చౌటుప్పల్: చౌటుప్పల్లోని భాస్కర్ సినిమా థియేటర్ పంపకంలో తలెత్తిన వివాదం ఓ పార్టనర్ కిడ్నాప్, బెదిరింపులకు దారితీసింది.
భాస్కర్ ఇంటి సమీపంలో వాహనాన్ని ఆపి, అందులోంచి ఇద్దరు వ్యక్తులు భాస్కర్ ఇంటికి వెళ్లారు. ఇంటిముందు తచ్చాడుతూ.. అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. పోలీసులకు సమాచారం అందింది. వారు వచ్చి ఎవరని ప్రశ్నించగా, స్థానికులమే అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్రెడ్డికి సమాచారమందడంతో, ఆయన ఆదేశాల మేరకు చౌటుప్పల్ పోలీసులు వారిని వెంబడించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద పట్టుకున్నారు. స్కార్పియోను, అందులోని రెండు కర్రలు, ఒక రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వీరిని విచారిస్తున్నారు. మంచికంటి భాస్కర్ తన కు బెదిరింపు కాల్స్ రావడంపై జిల్లా ఎస్పీ ప్రకాష్రెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేసిన ట్లు తెలిసింది.