తాళ్లతో కట్టేసి చెరువులో పడేశారు | The brutal murder of a woman in Visakhapatnam | Sakshi
Sakshi News home page

తాళ్లతో కట్టేసి చెరువులో పడేశారు

Apr 11 2016 7:00 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖపట్నం నగరంలోని అరిలోవ ప్రాంతంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు.

విశాఖపట్నం నగరంలోని అరిలోవ ప్రాంతంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఓ మహిళ ను తాళ్లతో బంధించి చెరువులో పడేశారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సోమవారం చెరువు నీటిలో మహిళ మృతదేహం పైకి తేలి కనిపించడంతో సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతం నుంచి 7వ తేదీన దాడి లక్ష్మి (45) అనే మహిళ అదృశ్యం కాగా దానిపై కేసు నమోదైంది. తాజాగా బయటపడిన మహిళ మృతదేహం ఆమెది కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement