తారు. అమేథీ కుటుంబం మధ్య నివసించేందుకు ఆమె ఇక్కడే తన నివాసాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఇంటి నిర్మాణంతో ఆమె అమేథీ నుంచి ఓటరుగా నిలిచే ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం లాంఛనాలు పూర్తయ్యాయని గుప్తా తెలిపారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని గౌరీగంజ్ అసెంబ్లీ స్థానంలోని మెదన్ మావాయి గ్రామంలోని బూత్ నంబర్ 347లో ఓటరుగా మారారు. గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి స్మృతి ఇరానీ గత ఫిబ్రవరి 22న గృహ ప్రవేశం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని సుమారు 55,000 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. కాగా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మే 20న అమేథీలో ఐదో దశలో పోలింగ్ జరగనుంది. -
ఎవరు నిజమైన రాహుల్ గాంధీ?: స్మృతి ఇరానీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ద్వంద వైఖరిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై సంఘీభావం తెలుపుతారు. అదేవిధంగా తెలంగాణలో మాట్లాడినప్పుడు మాత్రం కేజ్రీవాల్ అవినితీ పరుడని అంటారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీ ద్వంద వైఖరిలో మాట్లాడానికి సంబంధించి నేను ఆధారాలు ఇవ్వగలను. కేజ్రీవాల్తో పాటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అవినీతిపరుడని 2, జూలై, 2023లో తెలంగాణ రాహుల్ మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అన్ని విషయాలు దర్యాప్తు సంస్థలకు తెలుసన్నారు. అవినీతి సొమ్మును ఆప్ గోవా ఎన్నికలకు వినియోగించిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. వీరిలో ఎవరు నిజం చెబుతున్నారు?’ అని స్మృతి ఇరానీ నిలదీశారు. Smt. @smritiirani addresses a press conference at party headquarters in New Delhi. https://t.co/jITZyxd3dL — BJP (@BJP4India) March 22, 2024 ఎవరు నిజమైన రాహుల్ గాంధీ? తెలంగాణలో మాట్లాడే రాహుల్ గాంధీ? లేదా ఢిల్లీలో మాట్లాడే రాహుల్ గాంధీ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంతటి అవినీతికి పాల్పడతారో అరవింద్ కేజ్రీవాల్ను చూస్తే తెలుస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావటంతో రాహుల్ శుక్రవారం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను అరెస్ట్ చేశారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ రిమాండ్లో ఉన్నారు. అదేవిధంగా ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏడురోజుల రిమాండ్ పూర్తి చేసుకోగా... తాజాగా (శనివారం) రౌస్ అవెన్యూ కోర్టు మరో మూడురోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది. -
హ్యాట్రిక్ నేతకు చుక్కలు చూపించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఉత్తరప్రదేశ్ దేశంలో రాజకీయంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఇక్కడి లోక్సభ స్థానాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు పోటీ చేస్తున్న సీట్లు ఇక్కడే ఉన్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే అమేథీ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో మరోసారి లోక్సభకు ఎన్నికయ్యేందుకు పోటీలో నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani). 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ తీవ్ర ఎన్నికల పోరులో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, వరుసగా మూడుసార్లు గెలిచిన రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఓడించి సంచలనం సృష్టించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్పై ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వాయనాడ్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ అక్కడ నుంచి గెలిచి లోక్సభలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత ఐదేళ్లలో తన పాపులారిటీని పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి చారిత్రాత్మక విజయంతో కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మరోసారి అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే గత చారిత్రక పోరు మరోసారి పునరావృతం కానుంది. స్మృతి ఇరానీ గురించి.. 1976 మార్చి 23న జన్మించిన స్మృతి ఇరానీ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించారు. 1998 మిస్ ఇండియా అందాల పోటీలో ఫైనలిస్టులలో ఒకరైన ఆమె.. ఏక్తా కపూర్ ప్రముఖ డైలీ సీరియల్ ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’లో తులసి విరానీ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. దీంతో మరిన్ని టీవీ షోలలోకూ ఆమె కనిపించారు. టెలివిజన్లో విజయవంతమైన నటనా జీవితం తర్వాత స్మృతి ఇరానీ 2003లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరిన ఆమె 2004లో పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. 2010లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఏడాది తర్వాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీ లోక్సభ నుండి అప్పటికే రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2014 ఎన్నికల్లో స్మృతి ఇరానీ బీజేపీ నుంచి పోటీ చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా భావించే ఆ స్థానంలో పోటీ చేసి ఆసక్తి రేకెత్తించగలిగారు. రాహుల్ గాంధీ గెలుపు మార్జిన్ను 1 లక్ష ఓట్లకు తగ్గించారు. ఓటమి పాలైనప్పటికీ ఆమె మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలో చేరారు. 38 ఏళ్ల వయసులో ప్రధాని మోదీ తొలి క్యాబినెట్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. 2014 నుండి 2019 వరకు స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ, టెక్స్టైల్స్, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్కాస్టింగ్ పోర్ట్ఫోలియోలను నిర్వహించారు. 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీని ఓడించి సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూటమి అభ్యర్థులను నిలబెట్టకుండా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చినప్పకీ, స్మృతి ఇరానీ 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2022 జూలై నుండి ఆమె మైనారిటీ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తున్నారు. స్మృతి ఇరానీ పార్సీ వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
Smriti Irani నూతన గృహప్రవేశ వేడుక: సాంప్రదాయ లుక్లో కేంద్ర మంత్రి
# Smriti Irani Performs Griha Pravesh కేంద్ర మంత్రి ,అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో 'గృహ ప్రవేశ' వేడుకలు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. స్మృతి, జుబిన్ ఇరానీతో కలిసి గురువారం అమేథీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉజ్జయని పూజారి ఆశిశ్ మహరాజ్ ఆధ్వర్యంలో గృహ ప్రవేశ వేడుకను నిర్వహించారు. విజయవంతమైన నటిగా , పార్లమెంటేరియన్గా మాత్రమేకాకుండా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారు. ఈ నేపథ్యంలోనూ ఆమె తన భర్త జుబిన్ ఇరానీతో కలిసి నిర్వహించిన వేడుక ఫోటోలను షేర్ చేశారు. అందమైన మెరూన్ , పసుపు రంగు చీరలో, క్రీమ్-హ్యూడ్ కుర్తాలో జుబిన్ హుందాగా కనిపించారు. ‘‘దుర్గామాత కృప, మహదేవుడి ఆశీర్వాదంతోపాటు, పెద్దోళ్ల ఆదరణ, చిన్నోళ్ల ప్రేమ, స్నేహంతో అమేథీలో కట్టుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించా’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ, స్మృతి మధ్య పోటీ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. #WATCH | Union Minister Smriti Irani and her husband Zubin Irani perform rituals at the 'Griha Pravesh' ceremony at their residence in Amethi, Uttar Pradesh. pic.twitter.com/dN4EoBXZkX — ANI (@ANI) February 22, 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమేథీలో ఆమె గృహ ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో తాను గెలిస్తే అమేథీని శాశ్వత ఇంటి అడ్రస్గా మార్చుకుంటానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో తొలిసారి రాహుల్ గాంధీని ఓడించారు. అంతేకాదు ఈ వారం ప్రారంభంలో, రాబోయే ఎన్నికల్లో అమేథీ నుండి తనపై పోటీ చేయాలని స్మృతి, రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బీజేపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్మృతి 2014లో రాహుల్ గాంధీతో పోటీపడి ఓటమి పాలయ్యారు. కానీ 2004 నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన రాహుల్ని ఓడించి 2019లో సంచలన విజయం సాధించారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లో అమేథీ గౌరీగంజ్ తహసీల్లోని మావాయి గ్రామంలో 15వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేశారామె. 2023లో ‘కిచ్డీ భోజ్’ కార్యక్రమం నిర్వహించి స్మృతి తాజాగా గృహ ప్రవేశం నిర్వహించారు. -
స్మృతి ఇరానీ ఇంట శుభకార్యం.. 20 వేల అతిథులు!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ పరిధిలో గల మెదన్ మావాయి గ్రామంలో కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. నేటి (గురువారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీ స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు నూతన గృహంలో పూజలు నిర్వహించనున్నారు. సొంత ఇంటి గృహప్రవేశం సందర్భంగా స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని 20 వేల మందికి గురువారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఎంపీ స్మృతి ఇరానీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, మంత్రి ధరంపాల్ సైనీ, స్వతంత్ర దేవ్ సింగ్, అమేథీ ఇన్ఛార్జ్ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. స్మృతి ఇరానీ నూతన నివాసంలో సేవకులు, అతిథులకు పత్యేక గదులతో పాటు విలేకరుల సమావేశ గది కూడా ఉంది. ఎంపీ స్మృతి ఇరానీ నూతన గృహం సిద్ధమైన తరుణంలో గ్రామాభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. -
టార్గెట్ రాహుల్.. సోనియాకు స్మృతి ఇరానీ చురకలు
లక్నో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం తన మాజీ నియోజకవర్గం అమేథీలో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాత్రిపూట మద్యం సేవించే వారితో ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు నృత్యం చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తులు కనిపించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారణాసి వెళ్లిన తనకు రాత్రిపూట వాయిద్యాలు మోగించడం.. మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నవారిని చూశానని అన్నారు. అయితే రామ మందిరంలో ప్రధాని మోదీ, అంబానీ, అదానీలతోపాటు భారతదేశంలోని కోటీశ్వరులందరు ఉంటారు కానీ ఒక్క వెనుకబడిన లేదా దళిత వ్యక్తి కూడా కనిపించడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్పై రాహుల్గాంధీ మనసులో ఎంత విషం ఉందో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. వాయనాడ్లోనూ ఉత్తరప్రదేశ్ ఓటర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అయోధ్య రామాలయంలో జరిగే 'ప్రాణప్రతిష్ఠ' కార్యక్రమానికి ఆహ్వానాన్నిఆయన తిరస్కరించారని,, నేడు వారణాసి ఉత్తరప్రదేశ్ యువత గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: ఢిల్లీ, పుణెలో రూ.2,500 కోట్ల విలువైన ‘మ్యావ్ మ్యావ్’ పట్టివేత.. ఏంటిది? కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారంలో ఉందని కానీ ఉత్తరప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. తన కొడుకును మంచిగా పెంచలేకపోతే కనీసం అతన్ని పిచ్చిపిచ్చిగా మాట్లాడకుండా ఉండమని చెప్పాలంటూ సోనియాగాంధీకి చురకలంటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. దేశానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కాంగ్రెస్కు గట్టి పట్టు ఉన్నప్పటికీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు గెలుచుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే రాయబరేలి నుంచి గెలిచారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూడగా, కేరళలోని వయనాడ్లో గెలిచారు. -
రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడమే కాకుండా సవాల్ల పర్వం మొదలైంది. తాజాగా కేంద్ర మంతి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నేడు (సోమవారం) ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి మళ్లీ రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చాలెంజ్ చేశారు. ‘2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన అమేథీలో ఓడిపోతారు. ఆయనకు అమేథీలో గెలుస్తాననే విశ్వాసం ఉంటే మళ్లీ కేరళలోని వయ్నాడ్ లోక్సభ నియోజకవగర్గంలో పోటీ చేయకుండా ఆమేథీలో నాతో పోటీపడాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఇక్కడి ప్రజలు రాహుల్ గాంధీ గురించి ఏం అలోచిస్తునన్నారో? అమేథీలోని ఖాళీ రోడ్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని స్మృతి ఇరానీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె జన సంవాద్ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల పర్యటనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో కంచుకోటగా ఉన్న అమేథీ లోక్సభ నియోజకవర్గంలో 2019లో రాహుల్ గాంధీ.. అనూహ్యంగా 55,000 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశో గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ తరుఫున రాయ్బరేలీ సెగ్మెంట్లో సోనియాగాంధీ విజయం సాధించారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో ఓడిపోయి కేరళలోని వయ్నాడ్లో గెలుపొందారు. అయితే ఇటీవల సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ పెద్దల సభ(రాజ్యసభ)కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ రాయ్బరేలీ ప్రజలు తమ కుటుంబంతోనే ఉంటారని అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్మృతి ఇరానీ స్పందిస్తూ.. గాంధీ కుటుంబంలో ఎవరు? రాయ్బరేలీ ప్రజలతో ఉంటారని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం రామ్బరేలీ స్థానాన్ని వదిలి వెళ్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. ఇక.. అమేథీ సెగ్మెంట్ నుంచి మళ్లీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత లేదు. ‘కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ.. అమేథీలో ఎవరు? పోటీ చేస్తారనే విసషంపై నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ ఇక్కడ ఇప్పటీకే మూడుసార్లు గెలిపొందారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా అమేథీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అమేథీ నియోజకవర్గం చాలా ముఖ్యమైంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ యాత్ర రేపు(మంగళవారం) యూపీలోని రాయ్బరేలీకి చేరుకోనుంది. -
‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులకు వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన తెలుపుతున్నారు. టీఎంసీ సంబంధించిన ఓ నేత తమ ప్రాంతపు మహిళలను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నాడని అక్కడి గిరిజన మహిళుల రోడ్లెక్కి మరీ తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. మమతా తన పార్టీ కార్యకర్తలతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని ప్రోత్సహిస్తూ.. హిందూ మారణహోమానికి తెరలేపుతోందని ఆరోపించారు. ‘మమతా బెనర్జీకి కేవలం హిందూ మారణహోహమమే తెలుసు. తన పార్టీ కార్యకర్తలు హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలని అనుమతిస్తున్నారు. సందేశ్ కాళీ ప్రాంతంలో హిందూ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరూ? ఇప్పటి వరకు షేక్ షాజాహాన్ ఎవరనీ చర్చించుకుంటున్నారు?. షేక్ షాజాహాన్ ఎక్కడ ఉన్నాడో? సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. #WATCH | On Sandeshkhali violence, Union Minister Smriti Irani says, "In Sandeshkhali, some women narrated their ordeals to the media... They said TMC goons visited door to door to identify the most beautiful woman in every house. Who is young. The husbands of identified women… pic.twitter.com/hXARkKp1sj — ANI (@ANI) February 12, 2024 టీఎంసీ ఆఫిసులోనే టీఎంసీ కార్యకర్తలు మహిళలపై రాత్రికి రాత్రి అఘాయిత్యాలకు పాల్పడటానికి అనుమతించటం మాటల్లో చెప్పలేనిదని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇలాంటీ దారుణాలు జరుగుతుంటే పౌరులు ఎట్టిపరిస్థితుల్లో మూగ ప్రేక్షకుల వలె ఉండరని టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే గిరిజన కూలాలు, తెగలను వాడుకుంటోందని దుయ్యబట్టారు. ఇక.. మమతా బెనర్జీ రాష్ట్ర హోం డిపార్టుమెంట్ను తన గుప్పెట్లో పెట్టుకోవటంపై దేశంలో న్యాయం కోసం యాత్ర చేసేవారు కూడా స్పందించకపోవటం దారుణమని కాంగ్రెస్ను విమర్శించారు. హిందూవులపై దాడిల విషయంలో ప్రభుత్వం ప్రమేయం ఉందని స్మృతి ఇరానీ ఆరోపించారు. మరోవైపు.. సందేశ్ కాళీ ప్రాంతంలో టీఎంసీ నాయకులపై అక్కడి ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి కారణాలు తెలుసుకొని, పరిస్థితి చక్కదిద్దటానికి టీఎంసీ సీనియర్ నేత పార్థ భౌమిక్ రేపు(మంగళవారం) ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. చదవండి: ‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్ -
రాహుల్ యాత్రపై స్మృతి ఇరానీ విమర్శలు
లక్నో: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘భారత్ న్యాయ యాత్ర’పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’సంబంధించిన విషయం విన్నానని తెలిపారు. ఈ రోజుల్లో అన్యాయానికి తెలిసిన వ్యక్తులు.. న్యాయం చేస్తున్నట్లు నటిస్తున్నారని(రాహుల్ గాంధీని ఉద్దేశించి)ఎద్దేవా చేశారు. రెండు రోజుల ఆమేథీ పర్యటనలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పాల్గొన్నారు. గౌరీగంజ్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన సామాజిక సాధికారత శిబిరం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి ఏడాది 10 కోట్ల మంది పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఇక.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేపట్టనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర జనవరి 14న మాణిపూర్ నుంచి ప్రారంభమై.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. సుమారు 67 రోజుల పాటు 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల గుండా ఈ యాత్ర సాగనుంది. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమేథీ సెగ్మెంట్లో రాహుల్ గాంధీ.. స్మృతి ఇరాని చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్ సీఎంపై బీజేపీ నేత ఫైర్ -
‘నెలసరి విషయం వారికి ఎందుకు తెలియాలి?’
ఢిల్లీ: నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ అని.. అదేం వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్లో మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నెలసరి సమయంలో ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో పలువురు మహిళా నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇక ఈ విషయంలో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్మృతి ఇరానీ మాట్లాడారు. మహిళలకు సంబంధించిన సున్నితమైన నెలసరి విషయం ఉద్యోగం చేసే చోటు సదరు సంస్థల యాజమనులకు ఎందుకు తెలియాలి? అని అన్నారు. ఇది మహిళలకు కొంత అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవుపై ఒక తప్పనిసరి విధానం తీసుకురాలేదని వెల్లడించారు. ఒకవేళ ఒంటరి మహిళగా ఉన్న ఉద్యోగిని తాను ఆ సమయంలో సెలవు తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోతే.. తాను వేధింపులను ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపారు. అధికారికంగా పెయిడ్ లీవ్ మంజూరు చేస్తే.. ఈ విషయాన్ని సంస్థల్లో హెచ్ఆర్, అకౌంట్స్ వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. అలా పలు సంస్థల్లో పని చేసే చోట తెలియకుండానే మహిళలపై ఒక వివక్షను పెంచినవాళ్లము అవుతుమని తెలిపారు. అయితే తాను పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం సంబంధించి ప్రశ్న మరోకటిని వెల్లడించారు. ఆ రోజు ఎంపీ మనోజ్ ఝా LGBTQIA+ కోసం ప్రభుత్వం వద్ద ఏదైనా పీరియడ్ సెలవు విధానం ఉందా? అని అడిగారని తెలిపారు. గార్భాశయం లేని ఏ స్వలింగ సంపర్కుడికి రుత చక్రం ఉంటుంది? అని తాను చెసిన వ్యాఖ్యలపై మరోవిధంగా వ్యాప్తి చెంది వివాదం రేగిందని చెప్పారు. మరోవైపు మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించిన విషయం తెలిసిందే. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. చదవండి: ధన్ఖడ్పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా? -
‘వాటిపై ఆసక్తి ఏది?’.. స్మృతి ఇరానీ ఆవేదన
ముంబై: మహిళల ఆధ్వర్యంలో నడిచే వినూత్నమైన స్టార్టప్లకు మద్దతుగా నిలవకపోవడం పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీ) తీరును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘నేటికీ పురుషుల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోలిస్తే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్ట్లు ఆసక్తి చూపడంలేదు’ అని మెంటార్ మైబోర్డ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరానీ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో మంది మహిళా ఆవిష్కర్తలు ఉన్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు వాణిజ్య వెంచర్లుగా రూపాంతరం చెందడం లేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. వినూత్నంగా ఉంటున్నప్పటికీ కార్పొరేట్ బోర్డుల్లో ఎంత మంది మహిళలకు చోటు లభించిందో పరిశీలించాలని సూచించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలి వ్యాఖ్యలపై విమర్శలు రావడం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ‘‘మీ కంపెనీ హెచ్ఆర్ హెడ్ ప్రతి నెలా మీ నెలసరిని అడిగి తెలుసుకునే పరిస్థితిని ఊహించగలరా?’’అని ఆమె ప్రశ్నించారు. నెలసరి సెలవు ఇవ్వడం ప్రస్తుత చట్టాలకు సైతం విరుద్ధమన్నారు. ‘‘మహిళలు పెళ్లి చేసుకుంటే, పిల్లల కారణంగా పురోగతి చూపించలేరని గతంలో వారికి అవకాశాలు తిరస్కరించడాన్ని చూశాం. ఇప్పుడు నెలసరి రూపంలో వారికి ఉపాధిని నిరాకరించే పరిస్థితిని సృష్టించడం అవసరం అంటారా?’’అని ఇరానీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విషయంలో ఒకే విధానం సరికాదన్నారు. సంప్రదింపుల నైపుణ్యాలను విద్యార్థుల్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో కలి్పంచడంపై దృష్టి సారించాలని బిజినెస్ స్కూళ్లకు ఆమె సూచించారు. -
‘కేంద్ర మంత్రి వైఖరి విచారకరం.. మహిళల బాధను విస్మరించారు’
సాక్షి, హైదరాబాద్: మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని తెలిపారు. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇదని అన్నారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్మృతీ ఇరానీ వ్యతిరేరించడాన్ని ఆమె తప్పుపట్టారు. కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారని ‘ఎక్స్’లో అసహనం వ్యక్తం చేశారు. రుతుక్రమ పోరాటాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి కొట్టిపారేయడం విచారకరమని, మహిళల బాధలను స్మృతీ ఇరానీ విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. “నెలసరి ఎంపిక కాదు. అది సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది’ అని కవిత తెలిపారు. Disheartened by the Union Minister of Women and Child Development Smriti Irani Ji’s dismissal of menstrual struggles in Rajya Sabha. As a woman, it's appalling to see such ignorance, for our struggles, our journeys isn’t a consolation, it deserves a level playing field and that’s… pic.twitter.com/vj9wbb0A4f — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2023 గురువారం జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి.. నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాద అన్నారు. నెలసరికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: నెలసరి లీవ్ అవసరం లేదు -
హాట్టాపిక్గా 'పీరియడ్ లీవ్'! 'మాకొద్దు' అని వ్యతిరేకించటానికి రీజన్!
ప్రస్తుతం దేశంలో 'పీరియడ్ లీవ్' గురించే ప్రముఖులు, సెలబ్రెటీలు చర్చిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇది ఒక హాట్టాపిక్గా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పైగా అందరూ ముక్తకంఠంతో పీరియడ్ లీవ్ని వ్యతిరేకించడమే ఆసక్తికరంగా మారింది. దీనికి సెలబ్రెటీలు, ప్రముఖులు మద్దతు ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశం. ఎందుకిలా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ "పీరియడ్ లీవ్" అవసరమా? లేదా ఎందుకు వద్దు..? తదితరాల గురించే ఈ కథనం!. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు నెలసరి సెలవులు(menstrual leave) ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ పీరియడ్ సెలవు అంశమై నివేదిక కూడా పెట్టారు. ఈ విషయంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను ఆమె గట్టిగా వ్యతిరేకించారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో జరిగే సహజ ప్రక్రియ. అందుల్ల ఈ నెలసరి సెలవులు (menstrual leave ).. పని ప్రదేశంలో వివక్షకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. WCD Minister @smritiirani sums it up perfectly - "Menstruation is not a handicap!" Menstrual leave demand by pseudo-feminists will infact put females at a disadvantage as compared to a males. As a woman, I personally don't expect any special treatment. Gender equality, please! pic.twitter.com/14NYcwZFMs — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) December 14, 2023 ఈ అంశంపై సోమవారం పార్లమెంట్లో నివేదక కూడా పెట్టారు. దీంతో బుధవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు మనోజ్ ఝా ఎగువ సభలో రుతుక్రమ పరిశుభ్రత విధానంపై, సెలవులపై ప్రశ్నలు లేవనెత్తడంతో స్మృతి ఈ విధంగా స్పందించారు. ఐతే ఇప్పటి వరకు పిరియడ్ సెలవులు తప్పనసరి చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. స్మతీ ఇరానీ మాత్రం ఈ సెలవులను వ్యతిరేకిస్తున్నారు. దీని కోసం పోరాడి కష్టపడి సంపాదించకున్న సమానత్వాన్ని విలువ ఉండదని అన్నారు. అంతేగాదు దీన్ని ప్రత్యేక నిబంధనలు అవసరమయ్యే వికలాంగులు కోణంలో పరిగణించకూడదని చెప్పారు. ఐతే కొద్దిమంది మహిళలు మాత్రమే ఈ టైంలో డిస్మెనోరియా వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని, వీటిని చాలా వరకు మందుల ద్వారా నయంచేసుకోవచ్చని అన్నారు. అలాగే నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు కూడా చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో, 10 నుంచి 19 ఏళ్లలోపు యుక్తవయస్సులో ఉన్న బాలికల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న 'ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ (MHM)' పథకం గురించి కూడా ప్రస్తావించారు. అందరూ ఈ పీరియడ్స్ని సాధారణ దృక్పథంతో చూస్తే చాలు అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు మంజూరు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. స్మృతి అభిప్రాయంతో పలువురు సెలబ్రెటీ మహిళలు ఏకీభవించి మద్దతు పలకడం విశేషం. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా నయంచేసుకోవచ్చ We have fought for centuries for equal opportunities & women's rights and now, fighting for period leave might set back the hard-earned equality. Imagine employers factoring in 12-24 fewer working days for female candidates. A better solution? Supporting work from home for… — Ghazal Alagh (@GhazalAlagh) December 14, 2023 మహిళ చేయలేనిది ఏదీ లేదు..! ప్రముఖ బ్యూటీ బ్రాండ్ మామా ఎర్త్ సహ వ్యవస్థాపకుడు గజల్ అలగ్ మాట్లాడుతూ..స్మృతి పీరియడ్ లీవ్కి బదులుగా మెరుగైన పరిష్కారం సూచించారని ప్రసంసించారు. మహిళలు తాము ఏ పనై అయినా చేయగలమని నిరూపించారు. ఈ ఒక్క కారణంతో వారి సమానాత్వపు హక్కులను కాలరాయకూడదన్న ఆలోచన బాగుందని అన్నారు. అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం స్మృతికి మద్దతు తెలిపారు. మానవజాతి చరిత్రలో ఒక్క పని కూడా చేయని మహిళ లేదు. పిల్లలను పెంచడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అన్నిపనులు చేస్తూనే ఉన్నారు. ఈ పీరియడ్స్ అనేది జస్ట్ శరీరంలో వచ్చే ఓ నిర్దిష్ట వైద్య పరిస్థితే తప్ప అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు అవసరం లేదంటూ స్మృతి అభిప్రాయంతో ఏకీభవించారు కంగనా. సరికొత్త మార్పు.. ఇదంతా చూస్తుంటే మహిళా సాధికారతకు అసైలన అర్థం ఏంటో చెప్పారు. మాకు దయాదాక్షిణ్యాలతో పనిలేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు. సాటి మనుషులుగా ఒకరి బాధను అర్థం చేసుకుంటే చాలు తప్ప మాకదంతా అవసరంలేదని మహిళ ఆత్మివిశ్వాసాన్ని, ఔన్యత్యాన్ని చాటి చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే పురిటినిప్పిని పంటి కింద భరించగలిగే శక్తి ఉన్న స్త్రీకి ఇది ఒక లెక్క కాదు అని తేల్చి చెప్పింది. విమన్ పవర్ ఏంటో? వారి పంచ్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కదా. ద టీజ్ విమెన్ అని మరోసారి బల్లగుద్ది చెప్పారు. ఈ పేరుతో మా అవకాశాలను లాక్కొవద్దని, తాము ఎందులోనూ తక్కువ కాదు జస్ట్ ప్రకృతి సిద్ధంగా వచ్చే చిన్న ప్రక్రియ అని అందరూ తెలుసుకోండి తామెంటో చూపిస్తామని సగర్వంగా చెబుతున్నారు మహిళామణులు. -
నెలసరి లీవ్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు. ‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్ లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్ లీవ్ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
బాస్తో నాన్న.. టీచర్-పేరెంట్ మీటింగ్!
ఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తరచూ రాజకీయ, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఓ ఫోటో ఆసక్తికరంగా మారింది. గురువారం ఆమె తన తండ్రితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించిన ఫోటో స్మృతి ఇరానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఆ ఫొటోకు ఆసక్తికర కాప్షన్ను జతచేశారు. బాస్ అయిన ప్రధాని మోదీ.. తండ్రితో కలిసి జరిగిన సమావేశాన్ని ఆమె టీచర్-పేరెంట్ మీటింగ్తో పోల్చారు. ఇలాంటి సమయంలో వారు పరస్పరం తన గురించి ఫిర్యాదులు చేసుకోకుండా ఉండాలని దేవున్ని పార్థిస్తున్నానని రాసుకోచ్చారు. ఈ ఫొటోపై టీవీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, నటుడు సోనూసూద్ స్పందిస్తూ.. ‘మీరు మంచి స్టూడెంట్ అని పొగుడుతున్నారు’, మీ కూతురు చాలా కష్టపడే తత్వం గల మహిళ, మీరు మంచి నడవడిక నేర్పారని మోదీ అన్నట్లు’ కామెంట్లు చేశారు. ఎంతో బీజీ షెడ్యూల్లో తమ తండ్రితో కలవాడానికి సమయం ఇచ్చినందుకు ఆమె ప్రధానికి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందు సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని తన మునుపటి అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ మరోమారు స్పష్టం చేశారు. తరతరాలుగా గాంధీ కుటుంబం అమేథీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోందని, 2024 ఎన్నికల్లో రాహుల్ ఈ స్థానం నుంచే పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పునరుద్ఘాటించారు. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్.. అమేథీలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అదేసమయంలో రాహుల్ కేరళలోని వయనాడ్ సీటులో 4.31 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటిసారిగా దక్షిణ భారతదేశంతో కాంగ్రెస్ సత్తాను చాటారు. రాహుల్ గాంధీ తన పాత కంచుకోట అమేథీకి తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అజయ్ రాయ్ తన అభిప్రాయం తెలియజేయడం ఇది రెండోసారి. గతంలో లక్నోలో కూడా ఆయన ఇదే తరహా ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చడం ద్వారా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తున్నదని ఆయన విమర్శించారు. రామ మందిర నిర్మాణం అనేది మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని, దానిని భారీ కార్యక్రమంగా చేయకూడదని అన్నారు. ఎన్నికల సంవత్సరంలో జనాన్ని వంచించేందుకు బీజేపీ ఇలాంటి పనులను చేస్తున్నదన్నారు. రాముడు అందరివాడని, బీజేపీకే పరిమితం కాడని అజయ్ రాయ్ అన్నారు. కాగా అమెథీ లోక్సభ బరిలో బీజేపీ తిరిగి స్మృతి ఇరానీని రాహుల్తో పోటీకి దించనున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. -
గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి
స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో అడుగు పెట్టకముందే సినీ ఇండస్ట్రీలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. భాజపా తరఫున ఎంపీగా గెలిచిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే సీరియల్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించారు. బుల్లితెర నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరసగా ఐదు సార్లు అందుకుని చరిత్ర సృష్టించింది. (ఇది చదవండి: ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. దేవుడు చూస్తాడట!) అయితే తాజాగా క్యుంకీ.. సాస్ భీ కభీ బహు థీ సీరియల్ సహానటి అపరా మెహతా ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీ తన పిల్లలు జోర్, జోయిష్ పుట్టే సమయంలో ఒకరోజు ముందు కూడా షూటింగ్స్లో పాల్గొన్నారని మెహతా వెల్లడించారు. అయితే ఈ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. అపరా మెహతా మాట్లాడుతూ.. ' స్మృతికి తన కుమారుడు జోర్ పుట్టే ముందు రోజు వరకు మాతో షూటింగ్లో ఉంది. డెలివరీ తర్వాత నాల్గవ రోజే షూట్ చేయడానికి తిరిగి వచ్చింది. రెండోసారి ఆమె కుమార్తె జోయిష్ జన్మించినప్పుడు కూడా అదే పని చేసింది. అయితే ఒకసారి ఆమెకు గర్భస్రావం జరిగినట్లు నాతో చెప్పింది. ఈ విషయాన్ని క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ టీమ్కు చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజే షూటింగ్లో పాల్గొందని.' తెలిపింది. టీవీ పరిశ్రమలో పనిచేయడం చాలా కష్టమని.. అయితే దీనికి ఏ ఒక్క వ్యక్తిని నిందించలేమని పేర్కొంది. ఈ పరిశ్రమలో నిబద్ధత, అంకితభావం అవసరమని వెల్లడించింది. కాగా.. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ తులసి విరానీ పాత్రను స్మృతి ఇరానీ పోషించగా.. సవితా మన్సుఖ్ విరానీ పాత్రలో అపరా మెహతా కనిపించింది. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) -
Womens Reservation Bill 2023: సుస్థిర ప్రభుత్వం వల్లే మహిళా బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్రంలో పూర్తి మెజార్టీతో కూడిన బలమైన, సుస్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బిల్లుకు రికార్డు స్థాయిలో మద్దతు లభించిందని, చిరకాలం నాటి కల సాకారమైందని అన్నారు. పూర్తి మెజార్టీతో కూడిన స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకోవచ్చని ఈ పరిణామం నిరూపిస్తోందని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ మహిళా ఎంపీలు, నేతలు శుక్రవారం ఢిల్లీలో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచడం అనేది సాధారణ చట్టం కాదని చెప్పారు. ఇది నవ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక అంకితభావ తీర్మానమని స్పష్టం చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్న ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు తాము తీసుకొచి్చన బిల్లుకు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వ హయాంలో మహిళా శక్తి పెరిగిందని, అందుకే బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించిందని వివరించారు. గౌరవాన్ని పెంచితే తప్పేమిటి? మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం కంటే ముందే మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని స్థాయిల్లో మహిళల స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా పని చేశామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలు అడ్డుపడకుండా చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఈ బిల్లు విషయంలో అప్పటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆక్షేపించారు. మహిళలను కించపర్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహిళా బిల్లుకు ‘నారీశక్తి వందన్’ అనే పేరుపెట్టడం పట్ల విపక్ష ఎంపీలు చేస్తున్న ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. మహిళామణుల గౌరవాన్ని పెంచితే తప్పేమిటని ప్రశ్నించారు. బిల్లును పార్లమెంట్లో ఆమోదించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల బీజేపీ ఆకాంక్ష నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. మహిళల్లో నూతన విశ్వాసం కొన్ని నిర్ణయాలకు దేశ భవిష్యత్తు మార్చే శక్తి ఉంటుందని, ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వాటిలో ఒకటని ప్రధానమంత్రి అన్నారు. ఈ చట్టం మహిళల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని, దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ నెల 20, 21న కొత్త చరిత్ర నమోదైందని, దీని గురించి భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయని పేర్కొన్నారు. ‘మోదీ గ్యారంటీలు’ అమలవుతాయని చెప్పడానికి మహిళా బిల్లే ఒక నిదర్శనమని చెప్పారు. మహిళల సారథ్యంలో అభివృద్ధి అనే నూతన శకంలోకి అడుగుపెట్టబోతున్నామని ప్రకటించారు. భారత్ను చంద్రుడిపైకి చేర్చడంలో మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. -
Scholarship Scam: మైనారిటీ స్కాలర్షిప్.. భారీ కుంభకోణం
న్యూఢిల్లీ: మైనారిటీల్లోని పేద కుటుంబాల పిల్లలకు అందాల్సిన ఉపకార వేతనాలు భారీగా పక్కదారి పట్టాయి. అనర్హులు వాటిని కాజేశారు. ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దందాకు వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కొమ్ముకాశారు. స్కాలర్షిప్ పథకానికి ఆమోదం పొందిన విద్యా సంస్థల్లో 53 శాతం నకిలీవని తాజాగా తేలింది. అయిదేళ్లలో రూ.144.83 కోట్లు అనర్థులు జేబుల్లో వేసినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ అక్రమాలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ జూలై 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ శాఖ అంతర్గత విచారణ జరిపిన 1,572 విద్యా సంస్థల్లో 830 వరకు బోగస్వేనని గుర్తించారు. ప్రస్తుతానికి 830 విద్యాసంస్థల బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు, కేవైసీ పత్రాలతో లబ్ధిదారులకు బోగస్ అకౌంట్లను బ్యాంకులు ఎలా ఇచ్చాయనే దానిపైనా దృష్టి సారించనుంది. రాష్ట్రాల వారీగా అక్రమాలు.. ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని పరిశీలన జరిపిన మొత్తం 62 విద్యాసంస్థలూ బోగస్వే. రాజస్తాన్: పరిశీలన జరిపిన 128 విద్యాసంస్థల్లో 99 నకిలీవి. అస్సాం: రాష్ట్రంలోని స్కాలర్షిప్ అందుకుంటున్న మొత్తం విద్యా సంస్థల్లో 68శాతం ఉత్తుత్తివే. కర్ణాటక: కర్ణాటకలోని 64 శాతం విద్యాసంస్థలు బోగస్వి. ఉత్తరప్రదేశ్: 44 శాతం విద్యాసంస్థలు నకిలీవి. పశ్చిమబెంగాల్: 39 శాతం సంస్థలు నకిలీవి. పక్కదారి పలు విధాలు ► కేరళలోని మలప్పురంలో ఒక బ్యాంకు శాఖలో 66 వేల స్కాలర్షిప్పులు పంపిణీ అయ్యాయి. ఇక్కడ రిజిస్టరయిన మైనారిటీ విద్యార్థుల కంటే ఉపకారవేతనాలు తీసుకున్న వారి సంఖ్యే ఎక్కువ. ► జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్కు చెందిన ఒక కాలేజీలో 5 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7 వేల మంది స్కాలర్షిప్పులు అందుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుకుంటున్న 22 మంది విద్యార్థులకు ఒకే మొబైల్ నంబర్ ఒక్క తండ్రి పేరుతోనే రిజిస్టరయి ఉంది. మరో విద్యాసంస్థకు అనుబంధంగా హాస్టల్ లేకున్నా విద్యార్థులందరూ స్కాలర్షిప్ పొందారు. ► అస్సాంలో.. ఒక బ్యాంక్ బ్రాంచిలో 66 వేల మంది స్కాలర్షిప్ లబ్ధిదారులున్నారు. సంబంధిత మదర్సాకు వెళ్లి పరిశీలనకు యత్నించగా నిర్వాహకులు అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ► పంజాబ్లో.. స్కూల్లో పేరు నమోదు చేయించుకోని మైనారిటీ విద్యార్థులు సైతం ఉపకారవేతనాలు అందుకున్నారు. -
రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు..
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్ళీ అమేధీ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేస్తారని కరాఖండిగా చెబుతున్నారు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. అమేధీ ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను ఓడించి తాము చేసిన తప్పును సరిచేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రీజ్ లాల్ ఖబ్రీ స్థానంలో నియమితులైన అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక ప్రకటన చేసి సంచలనానికి తెర తీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేధీ నుంచే పోటీ చేస్తారని ప్రకటన చేశారు. మొదట కచ్చితంగా పోటీ చేస్తారని చెప్పిన ఆయన తర్వాత విలేఖరులు నొక్కి మరీ ప్రశ్నించడంతో కాస్త తటపటాయించి.. క్లాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అమేధీ ప్రజలు కూడా గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాటుని సరిచేసుకుని ఈసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే పార్లమెంటు స్థానంలో గెలిచిన స్మృతి ఇరానీ కిలో పంచదార కేవలం రూ.15 కే అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పంచదార ఎటు పోయిందంటూ ప్రశ్నించారు. గత రెండు పర్యాయాల్లో వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై పొటీ చేసిన అజయ్ రాయ్ ఈసారి ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి పోటీ చేస్తానంటే తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. . గత సార్వత్రిక ఎన్నికల్లో అమేధీ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 2004 నుండి ఇదే పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన రాహుల్ గాంధీ గత పర్యాయం 2019లో మాత్రం ఓటమిని చవిచూశారు. అయినా కూడా ఆయన కేరళలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. ఇది కూడా చదవండి: ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు -
వైవాహిక జీవితంపై ప్రశ్న.. స్మృతి ఇరానీ ఫైర్
ఢిల్లీ: స్నేహితురాలి భర్తను వివాహమాడారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో భాగంగా అభిమానులు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. తన భర్త జుబిన్ ఇరానీని వివాహమాడిన అంశాన్ని, జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా గురించి కూడా ఆమె స్పందించారు. అయితే.. సామాజిక మాధ్యమాల వేదికగా తరచు ఈ ప్రశ్నలు తనకు ఎదురవుతుంటాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఈసారి మాత్రం జుబిన్ ఇరానీ, మోనా గురించి మాత్రం స్పష్టంగా మాట్లాడారు. మోనాతో తనకు ఉన్న సంబంధాన్ని కూడా వివరించారు. ఈ సందర్భంగా మోనా ఇరానీ తన చిన్ననాటి స్నేహితురాలు కాదని ప్రజలకు విన్నవించారు. తనకంటే మోనా 13 ఏళ్ల పెద్దదని తెలుపుతూ ఇన్స్టాలో పోస్టు చేశారు. 'మోనా కుటుంబం రాజకీయ నేపథ్యం లేనిది. ఆమెను ఇందులోకి లాగొద్దు. నాతోనే పోరాడండి. నాతోనే వాదించండి. నా గౌరవ మర్యాదలపైనే మాట్లాడండి. కానీ ఒక అమాయక పౌరురాలిని ఇందులోకి లాగకండి. రాజకీయంగా ఏమీ సంబంధం లేని మోనాతో పోరాడకండి. ఆమె గౌరవానికి భంగం వాటిల్లవద్దు.' అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. స్మృతి ఇరానీ జుబిన్ ఇరానీని 2001లో వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు 'జోర్' కూడా ఉన్నాడు. కూతురు 'జోయిష్' ఉంది. జుబిన్కి మోనాతో ఇంతకుముందే వివాహం జరిగింది. వారిరువురికి 'షానెల్లే' పేరుగల కూతురు ఉంది. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీని తన టీవీ లైఫ్ గురించి కూడా ప్రశ్నించారు. రీల్ లైఫ్ను మిస్ అవుతున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. రీల్ లైఫ్ వదిలేసే నాటికి అది చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఎప్పటికీ ఆలాగే ఉంటుందని చెప్పలేమని అన్నారు. కాలం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తోందని చెప్పారు. ఇదీ చదవండి: ఎడతెరిపిలేని వర్షాలు.. విరిగిన కొండచరియలతో కూలిన గుడి.. 21 మంది మృతి.. -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఎమ్మెల్సీ కవిత కరచాలనం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్రంలో మెజారిటీ ఉన్న బీజేపీకి మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని.. అయితే ఆ దిశగా ఆలోచించడం లేదని కవిత వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును మాత్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‘అనే పుస్తక ఆవిష్కరణ సభలో కవిత పాల్గొని మాట్లాడారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని కవిత ఆకాంక్షించారు. ఆ సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. కార్పొరేట్ రంగంలో కూడా మహిళా వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్దతివ్వడం లేదన్నారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలు ఎక్కడికి వెళ్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశంలో 29% మహిళలే ఉద్యోగాల్లో ఉన్నారని ఇలాగైతే దేశం వృద్ధి చెందలేదన్నారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు. కాగా భారత్లో కంపల్సరీ ఓటింగ్ రావాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు. -
మహిళా బిల్లు ఆమోదానికి ఒక్క నిమిషం చాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్రంలో మెజారిటీ ఉన్న బీజేపీకి మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని.. అయితే ఆ దిశగా ఆలోచించడం లేదని కవిత వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐపీసీ, సీర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును మాత్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‘అనే పుస్తక ఆవిష్కరణ సభలో కవిత పాల్గొని మాట్లాడారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని కవిత ఆకాంక్షించారు. ఆ సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. కార్పొరేట్ రంగంలో కూడా మహిళా వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్దతివ్వడం లేదన్నారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలకు ఎక్కడికి వెళ్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశంలో 29% మహిళలే ఉద్యోగాల్లో ఉన్నారని ఇలాగైతే దేశం వృద్ధి చెందలేదన్నారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు. కాగా భారత్లో కంపల్సరీ ఓటింగ్ రావాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు. -
'మా సార్కు అమ్మాయిలు తక్కువా..?' రాహుల్ ఫ్లయింగ్ కిస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే..
ఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బిహార్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ ఈ అంశంపై మాట్లాడటం రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే రాహుల్కు అమ్మాయిల కొరత ఏం లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ మాట్లాడటంపై బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో సభ నుంచి వాకౌట్ చేస్తున్న క్రమంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. అయితే.. రాహుల్ చర్యను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. తమను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. మహిళా ఎంపీలను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ స్పీకర్కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చర్య మహిళలపై కాంగ్రెస్ ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై బిహార్కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నీతు సింగ్ తాజాగా స్పందించారు. If Rahul Gandhi wants to give flying kiss he has many women available He won’t give it to a 50 year old budhiya Congress MLA from Bihar : Neetu Singh Anti women Congress can even defend Rahul’s misdemeanours inside the House pic.twitter.com/oXRz67ZqlX — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 10, 2023 నీతు సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే.. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలకు ఇస్తాడు.. కానీ ఆ 50 ఏళ్ల మహిళకు ఎందుకు ఇస్తాడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్పై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అన్ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. యాంటీ మహిళా కాంగ్రెస్ రాహల్ చర్యను సమర్థిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: బ్రిటీష్ కాలం చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు -
భరతమాతను హత్యచేశారంటే.. బల్లలు చరుస్తారా ?
న్యూఢిల్లీ: మణిపూర్లో భరతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వంపై విపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్సభలో చర్చ సందర్భంగా రాహుల్కు ఘాటుగా స్మృతి తన స్పందన తెలిపారు. ‘ సభలో ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. భరతమాత హత్యకు గురైందంటూ సభలోనే వ్యాఖ్యలు చేయడం పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయన ఇలాంటి తీవ్రవ్యాఖ్యలు చేస్తుంటే తోటి కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తారా ?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ నా ముందే ప్రసంగం చేశారు. ముందు వరసలో మహిళా సభ్యులు ఉండగా ఆయన(రాహుల్) గాలిలో ముద్దులు విసిరారు. ఇలాంటి అసభ్య సైగలు గతంలో మరెవరూ చేయలేదు. ఈ (గాంధీ)కుటుంబం సంస్కృతి ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసొచ్చింది’ అని వ్యాఖ్యానించారు. స్మృతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా కొందరు మహిళా బీజేపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ ఫ్లయింగ్ కిస్పై ఫిర్యాదుచేశారు. కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్చేశారు. ఆర్టికల్ రద్దు వల్లే అది సాధ్యమైంది ‘విపక్ష కూటమి పార్టీ నేత ఒకరు తమిళనాడులో.. భారత్ అంటే ఉత్తరభారతమే అని వివాదాస్పద వ్యాఖ్యచేశారు. దమ్ముంటే ఈ అంశంపై రాహుల్ మాట్లాడారు. మరో నేత కశ్మీర్పై రెఫరెండం కోరతారు. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో వస్తున్నాయా ?. మీ కూటమి ‘ఇండియా’ కాదు. భారత్లో అవినీతిని పెంచారు’ అని ఆవేశంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్లో కొనసాగడంపై స్మృతి ఎద్దేవా చేశారు. ‘ రక్తంతో తడిసిన కశ్మీర్ లోయ అది. యాత్ర పేరుతో అక్కడికెళ్లి స్నో బాల్స్తో ఆడుకున్నారు. ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దుచేయడం వల్లే అక్కడ అల్లర్లు తగ్గి నెలకొన్న ప్రశాంతత కారణంగా మీరు ఆ పని చేయగలిగారు. ఆ ఆర్టికల్ను మళ్లీ తెస్తామని అక్కడి వారికి రాహుల్ హామీ ఇచ్చి వచ్చారు. కానీ అది ఎన్నటికీ సాధ్యపడదు. ఆర్టికల్ పునరుద్ధరణ ఉండదు’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో అత్యయక స్థితిని స్మృతి గుర్తుచేశారు. ‘ మీ పాలనా చరిత్ర అంతా రక్తసిక్తం. 1984 సిక్కుల వ్యతిరేక అల్లర్లు, కశ్మీర్లో అశాంతి..’ అని వ్యాఖ్యానించారు. -
నిండు సభలో.. మహిళా మంత్రికి ముద్దులా?
న్యూఢిల్లీ: లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్ను కుదిపేసేలా కనిపిస్తోంది. సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్ది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు. ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. మణిపూర్పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్ లోక్సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు. -
మరో వివాదంలో రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేవలం స్త్రీద్వేషి మాత్రమే ఇలా తమ స్థానాల్లో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తారేమో అంటూ రాహుల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. తన చేష్టల ద్వారా ఆయన అగౌరవంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. In this video MP Rahul Gandhi can be showing blowing 'Flying Kiss'. pic.twitter.com/5XnHWHQwkD — Facts (@BefittingFacts) August 9, 2023 ఇదిలా ఉంటే రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు, మంత్రులు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, మోదీ సర్కార్పై విరుచుకుపడగా.. కౌంటర్గా స్మృతి ఇరానీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. బీజేపీది అనవసర రాద్ధాంతం ఇదిలా ఉంటే రాహుల్ పార్లమెంట్ను ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు వీడియోలో ఉందని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్ను కలిసి బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరోసారి క్విట్ ఇండియా చేపట్టాలి: స్మృతి ఇరానీ -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్
-
అసలు మీది ఇండియానే కాదు.. రాహుల్కు స్మృతి ఇరానీ స్ట్రాంగ్ కౌంటర్
న్యూ ఢిల్లీ: బుధవారం జరిగిన లోక్ సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపైనా ప్రధానిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంతేస్థాయిలో తిప్పికొట్టారు. మీరసలు భారత దేశానికి చెందినవారే కాదన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశాలు మొదలవుతూనే ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈరోజు సమావేశాల్లో లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి సభలో ప్రసంగించారు. ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా మాట్లాడిన రాహుల్ మణిపూర్ భారత దేశంలో భాగమన్న విషయాన్ని ప్రధాని మర్చిపోయారని, మణిపూర్ లో భారత మాతను చంపేశారన్నారు. రావణాసురుడు ఎలాగైతే కుంభకర్ణుడు, మేఘనాధుడు ఇద్దరి మాటలు విన్నాడో ప్రధాని కూడా ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల మాటలే వింటున్నారని విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం తన స్వార్ధ రాజకీయాల కోసం ఒకే దేశంలో రెండు మణిపూర్ లను సృష్టించారన్నారు. #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "Bharat maa ki hatya ki baat karne wale kabhi bhi mez nahi thapthapate. Congressiyo ne baith kar maa ki hatya ke liye mez thapthapaai hai..." https://t.co/Nay92GDe4k pic.twitter.com/uAPE2YQIRN — ANI (@ANI) August 9, 2023 రాహుల్ మాట్లాడిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ విభజించబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు. ఆయన మణిపూర్లో భారత మాత చంపబడిందని అన్నారు. దానికి వారి మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది. అందుకే కుటుంబపాలను స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి అన్నారు. మీరనుకునే ఇండియా కాదిది. అవినీతి రహిత ఇండియా. ఇక్కడ కుటుంబపాలనకు చోటు లేదన్నారు. అసలు మీరు ఇండియాకు చెందిన వారే కాదన్నారు. నాడు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నినదించినట్లు ఇప్పుడు మీ కుటుంబ పాలనకు,అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలన్నారు. #WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "Manipur is an integral part of India. Khandit na tha, na hai aur na kabhi hoga..." https://t.co/CIFqt9F5H4 pic.twitter.com/2uTrTWRG84 — ANI (@ANI) August 9, 2023 కశ్మీర్ లో గిరిజా టిక్కు అనే పండిట్ పై సామూహిక అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు. అదే విషయాన్ని సినిమాలో చూపిస్తే కొంతమంది కాంగ్రెస్ లీడర్లు దాన్ని దుష్ప్రచారమన్నారు. ఇప్పుడు విచిత్రంగా వారే మాట్లాడుతున్నారు. రాజ్జస్థాన్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న బిల్వారాలో అభంశుభం తెలియని పసికందుపై మానభంగం జరిగింది. ఇవేవీ మీకు కనిపించవా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆమె 1984లో కాంగ్రెస్ పాలనలో నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. చరిత్ర చూస్తే కాంగ్రెస్ పాలన అంతా రక్తసిక్తమై ఉంటుందని అన్నారు. -
మణిపూర్లో కీచక పర్వం.. స్మృతి ఇరానీ స్పందన
ఇంఫాల్/ఢిల్లీ: అల్లర్లలో అట్టుడికిపోతున్న మణిపూర్లో కీచక పర్వం వెలుగుచూసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. ఆపై పంట పొలాల్లోకి లాక్కెల్లి కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కెమెరాల సాక్షిగా ఇది జరగ్గా.. ఈ ఘోరానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా పలువురు రాజకీయ నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లో తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే.. చుట్టూ ఉన్న మూక వాళ్లను ఇష్టానుసారం తాకుకూ వేధించడం అందులో ఉంది. ఆపై వాళ్లను పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్తూ మరో వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆపై ఆ ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిగిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని ఇంఫాల్కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్పోక్పి జిల్లా పరిధిలో మే 4వ తేదీన ఇది జరిగిందని ఐటీఎల్ఎఫ్ (ఆదివాసీ గిరిజన నేతల సంఘం) ఆరోపిస్తోంది. అయితే.. పోలీసులు మాత్రం ఇది వేరే చోట జరిగిందని.. ఎఫ్ఐఆర్ మాత్రం కాంగ్పోక్పిలో నమోదు అయ్యిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందించారు. హైప్రొఫైల్ కేసుగా దీనిని దర్యాప్తు చేపట్టాలని మణిపూర్ పోలీస్ శాఖను ఆదేశించారు. The horrific video of sexual assault of 2 women emanating from Manipur is condemnable and downright inhuman. Spoke to CM @NBirenSingh ji who has informed me that investigation is currently underway & assured that no effort will be spared to bring perpetrators to justice. — Smriti Z Irani (@smritiirani) July 19, 2023 అంతకు ముందు కేంద్ర శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘటనపై.. భయంకరమైన ఘటన అని ట్వీట్ చేశారామె. ఘటనపై సీఎం బీరెన్, మణిపూర్ సీఎస్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని.. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె వాళ్లను కోరినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించామని.. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుంటామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. బాధితులు కుకీ తెగ మహిళలుగా తెలుస్తోంది. *All out effort to arrest culprits as regard to the viral video of 02 (two) women paraded naked :* As regard to the viral video of 02 (two) women paraded naked by unknown armed miscreants on 4th May, 2023, a case of abduction, gangrape and murder etc 1/2 — Manipur Police (@manipur_police) July 19, 2023 PM’s silence and inaction has led Manipur into anarchy. INDIA will not stay silent while the idea of India is being attacked in Manipur. We stand with the people of Manipur. Peace is the only way forward. — Rahul Gandhi (@RahulGandhi) July 19, 2023 ఈ ఘటనకు ఒక్కరోజు ముందు నుంచే మణిపూర్ రణరంగంగా మారడం ప్రారంభమైందన్నది తెలిసిందే. గిరిజన హోదా కోరుతూ మెయితీలు చేస్తున్న విజ్ఞప్తులు.. అక్కడి కుకీ గిరిజనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. మానప్రాణాలు పోతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి.. అపహరణ, గ్యాంగ్రేప్తో పాటు హత్యానేరాల కింద కేసులు నమోదు చేసినట్లు మణిపూర్ పోలీస్ శాఖ వెల్లడించింది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. मणिपुर से आ रही महिलाओं के खिलाफ यौन हिंसा की तस्वीरें दिल दहला देने वाली हैं। महिलाओं के साथ घटी इस भयावह हिंसा की घटना की जितनी निंदा की जाए कम है। समाज में हिंसा का सबसे ज्यादा दंश महिलाओं और बच्चों को झेलना पड़ता है। हम सभी को मणिपुर में शांति के प्रयासों को आगे बढ़ाते हुए… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2023 Attention India! The modesty of two tribal women from Manipur were outraged on 4th May. They were paraded naked, fondled and beaten in full public glare! A disturbing video taken by a perpetrator leaked and got viral today. This breaks all level of humanity. @PMOIndia @NCWIndia — hoihnu hauzel - www.thenestories.com (@hoihnu) July 19, 2023 ట్విటర్లో వీడియోలు తొలగింపు.. చర్యలు? మణిపూర్లో ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా ఊరేగిస్తూ.. ఇష్టానుసారం తాకుతూ ఉరేగించిన వీడియో ట్విటర్ను కుదిపేసింది. వాళ్లపై సామూహిక అత్యాచారమూ జరిగిందన్న ఆరోపణలతో యావత్ దేశం భగ్గుమంది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఘటనలకు వీడియోలను తొలగించాలని ట్విటర్ను కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వీడియోను తొలగించాలని ట్విటర్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్రం ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. భారత చట్టాలకు అనుగుణంగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విటర్పై చర్యలకు ఉపక్రమించిబోతున్నట్లు సమాచారం. -
‘ఫ్రెంచి పరేడ్’కు ‘రాఫెల్ పాసు’!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పదం కోసం ఫ్రాన్స్లో పర్యటించడం ద్వారా బాస్టిల్ డే కవాతులో పాల్గొనే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంపాదించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మణిపూర్లో ఓ వైపు విద్వేషాగ్ని వ్యాపిస్తోంది. ఈ అంశాన్ని యూరప్ పార్లమెంట్ కూడా పట్టించుకుని చర్చకు పెట్టింది! కానీ మన ప్రధాని మాత్రం అసలేం పట్టనట్లు కూర్చున్నారు. మణిపూర్పై ఇంతవరకు ఒక్కమాటా మాట్లాడలేదు. పైగా రాఫెల్ ఒప్పందంతో పారిస్లో బాస్టిల్ డే కవాతులో పాల్గొనే పాస్ సంపాదించారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా, ‘‘1997లో రిచర్డ్ నెల్సన్ ‘ది మూన్ అండ్ ది గెట్టో’ అని ఒక వ్యాసం రాశారు. అందులో ఏముందంటే.. అద్భుత సాంకేతికత సాధించిన అమెరికా చంద్రుడిపై కాలుమోపింది. కానీ స్వదేశంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. ఇప్పుడు ఆ వ్యాసాన్ని భారత్లో మాత్రం ‘ది మూన్ అండ్ మణిపూర్’గా చదువుకోవాలి’’ అని విమర్శించారు. విసుగెత్తిన యువరాజు: బీజేపీ కౌంటర్ రాహుల్ విమర్శలపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందించారు. ‘ఫ్రాన్స్లో నిరసనలు, అల్లర్ల విషయాన్ని ప్రస్తావించని ఈయూ పార్లమెంట్.. భారత్లో మణిపూర్ అంశంపై చర్చకు సిద్దమవుతాయి. ఇదే రాహుల్ ఆశించేది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించడంతో విసుగు చెందిన యువరాజు ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజలు తిరస్కరించిన రాహుల్ రక్షణ ఒప్పందాలు తమ హయాంలో జరగలేదే అని తెగ బాధపడిపోతున్నారు’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇన్నేళ్లూ మణిపూర్ సమస్యను అపరిష్కృతంగా తయారుచేసిన ఘనత కాంగ్రెస్దే అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘లైంగిక వేధింపులపై ఉద్యమిస్తున్న మహిళా అథ్లెట్లకు ఈ మహిళా నేత కనీస మద్దతు ఇవ్వరు. కానీ రాహుల్పై విమర్శలకు రెడీ అవుతారు’’ అంటూ స్మృతీపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే విమర్శలు గుప్పించారు. -
ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అమె మోడల్ రంగంలో కూడా రానించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) తాజాగ ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టీవి సీరియల్స్లలో పనిచేస్తున్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. నటిగా తను కెరీర్ ప్రారంభించిన రోజుల్లో తన వద్ద సరిగ్గా డబ్బుల్లేవు. షూటింగ్ల ద్వారా వచ్చే డబ్బు సరిపోయేది కాదు. కనీసం బ్యాంక్ ఖాతాలో రూ.30 వేలు కూడా ఉండేవి కాదని గుర్తు చేసుకుంది. తనకు పెళ్లైన కొత్తలో బ్యాంక్ నుంచి రూ.25 లక్షలు లోన్ తీసుకుని ఒక ఇంటిని కొనుగోలు చేశామని తెలిపారు. కానీ ఆ సమయంలో ఇంటికి సంబంధించిన ఈఎంఐ చెల్లించడం చాలా కష్టంగా అనిపించేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. అలాంటి సమయంలో ఓరోజు తన వద్దకు కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక భారీ ఆఫర్ ఇచ్చారని ఇలా తెలిపింది. 'పాన్ మసాలా యాడ్లో పనిచేయమని, అందుకోసం రూ.కోట్లలో డబ్బులు ఇస్తామని భారీ ఆఫర్ చేశారు. కాకపోతే ఆ ఆఫర్ను నేను తిరస్కరించాను. దీంతో నా స్నేహితులు.. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? అంత డబ్బు ఇస్తామంటే ఎందుకని కాదంటున్నావు' అని అని స్మృతి ఇరానీ తెలిపారు. (ఇదీ చదవండి: నయనతార రిచ్ లైఫ్.. సొంతంగా విమానంతో పాటు ఇవన్నీ కూడా) ఆ సమయంలో సీరియల్ ద్వారా ప్రేక్షకులందరూ తనను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారని ఇరానీ తెలిపారు. దీంతో పాన్ మసాలా లాంటి యాడ్స్లో నటిస్తే వాళ్లు ఎలా తీసుకుంటారోననే ఆలోచన రావడంతో నో చెప్పానని ఆమె తెలిపారు. అంతే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ యాడ్స్ చూసే ప్రమాదం ఉండటంతో పాన్ మసాలా, అల్కహాల్ కంపెనీలకు చెందిన యాడ్స్కు దూరంగా ఉంటూ వచ్చానని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. -
యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుకిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఇది కీలకాంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్రం. ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు, మహిళల హక్కులను పరిశీలించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి పౌరస్మృతి అమలుచేసే విషయమై ఎదురయ్యే చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసే క్రమంలో ఈ మంత్రుల ప్యానెల్ బుధవారం మొదటిసారి సమావేశమయ్యింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సునిశితంగా అధ్యయనం చేసి జులై మూడో వారం లోపే ఈ ప్యానెల్ ప్రధానమంత్రికి పూర్తి నివేదికను సమర్పించనున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రజలు ఎదురుంటున్న ప్రధాన సమస్యల నుండి వారి దృష్టిని మళ్లించడానికే ప్రధాని ఈ ప్రస్తావన చేసినట్లు ఆరోపించాయి. ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
ఇదేం ప్రేమ.. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో భాగంగా నిర్వహించిన మొహబ్బత్ కీ దుకాన్ కార్యక్రమంలో ప్రస్తుత ముస్లింల పరిస్థితి 80వ దశకంలో దళితులను పోలి ఉందని చేసిన వ్యాఖ్యలతో మొదలు, అదేపనిగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పర్యటనను కొనసాగిస్తున్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీ ప్రేమంతా రాజకీయాలు చేయడం మీదే ఉంది తప్ప దేశం మీద కొంచెమైనా లేదు.. ఇదేం ప్రేమ.." అంటూ ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇదేం ప్రేమ.. స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ప్రేమతత్త్వం గురించి మాట్లాడేటప్పుడు అందులో సిక్కుల హత్యల గురించి మాట్లాడారా? ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు మీ హయాంలో జరిగిన రాజస్థాన్ మహిళల కిడ్నాపుల గురించి మాట్లాడారా? హిందువుల జీవన విధానం అస్తవ్యస్తం చేయడం కూడా మీ ప్రేమలో భాగమేనా? దాని గురించి మాట్లాడరేం? భారత దేశం ఎదుగుదలను సహించలేని వారితో చేతులు కలపడం, మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బయటవారి మద్దతు కోరడం ఇవన్నీ మీ ప్రేమలో భాగమేనా? నీ దేశంపై కాకుండా కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒలకబోసే ప్రేమ.. ఇదేమి ప్రేమ? అంటూ ప్రశ్నించారు. ప్రేమ పేరుతో ద్వేషం పెంచుతున్నారు.. పది రోజుల యూఎస్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిగా బీజేపీ నాయకులు ఒక్కొకరుగా రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. పరాయి గడ్డ మీద ప్రేమ పేరుతో దేశంపై ద్వేషాన్ని పెంచుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. #WATCH | Union Minister Smriti Irani speaks on Rahul Gandhi's "Mohabbat ki dukan" remark; says, "...When you talk about 'Mohabbat', does that include the killing of Sikhs? When you talk about 'Mohabbat', does that include the kidnapping of women in Rajasthan? When you talk about… pic.twitter.com/Rjx1Xebqme — ANI (@ANI) June 8, 2023 ఇది కూడా చదవండి: రెండు దేశాలకు మంచిది కాదు.. భారత విదేశాంగ శాఖ -
Smriti Irani: ఆ అయిదు రోజులు... అయితే ఏంటీ!
మెనుస్ట్రుయేషన్కు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడడానికి సంకోచించే రోజుల్లో, శానిటరీ యాడ్స్లో నటించడానికి నటీమణులు ససేమిరా అనే రోజుల్లో కెరీర్ తొలి అడుగుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్ లో నటించింది స్మృతి ఇరానీ. అది తన తొలి యాడ్. ‘అది ఫ్యాన్సీ యాడ్ కాదు. వదిలేయ్’ ‘ఈ యాడ్ చేస్తే తక్కువ చేసి చూస్తారు. నటిగా అవకాశాలు రావు’ అని అందరూ భయపెట్టారు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ యాడ్లో నటించింది స్మృతి. 25 సంవత్సరాల క్రితం నాటి ఆ వీడియోను స్మృతి ఇరానీ(ప్రస్తుతం కేంద్రమంత్రి) ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. ఆ వీడియోలో... పీరియెడ్స్, వాటిపై ఉండే అపోహలు... మొదలైన వాటి గురించి స్మృతి ఇరానీ మాట్లాడింది. ‘ఆ అయిదు రోజులు. అయితే ఏంటీ? పీరియెడ్స్ అంటే వ్యాధి కాదు. ప్రతి మహిళకు ఉండే సహజ లక్షణం. నేను, మా అమ్మ, మీరు... లక్షలాదిమంది భారతీయ మహిళల కోసం శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి...’ అంటూ సాగే స్మృతి మాటలకు ఆ రోజుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది. ‘ఇది తప్పనిసరిగా గుర్తుచేసుకోదగిన జ్ఞాపకం’ అని తన వీడియో గురించి కాప్షన్ రాసింది స్మృతి ఇరానీ. ‘ఈరోజుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్లు చేయడానికి నటీమణులు సంకోచించడం లేదు. కాని ఆరోజుల పరిస్థితి వేరు. ఆ రోజులు నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నాయి. పీరియెడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడే రోజుల్లో ధైర్యంగా స్మృతి ఆ యాడ్ చేయడం అభినందనీయం’ అంటూ ఒక యూజర్ కామెంట్ సెక్షన్లో స్పందించారు. -
జై శ్రీ అన్నా
గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు. ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
‘నా తల్లిదండ్రులు విడిపోయారు.. ఇది చెప్పడానికి 40 ఏళ్లు పట్టింది’
న్యూఢిల్లీ: తన తల్లిదండ్రులు విడిపోయారని చెప్పడానికి 40 సంవత్సరాలు పట్టిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో ఫేమ్ అయిన ఈ నటి తన తల్లిదండ్రుల ఎడబాటు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. అందులో ఆమె మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నప్పుడు వారి వద్ద కేవలం 150 రూపాయలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇరానీ తండ్రి పంజాబీ-ఖాత్రి కాగా, నటి తల్లి బెంగాలీ-బ్రాహ్మణి. ఆర్థిక పరిస్థితి సరిగాలేని కారణంగా ఆవు షెడ్ పైన ఉన్న గదిలో నివసించేవారని చెప్పుకొచ్చారు. ‘ఆ రోజుల్లో మమ్మల్ని చిన్నచూపు చూసేవారు, అలాంటి జీవితం గడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. జేబులో కేవలం 100 రూపాయలతో మా అందరినీ చూసుకునేవారు. మా నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు, నేను అయనితో కూర్చునేదానిని. మా అమ్మ వేరే ఊళ్ళకి వెళ్ళే మసాలాలు అమ్మేది. మా నాన్న పెద్దగా చదువుకోలేదు, మా అమ్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దీంతో అప్పుడప్పుడు వారి మధ్య విభేధాలు తలెత్తి గొడవలు జరిగేవని’ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అభిప్రాయ భేదాలను కొద్దిమంది మాత్రమే తట్టుకోగలరని ఆమె భావోద్వేగంగా తెలిపారు. చదవండి: మొదటి రాత్రే భర్త నిజస్వరూపం.. లిప్స్టిక్ పూసుకుని విచిత్ర ప్రవర్తన! -
ప్రధాని ఇమేజ్ని డ్యామేజ్ చేయటం అంత ఈజీ కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్సభ అనర్హత వేటు పడిన నేపథ్యంలో అనుహ్యంగా విపక్షాలన్నీ ఏకమై నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్పై వాగ్దాడిని పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్పై విరుచుకపడ్డారు. రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే అది అంత ఈజీ కాదని, ఎందుకంటే మోదీ బలం భారతదేశ ప్రజలేనని నొక్కి చెప్పారు. ఆయన 2019లో ఒక పత్రిక ఇంటర్యూలో మోదీకి బలం తన ఇమేజేనని దాన్ని దెబ్బతీస్తానని చెప్పారన్నారు. దీంతో రాహుల్లో దాగి ఉన్న పొలిటకల్ సైకో బహిర్గతమైందని విమర్శించారు. అలాగే మోదీని పార్లమెంట్లో దుర్భాషలాడి, నిందించాడే తప్ప తన ధోరణి సరైనదేనా అని ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోలేపోయడన్నారు. తను అనుకున్నది జరగకపోవడంతో రాజకీయంగా నిరాశ చెంది ఇలా మోదీపై విరుచకుపడుతున్నారని అన్నారు. అలాగే మంత్రి స్మృతి ఇరానీ.. రాహుల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలి శిక్ష పడటం గురించి ప్రస్తావిస్తూ.. మన దేశంలోని ఓబీసీ వర్గాన్ని క్షమించమని చెప్పే ఔదార్యాన్ని పెంపొందించు కోలేకపోయారన్నారు. ఇది గాంధీ కుటుంబాల దురహంకారానికి నిలువెత్తు నిదర్శంన అని మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. (చదవండి: ‘రాహుల్ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా) -
Sushant Singh Death: ఒక్కసారి కాల్ చేసి ఉంటే.. కంటతడి పెట్టుకున్న స్మృతి ఇరానీ
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి దాదాపు మూడేళ్లు కావోస్తుంది. 2020 జూన్ 14l ముంబై బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీలానే ఉంది. నటుడి మృతిని సెలబ్రిటీలు, అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. నేటికి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉన్నారు. సుశాంత్ అకాల మరణంపై తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. స్మతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు మోడల్గా కెరీర్ను ప్రారంభించి ఆ తరువాత టీవీ సీరియల్స్, పలు సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. సీరియల్స్లో నటిస్తున్న సమయంలో సుశాంత్ సింగ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ముంబైలో టీవీ షోలలో పనిచేయడంతో అతనితో ఆమెకు మంచి బంధం ఉంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కేంద్ర మంత్రి..సుశాంత్ మరణించినప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘సుశాంత్ సింగ్ మరణం గురించి తెలిసినప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాను. ది స్లో కాన్వర్సేషన్లో నీలేష్ మిశ్రాతో మాట్లాడుతున్నాను. సుశాంత్ మరణ వార్త తట్టుకోలేక పోయాను ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. వెంటనే ఆ కాన్ఫరెన్స్ ఆపేశాను. మరణించే ముందు సుశాంత్ నాకు ఎందుకుఫోన్ చేయలేదని బాధపడ్డాను. ఒకవేళ చేసి ఉంటే.. మిమ్మల్ని మీరు బలవంతంగా చంపుకోవడం ఆపండి అని చెప్పాలి అనుకున్నాను’ అని భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత సుశాంత్ సహానటుడు, స్నేహితుడు అమిత్ సాద్కి కాల్ చేసి మాట్లాడినట్లు స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. సుశాంత్ ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆ సమయంలో అమిత్ కూడా షాక్లో ఉన్నాడని, సుశాంత తనకు జీవించడం ఇష్టం లేదని తనతో చెప్పినట్లు అమిత్ చెప్పాడని పేర్కొన్నారు. కనీసం ఒక్కసారయినా తనకు ఫోన్ చేసే సుశాంత్.. ఆత్మహత్య చేసుకునేముందు ఎందుకు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సీరియల్ సెట్లో గర్భస్రావం.. వెళ్లనివ్వలేదు, డ్రామా అన్నారు
స్మృతి ఇరానీ.. రాజకీయాల్లోకి రావడానికి ముందు నటిగానే సుపరిచితురాలు. క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్తో ఎక్కువ పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ సీరియల్ నిర్మాత పండిత్ జనార్ధన్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది స్మృతి. ఈ ధారావాహిక శోభాకపూర్, ఏక్తాకపూర్ బ్యానర్లో నిర్మితమైంది. ఈ సీరియల్ సెట్లో స్మృతి ఇరానీకి గర్భస్రావమైంది. తాజాగా ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ షూటింగ్ చేస్తున్న రోజులవి.. అప్పుడు నేను గర్భవతినన్న విషయం నాకూ తెలియదు. ఓరోజు కొంత అస్వస్థతగా అనిపించడంతో ఇంటికి వెళ్తానని చెప్పాను. కానీ వెళ్లలేకపోయాను. షూటింగ్లోనే ఉండిపోయాను. తీరా సాయంత్రం అయ్యాక వెళ్లమని చెప్పారు. నేను బయలుదేరానో లేదో రక్తస్రావం మొదలైంది. నాకింకా గుర్తుంది, ఆరోజు బాగా వర్షం పడుతోంది. వెంటనే ఒక ఆటోను పిలిచి ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాను. అక్కడికి వెళ్లగానే ఓ నర్సు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. ఓ పక్క రక్తస్రావమవుతున్నా ఆటోగ్రాఫ్ ఇచ్చాను. గర్భస్రావం అవుతున్నట్లుంది. ముందు నన్ను అడ్మిట్ చేసుకోండి అని అడిగాను. ఇంత జరిగిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం అవసరం. కానీ అది అంత ఈజీ కాదని నాకు తెలుసు. క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్లో దాదాపు 50 ముఖ్య పాత్రలున్నాయి. వాటితో సీరియల్ను ముందుకు తీసుకెళ్లొచ్చు. అయినప్పటికీ వాళ్లు నేను రావాల్సిందేనని వెంటపడ్డారు. తీరా సెట్స్కు వెళ్లాక నా గర్భస్రావం అంతా బూటకం అంటూ పుకారు పుట్టించారు. ఏక్తా కపూర్ కూడా అదే నిజమనుకుంది. నా ఇంటి ఈఎమ్ఐ కట్టాలంటే డబ్బులు కావాలి. దానికోసమే నేను హాస్పిటల్కు వెళ్లిన తర్వాతి రోజే సెట్స్లో జాయిన్ అయ్యా. అది ఎవరూ నమ్మలేదు. అందుకే మరుసటి రోజే నా మెడికల్ పేపర్స్ పట్టుకొచ్చి ఏక్తాకు చూపించి నేనేమీ డ్రామా చేయడం లేదని చెప్పాను. అప్పుడుకానీ తనకు నిజం అర్థం కాలేదు' అని చెప్పుకొచ్చింది స్మృతి ఇరానీ. -
సిగ్గనిపించట్లేదా? అని మేకప్ మెన్ ముఖం మీదే..: స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ మొదట్లో బుల్లితెరపై నటిగా రాణించిన విషయం అందరికీ తెలిసిందే! రామాయణ్, విరుధ్: హర్ రిష్తా ఏక్ కురుక్షేత్ర, హమ్ హై కల్ ఆజ్ ఔర్ కల్, క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ వంటి సీరియల్స్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే సీరియల్స్లో నటిస్తున్న సమయంలో మేకప్మెన్ తనను అవమానించాడట. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ మొదటి ఏడాది నాకు రోజుకు రూ.1800 ఇచ్చారు. అప్పటికింకా నాకు సొంతంగా కారు కూడా లేదు. జుబిన్ను పెళ్లాడాక మాకిద్దరికీ కలిపి రూ.30,000 దాకా వచ్చేవి. అయినా సరే నేను ఆటోలోనే సెట్స్కు వెళ్లేదాన్ని. ఓ రోజు నా మేకప్ మెన్.. నేను రోజూ కారులో వస్తున్నా, మీరిలా ఆటోలో వస్తున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా? అని ముఖం మీదే అడిగాడు. సొంతంగా ఏదైనా బండి కొనుక్కోవచ్చుగా అని చెప్పాడు. అప్పుడు నాకెంతో అవమానంగా అనిపించింది. మరోవైపు సీరియల్ సెట్లో ఎటువండి కూల్డ్రింక్స్, ఫుడ్ తీసుకోవడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఎందుకంటే ఆ ఫుడ్ అక్కడున్న వస్తువులపై పడితే శుభ్రం చేయడం కష్టం అవుతుందని యూనిట్ బాధ! అందుకే ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే సెట్ నుంచి బయటకు వచ్చి ఛాయ్ ఆస్వాదించేదాన్ని' అని చెప్పుకొచ్చారు. ఇకపోతే క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్లో ఆమె తులసి విరాణిగా నటించారు. కాగా స్మృతి ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో అమేథీ గడ్డపై రాహుల్ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
మిస్ ఇండియా పోటీల్లో స్మృతి ఇరానీ ర్యాంప్ వాక్.. పాత వీడియో వైరల్
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా, రాజకీయవేత్తగా, అందరికీ సుపరిచితురాలే. 2014లో మోదీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ నిలిచారు. తొలుత టెలివిజన్ నటి అయిన స్మృతి అనంతరం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీటన్నిటికంటే ముందు స్మృతి మోడల్గా పనిచేశారు. దాదాపు 25 ఏళ్ల కిత్రం అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఈ విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.బెంగాలీ-పంజాబీ కుటుంబానికి చెందిన స్మృతి.. 2000లో ఆతిష్, హమ్ హై కల్ ఆజ్ ఔర్ కల్ అనే సీరియల్స్ ద్వారా తొలిసారి బుల్లితెరపై కనిపించారు. ఏక్తా కపూర్ షో 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'లో తులసి విరాణిగా అందరికీ గుర్తుండిపోయారు. ఈ సీరియల్ ఆమెకు భారీ స్టార్డమ్ని సంపాదించిపెట్టింది. ఆమె ఉత్తమ నటిగా వరుసగా ఐదు ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు అందుకున్నారు. అంతేగాక స్మృతి ఇరానీ 25 సంవత్సరాల క్రితం 1998లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు. ఆమె టాన్జేరిన్ స్లీవ్లెస్ టాప్, మినీ స్కర్ట్లో అద్భుతంగా ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించారు. అయితే టాప్ 9కి చేరుకోలేకపోయారు. గురువారం( మార్చి23)న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ర్యాంప్ వాక్ చేస్తున్న స్మృతి వీడియోను మీరూ చూడండి. View this post on Instagram A post shared by Cryptic Miind (@crypticmiind) కాగా 2003లో ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె 2004లో మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2004లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2011లో తొలిసారి 2017లో రాజ్యసభకు రెండోసారి ఎన్నికయ్యారు. 2014లో అమేథీ నుంచి బరిలోకి దిగి రాహుల్ గాంధీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అదే అమేథీ గడ్డపై రాహుల్ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు. -
మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్కు స్మృతి ఇరానీ వంట పాఠాలు
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఈ మధ్య భారతీయ వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోటీలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దగ్గర కిచిడీకి పోపు (తడ్కా) ఎలా పెట్టాలో నేర్చుకున్నారు. ఆ వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్లో షేర్ చేశారు. అత్యంత పోషక విలువలు ఉన్న భారతీయ సూపర్ ఫుడ్ కిచిడీకి బిల్గేట్స్ పోపు(తడ్కా) పెట్టారు అంటూ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. పోషణ్ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిల్గేట్స్ పాల్గొన్నారు. ఈ వీడియోలో కిచిడీకి పోపు(తడ్కా) ఎలా పెట్టాలో బిల్ గేట్స్కు స్మృతి ఇరానీ నేర్పించారు. బిల్ గేట్స్ కూడా స్వయంగా దినుసులు వేసి గరిటెతో కలియపెట్టారు. అంతా పూర్తయ్యాక కిచిడీని రుచి చూశారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక రోజులో దాదాపు నాలుగు లక్షల మంది వీక్షించారు. దాదాపు 10 వేల లైక్లు, అనేక కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ కిచిడీని మైక్రోసాఫ్ట్ కిచిడీ అని పిలుస్తామంటూ పలువులు యూజర్లు చమత్కరించారు. -
George Soros: ఎవరీయన.. ప్రధాని మోదీని ఏమన్నాడంటే..
జార్జ్ సోరోస్.(92). ఈ పేరు వింటే చాలూ బీజేపీ మండిపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు కేంద్రం తరపున మంతత్రి స్మృతి ఇరానీ సైతం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.ఇంతకీ ఈయనెవరూ? ప్రధాని మోదీని ఏమన్నారంటే.. ► జార్జ్ సోరోస్.. హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ఈయన సంపద విలువ 8.6 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో 32 బిలియన్ డాలర్లను దానం చేస్తున్నట్లు ప్రకటించి.. 15 బిలియన్డాలర్లు ఇప్పటికే ఇచ్చేశాడు కూడా. ప్రపంచంలోకెల్లా ‘అత్యంత ఉదార దాత’ అనే బిరుదును ఈయనకు కట్టబెట్టింది ఫోర్బ్స్. అయితే.. ► మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్(జర్మనీ--ఫిబ్రవరి 17-19 తేదీల నడుమ జరగనుంది) దరిమిలా.. జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదానీ గ్రూప్ సంక్షోభాన్ని లేవనెత్తిన ఆయన.. విదేశీ పెట్టుబడిదారులు, భారత పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ► ‘మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయి. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడింది. మోదీ బలహీన పడే అవకాశముంది. ‘‘ఈ పరిణామం కచ్చితంగా భారత సమాఖ్య ప్రభుత్వంపై ఆ దేశ ప్రధాని మోదీకి ఉన్న పట్టును గణనీయంగా బలహీనపరుస్తుంది.సంస్థాగత సంస్కరణల కోసం తలుపులు తెరవాల్సి వస్తుంది. నాకు అక్కడి(భారత్) విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణను నేను ఆశిస్తున్నాను" అని మిస్టర్ సోరోస్ పేర్కొన్నారు. ► ఈ బిలియనీర్ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు మండిపడుతోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోరోస్ వ్యాఖ్యలను ‘భారత్పై సహించరాని దాడి’గా అభివర్ణించారామె.విదేశీ శక్తులంతా మూకుమ్మడిగా భారత ప్రజాస్వామ్య విధానంలో జోక్యం చేసుకునే యత్నం చేస్తున్నాయని.. దేశప్రజలంతా కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపు ఇచ్చారు.అంతేకాదు సోరోస్ను ఆర్థిక యుద్ధ నేరగాడిగా అభివర్ణించారామె. ఆయన కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను దోచుకున్న సోరోస్ను ఆర్థిక నేరగాడిగా ఆ దేశం ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతారు. గతంలోనూ మన అంతర్గత వ్యవహారాల్లో ఇలాగే విదేశీ శక్తులు జోక్యం చేసుకోగా.. వారిని మనం ఓడించాం. ఈసారి కూడా అలాగే చేస్తాం అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. Whether the PM-linked Adani scam sparks a democratic revival in India depends entirely on the Congress, Opposition parties & our electoral process. It has NOTHING to do with George Soros. Our Nehruvian legacy ensures people like Soros cannot determine our electoral outcomes. — Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2023 ► జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదానీ వ్యవహారం భారత్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపకక్షాలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జార్జ్ సోరోస్ కు ఎలాంటి సంబంధం లేదు. సోరోస్ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ► ప్రపంచ ధనికుల్లో ఒకరైన జార్జ్ సోరోస్.. హంగేరీలో ఓ జూయిష్ ఫ్యామిలీలో పుట్టారు. నాజీల రంగ ప్రవేశంతో.. ఆయన కుటుంబం లండన్కు వలస వెళ్లింది. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. ఆపై లండన్లోనే ఓ ప్రముఖ బ్యాంక్లో కొంతకాలం పని చేసి.. 1956లో ఆయన న్యూయార్క్కు వెళ్లి యూరోపియన్ సెక్యూరిటీస్ అనలిస్ట్గా పని చేయడం ప్రారంభించారు. ► 1973లో హెడ్గే ఫండ్(పూల్ ఇన్వెస్ట్మెంట్) అనే సాహసోపేతమైన అడుగుతో ఆర్థిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారాయన. ఆపై ఎన్నో సంచలనాలకు ఆయన నెలవయ్యాడు. ► బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. ఆయన దగ్గరి సంపద 8.5 బిలియన్ డాలర్లు. అలాగే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ పేరుతో ఛారిటీ పనులు చేస్తున్నారాయన. ప్రజాస్వామ్య పరిరక్షణ, పాదర్శకత, వాక్ స్వేచ్ఛ నినాదాలతో ఈ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేస్తోంది. ► రష్యా, చెకోస్లోవేకియా, పోలాండ్, రష్యా, యుగోస్లేవియా.. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు తర్వాత ఈ దేశాల్లోనూ ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహించారాయన. ప్రస్తుతం 70కి పైగా దేశాల్లో జార్జ్ సోరోస్ ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్’ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ► రాజకీయంగానూ ఆయన అభిప్రాయాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గతంలో.. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్లకు ఆయన మద్దతు ప్రకటించారు. అలాగే.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్లకు బద్ధ వ్యతిరేకి. ఇప్పుడు అదానీ గ్రూప్-హిండెన్బర్గ్ వ్యవహారంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. -
రాజస్తాన్ కోటలో ఘనంగా స్మృతి ఇరానీ కూతురు పెళ్లి
కేంద్ర మంత్రి, మాజీ నటి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్లే వివాహం రాజస్తాన్ కోటలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మేరకు స్మృతి కూతురు షానెల్లేకి, అర్జున్ భల్లాకి 2021లో నిశ్చితార్థం కాగా, గురువారం రాజస్తాన్లో ఖిమ్సర్ కోటలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో షానెల్లె ఎరుపు రంగు లెహంగా ధరించగా, వరుడు అర్జున్ తెల్లటి షేర్వాణీలో మెరిసిపోయాడు. వారి వివాహ వేడుకలు ఫిబ్రవరి 7న హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలతో ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలో ఆమె తల్లి స్మృతి కూడా బంగారు అంచుతో కూడిన ఎరుపు రంగ చీరతో కనిపించారు. ఈ సందర్భంగా ఆ వధువరులిద్దరూ భార్యభర్తల్లా కలసి నటించిన తొలి చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. A glimpse of Union Minister Smriti Irani's daughter Shanelle and Arjun Bhalla's mehendi and sangeet ceremonies at Khimsar Fort, Rajasthan. pic.twitter.com/FRyJXDRIiS — Tina Arpan Shah 🇮🇳 @tina661014 on #kooapp (@tina661014) February 9, 2023 (చదవండి: పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..) -
'కేంద్రం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది'
కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని..ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలను నెలకొల్పినట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రధాని మోడీ ఖేలో ఇండియా కేంద్రాలు తీసుకొచ్చారని మీడియా సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంతో మంది క్రీడాకారులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని ప్రతిభను చాటుతున్నారని వివరించారు. ఒలింపిక్స్ లో పోటీ చేసిన ఇండియా.. గోల్డ్ మెడల్ సాధించిందని, అలాగే పారాలింపిక్స్ లో కూడా క్రీడాకారులు 19 పతకాలు సాధించి దేశ కీర్తిని ఇనుమడింప చేశారని స్మృతి ఇరానీ సంతోషం వ్యక్తం చేశారు. మహిళల హాకీ జట్టు మరోసారి అవార్డులను ఎలా తెచ్చిపెట్టిందో దేశం చూసిందన్నారు. కేంద్రం ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్ ను లక్ష్యంగా పెట్టుకుని సాధన చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా అగ్రశ్రేణి భారతీయ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చేందుకు వీలు కల్పించిందన్నారు. శిక్షణా కార్యకలాపాల నిమిత్తం ఒక్కో క్రీడాకారుడికి ఏడాదికి రూ.5 లక్షలు అందజేస్తుందని మంత్రి స్మృతి ఇరానీ వివరించారు. -
అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. పుష్పరాజ్గా బన్నీ నటనకు యావత్ భారత్ సినీలోకం బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతో పాటు అవార్డుల పంటను కూడా పండిస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనకుగాను ఫిలింఫేర్, సైమా అవార్డులు రాగా.. తాజాగా బన్ని ఖాతలో మరో అవార్డును చేరింది. ఎంటర్టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు బన్నీ. ఈ అవార్డును ఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా అందుకున్నాడు. (చదవండి: అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి చెందిన అవార్డును అందుకున్న దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ నిలవడం గమనార్హం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నేను దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఉత్తరాది నుంచి అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకం’అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవార్డును కోవిడ్ వారియర్స్ డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు అంకింతం చేశాడు. -
కేంద్ర మంత్రిని గుర్తుపట్టని అధికారి.. ఉద్యోగానికి ఎసరు?
లక్నో: పైఅధికారులు ఫోన్ చేస్తేనే ఎంతో హడావిడి చేస్తారు అధికారులు. అలాంటిది కేంద్ర మంత్రి ఫోన్ అంటే మరి ఎలా ఉంటుంది? కానీ, ఫోన్ చేసిన కేంద్రమంత్రి గొంతును గుర్తుపట్టకపోవడం వల్ల ఓ అధికారి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి, ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గ ఎంపీ స్మృతి ఇరానీ ఫోన్ చేయగా ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్ గుర్తించకపోవటంతో ఆయనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? అమేథీ లోక్సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగస్టు 27న పర్యటించారు. అదే సమయంలో ముసఫిర్ఖానా తహసిల్లోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేశ్(27) అనే వ్యక్తి తన తల్లికి పెన్షన్ మంజూరు కాలేదనే విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్థానిక కార్యాలయంలో క్లర్క్ దీపక్ కారణమని పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తును ఇంకా అతడు ధ్రువీకరించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ.. ఆ అధికారికి ఫోన్ చేశారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం కేంద్ర మంత్రి గొంతును గుర్తు పట్టలేకపోయారు. దీంతో ఆమె పక్కనే ఉన్న జిల్లా ఉన్నతాధికారి ఆ ఫోన్ తీసుకొని క్లర్క్తో మాట్లాడారు. వెంటనే కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని జిల్లా అధికారులకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. కరుణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. క్లర్క్ నిర్లక్ష్యం వహించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ముసఫిర్ఖానా సబ్డివిజినల్ మేజిస్ట్రేట్ విచారణ జరుపుతారని.. నివేదిక ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారు.. కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలపై దుమారం.. -
ఝున్ఝున్వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే
న్యూఢిల్లీ: ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా ఆకస్మిక మరణంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నివాళులు అర్పించారు. లెజండ్ ఎప్పటికీ జీవించే ఉంటారంటూ వరుస ట్వీట్లలో ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గుండెపోటు కారణంగా ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. (రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) "ఈ రోజు నేను నా సోదరుడిని కోల్పోయాను.. చాలామందికి తెలియని బంధం మాది. అందరూ అతణ్ని బిలియనీర్ ఇన్వెస్టర్ అని, బీఎస్ఈ బాద్షా అని పిలుస్తారు. కానీ ఆయన ఇప్పటికీ.. ఎప్పటికీ ఒక డ్రీమర్’’ అని ఆమె ట్వీట్ చేశారు. అందం..పట్టుదల, సున్నితత్వం ఆయన సొంతం. మై జెంటిల్ జెయింట్ అని ఆమె పేర్కొన్నారు. మనం మనంగా జీవించాలి అని భయ్యా (రాకేష్ ఝున్ఝున్వాలా) ఎపుడూ చెబుతూ ఉండేవారు. ది లెజెండ్, లెగసీ నిలిచే ఉంటుందంటూ స్మృతి వరుస ట్విట్లలో సానుభూతి ప్రకటించారు. ఇది చదవండి:Rakesh Jhunjhunwala: అల్విదా బిగ్బుల్ ఒక శకం ముగిసింది: పలువురి భావోద్వేగం -
స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట.. కాంగ్రెస్ నేతలకు షాక్!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజుల క్రితం ఆరోపణలు చేశారు. గోవాలో బార్ వ్యవహారం దేశంలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆ కేసులో స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట లభించింది. అసలు గోవాలోని రెస్టారెంట్కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ ఓనర్లు కాదని సోమవారం స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని పేర్కొంది. వారు ఎన్నడూ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేసింది. రెస్టారెంట్, ఆ భూమి కూడా స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెకు చెందినది కాదని తెలిపింది. కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డీసౌజాలు ఆరోపణలు చేసిన క్రమంలో వారిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావా వేశారు కేంద్ర మంత్రి. ఆ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. ‘డాక్యుమెంట్లను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె పేరున లైసెన్స్ జారీ కాలేదు. రెస్టారెంట్కు వారు ఓనర్లు కాదు. ఎప్పుడూ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం లేదు.’ అని పేర్కొంది. కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనలు అపవాదు వేయాలనే దురుద్దేశంతో బోగస్గా అనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. అలాగే.. ప్రజల దృష్టిలో పడేందుకు కొందరిని టార్గెట్ చేసుకున్నట్లు ఉందని పేర్కొంది. కాంగ్రెస్ నేతలు తమ ట్వీట్లను తొలగించకపోతే.. ట్విట్టర్ ఆ పని చేస్తుందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Smriti Irani: ఆ ద్వేషంతోనే 18 ఏళ్ల నా కూతురిపై ఆరోపణలా.. స్మృతి ఇరానీ ఎమోషనల్ -
రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే..
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు. పదే పదే ద్రౌపది ముర్ము అని పిలిచారని, పేరుకు ముందు రాష్ట్రపతి అని గానీ, మేడం, శ్రీమతి అని గానీ సంభోదించలేదని విమర్శించారు. ఈమేరకు అధిర్ రంజన్ చౌదరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడినందుకు స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, గురువారమే పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అని సంభోదించారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రపతిని అవమానించేలా మాట్లాడినందుకు అధిర్ రంజన్తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో ఆందోళనలు కూడా చేపట్టారు. చివరకు అధిర్ రంజన్ చౌదరి వెనక్కితగ్గారు. క్షమాపణలు కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. చదవండి: మీరు బతికున్నారంటే మోదీ చలవే.. 'డోసు' పెంచిన బిహార్ మంత్రి -
కేంద్రమంత్రి స్మృతి ఇరాని పరువు నష్టం దావా
-
స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్
Smriti Irani Defamation Case.. గోవాలో బార్ వ్యవహారంలో దేశంలో హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు. కాగా, శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ నేతలకు భారీ షాకిచ్చింది. ముగ్గురు హస్తం నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు నోటీసులు జారీ చేసింది. పరువునష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆగస్టు 18వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గోవాలో బార్ సంబంధించి చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా డిలీట్ చేయాలని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామని కౌంటర్ ఇచ్చారు. అసలు వాస్తవాలను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. గోవాలో బార్ల విషయంలో తన కూతురుపై ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ విషయాన్ని లీగల్ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మంత్రి స్మృతి ఇరానీ తన పరువు నష్టం దావాలో డిమాండ్ చేశారు. Smriti Irani defamation case: Delhi HC directs three Congress leaders to remove social media posts #SmritiIrani #DelhiHighCourt #Congress https://t.co/2YnwX7jPHD — Lagatar English (@LagatarEnglish) July 29, 2022 ఇది కూడా చదవండి: బెంగాల్ స్కామ్.. నటి అర్పితా ముఖర్జీ కేసులో ఊహించని పరిణామం -
‘సోనియా జీ’ మీరు కూడా మహిళే కదా: నిర్మలా సీతారామన్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. అనంతరం.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అధినేత్రి విరుచుకుపడ్డారు. తనతో మాట్లాడవద్దని మండిపడ్డారు. మద్యాహ్నం 12 గంటలకు లోక్సభ వాయిదా పడిన సమయంలో బీజేపీ నేత రమాదేవితో సోనియా మాట్లాడుతుండగా వారి సంభాషణలో స్మృతి ఇరానీ కల్పించుకున్నారు. ఆపై ఆగ్రహంతో ఊగిపోయిన సోనియా.. స్మృతి ఇరానీ వైపు తిరిగి తనతో మాట్లాడవద్దని అన్నట్టు సమాచారం. ఇక అదీర్ వ్యాఖ్యలపై అంతకుముందు స్మృతి ఇరానీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. అంతకుముందు, ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దీంతో, లోక్సభకు సాయంత్రం 4 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు.. అధిర్ రంజన్ చౌదరి.. రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ క్రమంలో సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్మృతి ఇరానీ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను అవమానించడాన్ని సోనియా గాంధీ ఆమోదించారని మండిపడ్డారు. సోనియా గాంధీ.. ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, స్త్రీ వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. #WATCH | Some of our Lok Sabha MPs felt threatened when Sonia Gandhi came up to our senior leader Rama Devi to find out what was happening during which, one of our members approached there & she (Sonia Gandhi) said "You don't talk to me": Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/WxFnT2LTvk — ANI (@ANI) July 28, 2022 కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం సోనియాగాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు సోనియా గాంధీ ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇందుకు సోనియా గాంధీ తప్పకుండా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఇది నోరు జారి అన్న మాట కాదు.. ఒక్కసారి కాదు.. పదే పదే రాష్ట్రపతి పదం వాడారని తెలిపారు. ఇక, ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్ రంజన్ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. ‘తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. In another low, Leader of #Congress in LS, Adhir Ranjan Chowdhury, condescendingly refers to President Droupadi Murmu as “राष्ट्रपत्नी”. Shameful indeed pic.twitter.com/k0yAnsLNRu — Ramanathan B (@ramanathan_b) July 28, 2022 ఇది కూడా చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్సభ -
Rashtrapatni Row: పార్లమెంట్లో బీజేపీ ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. లోక్సభలో బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం లోక్సభలో గళం వినిపించారు. రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్మృతి ఇరానీ మండిపడ్డారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్ రంజన్ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. ‘తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా మాట్లాడారాయన. ఇప్పటికే అధిర్ రంజన్ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చినట్లు అయ్యిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకానొక టైంలో బీజేపీ సభ్యులంతా లేచి.. స్మృతి ఇరానీకి మద్ధతుగా గళం వినిపించారు. ఈ గందరగోళం నడుమే లోక్సభ 12 గం. దాకా వాయిదా పడింది. పార్లమెంట్ ఆవరణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తోటి ఎంపీలతో కలిసి ఫ్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధిర్ రంజన్వి సెక్సీయెస్ట్ కామెంట్లు అని, ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానం అంటూ ఆమె పేర్కొన్నారు. It was a deliberate sexist insult. Sonia Gandhi should apologise to the President of India and the country: Finance Minister & BJP leader Nirmala Sitharaman on Cong MP Adhir Chowdhury's 'Rashtrapatni' remark pic.twitter.com/4CSGFzH2TE — ANI (@ANI) July 28, 2022 #WATCH | "He has already apologised," says Congress interim president Sonia Gandhi on party's Adhir Chowdhury's 'Rashtrapatni' remark against President Droupadi Murmu pic.twitter.com/YHeBkIPe9a — ANI (@ANI) July 28, 2022 In another low, Leader of #Congress in LS, Adhir Ranjan Chowdhury, condescendingly refers to President Droupadi Murmu as “राष्ट्रपत्नी”. Shameful indeed pic.twitter.com/k0yAnsLNRu — Ramanathan B (@ramanathan_b) July 28, 2022 -
Smriti Irani Daughter: స్మృతి ఇరానీపై ట్రోలింగ్
గోవా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. తన కూతురు జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్పై ఆమె ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే క్షమాపణలు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ కీలక నేతలకు లీగల్ నోటీసులు కూడా పంపారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఉత్తర గోవా అస్సాగావ్లో సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్కు లీగల్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని స్వయంగా గోవా ఎక్సైజ్ శాఖ ధృవీకరించింది. అంతేకాదు.. నిజంగానే ఇల్లీగల్ బార్ లైసెన్స్తో నడుస్తోందని తేల్చింది. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి పేరిట కిందటి నెలలో లైసెన్స్ను రెన్యువల్ చేశారని నిర్ధారణ చేసుకుని మరీ నోటీసులు పంపినట్లు ప్రకటించింది. అయితే దానికి ఓనర్ ఎవరనే విషయంపై మాత్రం ఎక్సైజ్ శాఖ మౌనం వహించడం గమనార్హం. మెనూ వైరల్ ఇదిలా ఉంటే.. గతంలో కూతురు నడిపించే సదరు కేఫ్ అండ్ బార్కు, ఆమె డిషెస్కు దక్కిన రివ్యూలపై స్వయంగా స్మృతి ఇరానీనే స్పందించడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన మీడియా కథనాలు, ఆమె ఇచ్చిన రివ్యూ తాలుకా స్క్రీన్షాట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆమె నడిపిస్తున్న రెస్టారెంట్ మెనూను సైతం కొందరు తెర మీదకు తెస్తున్నారు. #smritiiranidaughter హ్యాష్ ట్యాగ్తో పేరుతో ఆ మెనూలో బీఫ్ ఉండడాన్ని ప్రస్తావిస్తున్నారు. తల్లి ఫేక్ డిగ్రీలాగే.. కూతురు ఫేక్ లైసెన్స్తో అబద్ధాలతో బార్ నడిపిస్తోందంటూ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఇది రాజకీయపరమైన విమర్శలకు దారి తీస్తోంది. Delicious Menu at #smritiiranidaughter 's BAR. pic.twitter.com/SsS6KxetCE — Anup Dhote | अनुप धोटे (@AnupDhote_IYC) July 25, 2022 Ammi bole Mummy, Beti bole Yummy? BJP member Smriti Irani's daughter caught in controversy of serving Beef in Goa's Restaurant & Bar. #BeefJihad #smritiiranidaughter #SillySoulsGoa pic.twitter.com/zbxUeQEtl4 — Faithful Indian 🇮🇳 (@faithfulindian8) July 25, 2022 Hotel Taj Palace New Delhi on 24 May 2022 The queue is of candidates for walk-in interview for Air India Cabin Crew Educated hotel management students are struggling for jobs but #smritiiranidaughter is running bar Cafe just after doing 12th class wah.#स्मृति_ईरानी_चुप्पी_तोड़ो pic.twitter.com/1MOA7jmuOf — ਮਨਰਾਜ मनराज singh (@manraj_mokha) July 25, 2022 స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ తన ఇన్స్టాగ్రామ్ బయోలో ఆ కేఫ్కు కో-ఫౌండర్గా పేర్కొనడం విశేషం. మరోవైపు తమ పార్టీ ఒత్తిడి మేరకు ఈ బ్యార్ వ్యవహారంపై అధికారులు చర్యలు ప్రారంభించారని, అయితే సిన్సియర్గా వ్యవహరించిన ఓ అధికారిని ఒత్తిళ్లతో అక్కడి నుంచి బదిలీ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన జోయిష్ అదంతా ఆధారాలు లేని నిందలని చెబుతోంది. తాను ఓనర్ను కాదని, అసలు ఆ రెస్టారెంట్ను తాను నడపడం లేదని, పార్ట్టైంగా అక్కడ రకరకాల డిషెస్ వండుతున్నానని జోయిష్ స్పందించారు. ఇక కూతురిని టార్గెట్ చేసుకుని తనపై విమర్శలు గుప్పించడంపై ఇదివరకే తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. న్యాయస్థానం, ప్రజాకోర్టులో తాను సమాధానాలు కోరుతానన్నారు. సోనియా, రాహుల్ గాంధీ రూ.5వేలకోట్ల దోపిడీపై తన తల్లి(స్మృతినే ఉద్దేశించుకుని..) విలేకరుల సమావేశం పెట్టడమే తన కూతురు తప్పని.. 2014, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై తన తల్లి పోటీ చేయడమే ఆమె తప్పని స్మృతి ఇరానీ ఆరోపించారు. తన కూతురు జోయిష్ స్టూడెంట్ అని, చదువుకుంటోందని, ఆమెకు ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్మృతీ ఇరానీ మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ మాత్రం.. ప్రధాని మోదీ స్పందించి స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆర్టీఐ యాక్టివిస్ట్గా తనకు తాను చెప్పుకునే రోడ్రిగ్యూస్ అనే వ్యక్తి.. బీజేపీ వ్యతిరేక చేష్టల్లో భాగంగానే కావాలనే ఈ వివాదంలోకి స్మృతీ ఇరానీ, ఆమె కూతురిని భాగం చేస్తున్నాడంటూ బీజేపీ మద్దతుదారులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ అంతా కాంగ్రెస్ నడిపిస్తున్న కుట్రేనని ఆరోపిస్తున్నారు. -
జైరాం రమేశ్కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెటా డిసౌజాకు లీగల్ నోటీసులు పంపారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతోందని నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను మసకబార్చేందుకే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. 18 ఏళ్ల తన కూతురు గోవాలో రెస్టారెంట్ కోసం, బార్ కోసం ఎలాంటి దరఖాస్తులు చేయలేదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తన కూతురుకు ఎక్సైజ్ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు. స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీకి గోవాలో రెస్టారెంట్ ఉందని, అందులో అక్రమంగా బార్ కూడా నడుస్తోందని కాంగ్రెస్ నేతలు శనివారం ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన స్మృతి ఇరానీ వీటిని కొట్టిపారేశారు. తాను గాంధీలను విమర్శిస్తున్నందుకే తన కూతుర్ని లక్ష్యంగా చేసుకున్నారని ఎమోషనల్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం జోయిష్ ఇరానీపై చేసిన ఆరోపణలను సమర్థించుకుంది. సాక్ష్యంగా చూపుతూ ట్విట్టర్లో వీడియో కూడా షేర్ చేసింది. అంతేకాదు ఆదివారం గోవాలోని జోయిష్ ఇరానీదే అని ఆరోపిస్తున్న రెస్టారెంట్ ముందు నిరసన కూడా చేపట్టింది. చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం'
న్యూఢిల్లీ: స్మృతి ఇరానీ కుతూరు జోయిష్ ఇరానీ.. గోవాలో లైసెన్స్ లేకుండా బార్ నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపించడం దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ ఖండించారు. తన కూతురు కాలేజీలో చదువుకుంటోందని ఆమె పేరుపై ఎలాంటి రెస్టారెంట్లు లేవని కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడికి దిగారు. అయితే యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తాజాగా ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ రెస్టారెంట్ జోయిష్ ఇరానీదే అనేందుకు ఇదే సాక్ష్యం అని తెలిపారు. Which of the two is lying? pic.twitter.com/Q4hKfvG9IZ — Srinivas BV (@srinivasiyc) July 23, 2022 కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోలో ఆ రెస్టారెంట్ తనదే అని జోయిష్ ఇరానీ అన్నారు. గోవాలో ఏ రెస్టారెంట్కు వెళ్లినా లోకల్ ఫుడ్ దొరుకుతుందని, కానీ ఇంటర్నేషనల్ ఫుడ్ మాత్రం తన రెస్టారెంట్లోనే లభిస్తుందని ఆమె మాట్లాడినట్లు వీడియోలో ఉంది. దీన్నే సాక్ష్యంగా చూపుతూ కాంగ్రెస్ మరోమారు తన ఆరోపణలను సమర్థించుకుంది. అంతకుముందు స్మృతి ఇరానీ మీడియా సమావేశం నిర్వహించి ఎమోషనల్ అయ్యారు. తాను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించడం వల్లే తన కూతుర్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురుకు ఆ రెస్టారెంట్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. చదవండి: ఆ ద్వేషంతో 18 ఏళ్ల నా కూతురిపై ఆరోపణలా.. స్మృతి ఇరానీ ఎమోషనల్ -
అందుకే నా కూతుర్ని టార్గెట్ చేశారు: స్మృతి ఇరానీ
సాక్షి,న్యూఢిల్లీ: గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందువల్లే అభం శుభం తెలియని తన కూతురిని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18 ఏళ్ల తన కూతురు గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కూతురు కావడమే ఆమె శాపమా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమోషనల్ అయ్యారు. '18 ఏళ్ల నా కూతురి వ్యక్తిత్వాన్ని కూనీ చేయాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. నా కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఎలాంటి బార్ నడపటం లేదు. కావాలంటే పేపర్లు చూసుకోండి. ఆమె పేరు ఎక్కడుంది? నేను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నందు వల్లే నా కూతురిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా కుమార్తె రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ విద్యార్థిని.' అని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ విషయంపై న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. వారికి ఈరోజే నోటీసులు పంపిస్తానని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని అమెథీకి పంపాలని, మరోసారి ఓడిస్తానని సవాల్ విసిరారు. కాగా అంతకుముందు స్మృతీ ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ గోవాలో రెస్టారెంట్ నడుపుతున్నారని, అందులో ఫేక్ లైసెన్స్తో బార్ కూడా ఉందని కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా ఆరోపించారు. మోదీ ప్రభుత్వం స్మృతి ఇరానీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను జోయిష్ ఇరానీ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. అవి నిరాధారమైనవని, స్మృతి ఇరానీ కూతురు అయినందువల్లే ఆమెపై రాజకీయ దురుద్దేశంతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: ఎన్డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్.. కేంద్రంపై ఫైర్ -
కేంద్ర మంత్రులు సింధియా, స్మృతి ఇరానీకి అదనపు బాధ్యతలు
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి అదనంగా మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఈ క్రమంలోనే జ్యోతిరాధిత్య సింధియాకు ఉక్కు, గనుల శాఖను కేటాయించారు. అయితే, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నఖ్వీతో పాటుగా రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ కూడా రాజీనామా చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు.. కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న పోర్ట్ఫోలియోతో పాటు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా కేటాయించాలని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. Smriti Irani, Jyotiraditya Scindia get additional charge of minority affairs, steel ministries https://t.co/Hvu0KbuLTC via @indiatoday — Amit Paranjape (@aparanjape) July 6, 2022 -
రాష్ట్రానికి మరిన్ని సఖి కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని సఖి(ఒన్ స్టాప్ సెంటర్) కేంద్రాలను మంజూరు చేయనున్నట్లు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. లింగ ఆధారిత హింసను ఎదుర్కొంటున్న మహిళలకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తాయన్నారు. ‘ఎనిమిదేళ్లలో కేంద్రం సాధించిన విజయాలు– మహిళలు, పిల్లలపై ప్రభావం’అనే అంశంపై సోమవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన ప్రాంతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. తెలంగాణకు 36 సఖి కేంద్రాలను మంజూరు చేయగా, ఇప్పటికే 33 కేంద్రాలు సేవలందిస్తున్నాయని తెలిపారు. హింసకు గురైన మహిళలు, బాలికలకు సఖి పథకం ద్వారా వైద్య, న్యాయ సహాయం, మానసిక సలహాలు, తాత్కాలిక ఆశ్రయం కల్పించనున్నట్లు వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన దాదాపు 4 వేల మంది పిల్లలకు పీఎం కేర్స్ పథకం కింద ఆర్థికసాయం అందించినట్లు వివరించారు. మంత్రి వివిధ పథకాల కింద లబ్ధి పొందినవారి జీవితగాధలను విన్నారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. -
ఎనిమిదేళ్ల మోదీ పాలన అమోఘం: నడ్డా
సాక్షి, హైదరాబాద్: దేశ అభ్యున్నతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎనిమిదేళ్లుగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కొనియాడారు. పేదల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన అభినందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం సాయంత్రం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభం కాగా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసం చేశారు. నడ్డా ప్రసంగం వివరాలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మీడి యాకు వెల్లడించారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వప్నించిన ఆర్టికల్ 370 రద్దు ప్రశంసనీయమని నడ్డా పేర్కొన్నట్లు తెలిపారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ నినాదాన్ని సాకారం చేసేందుకు జన్ధన్ యోజన, బీమా, కిసాన్ సమ్మాన్ నిధి వంటి సామాజిక భద్రత, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉన్నతికి చేపట్టిన పథకాలను ఆయన కొనియాడినట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో సేవ చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారనీ, 25 నెలలపాటు 80 కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం అందించిన కేంద్రప్రభుత్వాన్ని అభినందించారని వెల్లడించారు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తలకు, కశ్మీర్ వేర్పాటువాదుల చేతిలో అంతమైన కార్యకర్తల త్యాగాలు మరవలేనివనీ, రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ నాయకురాలు ద్రౌపదీ ముర్మును ప్రకటించడం బలహీనవర్గాలపట్ల బీజేపీ ప్రాధాన్యతను చాటిందని నడ్డా పేర్కొన్నట్లు వివరించారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం వ్యక్తుల కంటే వ్యవస్థలు ముఖ్యమన్న విషయం సీఎం కేసీఆర్ గుర్తించా లని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రాజ్యాం గ ఉల్లంఘనలు చేయడంలో కేసీఆర్ ముందువరుసలో ఉంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని దేశంలోని ప్రజలెవరూ ఆమోదించేస్థితి లేదని అన్నారు. మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ -
సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రధానికి స్వాగతం పలికే ప్రోటోకాల్ను కూడా పాటించని నేత సీఎం కేసీఆర్ అని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం అన్నారు. రెండు కళ్ల విధానం బీజేపీలో చెల్లుబాటు కాదన్నారు. బీజేపీ పాలనలో 8 ఏళ్లలో దేశం ఎంతో లబ్ది పొందిందని, 11 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు అందాయని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు అద్భుతమని కొనియాడారు. చదవండి: ప్రియమైన ఉపముఖ్యమంత్రి గారూ.. మీరు చాలా గ్రేట్! -
ఈడీపై ఒత్తిడి తెచ్చేందుకే కుట్ర: స్మృతీ ఇరానీ
న్యూఢిల్లీ: ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్కు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది.కేంద్రం కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను బీజేపీ తప్పుపట్టింది. అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టిందని, ఇది ముమ్మాటికీ కుట్రే అని ఆమె మండిపడ్డారు. గాంధీ ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందని విమర్శించారు. జైలు నుంచి బెయిల్పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అందులో రాహుల్ గాంధీ కూడా ఒకరని నొక్కి చెప్పారు. సంబంధిత వార్త: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. అసలేం జరిగింది? Press conference by Union Minister Smt. @smritiirani at party headquarters in New Delhi. https://t.co/tAWpWUJRvT — BJP (@BJP4India) June 13, 2022 -
స్టెప్పులేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
-
డ్యాన్స్తో అదరగొట్టిన స్మృతిఇరానీ..
ఇంఫాల్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతిఇరానీ మణిపూర్లో పర్యటించారు. అందులో భాగంగా శుక్రవారం వాంగ్ఖీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి మహిళలు వేసుకునే వస్త్రాలను ధరించి.. సంప్రదాయ నృత్య కళాకారులతో డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో అక్కడ ఉన్న స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రిని మరింత ఉత్సాహపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మణిపూర్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. #WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW — ANI (@ANI) February 18, 2022 -
ములాయం సింగ్కు స్మృతి ఇరానీ పాదాభివందనం, వీడియో వైరల్
Mulayam Singh Yadav blesses Smriti Irani: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్యసభ, లోక్సభ ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ మెట్లు దిగుతూ పార్లమెంటు హాల్లోకి వస్తున్న సమయంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ ములాయం పాదాలను తాకి నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమెను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం కాగా ఇటీవల ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆమె బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఆమె కూడా లక్నోలోని తన మామ ములాయం సింగ్ ఇంటికి వెళ్లి అక్కడ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో ములాయం సింగ్ యాదవ్ ఆమె తలపై చేయి వేసి దీవించారు. చదవండి: బీజేపీ ఏరికోరి సీఎంను చేసింది.. ప్లస్ అవుతారా? #WATCH | Samajwadi Party (SP) founder-patron and MP Mulayam Singh Yadav blesses Union Minister Smriti Irani, as she greets him at the Parliament. pic.twitter.com/3ti42DXkpa — ANI (@ANI) January 31, 2022 -
దేశ ప్రధానికి హాని తలపెడతారా ?
-
దళిత యువతిపై అమానుషం.. జుట్టుపట్టుకొని కొడుతూ.. వీడియో వైరల్
లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. బాలిక పట్ల కొందరు వ్యక్తులు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీలోని అమేథీ పరిధిలో ఒక యువతి తమ ఇంట్లో చోరీ చేసిందనే ఆరోపణలతో కొందరు బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఆమెను జుట్టుపట్టుకొని లాక్కొచ్చి ఇంటిలో బంధించారు. ఆ తర్వాత.. ఇద్దరు వ్యక్తులు ఆమెను నేలపై తొసేసి.. మరో వ్యక్తి ఆమెపై కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. పాపం బాలిక దెబ్బలకు తాళలేక ఏడుస్తూ ఉంటే వారు ఏమాత్రం జాలిచూపడం లేదు. ఇద్దరు మహిళలు కూడా బాలికను తీవ్రంగా దూషిస్తున్నారు. బాలికను కొడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు వీడియో తీస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. బాలిక దెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తు ఉండే దుర్మార్గులు మాత్రం ఏ మాత్రం జాలీ చూపలేదు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అమేథీ పోలీసులు నిందితులపై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులను నమోదు చేశారు. బాలికను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీటర్లో మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. యోగీ ప్రభుత్వం నిద్రపోతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ట్వీటర్ వేదికగా స్సందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. అమేథీ పోలీసు అధికారి అర్పిత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతావారికోసం గాలిస్తున్నట్టు తెలిపారు. యోగి ప్రభుత్వం కేవలం అధికారం కోసం మాత్రమే చూస్తుందని.. ప్రజల భద్రతను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ప్రస్తుతం యూపీలో కలకలం రేపుతుంది. अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr — Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021 -
ఆ మాటలు సిగ్గు చేటు.. చర్యలు తీసుకోవాల్సిందే: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: లైంగిక దాడికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు సిగ్గు చేటని, అసలు మహిళ సాధికారత గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తమ నేతపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుడై మహిళలను కించపరిచేలా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని ఆమె ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కర్ణాటక మాజీ స్పీకర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్కుమార్ రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండగా స్పీకర్ను ఉద్దేశించి ఆయన ఓ వ్యాఖ్య చేశారు.. ‘ఒక సామెత ఉంది, లైంగిక దాడి అనివార్యమైనప్పుడు ,పడుకుని ఎంజాయ్ చేయాలని అన్నారు. అసెంబ్లీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. దీంతో దిగివచ్చిన ఎమ్మెల్యే రమేశ్కుమార్ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. చదవండి: వైరల్: అసెంబ్లీలో నోరు జారిన ఎమ్మెల్యే, ఏదో చెప్పబోయి మరేదో.. -
అన్నీ కేసీఆర్ కుటుంబానికే..
సాక్షి, సిద్దిపేట: ‘నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పాటైనా ప్రజలు నీళ్ల కోసం పోరాడుతూనే ఉన్నారు.. నిధులన్నీ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది.. నియామకాలూ సీఎం కుటుంబానికే పరిమితమయ్యా యి’ అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతిఇరానీ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముగిసింది. ఈ సందర్భంగా హుస్నాబాద్లో రోడ్షో నిర్వహించారు. అనంతరం సభలో స్మృతిఇరానీ మాట్లాడారు. ‘రాష్ట్రంలో అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడేందుకే ఈ యాత్ర చేపట్టారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి అనేక నిధులిస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది. 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీని ప్రధాని త్వరలో పున: ప్రారంభిస్తారు. దేశం లోని 18 కోట్ల మంది పేదలకు 14 నెలలుగా ఉచితంగా రేషన్ బియ్యాన్ని కేంద్రం అందిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ 20 నెలలైనా అమలు కావడం లేదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి అమలు చేయని వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే ఆయన ఎంఐఎంను చూసి భయపడుతున్నారు. టీఆర్ఎస్కు కారున్నా.. దాని స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలో ఉంది’అని కేంద్ర మంత్రి విమర్శించారు. సంజయ్ చేపట్టిన తొలిదశ యాత్ర దిగ్విజయవంతమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండిని అభినందించారని స్మృతిఇరానీ వివరించారు. ఉచితవిద్య, వైద్యంపైనే తొలి సంతకం.. పాదయాత్రలో ప్రజల సమస్యలు, కష్టాలు చెబుతుంటే కళ్లలో నీళ్లు వచ్చాయని.. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిందని.. 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే సీఎం ఎవరైనా ఉచితవిద్య, వైద్యంపైనే తొలి సంతకం పెడతారని బండి సంజయ్ అన్నారు. ‘రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. టీఆర్ఎస్ గడీల పాలనను బద్ధలుకొట్టేందుకు ఇదే చివరి పోరాటం కావాలి. ధరణి పోర్టల్ టీఆర్ఎస్కు భరణిగా.. పేదలకు దయ్యంలా మారింది. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. మాట్లాడితే కేసీఆర్ ధనిక రాష్ట్రమని అంటున్నారు.. మరి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఎందుకు ఇవ్వడం లేదు. రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదు. పోడు భూముల సమస్యతో గిరిజనులు అల్లాడుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో హిందువులు గణేష్ ఉత్సవాలను కూడా చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. బీజేపీ ఏరోజు సభ పెడితే.. కాంగ్రెస్ అదే రోజు మీటింగ్ పెడుతోంది. దాని కథేందో వారికే తెలియాలి. యాత్రలో 15వేలకు పైగా వినతిపత్రాలు వచ్చాయి. వాళ్లందరి తరఫున పోరాటానికి నేను బ్రాండ్ అంబాసిడర్ను. ఈటల రాజేందర్ గెలుపు తరువాత మళ్లీ మలిదశ పాదయాత్ర ప్రారంభిస్తా’అని బండి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా సంగ్రామయాత్ర తొలివిడత పాదయాత్రను విజయవంతంగా ముగించిన బండి సంజయ్ ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు. దళితుల అభ్యున్నతికి కేంద్రం రూ.25 వేల కోట్ల నిధులను వెచ్చించింది. స్టాండప్ ఇండియా స్కీం పేరుతో దళితులను పారిశ్రామికవేత్తలను చేశాం. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులిచ్చాం. కేంద్రం.. ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఇక్కడి రైతులకు ఆ పథకాన్ని అమలు చేయడం లేదు. ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంటే.. రాష్ట్రంలో దాన్ని అమలు చేయకుండా పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. సొంత ఇంటి కోసం కేసీఆర్ ప్రగతిభవన్ నిర్మించుకున్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పేదలకు మాత్రం ఉండటానికి సొంత ఇళ్లు మాత్రం నిర్మించి ఇవ్వరు. – స్మృతి ఇరానీ హుజూరాబాద్లో ఐదు నెలలుగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలుకావడం లేదని, కేసీఆర్ రాజ్యాంగమే అమలవుతోందని మాజీ మం త్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ‘మద్యం ఏరులై పారుతోంది. మనుషులకు విలు వ కట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నేను గెలవొద్దని కేసీఆర్ ఆదేశిస్తే.. ఆయన బానిసలు అమలు చేస్తున్నారు. అక్టోబర్ 30న హుజూరాబాద్లో కురక్షేత్ర యుద్ధం జరగబోతోంది. కేసీ ఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి జరి గే యుద్ధం ఇది. టీఆర్ఎస్ ఎన్ని సర్వేలు చేసినా.. 75 శాతం ఓట్లు బీజేపీకే వస్తున్నయ్. ఎన్ని కుట్ర లు చేసినా వాళ్ల ఆటలు సాగడం లేదు’అని అన్నా రు. కేంద్రం నుంచి నిధులు రాకుంటే తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతోందని బీజేపీ శాసన సభ పక్షనేత రాజాసింగ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ‘బంధు’పథకం అమలు చేయా లని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేవారు. ఒక పక్క ధనిక రాష్ట్రం అని చెబుతూ.. మరోపక్క ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని విమర్శించారు. ఈ యాత్ర ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. -
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది: స్మృతి ఇరానీ
సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తొలి విడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నేడు ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం హుస్నాబాద్లో భారీ బహరంగ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ సభకు హాజరయ్యారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు స్మృతి ఇరానీ. ఎంఐఎంకు టీఆర్ఎస్ భయపడుతుందేమో కానీ బీజేపీ భయపడదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమం నుంచి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని మళ్లీ మోసం చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం. నిధులు కేసీఆర్ జేబులోకి వెళ్తున్నాయి. నియామకాలు కేసీఆర్ ఇంట్లోకి వెళ్లాయి’’ అన్నారు. (చదవండి: కష్టాలు కదిలించాయి.. కన్నీళ్లు తెప్పించాయి) ప్రగతి భవన్లో కాషాయ జెండా ఎగరవేసే వరకు యాత్ర కొనసాగిస్తాం: డీకే అరుణ నియంత పాలన అంతం చేసేందుకు ప్రారంభించిందే ప్రజాసంగ్రామ యాత్ర.. ప్రభుత్వంలోకి వచ్చే వరకూ దశలవారీగా యాత్ర చేపడతాం అన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెలంగాణ రావాలన్నారు. ఇప్పుడేమో అన్ని ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారు అని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడు. తెలంగాణలో ఆదాయం ఎటు పోతుంది.. గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు. దళిత బందు హుజూరాబాద్ లోనే ఎందుకు... ప్రతి పేదవారికి ఆర్థిక సాయం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. (చదవండి: క్షమించండి.. ఈరోజు సోమవారమా?!) ‘‘ఏ పథకానికీ పైసలు లేవు అంటడు.. కాని హుజూరాబాద్ ఎన్నిక రాగానే కేసీఆర్కు దళిత బంధు గుర్తుకు వచ్చింది. ఏం చేసైనా ఈటెలను ఓడించాలని చూస్తున్నారు. ఎన్నికల లోపు దళిత బందు అన్ని జిల్లాల్లో అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఈటల ముందుండి పోరాటం చేశాడు. పార్టీలో నిరంకుశత్వం.. అవినీతి గురించి మాట్లాడుతున్నాడని.. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఈటలను బయటకు పంపిండు. కేసీఆర్ ఎక్కడ పోయినా సోది తప్ప ఏదీ చెప్పడు. కథలతోనే ప్రజలను మోసం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నిదులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు’’ అని తెలిపారు. చదవండి: సిట్టింగ్లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు ! -
నేడు హుస్నాబాద్లో బీజేపీ సభ
సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తొలి విడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నేడు ముగియనుంది. ఆగస్టు 28న హైదరాబాద్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ముగింపు సందర్భంగా హుస్నాబాద్లో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు వింటూ వారికి భరోసానిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సంజయ్ పాదయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో ఇద్దరు మాజీ సీఎంలు, ఆరుగురు కేంద్ర మంత్రులు సహా 24 మంది జాతీయ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. నేటి రోడ్షో, సభను లక్ష మందితో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతీఇరానీ రోడ్షో, సభకు హాజరుకానున్నారు. హుస్నాబాద్ అంతా ప్లెక్సీలు, జెండాలతో కాషాయమయం అయింది. సభను విజయవంతం చేయాలని యాత్ర ఇన్చార్జి మనోహర్రెడ్డి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గౌరవెల్లి, గండిపల్లిపై సీఎం వివక్ష... గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన వివక్ష చూపుతూ హుస్నాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభమై 12 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తి చేయకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. శుక్రవారం 35వ రోజు సిద్దిపేట జిల్లా పొట్లపల్లి నుంచి హుస్నాబాద్ వరకు యాత్ర సాగించిన సంజయ్.. దారిపొడవునా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ‘1.14 టీఎంసీ నీటి సామర్థ్యంతో గౌరవెల్లి, 0.4 టీఎంసీ సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులకు 2009లో శంకుస్థాపన చేశారు. రైతుల నుంచి 1,836 ఎకరాలు సేకరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీడిజైన్ పేరుతో 2017లో 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి అదనంగా 2 వేల ఎకరాలు సేకరించారు. దీంతో 7 గిరిజన తండాలు ముంపునకు గురవుతున్నా బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేయకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్ నియోజకవర్గానికి, అల్లుడి నియోజకవర్గానికి ఒక న్యాయం.. హు స్నాబాద్కు ఇంకో న్యాయమా?’అని హెచ్చరించా రు. కాగా పాదయాత్ర విజయవంతంగా సాగ డం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి బండి సంజయ్ను అభినందించారు. ఇక ముందు రాష్ట్రం లో ఇలాగే ముందుకు సాగాలని సూచించారు. పాదయాత్ర సాగిందిలా.. మొత్తం రోజులు: 36 (మధ్యలో రెండురోజులు విరామం) కిలోమీటర్లు: 438 జిల్లాలు: 8 (హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట) అసెంబ్లీ నియోజకవర్గాలు: 19 (చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్) పార్లమెంట్ నియోజకవర్గాలు: 6 (హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్) రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల నుంచి వినతులు: 11,675 -
హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
రాజ్యసభలో.. సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను హోంశాఖకు పంపినట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన దిశ – క్రిమినల్ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులు హోంశాఖ పరిశీలనలో ఉన్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. హింసకు గురవుతూ ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కింద ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు మొత్తం 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరైనట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకసింగ్ చెప్పారు. జేఈఈ, నీట్లో కూడా రాణించేందుకు వీలుగా ఈ పాఠశాలల్లో ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులకు దక్షణ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 1,570 పంచాయతీల్లో వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయగా 216 పంచాయతీల్లో ప్రస్తుతం వినియోగిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి దేవుసింగ్ చౌహాన్ తెలిపారు. మే నెలలో ఆంధ్రప్రదేశ్లో వైర్లెస్ద్వారా 8,07,504 టీబీ డాటాను వినియోగించారని, ఇది దేశంలోనే రెండో అత్యధికమని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. లోక్సభలో.. ఏపీ స్మార్ట్ సిటీల్లో 251 ప్రాజెక్టులు స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఏపీలో రూ.7,740.83 కోట్ల విలువైన 251 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ చెప్పారు. కాకినాడలో రూ.911.85 కోట్ల విలువైన 55 ప్రాజెక్టులు, తిరుపతిలో రూ.201 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులు, విశాఖపట్నంలో రూ.646.32 కోట్ల విలువైన 43 ప్రాజెక్టులు పూర్తయ్యాయని వివరించారు. అమరావతిలో రూ.2,046 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు వర్క్ ఆర్డ ర్ దశలో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు సంబంధించి రూ.7,798 కోట్లు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్రాణే తెలిపారు. విశాఖపట్నంలో సెంట ర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ మారిటైమ్, షిప్బిల్డింగ్ ప్రాజెక్టు చేపట్టినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. -
కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను పరిశీలిన అనంతరం తమ అభిప్రాయాలను జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు - క్రిమినల్ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు ఆమె తెలిపారు. దిశ (క్రిమినల్ లా సవరణ) బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి 2020 జనవరి 21న తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి చెప్పారు. ఈ బిల్లుపై మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించాం. అనంతరం మా అభిప్రాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును మా మంత్రిత్వ శాఖకు పంపించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి గత జూన్ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచార నేరాలనుత్వరితగతిన విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉద్దేశించిన మరో బిల్లు 2020 జనవరి 29న హోం మంత్రిత్వ శాఖ నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి తెలిపారు. దీనిపై కూడా తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా బిల్లును ఈ ఏడాది జనవరి 11న హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది. దానిపై కూడా మా అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు తెలియచేయడం జరిగింది. ఈ రెండు దిశ బిల్లులు ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలియజేశారు. -
ఏపీలో 14 ‘దిశ కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన ‘దిశ’ కేంద్రం శుభవార్త తెలిపింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మహిళల కోసం ఏపీలో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదని మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. హింసకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవలతోపాటు వారికి ఆశ్రయం కల్పించేందుకు దిశ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు మంత్రి వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రేయింబవళ్లు సేవలు అందుతున్నాయని చెప్పారు. మహిళల సాధికారతను సాధించేలా వారికి రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కార్యక్రమం కింద ఆయా జిల్లాల్లో దిశ కేంద్రాల స్థాపన జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. -
స్మృతి ఇరానీని కలిసిన వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ సీపీ మహిళా ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిశారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించారు’’ అని అన్నారు. -
మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా...జాతీయ హెల్ప్లైన్
సాక్షి, న్యూఢిల్లీ: మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా ఏర్పాటు చేసిన జాతీయ హెల్ప్లైన్ నంబరు 7827170170ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆవిష్కరించారు. 24 గంటలూ పనిచేసే ఈ హెల్ప్లైన్ను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఏర్పాటు చేసింది. అలర్లు, హింసాకాండ బాధిత మహిళలకు ఆన్లెన్ ద్వారా సహాయం అందించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ఈ హెల్ప్లైన్ ఏర్పాటైంది. పోలీసు యంత్రాంగం, ఆసుపత్రులు, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, మానసిక నిపుణుల సేవలు తదితర సదుపాయాలతో ఈ నంబరును అనుసంధానం చేయడం ద్వారా బాధిత మహిళలకు భద్రత కల్పించనున్నారు. -
పెళ్లి కావాల్సిన వారికి ఆ పరీక్షపెట్టండి: కేంద్ర మంత్రి సలహా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా శుక్రవారం చేసిన ఓ పోస్టులు తెగ వైరలయ్యాయి. తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. పెళ్లి కావాల్సిన వారికి సలహాలు ఇచ్చారు. ఆంటీ ఇచ్చే సలహా అంటూ తనకు తాను ఆంటీగా అభివర్ణించుకోవడం స్మృతి ఇరానీకే చెల్లింది. ఎవరైనా ఆంటీ అంటే ఊరుకోరు కానీ స్మృతి ఇరానీ ఆంటీ అనిపించుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో చేసిన ఆమె పోస్టులు ఇలా ఉన్నాయి. ‘ఏ వ్యక్తికైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా (స్లో) ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవచ్చు’ అని ఓ పోస్టు చేశారు. అనంతరం మరో పోస్ట్ చేశారు. ‘ఆంటీ సలహా.. ఏ పదార్థం పరిపూర్ణం.. లోపం లేనిది (పర్ఫెక్ట్)గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మార్చుకోవాలి’ అని సలహాలు ఇస్తూ పోస్టు చేశారు. ఈ పోస్టులపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ ఉన్న విషయం తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో స్మృతిని కొనసాగించారు. -
వైరల్: మీ కుమార్తెలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేశారు. యానిమేటెడ్ వీడియోలు, జీఐఎఫ్లతో కథలు చెప్పే బోహ్రా సిస్టర్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ తమ కుమార్తెలకు అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి కోరారు. ఈ యానిమేటెడ్ వీడియోలో ఓ చిన్న అమ్మాయి విచారకమైన ముఖంతో.. చేతిలో చీపురుతో నిలబడి ఉంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి. అయితే ఆమె చిరిగిన దస్తులు బదులుగా.. పాఠశాల యూనిఫాం వేసుకోవడంతో.. తక్షణమే ఆమె ముఖం వెలిగిపోతుంది. ‘‘మీ కుమార్తెలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి.’’ అనే క్యాప్షన్తో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 1,42,594 మంది నెటిజన్లు వీక్షించారు. వందల మంది లైక్ కొట్టి.. కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ చాలా చక్కటి సందేశం.. ఇది చాలా ముఖ్యమైనది.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ నిజంగా ఇది ఎంతో బాగుంది. మీ కుమార్తెలను బడి బాట పట్టించండి.’’ అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్న పిల్లల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం త్వరగా ఆమోదం పొందడానికి మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కోరారు. రాష్ట్ర చట్ట సభలు చేసిన ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్రానికి పంపామని తెలిపారు. అయితే ఈ బిల్లుపై కేంద్ర హోం శాఖ.. మహిళా, శిశు సంక్షేమ శాఖ అభిప్రాయాలు, సూచనలు కోరిందన్నారు. మహిళల భద్రతలో కీలకమైన ఈ బిల్లుపై వేగంగా స్పందించి దిశ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం ఆయన లేఖ రాశారు. ఆ లేఖ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీమతి స్మృతి ఇరానీజీ.. రెండేళ్లుగా చిన్న పిల్లల కోసం, లింగ వివక్ష రూపుమాపే విధంగా మీరు సమర్థవంతంగా అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయి. మహిళల పోషణ, సంక్షేమంపై పథకాలను బలోపేతం చేయడమే కాకుండా, మహిళలు, పిల్లల రక్షణ కోసం బలమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీరు నాతో అంగీకరిస్తారనుకుంటున్నా. మహిళలు, పిల్లల భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మహిళలు, పిల్లలపై జరుగుతున్న దారుణ ఘటనల్లో త్వరితగతిన దోషులను గుర్తించి కఠిన చర్యలను తీసుకునే విధంగా గత రెండేళ్లుగా అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాము. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థ 2020 డిసెంబర్లో ‘ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు, పిల్లలపై నిర్దేశిత నేరాలకు ప్రత్యేక కోర్టులు) బిల్లు 2020’, ‘ఆంధ్రప్రదేశ్ దిశ – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లులను ఆమోదించింది. అటువంటి కేసులలో త్వరగా న్యాయం జరిపించి, దోషులకు కఠిన శిక్ష వేయడం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కూడా బిల్లులు అనుమతిస్తాయి. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన కేసుల్లో తగిన సాక్ష్యాలు ఉంటే ఏడు రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి చేసేలా చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ కేసుల్లో దోషులకు త్వరితగతిన శిక్ష విధించడానికి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. దిశ బిల్లుకు అంగీకారం లభిస్తుందన్న ఆశాభావంతో మహిళలు, చిన్న పిల్లలపై నమోదవుతున్న లైంగిక నేరాల కేసులలో దర్యాప్తు, విచారణను సకాలంలో పూర్తి చేసే విధంగా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా దృష్టి ఇలా.. ►ప్రత్యేకంగా ఒక మహిళా ఐఏఎస్, ఒక మహిళా ఐపీఎస్ అధికారుల నియామకం. ►డీఎస్పీల నేతృత్వంలో 18 దిశ మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు. ఇవి స్నేహ పూర్వకంగా ఉన్నాయని ఐఎస్ఓ ధృవీకరణ. ►ఆపద వేళ ఆదుకునేలా దిశ యాప్ రూపకల్పన. ఈ యాప్లోని ఎస్వోఎస్ బటన్ నొక్కితే తక్షణం స్పందించి సాయం. ►ఈ యాప్ను ఇప్పటికే 19.83 లక్షల మంది డౌన్లోడ్. ఏడాదిన్నరగా 3,03,752 ఎస్వోఎస్ రిక్వెస్టులు. వీటిలో 1,823 చర్యలు తీసుకోవాల్సిన కాల్స్. 221 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు. ►మంగళగిరి, తిరుపతి, విశాఖపట్నంలో కొత్తగా దిశ ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటు పనులు ప్రారంభం. ►రాష్ట్ర వ్యాప్తంగా 700 పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్ల ఏర్పాటు. ►ఇంటిగ్రేటెడ్ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ కోసం 18 మినీ బస్సులు ఏర్పాటు. 900 ద్విచక్ర వాహనలతో దిశ పెట్రోలింగ్. ►కేసుల విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం. ►లైంగిక దాడికి గురై ప్రాణాలతో బయట పడిన వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత. బాధితులు ధైర్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేలా 13 జిల్లాల కేంద్రాల్లో వన్స్టాప్ సెంటర్ ఏర్పాటు. బాధితుల ఆత్మస్థైర్యం పెంచేలా సైకలాజికల్, సామాజిక కౌన్సెలింగ్, మెడికో లీగల్ అసిస్టెన్స్, తాత్కాలిక ఆశ్రయం. త్వరితగతిన సమాచారం పంపండి క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజర్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్.. ఉమ్మడి జాబితాలో ఉన్నందున, ఈ రెండు బిల్లులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ప్రకారం రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపించాము. ఈ బిల్లు ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖ 2021 జనవరి 11న ఓఎం నంబర్ 17/6/2021, 15.06.2021 తేదీన ఓఎం నంబర్ 17/01/2020తో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్యాఖ్యలు, పరిశీలన కోరింది. అందువల్ల త్వరితగతిన మీరు ఈ బిల్లులపై మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యలను హోం శాఖకు పంపాల్సిందిగా కోరుతున్నా. ఈ బిల్లు గురించి వివరించడానికి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారిని ఒకరిని నియమిస్తాను. ఏడాదిన్నరగా ఇదీ ఫలితం.. ►డిసెంబర్ 2019 నుండి ఇప్పటి వరకు 162 రేప్, 1,353 లైంగిక నేరాల్లో ఏడు రోజుల్లోనే కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 498 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ►మహిళలపై నేరాల కేసులపై దర్యాప్తు పూర్తి చేయడానికి 2017లో 117 రోజులగా ఉన్న సగటు సమయం 2021 నాటికి 41 రోజులకు తగ్గింది. ►లైంగిక వేధింపుల కేసుల్లో ఈ సంవత్సరం దర్యాప్తు సగటు రేటు రాష్ట్రంలో 90.17 శాతంగా ఉంటే దేశ సగటు రేటు 35 శాతంగా ఉంది. ►143 మందిపై నేరారోపణలు రుజువు కాగా, ఇందులో ముగ్గురికి ఉరిశిక్ష, 14 మందికి జీవిత ఖైదు విధించారు. -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్ లేఖ
-
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. దిశ చట్టం ఆమోదించాలంటూ సీఎం జగన్ లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. కాగా ‘దిశ’ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షలో భాగంగా దిశ చట్టానికి సంబంధించి కేంద్ర మంత్రికి జగన్ లేఖ రాశారు. కాగా ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
భర్తకు నివాళిగా సైన్యంలో అడుగుపెట్టిన భార్య
సాక్షి, చెన్నై: పుల్వామాలో ఉగ్రవాదులతో పోరాడుతూ 2019 ఫిబ్రవరిలో భారత ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన భార్య నితికా కౌల్ భారత సైన్యంలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. నితికా కౌల్ శనివారం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి తన భర్తకు నివాళిగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేసి సైన్యంలో చేరారు. కాగా దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్లో స్పందిస్తూ...నితికా కౌల్కు అభినందనలు తెలిపారు. "లెఫ్టినెంట్-నితికా కౌల్, మీరు భారతదేశ నారీ శక్తి స్వరూపం. మీ అంకితభావం, సంకల్పం, భక్తి గొప్పది. మేజర్ విభూతి ధౌండియాల్ ఈ రోజు మీ భుజంపై ఉన్న నక్షత్రాలను చూసి ఆనందం, గర్వంతో నవ్వుతారు.’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: వైరల్ వీడియో: పోలీస్పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి) -
ఆక్సిజన్ కోసం అర్థిస్తే.. అరెస్ట్ చేశారు
లక్నో: దేశప్రజలంతా కోవిడ్ బారిన అల్లాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్లో మహమ్మారి విజృంభణ ఉధృతంగా ఉంది. ఈ సారి ఆక్సిజన్, బెడ్ల కొరత అధికంగా ఉంది. ఏ హాస్పిటల్ ముంద చూసినా ప్రాణవాయువు కోసం అర్థిస్తూ.. ఆస్పత్రుల్లో చేర్చుకోమంటూ వేడుకునే జనాలకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను తెలియజేస్తూ.. సాయం అర్దిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కోరుతూ ట్వీట్ చేసినా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుడు మరణించాడు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన శశాంక్ యాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా.. తన తాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. తనకు ఆక్సిజన్ సిలిండర్ అత్యవసరం అంటూ ట్వీట్ చేస్తూ నటుడు సోనూ సూద్ని ట్యాగ్ చేసి సాయం చేయాల్సిందిగా కోరాడు. శశాంక్ స్నేహితుడు అంకిత్ ఈ మెసేజ్ను ఓ జర్నలిస్ట్కు సెండ్ చేసి తన ఫ్రెండ్కి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. సదరు రిపోర్టర్ ఈ మెసేజ్ను షేర్ చేస్తూ స్మృతి ఇరానీని ట్యాగ్ చేశారు. అయితే ఈ మెసేజ్లలో ఎక్కడా కూడా శశాంక్ తాత కోవిడ్తో బాధపడుతన్నట్లు వెల్లడించలేదు. ఈ మెసేజ్ చూసిన స్మృతి ఇరానీ శశాంక్కు సాయం చేద్దామని భావించి అతడికి 3 సార్లు కాల్ చేసినప్పటికి.. ఎలాంటి స్పందన లేదని తెలిసింది. దాంతో స్మృతి ఇరానీ ఈ మెసేజ్ను అమేథీ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారికి సెండ్ చేసి.. వివరాలు కనుక్కోమని ఆదేశించారు. ఇదిలా ఉండగానే శశాంక్ తాత చనిపోయినట్లు తెలిసింది. దాంతో స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు. ‘‘శశాంక్ తన ట్వీట్లో షేర్ చేసిన నంబర్కు మూడు సార్లు కాల్ చేశాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అమేథీ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్, పోలీసులకు అతడి గురించి కనుక్కోని సాయం చేయాల్సిందిగా ఆదేశించాను’’ అంటూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. Called Shashank thrice .. no response on the number shared by you in your tweet. Have alerted office of @DmAmethi & @amethipolice to find and help the person in need. https://t.co/4D3Nfe2Nue — Smriti Z Irani (@smritiirani) April 26, 2021 ఈ క్రమంలో అమేథీ పోలీసులు శశాంక్ వివరాలు తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే శశాంక్ తాత కోవిడ్ బారిన పడలేదు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘అతడి తాత కోవిడ్ బారిన పడలేదు. అసలే బయట జనాలు ఆక్సిజన్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో శశాంక్ తన సోషల్ మీడియాలో జనాలను భయపెట్టేలా ఇలా ట్వీట్ చేయడం సరైంది కాదు. పైగా అతను బయట ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రయత్నించలేదు. డైరెక్ట్గా యాక్టర్ సోనూ సూద్నే తనకు సాయం చేయమని కోరాడు. తప్పుడు సమాచారం షేర్ చేసినందుకు అతడిని అరెస్ట్ చేశాం’’ అన్నారు. कोविड-19 के समय में शशांक यादव द्वारा किये गये ट्वीट तथा सोशल मीडिया प्लेटफॉर्म पर भ्रामक तथ्य व अफवाह न फैलाने के संबंध में #SP_अमेठी श्री दिनेश सिंह द्वारा की गई अपील @Uppolice @dgpup @adgzonelucknow @igrangeayodhya @PrashantK_IPS90 @CMOfficeUP @ChiefSecyUP pic.twitter.com/6pYsj7MVIi — AMETHI POLICE (@amethipolice) April 28, 2021 చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’ -
స్మృతి ఇరానీ పోస్ట్పై సోనూసూద్ కామెంట్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫొటోలను షేర్చేస్తూ..'కరోనా ఇంకా ముగియలేదు. కాబట్టి మీరు బయటికి వెళ్లేటప్పుడు మాస్క్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. లుక్స్ కంటే మాస్క్పై దృష్టి పెట్టండి. సరక్షితంగా ఉండండి' అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్పై సోనూసూద్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. జో హుకుమ్(మీరు ఎలా చెబితే అలాగే)అంటూ సోనూ సూద్ పేర్కొనగా, మీరు మాస్క్ ఉన్నా లేకపోయినా అందంగానే ఉంటారంటూ ఫేమస్ చెఫ్ సువిర్ సారన్ ప్రశంసించారు. స్మృతి పోస్ట్పై పలువురు నెటిజన్లు సైతం హార్ట్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) చదవండి : శర్వానంద్కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. చదవండి : తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా -
రాహుల్ ఇలాఖా.. ఇక స్మృతీ ఇరానీ అడ్డా
ఆమేఠి: లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నెరవేర్చనున్నారు. ఈ మేరకు పనులు మొదలుపెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇలాఖాగా ఉన్న ఆమేఠీని స్మృతి చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమేఠిలో తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు. త్వరలోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని స్థానికులకు పూర్తిగా అందుబాటులో ఉంటానని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమేఠిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేశారు. అయితే రాహుల్ను ఓడిస్తానని సవాల్గా తీసుకుని స్మృతి ఇరానీ మొదటిసారి ఆమేఠి నుంచి లోక్సభకు పోటీ చేశారు. హోరాహోరి ప్రచారం చేసి చివరకు రాహుల్గాంధీని ఓడించి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించారు. అయితే స్మృతి ఇరానీ పోటీతో భయపడి కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ పోటీ చేశారని రాజకీయాల్లో టాక్ ఉంది. అందుకే రాహుల్ ఆమేఠిలో ఓటమి పాలవగా వయనాడ్లో గెలిచాడు. అయితే లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీ స్థానికంగా ఉండడని, ఢిల్లీలో తిష్టవేసి ఆమేఠిని పట్టించుకోవట్లేదని చెప్పి స్థానిక ఓటర్లకు గాలం వేశారు. తాను గెలిస్తే ఆమేఠిలో ఇంటి నిర్మాణం చేసుకుని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో స్మృతి ఇరానీ ప్రకటించారు. దీంతో స్థానికులు స్మృతి ఇరానీకి భారీగా ఓట్లు గుద్దేశారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్మృతి ఇరానీ ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టారు. సోమవారం ఇంటికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. త్వరలోనే ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తానని.. దీనికి ఆమేఠి నియోజకవర్గ ప్రజలందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆమేఠిలో స్మృతి ఇంటిని అద్దెకు తీసుకుని నివసించారు. ఇప్పుడు సొంతంగా ఇల్లు నిర్మించుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. लोकसभा चुनाव के दौरान अमेठी में अपनों के साथ, अपनों के बीच रहने का जो वादा किया था उस वादे के अनुसार अपना घर बनाने के लिए आज भूमि निबंधन प्रक्रिया को सम्पन्न किया। निरंतर प्रेम, स्नेह एवं आशीर्वाद देने के लिए अमेठी का हृदय से धन्यवाद। pic.twitter.com/9dKof3A6L2 — Smriti Z Irani (@smritiirani) February 22, 2021 -
క్షమించండి.. ఈరోజు సోమవారమా?!
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనకు సంబంధించిన విషయాలను, ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటారు. అంతేకాదు తనకు ఎదురయ్యే సందేహాలను, తన భావాలను పోస్టులుగా పెట్టడమే కాకుండా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూంటారు. తాజాగా ఆమె సోమవారం ఉదయం లేస్తూనే ఇన్స్టాగ్రామ్లో సందేహాన్ని వ్యక్తం చేశారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె సిరీయస్గా చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. (చదవండి: ‘వర్కింగ్ మదర్ కష్టాలు ఇలా ఉంటాయి’) దీనికి ‘ఎక్స్క్యూజ్ మీ.. ఈ రోజు సోమవారమా??? సందేహాలతో మొదలైన ఈ వారం సమాధానంతో ఎండ్ అవ్వాలని ఆశిస్తున్న’ అంటూ పోస్టు చేశారు. స్మృతీ పోస్టు చూసిన టీవీ నటి దివ్య సెత్ షా ‘నాకు కూడా అలానే ఉంది’ అని కామెంట్ చేయగా.. ‘మీరు చేసే దానికంటే ఎక్కువగా మీ కళ్లు మాట్లాడుతున్నాయి’, ‘దయ, ప్రేమతో పాటు బలవంతులు మీరు.. త్వరలోనే అద్భుతమైన వారం మీ ముందుకు రాబోతుంది. హ్యాపీ మండే మేడమ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ) View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) -
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 2021–22 కేంద్ర బడ్జెట్లో నిధుల విడుదలతో పాటు సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ను మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ, టెక్స్టైల్ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన నిధులతో పాటు, కోవిడ్ సంక్షోభంలో ఈ రంగాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ పలు సూచనలు చేశారు. రూ.1,552 కోట్ల అంచనాతో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కీలకమైన మౌలిక వసతుల కోసం సుమారు రూ.1,094 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. రూ.300 కోట్లు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ మెగా టెక్స్టైల్ పార్క్ స్కీం కింద రూ.500 కోట్ల మేర విడుదలకు అవకాశమున్నందున బహిర్గత మౌలిక వసతుల కోసం తక్షణమే కనీసం రూ.300 కోట్లు ఇవ్వాలని కేటీఆర్ లేఖలో కోరారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీఎస్డీఎస్) మార్గదర్శకాల ప్రకారం 25,495 మరమగ్గాలు (తెలంగాణలో 35,588) ఉన్న సిరిసిల్లలో ఇచల్కరంజి (మహారాష్ట్ర), సూరత్ (గుజరాత్) తరహాలో మెగా పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులను ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు రూ.50 కోట్లతో వీవింగ్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆలస్యమవుతున్నందున ‘మెగా పవర్లూమ్ క్లస్టర్’తో పాటు రూ.49.84 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ నిధులతో సిరిసిల్లలోని వీవింగ్ అపారెల్ పార్క్, టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులు, మగ్గాల ఆధునీకరణ, మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి తదితరాలు చేపడతామన్నారు. తెలంగాణలో ఐఐటీహెచ్ ఏర్పాటు పవర్లూమ్ రంగానికి సంబంధించి మార్కెటింగ్ వ్యూహాల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ‘పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’కు ప్రభుత్వ వాటాగా రూ.756.97 కోట్లు సమకూరుస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేస్తోందన్నారు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు తమిళనాడు, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) ఏర్పాటు చేయాలని కోరారు. పూర్తి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఐఐహెచ్టీ ఏర్పాటుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత పార్కులో సదుపాయాలు ఉన్నాయన్నారు. జాతీయ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎన్హెచ్డీపీ) కింద బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరు చేసి పవర్లూమ్ ఆధునీకరణకు సహకరించాలని లేఖలో కోరారు. చేనేత, వస్త్ర రంగంలో పెట్టుబడులు భారతీయ చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమపై కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని ప్రస్తావిస్తూ విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో లావాదేవీలు స్తంభించి లక్షలాదిమంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాత్కాలిక విధానం(షార్ట్ టర్మ్ పాలసీ) రూపొందించి, వేతనాలు, బ్యాంకింగ్, ఎగుమతులకు ప్రోత్సాహకాలు, జీఎస్టీ చెల్లింపులు తదితర ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ను విస్తృతం చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ ఈ కామర్స్ వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. చేనేత, వస్త్ర రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రానికి కేటీఆర్ సూచించారు. -
వర్కింగ్ మదర్ కష్టాలు ఇవే: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలను, తన భావాలను పోస్ట్ లుగా పెట్టడమే కాకుండా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతుంటారు. మంత్రిగా తాను చేస్తున్న కార్యకలాపాలతోపాటు తన లైఫ్లోని పలు విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా ఓ సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో వర్కింగ్ మదర్ జీవిత కష్టాలు ఎలా ఉంటుందో వివరించారు. దీనిని ఫన్నీ కామెంట్ను జత చేశారు. స్మృతికి భర్త జుబిన్ ఇరానీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ ఈ పోస్టులో తన కుటుంబాన్ని, పిల్లలను, వర్క్ మీటింగ్స్ మధ్య జీవితాన్ని ఎలా సమన్వయం చేస్తున్నారో వెల్లడించారు. ‘ఇంటి నుంచి పనిచేసే అమ్మలకు ఆన్లైన్ సమావేశాలను, ఇంట్లో బాధ్యతలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది’. అని పేర్కొన్నారు. దీనికి వర్కింగ్ మామ్స్ అనే హ్యష్ట్యాగ్ను జోడించారు. అయితే ఇంట్లో నుంచి వర్చువల్ మీటింగ్స్కు హాజరవుతున్న మంత్రికి తమ పిల్లలు అరవడం వల్ల అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర మంత్రి పోస్టుపై పలువురు ప్రముఖలు స్పందిస్తున్నారు. ఆమె మల్టీ టాస్కర్ అని ప్రశంసిస్తున్నారు. కాగా ఇటీవల తాజా ట్యూస్డే(మంగళవారం ) అంటూ యాంగ్రీ లుక్స్తో మరోసారి అలరించిన విషయం తెలిసిందే. కోపంతో ఉన్న స్మృతి చిన్ననాటి ఫోటో, ఇప్పటి ఫోటోను షేర్ చేస్తూ.. నన్ను ఆగ్రహానికి గురిచేయొద్దు (డోంట్ యాంగ్రీ మీ) అంటూ ఫ్లాష్బ్యాక్ ఫోటోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) -
నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. జీవిత విషయాల దగ్గరనుంచి ఫన్నీ మీమ్స్ వరకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడంలో ఆమె ముందుంటారు. స్మృతి పెట్టే పోస్టులకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటెస్ట్గా తాజా ట్యూస్డే(మంగళవారం ) అంటూ యాంగ్రీ లుక్స్తో మరోసారి అలరించారు. (ఎన్డీయేకు మరో మిత్రపక్షం గుడ్బై..!) కోపంతో ఉన్న స్మృతి చిన్ననాటి ఫోటో, ఇప్పటి ఫోటోను షేర్ చేస్తూ.. నన్ను ఆగ్రహానికి గురిచేయొద్దు (డోంట్ యాంగ్రీ మీ) అంటూ ఫ్లాష్బ్యాక్ ఫోటోను పోస్ట్ చేశారు. ఏళ్లు గడిచేకొద్ది రూపంలో మార్పులు వస్తాయి కానీ హావభావాల్లో కాదు అంటూ ఓ క్యాప్షన్ను జోడించారు. ఇక స్మృతి పోస్ట్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి 20వేలకు పైగా లైకులు వచ్చాయి. ఇక కొద్ది రోజుల క్రితమే స్మృతి కరోనా నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. (వంటగదిలో ఎవరున్నారు.. రాహులే రాశీ!) View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) -
టీఆర్ఎస్కు ప్రజా మద్దతు లేదు: స్మృతి ఇరానీ
సాక్షి, హైదరాబాద్: 'సబ్కా సాథ్.. సబ్ కా వికాస్' భారతీయ జనతా పార్టీ విధానమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో టీఆర్ఎస్, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలర్పించారు. వాళ్ల కుటుంబాల గుండెలు పగిలాయి. అవినీతి, అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదలతో మునిగింది. వరదల్లో 80 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. దుబ్బాక ఉపఎన్నికతో తెలంగాణ ప్రజల సపోర్ట్ అధికార పార్టీకి లేదని తెలిసిపోయింది. (సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి) రాజకీయ లబ్ధికోసమే వారికి ఓటు అక్రమ చొరబాటుదారలుకు, రోహింగ్యాలకు హైదరాబాద్లో ఓటు హక్కు ఎలా కల్పించారు. రాజకీయ లబ్ధికోసమే రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. అక్రమ చొరబాటు దారుల విషయంలో పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశ సంపద దేశ ప్రజలే అనుభవించాలి. ఎంఐఎం-టీఆర్ఎస్ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. పారదర్శక పాలన కోసం బీజేపీకి పట్టాం కట్టాలని కోరుతున్నాం. 920 కోట్ల రూపాయలు ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాం. టెక్నికల్ టెక్స్ టైల్స్ కోసం కేంద్రం 1,000 కోట్లు కేటాయించింది. చిల్డ్రన్ వాక్సినేషన్, ఉపాధి ఆవకాశాలు అందకుండా చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో 75 వేల అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయి..?. (షాడో టీమ్స్.. ఎత్తుకు.. పై ఎత్తులు!) టీఆర్ఎస్- ఎంఐఎం డ్రామాలాడుతున్నాయి.. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. తెలంగాణలో కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎందుకు విచారణకు అదేశించదు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు.. ప్రభుత్వ పథకాలు అన్ని ఎందుకు పాతబస్తీకి చేరడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటది. ఎంఐఎం ఎమ్మెల్యే లేఖలు ఉన్నా ప్రభుత్వం విచారణ చేయడం లేదు. టీఆర్ఎస్- ఎంఐఎం తెలంగాణ రాష్ట్రంలో మిత్ర పార్టీలు. రెండు పార్టీలు కలిసి రాజకీయ డ్రామా అడుతున్నాయి' అంటూ స్మతి ఇరానీ వ్యాఖ్యానించారు. -
కోట్లాది రూపాయల అవినీతి జరిగింది: స్మృతి ఇరానీ
-
కరోనా పాజిటివ్, కేంద్ర మంత్రి ఫన్నీ మీమ్
కేంద్ర జౌళి, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బుధవారం ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు దగ్గర ఉన్నవారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాకు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు చాలా మంది నేతలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇక స్మృతి ఇరానీ తనకు కరోనా రావడంపై స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫన్నీ మీమ్ను షేర్ చేశారు. ‘నేను ఆనారోగ్యం పాలు అయ్యాను అంటే నాకు భయంగా ఉంది. ఎందుకంటే నేను వారం రోజుల నుంచి వెజ్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఎంత ధైర్యం నీకు? నేను కూరగాయలు తీసుకున్నప్పుడే ఇలా జరిగింది’ అని కాప్షన్ జత చేస్తూ ఒక మీమ్ను తన అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ మీమ్ను ఇప్పటికే 25,000ల మందికి పైగా లైక్ చేశారు. ఇక కొంత మంది కామెంట్ ఇలాంటి దురదృష్టకర విషయంలోనూ మీకు ఇంట్లో ఉండటానికి, విశాంత్రి తీసుకోవడానికి అవకాశం లభించింది. ఆవిషయంలో ఆనందంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ -
స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్లోకి వచ్చిన వారందరూ వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్మతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. "ఓ ప్రకటన చేసే క్రమంలో నేను పదాల కోసం వెతకడం చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. It is rare for me to search for words while making an announcement; hence here’s me keeping it simple — I’ve tested positive for #COVID and would request those who came in contact with me to get themselves tested at the earliest 🙏 — Smriti Z Irani (@smritiirani) October 28, 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్మృతి ఇరానీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. గత వారం ఆమె బిహార్లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. గోపాల్గంజ్, ముంజర్, బోధ గయా, దిఘా వంటి ప్రాంతాల్లో దాదాపు 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్మృతికి కరోనా పాజిటివ్గా తేలడంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఆందోళనకు గురవుతున్నారు. -
రాజకీయాలు కాకుంటే.. మళ్లీ ఎందుకు?
-
హథ్రాస్ ఘటన: కేంద్ర మంత్రికి నిరసన సెగ
లక్నో: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి హథ్రాస్ ఘటన నిరసనల సెగ తగిలింది. వారణాసి వచ్చిన ఇరానీని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె కారును చుట్టుమట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధితురాలికి న్యాయం చేయాలని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హథ్రాస్ పర్యటనకు అనుమతినివ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రాహుల్, ప్రియాంక మరోసారి హథ్రాస్ పర్యటనకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో యూపీ డీజీపీ, ఉన్నతాధికారులు సైతం హథ్రాస్ బయల్దేరి వెళ్లారు. నొయిడా టోల్ ప్లాజా ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. (చదవండి: సంచలనంగా మారిన ఆడియో క్లిప్లు..) రాజకీయాలు ఇక చాలు హథ్రాస్ ఘటన బాధిత కుటుంబానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. రాహుల్, ప్రియాంక హథ్రాస్ పర్యటనపై ఆమె మండిపడ్డారు. రాజస్తాన్ అత్యాచారాల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎదురుదాడికి దిగారు. రాజస్తాన్ ఘటనలపై సీఎం అశోక్ గహ్లోత్పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. హథ్రాస్ ఘటన విషయంలో రాహుల్, ప్రియాంక ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టి లాభం పొందేందుకే వారిద్దరూ మళ్లీ హథ్రాస్ పర్యటన పెట్టుకున్నారని ఆరోపించారు. కాగా, హథ్రాస్కు బయల్దేరిన రాహుల్ గాంధీ, ప్రియాంకను పోలీసులు గురువారం అడ్డుకున్న సంగతి తెలిసిందే. లాఠీచార్జిలో రాహుల్ కిందపడటంతో దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తమైంది. శుక్రవారం కూడా అలాంటి ఘటనే జరిగింది. తృణమూల్ నేతలపైనా హథ్రాస్ సరిహద్దుల్లో లాఠీచార్జ్ జరిగింది. కాగా, హథ్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. ఇక బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ర్యాలీ జరగుతున్న క్రమంలోనే అదే అర్ధరాత్రి పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ నివేదిక బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వెల్లడించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈకేసులో మొత్తం రికార్డులు బహిర్గతం చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. హథ్రాస్ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. (చదవండి: నిందితులతో పాటు బాధితులకు లై డిటెక్టర్ టెస్ట్: సిట్) -
స్మృతి ఇరానీ పోస్ట్.. మేము ఎదురుచూస్తూ ఉంటాం!
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఆమె పోస్టు చేసే మీమ్స్, జోక్స్, జీవిత విషయాలకు సంబంధించివి నెటిజన్లను ఎంతోగానే ఆకర్షిస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్స్టాగ్రామ్లో మరో పోస్టు పెట్టారు స్మృతి. మనల్ని మనం ఎల్లప్పుడూ ఎలా మెరుగుపరుచుకుంటాం, ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాం అనే విషయాన్ని ఈ పోస్టు ద్వారా వెల్లడించారు. (ఖాళీ కుక్కర్ను గ్యాస్ స్టౌపై పెట్టింది ఎవరు?) ఈ మేరకు.. ‘నేను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాను. మీ ఓపికకు ధన్యవాదాలు ’ అని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అయ్యింది. 22 వేల మంది లైక్ చేయగా ఈ పోస్టుపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా సైతం దీనిని లైక్ చేశారు. ‘మేడమ్ ఎంత సమయమైనా తీసుకోండి. మీ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం’. అని కామెంట్ చేశారు. మరొకరు.. ‘మీరు ఖచ్చితంగా దేశం కోసం ఉత్తమమైనది నిర్మిస్తారు’. అని పేర్కొన్నారు. (‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’) View this post on Instagram 🤫 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Sep 19, 2020 at 10:19pm PDT -
ఫన్నీ వీడియో షేర్ చేసిన స్మృతి ఇరానీ
-
ఖాళీ కుక్కర్ను గ్యాస్ స్టౌపై పెట్టింది ఎవరు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు వినగానే ఆమె వాక్చాతుర్యంతో పాటుగా.. నటిగా తనలోని భిన్న కోణాలు తెరపై ఆవిష్కరించిన తీరు గుర్తుకువస్తుంది. గతంలో హిందీ సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో నటించిన ఆమె.. తర్వాత కాలంలో బీజేపీలో చేరి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అంతేకాదు గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట ఆమేథీలో.. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీని ఓడించి సత్తా చాటారు. తద్వారా మోదీ కేబినెట్ 2.0లో మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా రాహుల్పై వ్యంగ్యాస్గ్రాలు సంధించే స్మృతి ఇరానీ తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే.. హిందీ సీరియళ్లు చూసే వారికి ‘సాథ్ నిబానా సాథియా’ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ ప్రముఖ చానెల్ ప్రసారమై సూపర్ హిట్గా నిలిచిన ఈ సీరియల్ను తెలుగులో కూడా ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో డబ్ చేశారు. ఇందులో ముఖ్యపాత్రలైన కోకిలాబెన్(అత్త క్యారెక్టర్), గోపీ వహూ(కోడలు గోపిక), రాశి బెన్(చిన్న కోడలు రాశి) మధ్య వచ్చే సన్నివేశాలపై మ్యూజిక్ ప్రొడ్యూసర్ యశ్రాజ్ ముఖాతే ఇటీవల ఓ రాప్ సాంగ్ను రూపొందించాడు. చిన్న తప్పునైనా సహించని కోకిలా బెన్.. వంటగదిలో ఖాళీ కుక్కర్ను గ్యాస్ స్టౌపై ఎవరు పెట్టారంటూ కోపంగా ఆరా తీసే సంభాషణను స్పూఫ్తో ఫన్నీగా మార్చేశాడు. ఇక అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాన్యులతో పాటు బాలీవుడ్ తారలు దిశా పటానీ, కార్తిక్ ఆర్యన్ వంటి సెలబ్రిటీలు దీనిని అనుకరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.(చదవండి: ‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’) రాహులే రాశీ..! ‘‘నిన్న నాపైన జ్యూస్ ఒలికిపోయింది. ఆ తర్వాత నేను రెండోసారి స్నానం చేసేందుకు వెళ్లాను. ఆ తర్వాత నువ్వు కుక్కర్లో చనా వేసి నా దగ్గరకు వచ్చావు. అప్పుడు వంటగదిలో ఎవరు ఉన్నారు? అక్కడ ఎవరున్నారు? నేను ఉన్నానా.. నువ్వు ఉన్నావా.. ఎవరున్నారు? ఎవరూ చెప్పు?’’అంటూ కోకిలాబెన్ గద్దించగానే.. గోపీ.. రాశీ బెన్ అంటూ సమాధనమిస్తుంది. అప్పుడు.. ‘‘ఈ రాశి కుక్కర్లో నుంచి శనగలు తీసేసి ఖాళీ కుక్కర్ గ్యాస్ స్టౌ మీద పెట్టింది.. హే రాశీ!’’అంటూ కోకిలా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక వీడియోను ఓ నెటిజన్ స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అన్వయిస్తూ స్పూఫ్ చేశాడు. కోకిలా పాత్రలో స్మృతి, గోపి పాత్రలో సోనియాను ఊహిస్తూ జత చేసిన విజువల్స్లో ఆఖరున బీజేపీ నేత సంబిత్ పాత్రా విజువల్ను జత చేసి.. ‘‘రాహులే రాశీ’’అని వ్యాఖ్యానించినట్లుగా సృష్టించాడు. నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఈ వీడియోను షేర్ చేసిన స్మృతి ఇరానీ.. ‘‘ఆ పని చేసింది ఈ పిల్లాడే అన్నమాట. చాలా క్యూట్గా ఫన్నీగా ఉంది. రాజకీయాలకు సంబంధించింది కాదు. కేవలం వినోదం కోసమే ఇది. రసోదీ మే కౌన్ థా(వంటగదిలో ఎవరున్నారు) రాశి బెస్ట్ వర్షన్’’అని క్యాప్షన్ జతచేశారు. ఇక ఇలాంటి ఫన్నీ వీడియోలతో పాటు తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలు, స్ఫూర్తిమంతమైన సందేశాలను స్మృతి తరచుగా పోస్ట్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. -
‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడయాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. ఫన్నీ మీమ్స్, తన వర్క్కు సంబంధించిన కోట్స్ షేర్ చేస్తుంటారు. గత కొద్ది రోజులుగా జీవిత సత్యాలకు సంబంధించి ఆసక్తికరమైన కోట్స్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు స్మృతి ఇరానీ. తాజాగా కర్మకు సంబంధించి ఆమె షేర్ చేసిన ఓ కోట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. కర్మ అద్దలాంటిది అంటున్నారు ఇరానీ. అద్దం ముందు నిల్చుని మనం ఏం చేస్తే... అదే కనిస్తుందని తెలిపారు. ‘ఇతరులకు నీవు చేసే కీడు నీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే.. అదే నష్టం నీకు జరిగినప్పుడు.. అందుకే నేను ఇక్కడ ఉన్నాను-కర్మ’ అంటూ ఇరానీ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కోట్ను ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. అందుకనుగుణంగానే పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దీనికి 20 వేల లైక్లు వచ్చాయి. చాలా మంది నెటిజనులు ‘బాగా చెప్పారు మేడం.. నిజం’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (చదవండి: ‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’) View this post on Instagram Karma is not a ***** , it’s a mirror ... #duniyagolhai 🙏 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Aug 31, 2020 at 11:11pm PDT కొద్ది రోజుల క్రితం స్మృతి ఇరానీ ఓ సందేశాత్మక కోట్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘మీలోని భయాలు తొలగపోవడానికి కొంత సమయం పడుతుంది. గాయపడిన మీ హృదయం కోలుకోవడానికి కొంత సమయంల పడుతుంది. విధితో తలపడే బలాన్ని కనుగొనడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్ని జరగడానికి సమయం పట్టవచ్చు.. కానీ కోరుకున్నది తప్పక జరిగి తీరుతుంది’ అంటూ పోస్ట్ చేశారు స్మృతి ఇరానీ. -
ఇది భారతీయ మహిళల శక్తి
అది 2017, డిసెంబర్ 30వ తేదీ. భారత్– చైనా సరిహద్దు... అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ మిలటరీ పోస్ట్లో అగ్నిప్రమాదం. సెవెన్ బీహార్ రిజిమెంట్కు చెందిన మేజర్ ప్రసాద్ మహదీక్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. మేజర్ అమరుడైన పది రోజులకు ఆయన భార్య గౌరి ఒక నిర్ణయం తీసుకుంది. ‘ఒక వీరుడికి నివాళిగా తాను చేయగలిగినది చేయాలనుకుంది. ఆయనకు ఇష్టమైన రక్షణరంగంలో చేరాలి. ఆయన యూనిఫామ్ను ధరించాలి. ఆయన సాధించిన నక్షత్రాలను కూడా. మా ఇద్దరి జీవితం ఒక్కటే, యూనిఫామ్ కూడా ఒక్కటే’ అని తీర్మానించుకుంది. ఆమె లాయర్. కంపెనీ సెక్రటరీ కోర్సు చేసి మంచి సంస్థలో ఉద్యోగం చేస్తోంది. భర్త మరణంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష మీద దృష్టి పెట్టింది గౌరి. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఈ ఏడాది మార్చి నెలలో లెఫ్టినెంట్ హోదాలో రక్షణరంగంలో చేరింది. మేజర్ ప్రసాద్ గణేశ్ 2012లో ఆర్మీలో చేరారు. గౌరి– ప్రసాద్ల పెళ్లి 2015లో జరిగింది. రెండేళ్ల వివాహ బంధాన్ని నూరేళ్ల అనుబంధంగా పదిలంగా దాచుకుంటోంది గౌరీ మహదీక్. ధైర్యానికి వందనం గౌరీ మహదీక్ అంకితభావాన్ని, ధైర్యసాహసాలను గురువారం నాడు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. గౌరి జీవితంలో సంఘటనలను ఉదహరిస్తూ భర్తకు నివాళిగా ఆమె సాధించిన లక్ష్యాన్ని గుర్తు చేశారు. ‘ఇంతటి ధైర్యం, తెగువ, అంకితభావం భారతీయ మహిళలోనే ఉంటాయి. అసలైన భారతీయ మహిళకు అచ్చమైన ప్రతీక గౌరీ మహదీక్’ అన్నారు స్మృతీ ఇరానీ. ఈ సందర్భంగా గౌరీ మహదీక్ తాజా చిత్రాన్ని స్మృతి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘ఆన్లైన్లో ఇప్పుడు మరోసారి గౌరీ మహదీక్ గురించిన వార్తలన్నింటినీ చదివాను. చాలా గర్వంగా అనిపించింది’ అని కూడా అన్నారు స్మృతి. భారత్– చైనాల మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక వీరులను క్షణక్షణం తలుచుకోవాల్సిన సమయం ఇది. మంత్రి సైనికులను, అమర వీరులను ఆత్మీయంగా గుర్తు చేసుకున్నారు. -
‘ఎంత మార్పు.. థ్యాంక్స్ పీయూష్ జీ’
లక్నో: కాంగ్రెస్కు కంచుకోటలాంటి అమేథి నియోజకవర్గంలో ఈ సారి బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భారీ విజయం సాధించారు. ఈ క్రమంలో అమేథిలోని గౌరిగంజ్ రైల్వే స్టేషన్కు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. 2019కి ముందు.. ప్రస్తుతం రైల్వే స్టేషన్ రూపురేఖలు ఎలా మారాయో ఈ ఫోటోలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏళ్లుగా నిర్లక్ష్యం చేయబడిన అమేథి గౌరిగంజ్ రైల్వే స్టేషన్ను నూతనంగా మార్చడానికి సాయం చేసిన పియూష్ గోయల్కు కృతజ్ఞతలు’ అంటూ స్మృతి ఇరానీ రైల్వే స్టేషన్కు సంబంధించిన ఫోటోలను అప్పుడు.. ఇప్పుడు పేరుతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేసినందుకు స్మృతి ఇరానీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నెటిజనులు. वर्षों से जर्जर स्थिति और नागरिक सुविधाओं के अभाव में जूझ रहे अमेठी के गौरीगंज स्टेशन का कायाकल्प करने हेतु रेल मंत्री @PiyushGoyal जी का हार्दिक धन्यवाद। स्टेशन पर यात्रियों के लिए Wi-Fi, कोच जानकारी प्रणाली जैसी सुविधाओं के सफल कार्यान्वयन हेतु @drmlko25 जी के प्रति भी आभार। pic.twitter.com/ewzUPooRWz — Smriti Z Irani (@smritiirani) July 9, 2020 ఎన్నికల ప్రచారం నాటి నుంచే స్మృతి ఇరానీ అమేథిలో మౌలిక సదుపాయాల కొరత గురించి తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు కార్యక్రమాలు ప్రారంభించారు. నియోజకవర్గాన్ని పలుమార్లు సందర్శించారు. స్థానిక దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాక రాజీవ్గాంధీ హాయాంలో రాయ్బరేలీ నుంచి అన్చహర్ వరకు తలపెట్టిన రైల్వే ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లుందుకు కూడా స్మృతి ప్రయతిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాహుల్ గాంధీ అమేథిలో 12 వేల శానిటైజర్ల బాటిళ్లు, 20 వేల ఫేస్ మాస్క్లు, 10 వేల సబ్బులు పంపిణీ చేశారు. -
థ్యాంక్యూ టిక్టాక్ : స్మృతి వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: టిక్టాక్తో సహా 59 చైనా యాప్లపై నిషేధంపై ఒకవైపు మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గతంలో చేసిన వీడియో ఇపుడు నెట్లో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగా టిక్టాక్కు ప్రత్యేక ధన్యావాదాలు తెలుపుతూ కేంద్రమంత్రి చేసిన వీడియోను పలువురు ట్విటర్లో విరివిగా పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో కరోనాపై ఐక్యంగా పోరాడాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు లక్షలాదిమంది భారతీయులనుంచి స్పందన లభించిందంటూ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టిక్టాక్ పీపీఈ సూట్స్ విరాళాన్ని, భాగస్వామ్యాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి టిక్టాక్ ఇండియా సీఈవో నిఖిల్ గాంధీకి థ్యాంక్యూ చెప్పడంతో పాటు..ఈ వీడియో ప్రతివారికీ చేరాలంటూ కోరడం విశేషం. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం: వన్ప్లస్) కాగా టిక్టాక్, యూసీ బ్రౌజర్, టిక్టాక్, కామ్స్కానర్, షేరిట్తో సహా 59 చైనా యాప్లపై నిషేధాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిక్టాక్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనలను కంపెనీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. (నిషేధంపై టిక్టాక్ స్పందన) Arre Smriti ji! Yeh Kya! Thanking Tik Tok?! pic.twitter.com/GJaJzaAFZn — Prashant Bhushan (@pbhushan1) July 3, 2020 -
‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిత్యం సామాజిక సమస్యలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలన తెలుపుతూ యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ.. ప్రేరణ కలిగించే సందేశాలను నిత్యం షేర్ చేస్తూంటారు. తాజా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై ఆమె స్పందిస్తూ.. జీవితానికి సంబంధించిన కొన్ని స్పూర్తిదాయకమైన కోట్స్ను మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. (స్మృతి ఇరానీ పోస్ట్కు నెటిజన్లు ఫిదా..) అవి.. ‘‘మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ఎప్పటికీ మరవొద్దు.. అలాగే మీరు చేరుకునే గమ్యం వచ్చే వరకు మీ కళ్లను తీప్పుకోవద్దూ’’, ‘‘ఎవరైతే ఒంటరిగా పోరాడుతారో.. వారు మరింత బలవంతులు అవుతారు’’ అలాగే ‘‘మీ ఆశలను, కలను నెరవేర్చుకునే క్రమంలో ఇతరులు ద్వేషించడం మొదలు పెడుతారు.. ఎందుకంటే అక్కడ వారు ఉండరు’ చివరిగా ‘‘మీరు కష్టపడి ఎదుగుతున్న క్రమంలో మీరు ఎవరీకి స్పూర్తినిస్తారో మీకు తెలియదు.. కాబట్టి ఈ ప్రయాణంలో మీరు పట్టుదలతో ముందుకు సాగాలి’’ అంటూ షేర్ చేశారు. కాగా సుశాంత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు దర్యాప్తులో తెలిపారు. -
స్మృతి ఇరానీ పోస్ట్కు నెటిజన్లు ఫిదా..
న్యూఢిల్లీ: దేశంలోనే ప్రముఖ వైవిద్య రాజకీయ నాయకులలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. సామాజిక సమస్యలపై నిత్యం స్పందిస్తు సోషల్ మీడియాలో ఆక్టివ్గా తన అభిప్రాయాలను చెబుతుంటారు. తన జీవితంలో జరిగిన ప్రేరణ కలిగించే సంఘటనలను నిరంతరం పోస్ట్ చేస్తు అభిమానులను ఉత్సాహ పరుస్తుంటారు. తాజాగా స్మృతి ఇరానీ ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్ట్ను షేర్ చేశారు. ‘ఇతరులకు మంచి చేయడానికి ప్రజలందరు ప్రయత్నించాలని.. మీరు చేసే మంచి పని వల్ల ఉహించని విధంగా లబ్ది చేకురుతుందని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు’. ఒకవేళ మంచి చేసే అవకాశం రాకపోతే కనీసం మంచి ఆలోచనలు చేయాలని సలహా ఇచ్చారు. ఈ పోస్ట్ ద్వారా ప్రజలకు ప్రేరణ కలిగించేందుకు స్మృతి ఇరానీ ప్రయత్నించారు. ఈ పోస్ట్కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 17,000మంది నెటిజన్లు స్మృతి ఇరానీ పోస్ట్కు లైక్ చేశారు. స్మృతి ఇరానీ పోస్ట్పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. చదవండి: మిస్సింగ్ పోస్టర్లు: 'స్మృతి ఇరానీ ఎక్కడ?' View this post on Instagram ..... even if it doesn’t do good anyways .Good thoughts , Good words , Good deeds #zarathustra 🙏 A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jun 6, 2020 at 12:59pm PDT -
స్మృతి ఇరానీ కనిపించడం లేదు!
అమేథి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కనిపించడం లేదంటూ అమేథీలో మిస్సింగ్ పోస్టర్లు వెలిశాయి. "ఏడాది కాలంలో ఎంపీ స్మృతి ఇరానీ కేవలం రెండు సార్లే అమేథీకి వచ్చారు. అప్పుడు కూడా కొద్ది గంటలు మాత్రమే ఉన్నారు. నేడు అమేథీ ప్రజలు కరోనాతో విలవిల్లాడుతున్నారు. ఈ కష్టకాలంలో ఆమె నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని ఆశించాము, కానీ అది జరగడం లేదు" అని ఆ పోస్టర్లలో రాసి ఉంది. దీంతో ఎంపీ ఆచూకీ తెలపాల్సిందిగా కోరుతూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఈ పోస్టర్లను ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన స్మృతి ఇరానీ గత ఎనిమిది నెలల్లో తన నియోజకవర్గానికి పదిసార్లు వెళ్లి పద్నాలుగు రోజులు అక్కడే ఉన్నానని తెలిపారు. (వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!) మరి సోనియా గాంధీ తన సొంత నియోజకవర్గమైన రాయ్బరేలిలో ఎన్నిసార్లు పర్యటించారు? అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు బస్సుల్లో 22,150 మంది వలస కార్మికులు అమేథీకి రాగా 8,322 మంది రైళ్ల ద్వారా చేరుకున్నారు. మరి ఈ కష్ట కాలంలో సోనియా గాంధీ తన నియోజకవర్గానికి ఏం చేశారని విమర్శించారు. కాగా అమేథీలో ఇప్పటివరకు 148 కరోనా కేసులు నమోదవగా 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా వుండగా గ్వాలియర్లో జ్యోతిరాధిత్య సింధియా, భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదంటూ మిస్సింగ్ పోస్టర్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. (ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు) -
ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత
అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్యుడు బెజన్ దారువాలా (89) మరణించారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారని అహ్మదాబాద్లోని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈయన భారతదేశంలోని ప్రసిద్ధ జోతిష్య శాస్త్ర కాలమిస్ట్లలో ఒకరు. తన దశాబ్ధాల కెరీర్లో అనేక వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్తో సంబంధం కలిగి ఉన్నారు. అహ్మదాబాద్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. బెజన్కు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన చేతిని చూపించానని చెప్పడం విశేషం. అయితే తన తండ్రి కరోనా బారిన పడి మరణించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కుమారుడు నాస్టూర్ దారువాలా ఖండించారు. కాగా.. బెజన్ దారువాలా మరణానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి స్మతి ఇరానీలు సంతాపం ప్రకటిస్తూ.. 'ఆయన మరణం మమ్మల్ని కలిచివేసింది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఓం శాంతి' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే -
సోనియా వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుందంటూ ఆమె ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలబడాల్సిన సమయంలో ప్రతిపక్షాలు స్వంత ప్రయోజనాలు చూసుకోవడం నిజంగా దురదృష్టకరం. సంక్షోభ సమయంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నీచ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు దేశ ఐక్యతను విచ్ఛినం చేసి.. తాము లబ్ధి పొందాలని చూస్తున్నారు. వారి ప్రయత్నాలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలతో సహా ప్రతి రాష్ట్రానికి కేంద్రం ‘పీఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజన’ ద్వారా 1.76 లక్షల కోట్ల రూపాయలు లబ్ది చేకూర్చింది. ఈ పథకం దేశంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచింది’ అన్నారు.(వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!) ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, జిల్లా అధికారులంతా ఈ సంక్షోభ సమయంలో ఒక్క చోట చేరి కరోనా కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. దేశ నిర్మాణాత్మక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం దోహదపడదని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేయడం మానాలని స్మృతి ఇరానీ సూచించారు. (‘అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి’) -
'సోనూసూద్ మీ సేవలకు గర్వపడుతున్నాం'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మార్చి 22 నుంచి లాక్డౌన్ కొనసాగుతండగా వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. సొంతూళ్లకు వెళ్లేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. జాతీయ రహదారులపై ఎక్కడా చూసిని వేలాది మంది ఇళ్లకు చేరేందుకు పడుతున్న కష్టాలే కనిపిస్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటున్న విషయం తెలిసిందే. ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండగా నిలబడుతున్నారు. అతను చేస్తున్న సహాయ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: వలస కార్మికులను తరలిస్తున్న సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు తనుపడుతున్న తపనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు నటుడిగా ఎప్పుడో చాలా ఎత్తుకు ఎదిగారు. మీతో వృత్తి పరంగా మీతో నాకు రెండు దశాబ్ధాల పరిచయం. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఈ సహాయం మిమ్మల్ని చూసి మరింత గర్వపడేలా చేస్తోంది అని అన్నారు. కాగా గతంలో ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా యూపీలోని తన గ్రామానికి వెళ్లడానికి సాయం కోసం అభ్యర్థించగా.. అతనిని ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి సహాయ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రి గుర్తుచేశారు. చదవండి: సిక్కిం మరో దేశంగా ప్రభుత్వ ప్రకటన! I’ve had the privilege of knowing you as a professional colleague for over 2 decades now @SonuSood & celebrated your rise as an actor ;but the kindness you have displayed in these challenging times makes me prouder still 🙏thank you for helping those in need🙏🙏 https://t.co/JcpoZRIr8M — Smriti Z Irani (@smritiirani) May 24, 2020 -
గిబ్బరిష్ ఛాలెంజ్ పూర్తిచేసిన స్మృతి ఇరానీ
ఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కేంద్ర మంత్రి, స్మృతి ఇరానీ ఆదివారం ఇన్స్టాగ్రామ్లో మరోసారి తన మార్క్ చూపించుకున్నారు. త్రోబ్యాక్ ఫోటోల దగ్గర నుంచి సరదా మీమ్స్ వరకు ఎప్పటికప్పడు పోస్టులు చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న గిబ్బరిష్ ఛాలెంజ్ను పూర్తిచేసి వావ్ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియాలను పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అయ్యాయి. స్మృతి జీ సూపర్భ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గిబ్బరిష్ ఛాలెంజ్ అంటే? ఎప్పటికప్పడు లేటెస్ట్ పిల్టర్స్తో ఆకట్టుకునే ఇన్స్టాగ్రామ్లో గిబ్బరిష్ ఛాలెంజ్ తెగ ట్రెండ్ అవుతోంది. గజిబిజిగా ఉండే పదబంధాన్ని కరెక్ట్గా గెస్ చేయడమే ఈ ఫిల్టర్. అయితే కేవలం 10 సెకన్లలోనే పదాన్ని గుర్తుపట్టాలి. ఆలోపు గెస్ చేయలేకపోతే టైం అవుట్ అయ్యాక సరైన సమాధానం ఎంటో తెర మీద కనిపిస్తుంది. రెండుసార్లు ఈ ఛాలెంజ్ను ట్రై చేసి తక్కువ టైంలోనే కరెక్ట్గా గెస్ చేశారు స్మృతి ఇరానీ. దీనికి సంబంధించిన వీడియాలను ఇన్స్టాలో పంచుకున్నారు. ('నేను క్వారంటైన్లో ఉన్నా.. మరి మీరు' ) -
ఇంట్లో మాస్క్ తయారు చేసిన స్మృతి ఇరానీ
-
ఇలా మాస్క్ తయారు చేయండి: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అత్యవసర పని మినహా మిగతా వాటికి జనాలు బయట తిరగడానికి వీల్లేదని అధికారులు తేల్చి చెప్తున్నారు. అయితే ఆ అత్యవసర పని నిమత్తం గడప దాటిన మరుక్షణం నుంచి మాస్క్ తప్పనిసరి. దీంతో మార్కెట్లో వాటి డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో.. దొరికిందే చాన్సని కొందరు రెట్టింపు ధరలకు అమ్మడం ప్రారంభించారు. దీనిపై మండిపడ్డ ప్రభుత్వం మాస్కులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వాటి రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే మాస్కుల కోసం దుకాణాల వెంట తిరగాల్సిన పని లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్తున్నారు. (లోక్సభలో ‘ఉన్నావ్’ రభస) ఇంట్లోనే ఉండి ఎంతో సులువుగా మాస్కు తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో మాస్క్ ఎలా తయారు చేయాలో చెప్తూ దానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ముందుగా కత్తెరతో వస్త్రాన్ని నిర్దిష్ట ఆకృతిలో కత్తిరించారు. అనంతరం కుట్టు మిషన్ లేకపోతే దానికి బదులుగా సూది, దారాన్ని వాడమని చెప్తూ చేతిపైనే ఎలా కుట్టాలో చూపించారు. ఈ విధంగా సులభంగా మాస్క్ తయారు చేసుకోండంటూ.. చివరగా తాను చేసిన ఫేస్ మాస్క్ను చూపించారు. కాగా మాస్క్ లేకుండా బయటకు వస్తే కొన్నిచోట్ల జరిమానాలు సైతం విధిస్తున్న విషయం తెలిసిందే. (కుప్పలు కుప్పలుగా కరోనా మృతదేహాల ఖననం) -
'నేను క్వారంటైన్లో ఉన్నా.. మరి మీరు'
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉండి ఆ మహమ్మారిని తరిమేద్దామంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తాజాగా స్మృతి ఇరాని తన ఇన్స్టాగ్రామ్లో లూస్ హెయిర్లో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేశారు. 'కరోనా నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ హోం క్వారంటైన్ పాటిస్తున్నా. ఈ సందర్భంగా ప్రజలందరు ఇళ్లలోనే ఉంటూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నా. దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి' అంటూ తెలిపారు. కాగా బుధవారం ప్రఖ్యాత సంగీత విధ్వాంసుడు రవిశంకర్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తుగా ఒక వీడియోను షేర్ చేశారు. అంతేగాక ఇంట్లోనే ఉంటున్న స్మృతి తన పాతకాలం ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ అలనాటి జ్ఞాపకాలను ఆస్వాదిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 166కు చేరుకుంది. (భారత్లో 24 గంటల్లోనే 591 కరోనా కేసులు) View this post on Instagram Life unfiltered ... #stayhome A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Apr 9, 2020 at 2:07am PDT View this post on Instagram #stayhomestaysafe A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Apr 7, 2020 at 9:26pm PDT -
‘ఏపీలో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీ’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో 1665 అంగన్వాడీ వర్కర్లు, 3347 అంగన్వాడి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లా కలెక్టర్లు భర్తీ చేయడానికి వీలుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. (జేసీ ట్రావెల్స్ రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు) కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ 1 నుంచి అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు, హెల్పర్ల గౌరవ వేతనాన్ని నెలకు 1500 నుంచి 2250 రూపాయలకు పెంచిందిని మంత్రి తెలిపారు. అలాగే పనితీరు ప్రాతిపదికన హెల్పర్లకు ప్రోత్సాహకం కింద నెలకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతోందన్నారు. ఐసీడీఎస్-సీఏఎస్ వినియోగించే అంగన్వాడీ వర్కర్లకు పోషణ్ అభియాన్ ప్రోత్సాహకం కింద నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనానికి అదనంగా అనేక రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి అంగన్వాడీలకు అదనంగా ప్రోత్సాహక నగదును చెల్లిస్తున్నాయన్నారు ఇవి కాకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. (అధిక బరువుతో బాధపడుతున్నారా..) అదే విధంగా 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు, పనితీరును గుర్తిస్తూ వారికి ప్రేరణ కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రూ.50 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రాష్ట్ర స్థాయిలో 10 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీలకు ఏడాదికి 400 రూపాయల విలువైన చీర కలిగిన రెండు యూనిఫారాలు, 18-50 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వర్కర్లు, హెల్పర్లకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద జీవిత బీమా, 51 నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. తీవ్ర అనారోగ్య బారిన పడినట్లుగా గుర్తించిన అంగన్వాడీలకు 20 వేల రూపాయల వరకు చికిత్స ఖర్చులు, 9 నుంచి 12వ తరగతి చుదువుతున్న అంగన్వాడీల సంతానానికి స్కాలర్షిప్లు, సూపర్వైజర్ల నియామకంలో వారికి 50 శాతం రిజర్వేషన్ వంటి పలు సౌకర్యాలను అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు.(‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’) చదవండి: ‘కడపలో బ్యాంక్ శాఖలను తగ్గించలేదు’ -
భర్త కోసం స్మృతి స్పెషల్ డిష్..
నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అయితే ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడమే కాకుండా సరదా పోస్టులతో కూడా సందడి చేస్తారు.అలాగే తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా ఆమె అప్పుడప్పుడు షేర్ చేస్తూంటారు. తాజాగా వంటల్లో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన భర్త జూబిన్ ఇరానీ కోసం స్మృతి ప్రత్యేకంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారుచేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో కూడా ఆమె వివరించారు. క్యాప్షన్స్తో కూడిన 7 ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరిస్లో ఉంచారు. కాగా, కొద్దిరోజుల క్రితం స్మృతి తన కూతురు జోయిష్ ఇరానీ కోసం వెజ్ న్యూడిల్స్, చికెన్ మంచురియాను తయారు చేసిన సంగతి తెలిసిందే. -
కోడళ్లకు ఎంత మంది ఇలా చెప్పి ఉంటారు!
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ హీరోయిన్ తాప్సీ పన్ను తాజా చిత్రం ‘థప్పడ్’పై స్పందించారు. ఏదేమైనా మహిళపై చేయి చేసుకోవడం సరికాదన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..‘ప్రతి విషయంలో మహిళలే సర్దుకుపోవాలని పెద్దలు చెప్పే మాటను మీలో ఎంతమంది విని ఉంటారు. కేవలం పేద మహిళలు మాత్రమే తమ భర్తలను కొడుతారని మీలో ఎంతమంది ఆలోచిస్తున్నారు. చదువుకున్న పురుషులు ఆడవాళ్లపైకి చేయి ఎత్తరని ఎంతమంది నమ్ముతారు. ఇదేం పెద్ద విషయం కాదు.. ఇలాంటివి ఎన్నో మాకూ జరిగిగాయి మేము సంతోషంగా ఉండటం లేదా?.. జీవితమంటే సర్దుకుపోవాలి.. ఇలా ఎంతమంది తమ ఆడపిల్లలకు, కోడళ్లకు చెప్పుంటారు’ అంటూ రాసుకొచ్చారు. అయితే ‘నేను ఓ రాజకీయ నాయకురాలిగా దర్శకుడి భావాలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. అలాగే కొన్ని విషయాలపట్ల నటీనటులతో విభేదించకపోవచ్చు. కానీ ఓ మహిళగా నేను ఈ సినిమాను చూడాలనుకుంటున్నాను’ అని అన్నారు. అదేవిధంగా అందరూ తమ కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కానీ ఒక్కమాట మహిళను కొట్టడం ఎంతమాత్రం కూడా సహించని విషయం.. అది ఒక చెంప దెబ్బ అయినా కూడా అంటూ తన ఇన్స్టాలో రాసుకొచ్చారు. కాగా థప్పడ్ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. (చదవండి: వేరే సంబంధాలు ఉన్నాయా.. థప్పడ్ ట్రైలర్ కోసం క్లిక్ చేయండి!) View this post on Instagram How many think “ki maar pitai sirf gareeb auraton ke hi pati karte hai” How many believe “ki educated aadmi kabhi haath nahi uthata” How many tell their girls their daughter in laws“ koi baat nahi beta aisa to humare saath bhi hua lekin dekho aaj kitne khush hai“ I might not support the political ideology of the director or may disagree with some actors on some issues but this is a story that I will definitely watch and hope people watch it with their families. It’s not ok to hit a woman ... not even a slap ... not even JUST one slap Courtesy: @tseries.official A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Feb 9, 2020 at 3:45am PST భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! -
ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్, స్మృతి ట్వీట్ వార్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు- 2020 ముగిశాయి. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగాయి. సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఓటర్లకు ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ చేసిన ఓ విఙ్ఞప్తిని స్మృతి తప్పుబట్టారు. పోలింగ్ మొదలవడానికి ముందు ఆయన తన ట్విటర్ ఖాతాలో.. (చదవండి : ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లైవ్అప్డేట్స్) ‘అందరూ తప్పకుండా ఓటు వేయండి. ముఖ్యంగా మహిళా ఓటర్లందరూ కదలిరండి. మీ కుంటుంబ బాగుకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటారో.. అలాగే దేశాన్ని, ఢిల్లీని మంచి నాయకుల చేతుల్లో పెట్టడానికి నడుం బిగించండి. మీ భర్త సాయం తీసుకుని ఎవరు ఢిల్లీకి సరైన నాయకుడో చర్చించి ఓటు వేయండి. ఇది నా పత్యేక వినతి’ అని ట్వీట్ చేశారు. కాగా, కేజ్రీవాల్ ట్వీట్పై స్పందించిన స్మృతి.. మహిళల్ని ఢిల్లీ సీఎం కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎవరికి ఓటు వేయాలనే స్వేచ్ఛ కూడా మహిళలకు లేదా అని ప్రశ్నించారు. మహిళల్ని కేజ్రీవాల్ తక్కువ చేసి మాట్లాడారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్గా ట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ఎవరికి ఓటు వేయాలో ఢిల్లీ మహిళలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 11న జరుగనుంది. (చదవండి : కేజ్రీవాల్ ఒక్కడే..) -
‘ఓసారి వ్యాయామం చేయాలనుకున్నా.. కానీ’
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనగానే గుర్తొచ్చేది ఆమె వాక్చాతుర్యం. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్గా ఉంటూ నెటిజన్లకు ఎదో రకంగా మెసేజ్ ఇస్తుంటారు. కుటుంబం, రాజకీయాలకు సంబంధించిన విషయాలతోపాటు ఇతర ఎన్నో అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ.. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా వివరిస్తారు. తాజాగా మరో ఆసక్తికర విషయంతో స్మృతి వార్తల్లో నిలిచారు. తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫన్నీ మీమ్ను షేర్ చేశారు. గతంలో స్మృతి వ్యాయమం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఆమెకు కొన్నిసమస్యలు తలెత్తడంతో వెంటనే వ్యాయామాన్ని మానేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..‘‘నేను ఒకసారి వ్యాయామం చేయడం మొదలు పెట్టాను. అ తరువాత నాకు ఎలర్జీ రావడం మొదలైంది. నా చర్మం అంతా ఉబ్బిపోయింది. అలాగే గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. విపరీతమై చెమటతో ఆయాసం వచ్చేది. చాలా ప్రమాదకరంగా అనిపించింది.’’అని హస్యస్పదమైన పోస్ట్ చేశారు. -
పది జన్మలెత్తినా అది నీవల్ల కాదు: స్మృతి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి రెచ్చిపోయారు. రాహుల్ మరో పది జన్మలెత్తినా.. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్కు ఉన్న ధైర్యం, తెగువ రాదని అన్నారు. శనివారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి సావర్కర్ గురించి ప్రస్తావించారు. ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’ అని గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. సావర్కర్ ధైర్య సాహసాలను ఆమె ప్రశంసించారు. ఏ విషయంలో కూడా వారిద్దరికి పోలిక లేదని అన్నారు. కాగా సావర్కర్పై రాహుల్ చేసిన గతంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. (నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) -
దీపికా.. ఎవరికి మద్దతిస్తున్నావో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్యూను సందర్శించిన బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దీపికా చర్యను తప్పుపట్టారు. దేశ విధ్వంసాన్ని కోరుకునే వారికి తాను బాసటగా నిలిచానని దీపికా పడుకోన్ తెలుసుకోవాలని స్మృతి ఇరానీ అన్నారు. వార్తలను ఫాలో అయ్యేవారికి ఇలాంటి వారు ఎటువైపు నిలబడుతున్నారనేది అర్ధమవుతుందని తాను భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు హిందూ సంఘాలు దీపిక చర్యను తప్పుపడుతూ ఆందోళన చేపట్టాయి. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన జేఎన్యూ విద్యార్ధులకు ఆమె బాసట తెలపడంతో దీపికా తాజా చిత్రం చపాక్ను బహిష్కరించాలని కొందరు బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. జేఎన్యూలో చెలరేగిన హింసను ఖండిస్తూ దీపికా పడుకోన్ ఆజ్ తక్ టీవీతోనూ మాట్లాడారు. జేఎన్యూ దాడిపై తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. -
భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..!
భారతీయ సంప్రదాయం ప్రకారం భర్త ముందు నడిస్తే అతడికి కాస్త వెనుకగా భార్య నడుస్తుంది. దీనికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. తాను సంప్రదాయక మహిళను అని అందరూ అంటుంటారు. మన దేశ సంప్రదాయం ప్రకారం భర్తకు రెండడుగులు వెనుకగా భార్య నడవాలన్నది దైవ నిర్ణయం. అందుకు బలమైన కారణం ఉంది. భర్త దారితప్పినా వెనకున్న భార్య సరిదిద్దే వీలుంటుంది. అతడు దారి తప్పినా అతడ్ని తిరిగి దారిలో పెట్టగల శక్తి స్త్రీకి ఉంటుంది. నా భర్త నాకు సహకరిస్తాడు. అతనికి నేను సహకరిస్తాను. చదవండి: ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..! అందుకే ఆయన అడుగులో అడుగేసి రెండు అడుగులు వెనుకే నడుస్తాను అని స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు.స్మృతి వ్యాఖ్యలకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2018లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా..ప్రస్తుతం స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై లాజికల్ థింకర్ అనే ట్టిటర్ పేజిలో కొన్ని టిక్టాక్ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! Best reply to why Indian women walk behind her husband!!!👍👍👍👍👍🙏🙏🙏 pic.twitter.com/rFEZClQKt1 — logical thinker (@murthykp) January 2, 2020 -
దీదీ వ్యాఖ్యలపై స్మృతీ ఇరానీ ఫైర్
కోల్కతా : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తోసిపుచ్చారు. మమతా వ్యాఖ్యలు భారత పార్లమెంట్ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. కోల్కతాలో శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర చట్టంపై దీదీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ చట్టంపై కోల్కతాలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంతో పాటు ఎన్ఆర్సీలపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రిఫరెండంలో మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుపడితే ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అన్నారు. -
రాహుల్ రేప్లను ఆహ్వానిస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు చేసిన ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలపై లోక్సభ దద్దరిల్లింది. యావత్ భారతదేశాన్ని, ఆర్థిక ప్రగతిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యానించారంటూ సభలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. రాహుల్ రేప్లను ఆహ్వానిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపిస్తే, పార్లమెంటులో కొనసాగే నైతిక హక్కు రాహుల్కి లేదని మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారరాహుల్ గాంధీ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే భారత్ ‘రేప్ ఇన్ ఇండియా’గా మారుతోందని అన్నారు. శుక్రవారం ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ ఓం బిర్లా రెండు సార్లు సభని వాయిదా వేసినా పరిస్థితి చక్కబడలేదు. దీంతో ఆయన సభని నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభలో రాహుల్ని గట్టిగా నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలు చూస్తే దేశంలో మహిళలపై అత్యాచారం చేయాలని పిలుపునిస్తున్నట్టుగా ఉందన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీకి మద్దతు నిలిచారు. రాహుల్కు మద్దతుగా కనిమొళి.. బీజేపీ సభ్యులు సభలో తీవ్రంగా దాడి చేయడంతో రాహుల్కు ఎంపీ కనిమొళి మద్దతు పలికారు. లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడడానికి స్పీకర్ అనుమతించకపోవడంతో ఆయన పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని తాను క్షమాపణ చెప్పనని అన్నారు. ఈసీకి బీజేపీ ఫిర్యాదు రాహుల్ అత్యాచార వ్యాఖ్యల్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో బీజేపీ మహిళా ఎంపీలు కేంద్ర ఎన్నిక సంఘాన్ని సంప్రదించారు. రాహుల్ అత్యాచారాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని ఎంపీలు ఫిర్యాదు చేశారు. వీలైనంత మేర ఆయనకు కఠిన శిక్ష విధించాలని ఈసీని కోరారు. చట్టబద్ధమైన పక్రియలన్నీ పూర్తయ్యాక తాము తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చినట్టు ఇరానీ వెల్లడించారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో తప్పేముంది : కనిమొళి
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్లో పెను దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలు మహిళలపై లైంగిక దాడులను ప్రోత్సహించేవిలా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడుతూ ఆయన క్షమాపణను డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ తేల్చిచెప్పినా ఆయన వ్యాఖ్యలపై పాలక, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై డీఎంకే నేత కనిమొళి స్పందిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు సభ వెలుపల చేశారని, గతంలో తాము ఇలాంటి ఉదంతాలను ప్రస్తావిస్తే సభ వెలుపల జరిగిన వాటిని ఉటంకించరాదని తమను అనుమతించని విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని నిత్యం మేకిన్ ఇండియా గురించి చెబుతుంటారని, దాన్ని తాము గౌరవిస్తామని అయితే వాస్తవంగా దేశంలో జరుగుతున్నదేంటని కనిమొళి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ మేకిన్ ఇండియా జరగకపోయినా దేశంలో మహిళలపై లైంగికదాడులు మాత్రం జరుగుతున్నాయని ఇదే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని చెప్పారు. కనిమొళి వ్యాఖ్యలపైనా స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కూడా మీరు పార్టీలకు అతీతంగా వ్యవహరించలేకపోతున్నారని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.