Theatre
-
ఉగాది, రంజాన్ స్పెషల్స్.. థియేటర్లో 5, ఓటీటీలో 6 క్రేజీ సినిమాలు
మార్చి చివరి వారంలో సినిమాల జాతర భారీగానే ఉండనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ వరుసగా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో థియేటర్స్ అన్నీ కూడా కళకళలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి కూడా భారీ మూవీస్ విడుదల కానున్నడంతో సినిమా అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా పలు హిట్ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి.ధియేటర్స్లో విడుదలయ్యే సినిమాలు🎥 లూసిఫర్2- మార్చి 27🎥 వీర ధీర శూర- మార్చి 27🎥 రాబిన్హుడ్- మార్చి 28🎥 మ్యాడ్ స్క్వేర్- మార్చి 28🎥 సికందర్- మార్చి 30ఓటీటీ సినిమాలునెట్ఫ్లిక్స్🎥మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26🎥కాట్ (థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 26 🎥దేవా -మార్చి 29అమెజాన్ ప్రైమ్🎥హాలెండ్ (ఇంగ్లీష్) మార్చి 27🎥శబ్ధం (తెలుగు)- మార్చి 28🎥మలేనా - మార్చి 29జియో హాట్స్టార్🎥ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) మార్చి 26🎥ఓం కాళీ జై కాళి (తెలుగు/వెబ్ సిరీస్) - మార్చి 28జీ5🎥విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28🎥మజాకా - మార్చి 28ఆహా🎥ది ఎక్స్టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26🎥మిస్టర్ హౌస్ కీపింగ్ ( తమిళ్)- మార్చి 25 -
40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత
దాదాపు 40 ఏళ్ల చరిత్ర గల మరో థియేటర్ నేలమట్టమైంది. సూపర్స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985లో చెన్నైలో ప్రారంభమైన బృందా థియేటర్.. దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది. గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్మార్క్గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)1985 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులమీదుగా బృందా థియేటర్ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ థియేటర్ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. 40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
థియేటర్లో ప్రకటనలపై కోర్టు కీలక తీర్పు
బెంగళూరు: సరదాగా సినిమా చూద్దామని వెళితే తన విలువైన సమయం వృథా చేశారని ఓ యువ న్యాయవాది థియేటర్పై కేసు వేశారు. ఈ కేసులో వినియోగదారుల కోర్టు న్యాయవాదికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతనికి రూ.65వేల నష్టపరిహారం చెల్లించాలని థియేటర్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. 2023లో బెంగళూరులో అభిషేక్ అనే న్యాయవాది బుక్మైషో ప్లాట్ఫాంలో టికెట్లు బుక్ చేసుకొని పివిఆర్ ఐనాక్స్ థియేటర్లో సినిమాకు వెళ్లారు.సినిమా ప్రదర్శించే ముందు థియేటర్లో 25 నిమిషాల పాటు ప్రకటనలు వేశారు. దీంతో యువ న్యాయవాదికి చిర్రెత్తుకొచ్చి థియేటర్పై కేసు వేసి విజయం సాధించారు.ఈ కేసులో తీర్పిచ్చే సందర్భంగా వినియోగదారుల కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమయం డబ్బులతో సమానమని, అభిషేక్ విలువైన టైమ్ వేస్ట్ చేసినందుకు అతడికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ప్రకటనలు వేయడాన్ని థియేటర్ యాజమాన్యం సమర్థించుకుంది. తాము కొన్ని ప్రకటనలు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. -
నాగచైతన్య తండేల్.. మహిళ అభిమాని ఫుల్ ఎమోషనల్
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో తండేల్ టీమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో సంబురాల్లో మునిగిపోయారు.అయితే ఈ మూవీ చూసిన ఓ మహిళ అభిమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమాలో నాగచైతన్యకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా ఏడుపును ఆపుకోలేకపోయారు. వెక్కి వెక్కి మరీ ఏడుస్తూ కనిపించారుయ దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని బట్టి చూస్తే తండేల్ ఆడియన్స్కు ఎమోషనల్గా ఎంతలా కనెక్ట్ అయిందో అర్థమవుతోంది.కాగా.. ఈ సినిమాను మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియల్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు మరింత ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఎన్ని ట్యాంక్ నీలు ఉన్నాయ్ అమ్మ..🥹🥹Proud of you Anna #NagaChaitanya 🧎థియేటర్స్ తీసుకొచ్చి మరి యేడిపిస్తునవ్ Actor @chay_akkineni ❤️🤌#Thandel #ThandelJaathara #ThandelRaju pic.twitter.com/8jzlo8j5J6— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 9, 2025 -
హద్దులు మీరిన అభిమానం.. థియేటర్లోనే అరాచకం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిత్ తిరుమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో తలా అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ అభిమాన హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.రిలీజ్ మొదటి రోజు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్ చేశారు. ఏకంగా థియేటర్ లోపల బాణాసంచా పేల్చి అరాచకం సృష్టించారు. మరికొందరు అభిమానులైతే థియేటర్ వెలుపల పోలీసులతో గొడవపడ్డారు. కొందరు ఫ్యాన్స్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అగ్నిప్రమాదం జరిగి ఉంటే..అజిత్ కుమార్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు. థియేటర్ వెలుపల బాణాసంచా కాల్చి సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మీ అందరి ప్రాణాలు పోయేవని హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా హీరోపై అభిమానం ఉండాలే కానీ.. అది ప్రాణాలు తీసేలా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.Sambavam pannitanuga😭😭😭#VidaaMuyarchi #VidaaMuyarchiBookings https://t.co/GI1XfPHbM3 pic.twitter.com/yvQucbNe82— 𝓐𝓻𝓪𝓿𝓲𝓷𝓭❤️ (@_Aravind_15) February 5, 2025 -
పుష్ప-2 చూద్దామని థియేటర్కు వెళ్లారు.. తీరా పోస్టర్ చూస్తే!
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.సినిమా రిలీజైన రోజు నుంచి నార్త్లో పుష్ప-2 ఓ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. దక్షిణాది కంటే హిందీలోనే భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో పుష్పరాజ్ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ముందుగానే పుష్ప-2 ప్రదర్శించే థియేటర్లలో టికెట్స్ ముందుగానే బుక్ అవుతున్నాయి.పుష్ప-2కు బదులు బేబీ జాన్..తాజాగా పుష్ప-2 మూవీ చూడాలని టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. షో టైమ్కు థియేటర్కు వెళ్తే అక్కడా పుష్ప-2 బదులుగా బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రదర్శించారు. దీంతో థియేటర్ యాజమాన్యంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం చేశారు. థియేటర్ ముందే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.కాగా.. వరుణ్ ధావన్ నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అట్లీ కథను అందించగా.. కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ సినిమా తేరీ రీమేక్గా తెరకెక్కించారు.Many theatres are forcing people to watch film #BabyJohn while they bought tickets for film #Pushpa2! Distributor Anil Thadani should take strict action against such theatres. While Ppl should file case against fraud @bookmyshow in consumer court. pic.twitter.com/yMRsrPm52k— KRK (@kamaalrkhan) December 25, 2024 -
పుష్ప-2 మూవీ వీక్షించిన దర్శకధీరుడు.. ఏ థియేటర్లో చూశాడంటే?
డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల వసూళ్లతో సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఈ ఊపు చూస్తుంటే ఐదు రోజుల్లోనే రూ.1000 కోట్లు సాధించేలా కనిపిస్తోంది. మరోవైపు నార్త్లోనూ పుష్ప-2 హవా కొనసాగుతోంది. తొలి రోజు నుంచే హిందీలో వరుస రికార్డులతో దూసుకెళ్తోంది పుష్ప-2. కేవలం హిందీలోనే నాలుగు రోజుల్లో రూ.339 నెట్ వసూళ్లు సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ సృష్టిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీ దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి వీక్షించారు. హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లిన సినిమా నుంచి బయటికి వస్తోన్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తే బాలనగర్లోని విమల్ థియేటర్లో పుష్ప-2 వీక్షించినట్లు తెలుస్తోంది.కాగా.. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అమెజాన్ అడవులో నేపథ్యంలో అడ్వంచర్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధ కాగా.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ మూవీ కోసం ఇప్పటికే లోకేషన్స్ వేటలో ఉన్నారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. Director rajamouli sir watched #Pushpa2 🔥@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/qlzzp8IEHn— AlluBabloo Mithun (@allubabloo18) December 9, 2024 -
కుప్పంలో సీజ్ ది థియేటర్
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు. స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ! -
అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం
అమెరికాలోని కథా డ్యాన్స్ థియేటర్లో ప్రాచీన భారతీయ జానపద కథలను కథక్ డ్యాన్స్లో లయలుగా చేర్చి నృత్యకారులు అబ్బురపరుస్తున్నారు. కథక్ నృత్యం జానపద కథల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కథా డ్యాన్స్ థియేటర్లో ‘పంచతంత్ర, ది డ్యాన్సింగ్ టేల్స్ ఆఫ్ విజ్డమ్‘ను ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా విదేశాలలో భారత శాస్త్రీయ నృత్య రూపమైన కథక్ ద్వారా ప్రాచీన భారతీయ జానపద కథలకు జీవం పోస్తుంది.‘ఈ థియేటర్ ప్రారంభంలో నా మనుగడే ప్రశ్నార్థకంగా ఉండేది. భారతదేశం నుండి వచ్చిన నేను నా సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు ఎప్పుడూ బాధగా అనిపించేది. మన పొరుగువారిని కలుసుకోవాలంటే కళలను మించిన మార్గం లేదు. దీంతో 1987లో మా ఇంటి నేలమాళిగలో కథా థియేటర్ కంపెనీని ప్రారంభించాను’ అంటూ కథా డ్యాన్స్ థియేటర్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ రీటా ముస్తాఫీ తొలి రోజుల ప్రయత్నాలను వివరిస్తారు. ముస్తాఫీ, కథక్ క్లిష్టమైన ఫుట్వర్క్, హై–స్పీడ్ స్పిన్లు, రిథమిక్ ప్యాటర్న్లు, సాంస్కృతిక విభజనలను తగ్గించడానికి, కథలను చెప్పడానికి ఉపయోగిస్తూ వచ్చారు. జంతు కథల ఆధారంగా! ఇప్పుడు వారాంతాల్లో కథక్ నృత్య ప్రదర్శన ద్వారా నైతిక పాఠాలను బోధిస్తున్నారు. అందుకు, సంస్కృతంలో 2,000 ఏళ్ల క్రితం రాసిన జంతు కథల ఆధారంగా నృత్యాన్ని రూపొందించారు. ‘సింహం, నక్క, చిరుత, కాకి‘ కథలో మొదటిది... ఒక సింహం ఒంటెను వేటాడాలనే ఉద్దేశ్యంతో ఉన్నప్పటికీ దాని ప్రాణాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో నిజమైన నాయకత్వంలో దయ ఉంటుందని తెలుసుకుంటుంది. రెండవ కథ... ‘ది ఎలిఫెంట్ అండ్ ది మౌజ్‘లో, ఏనుగులు ఎలుకల సమూహాన్ని తొక్కడం మానుకుంటాయి. ఎలుకలు తరువాత ఏనుగులను వేటగాళ్ల ఉచ్చు నుండి రక్షిస్తాయి. శక్తి పరిమాణంతో సంబంధం లేకుండా పరస్పర గౌరవం విలువను ప్రదర్శిస్తాయి. చివరి కథ... ‘ది ఫిష్ అండ్ ది ఫ్రాగ్‘లో, అతి విశ్వాసం ఉన్న చేపలను సమీపంలోని కుటుంబం గురించి కప్ప హెచ్చరిస్తే, అవి విస్మరిస్తాయి. ఫలితంగా వాటిని ఆ కుటుంబం పట్టుకోవడంలో జాగ్రత్త, అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ‘‘ఇవి నేను ఎదిగే సమయంలో విన్న కథలు. నా పిల్లలూ ఆ కథలను వింటూ పెరిగారు, ఇప్పుడు నా మనవరాళ్లు కూడా వాటిని చదువుతున్నారు. ఈ కథలు అర్థవంతమైనవి ఎందుకంటే అవి దయగా, తెలివిగా, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పుతాయి’ అని ముస్తాఫీ వివరిస్తారు. ఒక చోట చేర్చే నృత్యంసెయింట్ లూయిస్ పార్క్లోని థియేటర్ డ్యాన్స్ స్కూల్ నుండి కథా డ్యాన్స్ థియేటర్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన 42 మంది డ్యాన్సర్లు, అప్రెంటిస్లు, 8 నుండి 12 సంవత్సరాల వయస్సు గల 20 మంది పిల్లలను ఈ నృత్యం ఒకచోట చేర్చుతుంది. న్యూ ఢిల్లీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ మైత్రేయి పహారీ, 50కి పైగా దుస్తులు, 30 మాస్క్లను రూపొందించారు, కల్పిత కథల జంతు పాత్రలను డ్యాన్సర్లు ధరిస్తారు. ఈ ప్రదర్శనలో సంజుక్త మిత్రా పెయింటింగ్లు, మిన్నియాపాలిస్కు చెందిన నిర్మాత జె.డి. స్టీల్, భారతీయ స్వరకర్త జయంత బెనర్జీ స్వరపరిచిన ఒరిజినల్ స్కోర్, కల్పిత కథల ద్వారా ప్రేక్షకులకు మార్గనిర్దేశం చేసే ఆంగ్ల వాయిస్ ఓవర్, కథనం కూడా ఉంటాయి. -
వేట్టయాన్కు ఊహించని రెస్పాన్స్.. మేకర్స్ కీలక నిర్ణయం!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. దసరా సందర్బంగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ ఫస్ట్ రోజే రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ది గోట్(రూ. 44 కోట్లు) తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచింది.అయితే రజనీకాంత్ వేట్టైయాన్కు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెట్టయాన్ కోసం మరిన్ని థియేటర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో దేశంలోని కీలక రాష్ట్రాల్లో అదనపు స్క్రీన్లలో వేట్టయాన్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్న చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోందని.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అదనపు స్క్రీన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాగా..టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయాన్ యాక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, అభిరామి, దుషార విజయన్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు. -
ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం: విజయేందర్ రెడ్డి
ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయంనైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటాల ప్రతిపాదనలను తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు పంపించింది. -
ఆ థియేటర్లలో బొమ్మ పడదు
సాక్షి, హైదరాబాద్: థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమష్టి నిర్ణయం కాదని... నష్టాలను మూటకట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చేవరకు అంటే...శుక్రవారం నుంచి కనీసం పదిరోజులపాటు ఏ బొమ్మా పడదు. జనవరి తర్వాత జూన్ వరకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కావడం లేదని, చిన్న సినిమాలు వచ్చినా.. అవి ప్రేక్షక ఆదరణ లేని కారణంగా రోజు అయ్యే వ్యయంలో కనీసం పదిశాతం ఆదాయం కూడా రావడం లేదని ఎగ్జిబిటర్ చారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. మల్టీప్లెక్స్లకు పర్సెంటేజీ రూపంలో లాభాలు సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా మల్టీప్లెక్స్లకు ఒక విధంగా, సింగిల్ థియేటర్లను మరోలా చూస్తున్నారన్న వాదన కూడా ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తోంది. మల్టీప్లెక్స్లో ఒక సినిమా వారంరోజులు నడిస్తే..వచ్చే ఆదాయంపై పర్సెంటేజీ రూపంలో లాభాలు ఇస్తుంటే.. సింగిల్ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారని, అద్దె చెల్లించడానికి వచ్చే ఆదాయం కంటే తక్కువ కలెక్షన్లు వచి్చనప్పుడు పర్సెంటేజీ లెక్కన తీసుకోమంటున్నారని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రావడానికి చాలా సమయం పడుతుండడంతో.. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోందని, దానికితోడు ఓటీటీల్లోనూ సినిమాలు వస్తుండడంతో.. థియేటర్లకు ఆదరణ తగ్గుతోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుదర్శన్ థియేటర్ యజమాని గోవింద్రాజు తెలిపారు. అది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం.. రెండువారాలపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయంతో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు సునీల్నారంగ్, కార్యదర్శి కె.అనుపమ్రెడ్డి స్పష్టం చేశారు. చిత్రసీమ అపెక్స్ బాడీకి నోటీసు ఇవ్వలేదు..తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయానికి చిత్ర పరిశ్రమ అపెక్స్బాడీలైన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలికి గాని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శనలు రద్దు చేయడమైందని గతంలోనూ బోర్డులు పెట్టేవారని ఆయన గుర్తు చేశారు. -
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
-
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూసివేత
కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. దీంతో సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, ఈసారి కరోనా వల్ల థియేటర్లు మూత పడటం లేదు. కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ఇలాంటి సమస్య వచ్చింది. థియేటర్ యజమానులకు సమ్మర్లో ఇలాంటి ఇబ్బందులు రావడంతో కాస్త నిరుత్సాహానికి గురౌతున్నారు.వేసవి శెలవులలో లెక్కలేనన్ని సినిమాలు విడుదల అవుతాయి. ప్రేక్షకులతో థియేటర్స్ అన్నీ నిండిపోతాయి.. కానీ ఈ ఏడాదిలో అలాంటి సందడి లేకపోవడంతో హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మే 17 నుంచి పదిరోజులపాటు మూసివేయనున్నారు. సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.థియేటర్స్ బంద్పై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్షన్తెలంగాణలో థియేటర్స్ బంద్పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి స్పందించారు. థియేటర్స్ బంద్ కావడానికి కారణం చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోచడం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమని ఆయన అన్నారు. ప్రతి రోజు థియటర్స్ ఖర్చులు భరించలేకే తాత్కాలికంగా సింగిల్ థియేటర్స్ మూసివేయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఖర్చులు భరించలేకే బంద్ చేయాల్సి వచ్చింది. కానీ, మరే ఇతర కారణాలు ఏమి లేవన్నారు. నిర్మాతలు ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామని చెబితే థియేటర్స్ ఓపెన్ చేస్తామని విజయేందర్ రెడ్డి అన్నారు. -
జయప్రద జైలు శిక్షరద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో సీనియర్ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్ఐకార్పొరేషన్(ఈఎస్ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్కు వెళ్లగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదీ చదవండి..ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా -
టాలీవుడ్ ప్రిన్స్ సందడి.. ఆ హిట్ సినిమా చూసేందుకే!
గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించాడు ప్రిన్స్ మహేశ్ బాబు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్.. తదుపరి చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు స్క్రిప్ట్ రెడీగా ఉన్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు హైదరాబాద్లో సినిమా థియేటర్లో సందడి చేశారు. ఇటీవల రిలీజైన మలయాళ డబ్బింగ్ హిట్ సినిమా ప్రేమలు చిత్రాన్ని ఏఎంబీ మల్టీప్లెక్స్లో వీక్షించారు. తన భార్య నమ్రతా శిరోద్కర్తో కలిసి థియేటర్కు వచ్చారు. సినిమా చూసి వెళ్తున్న వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. ప్రేమలు చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #TFNExclusive: Super 🌟 @urstrulyMahesh along with #NamrataShirodkar spotted near AMB Cinemas!📸#MaheshBabu #GunturKaaram #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/X1SJYekSt4 — Telugu FilmNagar (@telugufilmnagar) March 10, 2024 -
థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ
-
హనుమాన్ మూవీ చూస్తూ వింతగా ప్రవర్తించిన మహిళ
పెద్ద సినిమాల మధ్య చిన్న మూవీ విడుదలైంది. ఆ భారీ బడ్జెట్ చిత్రాల కలెక్షన్ల తుపానులో అది కొట్టుకుపోతుందనుకున్నారంతా! కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. ఈ చిన్న సినిమా ముందు పెద్ద సినిమాలు వెలవెలబోయాయి. ఏ మూవీ గురించే చెప్తున్నామో ఈపాటికే అర్థమైపోయుంటుంది. రూ.50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ ఐదు రెట్ల కన్నా ఎక్కువ లాభాలు సంపాదించింది. ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. పూనకంతో ఊగిపోయిన మహిళ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ పలుచోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో ఓ చోట ఆసక్తికర సంఘటన జరిగింది. థియేటర్లో హనుమాన్ సినిమా చూస్తున్న ఓ మహిళ హనుమాన్ చాలీసా మొదలవగానే పూనకమొచ్చినట్లుగా ఊగిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ మెలికలు తిరిగింది. పక్కన ఉన్నవాళ్లు ఆమెను పట్టుకుని సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె సీటులో కూర్చోలేక అరుస్తూ వింతగా ప్రవర్తించింది. వీడియో వైరల్ ఈ ఘటన ఉప్పల్లోని ఏషియన్ మాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ మహిళ వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు ఆమెకు హనుమాన్ పూనాడని అంటుండగా, మరికొందరు ఆమెలో దుష్ట శక్తి ఏదో ఉన్నట్లుంది, అందుకే చాలీసా రాగానే అలా ప్రవర్తించిందని కామెంట్లు చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం 'అదంతా ఏం కాదు.. తనకు ఫిట్స్ వచ్చినట్లుంది, లేదంటే ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లుంది' అని అభిప్రాయపడుతున్నారు. What you have cooked @PrasanthVarma You should see this 🙇🙇#HanuMan pic.twitter.com/Ry9KyIA0jA — AA Cult 🐉🪓 (@1_bunnyfreak) January 29, 2024 చదవండి: బర్రెలక్కకు రైతుబిడ్డతో పెళ్లా..? ఆ ఫోటోలు ఏంటి? -
సంక్రాంతి సినిమాల పంచాయతీ సెటిలైందా ?
-
దేశవ్యాప్తంగా పెరుగుతున్న హోం థియేటర్ ట్రెండ్
భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టిప్లెక్స్లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. – సాక్షి, హైదరాబాద్ మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచి్చన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచి్చన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో...: దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్ను 25 శాతం, వెబ్ సిరీస్లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే..: మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యం కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్ను మించి హోం థియేటర్ ఎక్స్పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
The Little Theatre: వందలాది పిల్లల అమ్మ
‘ఆరంభ శూరత్వం’ చాలామందిలో కనిపిస్తుంది. అయితే చెన్నైకి చెందిన అయేషా మేడమ్లో అది మచ్చుకైనా కనిపించదు. మూడు దశాబ్దాల క్రితం నాటకరంగంలోకి అడుగు పెట్టిన అయేషా పిల్లల్లో సృజనాత్మక కళల వికాసానికి ‘ది లిటిల్ థియేటర్’ ప్రారంభించింది. కాలంతో పాటు నడుస్తూ కొత్త ఆలోచనలు జత చేస్తూ థియేటర్ను ఎప్పటికప్పుడు క్రియాశీలంగా, నిత్యనూతనంగా నిర్వహిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ‘క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేయాలని ఉంది’ అని తన మనసులో మాటను తండ్రి దగ్గర బయట పెట్టింది అయేషా. ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడారు. అలా తండ్రి–కూతురు ఆలోచనల్లో నుంచి వచ్చిందే ది లిటిల్ థియేటర్ ట్రస్ట్. ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత చాలామందిలో కరుగుతూ పోతుంది. కాని మూడు దశాబ్దాలు దాటినా ‘ది లిటిల్ థియేటర్’ ఉత్సాహం. సృజన శక్తి రవ్వంత కూడా తగ్గలేదు. ‘ఇంకా కొత్తగా ఏం చేయవచ్చు’ అని ఆలోచిస్తూ వెళుతోంది ది లిటిల్ థియేటర్. కళలు, ఆరోగ్యాన్ని మేళవించి 2015లో చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో ‘హాస్పిటల్ క్లౌన్స్’ను పరిచయం చేసింది లిటిల్ థియేటర్. కీమో థెరపీ చేయించుకునే పిల్లలకు ‘క్రియేటివ్ థెరపీ’ అందిస్తోంది. ‘లిటిల్ థియేటర్’ ద్వారా ఏడాది పొడవునా సృజనాత్మక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల కోసం ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఫైర్ కథల కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కోవిడ్ కల్లోల సమయంలో ‘లిటిల్ థియేటర్’ ఆన్లైన్లోకి వచ్చింది. మల్టీ–కెమెరా సెటప్తో షోలను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవారు. యూట్యూబ్ చానల్ ద్వారా ఎంతోమందికి చేరువ అయింది. వన్స్ అపాన్ ఏ టైమ్ తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తూ ‘పిల్లలకు క్లాసు, హోంవర్క్ తప్ప మరో వ్యాపకం లేకుండా ఉంది’ అని నిట్టూర్చింది అయేషా. విదేశాల్లో ఉన్నత చదువు చదివిన అయేషా అక్కడ పిల్లల సృజనాత్మక వికాసానికి ఎన్నో వేదికలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ వాటి కొరత ఉంది అని గ్రహించి ‘ది లిటిల్ థియేటర్’కు శ్రీకారం చుట్టింది. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లితో ‘నాకు వందలాది పిల్లలు పుడతారు’ అని చెప్పింది చిన్నారి అయేషా. కూతురు మాట విని తల్లి పెద్దగా నవ్వింది. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా మాట నిజమైంది. ఇప్పుడు నాకు వందలాది పిల్లలు. ది లిటిల్ థియేటర్కు దగ్గరైన వాళ్లందరూ నా పిల్లలే’ అంటుంది అయేష. స్కూల్ ముగిసిన తరువాత పిల్లల కోసం నాటకానికి సంబంధించిన ప్రాథమిక విషయాలను పరిచయం చేసే కార్యక్రమాల నుంచి కుండల తయారీ వర్క్షాప్ల వరకు ఎన్నో నిర్వహించింది ది లిటిల్ థియేటర్. ‘ది లిటిల్ థియేటర్’ ట్రస్టు ప్రతి సంవత్సరం వందలాది మంది నిరుపేద పిల్లలకు సహాయపడుతుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన బాధ్యతలు చూస్తున్న అయేషా థియేటర్కు సంబంధించి సృజనాత్మక కార్యకలాపాలను మాత్రం యువతరానికే అప్పగించింది. ‘ప్రతిభావంతులైన యువతరానికి సృజనాత్మక బాధ్యతలు అప్పగిస్తే కంటెంట్లో కొత్తదనం కనిపిస్తుంది. సంస్థ మరింత ముందు వెళుతుంది’ అంటుంది అయేషా. ‘నాటకరంగంలోకి అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా, నేర్చుకున్నది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు ఆమె మాటల్లోనే... ‘నాటకరంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటింది. అయినప్పటికీ నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంది. నాటకరంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సులలో చేరుతుంటాను. నేను నేర్చుకున్నదాన్ని లిటిల్ థియేటర్కు తీసుకువస్తుంటాను’ అంటోంది అయేషా. క్రియేటివ్ థెరపీ హాస్పిటల్ వాతావరణంలో గాంభీర్యం, విషాదం, నిర్వేదం మిళితమై కనిపిస్తుంటాయి. ఈ వాతావరణాన్ని మార్చడానికి ఆస్పత్రిలో చేరిన పిల్లల్లో హుషారు తెప్పించడానికి, వారి పెదవులపై నవ్వులు మెరిపించడానికి చెన్నైలోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో ది లిటిల్ థియేటర్ ‘క్రియేటివ్ థెరపీ’ నిర్వహిస్తోంది. కథల కార్యక్రమం నుంచి తోలుబొమ్మలాట వరకు రకరకాల సృజనాత్మక కళలలో పేషెంట్లుగా ఉన్న పిల్లలను కలుపుకుంటూ వారిని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళతారు. ‘క్రియేటివ్ థెరపీ’ కోసం హాస్పిటల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ ఏసీ స్టూడియోలో పెర్ఫార్మెన్స్ లైట్లు, సౌండ్ సిస్టమ్స్, డిజిటల్ టీవీ స్క్రీన్, వర్క్షాప్కు సంబంధించి రకరకాల వస్తువులు ఉంటాయి. హాస్పిటల్లోని పిల్లల దిగులును దూరం చేయడంలో క్రియేటివ్ థెరపీ సత్ఫలితాలు ఇచ్చింది. హాస్పిటల్లోని పిల్లల కోసం షెల్ఫ్ల నిండా బట్టలు, బొమ్మలు, కలరింగ్ బుక్స్... మొదలైనవి ఏర్పాటు చేశారు. ఇతర హాస్పిటల్స్ కూడా పిల్లల కోసం ‘ఆర్ట్ థెరపీ’ని మొదలుపెట్టాయి. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రకరకాల పూల మొక్కలు, ప్లే పార్క్, పిట్టగూళ్లతో పేషెంట్ల కోసం ‘హ్యాపీ ప్లేస్’ను ప్రారంభించింది. మా అదృష్టం ‘చదువే కాదు మా పిల్లలకు కళలు కూడా కావాలి’ అంటున్న తల్లిదండ్రుల పరిచయం నిజంగా మా అదృష్టం. ‘చదువు తప్ప మా పిల్లలకు ఏమీ అవసరం లేదు’ అని వారు అనుకొని ఉంటే ది లిటిల్ థియేటర్ ఇంత దూరం వచ్చేది కాదు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. డబ్బున్న కుటుంబం, డబ్బు లేని కుటుంబం అని తేడా లేకుండా పిల్లలందరూ కళలతో మమేకం కావాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా మారడానికి కళలు ఉపయోగపడతాయి. – అయేషా, ఫౌండర్, ది లిటిల్ థియేటర్ -
ఓటీటీలో 20 సినిమాలు.. ఆ హిట్ సినిమా ఉచితం కాదు!
ప్రతి వారంలో శుక్రవారం వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పండగే. ఒకవైపు థియేటర్ రిలీజ్తో పాటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన హీరోల చిత్రాలు ఓటీటీకి ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికోసమే సినిమాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతుండగా.. గురు, శుక్రవారాల్లో మరిన్నీ సందడి చేయనున్నాయి. ఓటీటీలతో పాటు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన ఆదికేశవ, శ్రీకాంత్, శివాని రాజశేఖర్ నటించిన కోటబొమ్మాళి పీఎస్, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి. నెట్ఫ్లిక్స్ లియో- (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్- 24 స్క్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22 మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23 పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23 ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24 ఐ డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24 లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24 ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26 అమెజాన్ ప్రైమ్ ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24 ది విలేజ్ (తమిళ వెబ్ సిరీస్) - నవంబరు 24 ఒపెన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22(రెంట్- RS.149) అమెజాన్ మినీ టీవీ స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22 డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21 జీ5 ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24 జియో సినిమా ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23 బుక్ మై షో UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24 సోనీ లివ్ చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24 సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24 ఆపిల్ ప్లస్ టీవీ హన్నా వడ్డింగ్హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22 -
ఆ టోకెన్తో థియేటర్లో జీవితాంతం ఉచితంగా సినిమాలు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. చాలామంది పాత వస్తువులను జాగ్రత్తగా దాచేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నేళ్ల తర్వాత అవి బయట పడినప్పుడు వాటిని చూసినవారు తెగ ఆశ్యర్యపోతుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది దీనికి భిన్నం. 1766 నాటి ‘థియేటర్ టోకెన్’ ఇప్పుడు బ్రిటన్లో వేలం వేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ టొకెన్ ఉంటే థియేటర్లో రోజూ సినిమాలను ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ టోకెన్ కొనుగోలు చేయాలంటే భారీగా సొమ్ము చెల్లించాలివుంటుంది. గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్లోని బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ను నిర్మించివారు ముందుగా 50 ప్రత్యేకమైన టోకెన్లు తయారు చేశారు. ఈ టోకెన్లు కలిగినవారు థియేటర్లో ప్రదర్శించే ప్రతీ సినిమాను ఉచితంగా చూడవచ్చని ఆ టోకెన్లపై రాసి ఉంది. 250 ఏళ్లపాటు దాచివుంచిన ఈ టోకెన్లు ఇటీవల బయటపడ్డాయి. ఇప్పుడు వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ ప్రారంభ సమయంలో ఈ 50 టోకెన్లను తయారు చేశారు. కొందరు వాటిని వినియోగించారు. మరికొందరు విక్రయించారు. ఈ నేపధ్యంలో అనేక నకిలీ టోకెన్లు కూడా తయారయ్యాయట. విల్ట్షైర్లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం హౌస్లో ఈ టోకెన్లు విక్రయిస్తున్నట్లు వేలం హౌస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 1766లో థియేటర్ వాటాదారు విలియం జోన్స్కు టోకెన్ నంబర్ 35ను జారీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1815 నాటికి ఇది ప్రముఖ బ్రిస్టల్ బ్లూ గ్లాస్ తయారీదారు అయిన జాన్ వాధమ్ దగ్గరకు చేరింది. ఈ టోకెన్ ఇప్పటికీ ఈ కుటుంబం వద్ద ఉంది. మరో టోకెన్ అష్టన్ కోర్ట్కు చెందిన స్మిత్ కుటుంబం దగ్గరుంది. వేలం నిర్వహిస్తున్న సంస్థ ఒక టోకెన్ ధరను 2,500 పౌండ్లు అంటే సుమారు రూ. 2.51 లక్షలుగా నిర్ణయించింది. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ టోకెన్ల వినియోగానికి అనుమతిస్తాం. వారికి జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తాం. కాగా ఈ థియేటర్ను ‘థియేటర్ రాయల్’ అని పిలుస్తారు దీనిని కింగ్ స్ట్రీట్లో 1764-1766 మధ్య కాలంలో నిర్మించారు. ఇది కూడా చూడండి: 21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం! -
థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు
టెక్నాలజీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల వింతలు, అద్భుతాలతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొట్టేలా చేస్తున్నాయి. తాజాగా 5డీ ఎఫెక్ట్తో థియేటర్లో ఫైర్ సీన్కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారడంతో టెక్నాలజీ ఓవర్ డోస్పై మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు మనకు 2డీ, 3డీ,4డీ సినిమాల గురించి తెలుసు. ఇది భారీ విజువల్ ఎఫెక్ట్స్తో తెరపై వండర్స్ క్రియేట్ చేసేలా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్స్తో సినిమాలోని పాత్రలూ, దృశ్యాలు మనల్నీ మమేకం చేసేలా చేస్తాయి. అక్కడ జరుగుతున్న సీన్స్ నిజంగా మనచుట్టూ జరుగుతున్నాయేమో అనుకునేలా విజువల్స్లో కనిపిస్తాయి. స్క్రీన్పై సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ఫీల్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. సినిమాలో వర్షం పడినా, మంచు కురిసినా..చూసే ప్రేక్షకులకు కూడా కొన్ని సాంకేతిక పద్ధతులతో ఆ ఫీలింగ్ కలిగించేలా చేస్తుంది. ఇప్పుడు 5డీ థియేటర్లు ఒక అడుగు ముందుకేసి ఆడియెన్స్కు ఆ ఫీల్ను మరింత దగ్గర చేసింది. కానీ మితిమీరిన టెక్నాలజీ వాడకంతో కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు అనేలా గుర్తుచేస్తుంది ఈ వైరల్ వీడియో. 5డీ ఎక్స్ స్క్రీన్తో సినిమా థియేటర్లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్ చేస్తుండగా సడెన్గా ఓ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన సీన్ పడింది. అంతే క్షణాల్లో థియేటర్ మొత్తం అంటుకున్నట్లు కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు కూడా భలే థ్రిల్గా ఫీల్ అయ్యారు. అయితే ఇది రియల్ ఫైర్ యాక్సిడెంట్ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 5డీ ఎఫెక్ట్ బాగానే ఉంది కానీ, నిజంగానే ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ప్రేక్షకుల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడొద్దంటూ థియేటర్ ఓనర్స్పై గుర్రమంటున్నారు. మరోవైపు టెక్నాలజీని మితిమీరి వాడితే అనర్థాలే తప్పా మరొకటి ఉండదు. స్పేస్, వాటర్ వరకు ఓకే కానీ ఇలా నిప్పుతో చెలగాటం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. This is how people die. If a theater does somehow manage to go up in flames, people will think it's the 5D cinema effects. — JDM is the Shiz! (Scarface) (@FloatyRedHead23) October 13, 2023 My issue is what if a real fire broke out? This kind of stuff is awesome but desensitizes the mind and creates a loss of reaction time. — Cosmic-books 🇨🇦 (@foerster_bryan) October 13, 2023 -
లియో ట్రైలర్ .. వారందరికీ షాకిచ్చిన సెన్సార్ బోర్డ్!
దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్లో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ అభిమానులకు షాక్కు గురి చేసింది. ఆ బూతుపదం ఉండడంపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ.. ఆ డైలాగ్ను అలాగే ఉంచడంపై డైరెక్టర్ లోకేశ్ వివరణ కూడా ఇచ్చారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) అయితే ఈ ట్రైలర్ విడుదల రోజు చెన్నైలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో తాజాగా ఆ థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. అభ్యంతరమైన పదాలతో ట్రైలర్ను అలాగే చూపించారంటూ సెన్సార్ బోర్డు థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధనల ప్రకారం అలాంటి ట్రైలర్ను పబ్లిక్లో ప్రదర్శించకూడదని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యాజమాన్యాలను కోరింది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మేనన్, మిస్కిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!
అటు చూస్తే జవాన్ ఇటు చూస్తే ఆఫీస్...అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ... అని శ్రీశ్రీ అన్నట్టుగా ఆ బెంగుళూరు ఐ.టి ఉద్యోగికి కూడా సంకటం వచ్చింది. ఒకవైపు జవాన్ రిలీజ్. మరోవైపు సాఫ్ట్వేర్ డ్యూటీ. చివరకు అతను రెండూ చేశాడు. వైరల్ అయ్యాడు. బెంగళూరులోనే ఇటువంటివి జరుగుతుంటాయి. మొన్నా మధ్య ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ర్యాపిడో బైక్ వెనుక కూచుని ఆఫీస్కు వెళుతూ ట్రాఫిక్లో చిక్కుకుపోతే బైక్ మీదే ల్యాప్టాప్ తెరిచి లాగిన్ అయ్యి డ్యూటీ మొదలెట్టేశాడు. భారీ ట్రాఫిక్ వల్ల క్యాబుల్లో ఎక్కగానే ల్యాప్టాప్లు తెరిచే వాళ్లూ అక్కడ ఎక్కువే. ఇప్పుడు ఒక ఉద్యోగి ఏకంగా సినిమా హాల్లోనే ల్యాప్టాప్ తెరిచాడు. ఏం చేస్తాడు మరి? షారూక్ ఖాన్ ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో. సరిగ్గా ఆ టైమ్కే లాగిన్ అవ్వాలి. అందుకని థియేటర్లో ల్యాప్టాప్లో వేళ్లు టిక్కుటక్కుమంటుంటే కళ్లు సినిమాకు అంకితం అయ్యాయి. వెనుక కూచున్న ఒక వ్యక్తి ఇది ఫొటో తీసి ఇన్స్టాలో పెడితే లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ‘బెంగళూరులో ఇక పని చేయకుండా వదిలేసిన చోటు ఏదీ లేదు’ అని కామెంట్లు చేస్తూ ఏడవలేక నవ్వుతున్నారు. When #Jawan first day is important but life is #peakbengaluru. Observed at a #Bangalore INOX. No emails or Teams sessions were harmed in taking this pic.@peakbengaluru pic.twitter.com/z4BOxWSB5W — Neelangana Noopur (@neelangana) September 8, 2023 (చదవండి: కాలం కలిసి వస్తే డంప్యార్డ్ కూడా నందనవనం అవుతుంది!) -
సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే?
లక్నో: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా చూస్తుండగానే అకస్మాత్తుగా ఎంతోమంది చనిపోయారు. ఉన్నట్టుండి కూర్చున్న, నిలుచున్న చోటే కుప్పకూలిన ఘటనలు ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో చనిపించాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన వ్యక్తి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపుర్ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయాడు. కాగా, ఇటీవల విడుదలైన గదర్ -2 సినిమాను చూసుందుకు థియేటర్లోకి వస్తున్న 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు థియేటర్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని అక్షత్ తివారీగా గుర్తించారు. प्रदेश के लखीमपुर खीरी के एक मॉल में चलते–चलते एक युवक को हर्ट अटैक आ गया, युवक नीचे गिरा और मर गया।#lakhimpurkheri pic.twitter.com/jmQpfWvO9w — Aviral Singh (@aviralsingh15) August 28, 2023 అయితే, తివారీ.. థియేటర్ వద్ద ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. అనంతరం.. ఓ స్టాల్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా సీపీ టీవీ వీడియోలో రికార్డు అయ్యింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వెంటనే తివారీని ఆసుపత్రికి తరలించారు. తివారీని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: విమానంలో అద్భుతం.. పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ డాక్టర్లు -
ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం.. థియేటర్ అద్దాలు ధ్వంసం!
హైదరాబాద్లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్లో వీరంగం సృష్టించారు. సుదర్శన్ థియేటర్లో యోగి రీరిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ టాకీస్లోని స్క్రీన్తో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. (ఇది చదవండి: షారూక్ ఖాన్పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) థియేటర్పై కూల్డ్రింక్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: జిలేబి సినిమా రివ్యూ) Frustrated Prabhas fans are damaging theatre property because #Rogi4K failed to cross even the parking collections of previous re-releases. The cost of theatre damage is greater than the overall collections collected by ROGI till now."pic.twitter.com/eNO1XiYiw3 — HNE Official™ (@urstrulyHNE) August 18, 2023 -
Jailer Movie Release Fans Celebration: రజనీకాంత్ ‘జైలర్’మూవీ విడుదల.. అభిమానుల సందడి (ఫోటోలు)
-
థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!
ప్రముఖ యాంకర్, బిగ్బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో యాంకర్ రవితో జతకట్టి బుల్లితెరపై అలరించిన భామ.. ఆ తర్వాత మంజునాథ్ను ప్రేమ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్ గుడ్బై చెప్పిన లాస్య.. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనివ్వగా.. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే యూట్యూబ్ చానల్ను రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో ఎప్పుడు చురుక్కుగ్గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. (ఇది చదవండి: నీ భార్యగా గర్వపడుతున్నా.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్) తాజాగా లాస్య తన ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తన భర్తతో కలిసి థియేటర్లో హంగామా చేసింది. ఈ జంట మరింత రొమాంటిక్గా అందరి ముందే రెచ్చిపోయారు. ఆమె భర్త మంజునాథ్ థియేటర్లోనే లాస్యకు మరోసారి ప్రపోజ్ చేస్తూ రచ్చ చేశారు. ఇదంతా సూర్య హీరోగా నటించిన సూర్య సన్ఆఫ్ కృష్ణన్ రీ-రిలీజ్ థియేటర్లో జరిగింది. ఆ చిత్రంలోని సీన్ను అనుకరిస్తూ లాస్య చేసిన హంగామా చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ ) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
‘బార్బీ’ ఫీవర్.. సినిమా చూసేందుకు థియేటర్కు వచ్చిన వృద్ధ జంట.. చివరిలో
బార్బీ.. బార్బీ.. ప్రపంచవ్యాప్తంగా సీనీ అభిమానులను నోట ప్రస్తుతం ఇదే మాట. గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన బార్బీ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని రికార్డ్ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ‘బార్బీ’ మూవీ సూపర్ అంటూ కితాబు ఇవ్వడంతో విశేష స్పందన లభిస్తోంది. ఇక సోషల్ మీడియాలో బార్బీ ఫీవర్ మామూలుగా లేదనే చెప్పాలి. ఎక్కడ చూసిన పింక్ కలర్తో నింపుతున్నారు నెటిజన్లు. ఈ చిత్రాన్ని చూసేందుకు అన్ని వయసుల వారూ థియేటర్లకు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బార్బీ మూవీని చూసేందుకు వృద్ధ దంపతులు రాగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అందులో.. ఓ వృద్ధ దంపతులు సినిమా పూర్తయిన తర్వాత ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి థియేటర్ నుంచి బయటకు వస్తుండటం కనిపిస్తుంది. ఈ వీడియోని షకీనా అనే యూజర్ టిక్టాక్లో పోస్ట్ చేస్తూ.. బార్బీతో పాటు వీరిని చూసిన తర్వాత కంటనీరు రాకుండా ఉండదని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. "బార్బీ" చిత్రం జూలై 21న విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, దువా లిపా, సిము లియు, అరియానా గ్రీన్బ్లాట్, మైఖేల్ సెరా మరియు ఎమ్మా మాకీ నటించారు. The old couple after the Barbie movie by u/gamesofduty in MadeMeSmile -
Dil Raju : గద్వాల్లో దిల్ రాజు కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం (ఫొటోలు)
-
బ్రో సినిమాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ
-
Bro Movie Trailer Launch : దేవి థియేటర్లో బ్రో ట్రైలర్ లాంఛ్ (ఫొటోలు)
-
స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!
మావీరన్( తెలుగులో మహావీరుడు) చిత్రానికి ఇప్పుడు కొత్తగా పబ్లిసిటీ వచ్చేసింది. నటుడు శివకార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం మావీరన్ ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి సరిత ముఖ్యపాత్రను పోషించడం విశేషం. చాలా గ్యాప్ తర్వాత ఈమె ఇందులో తల్లి పాత్రలో నటించారు . దర్శకుడు మిష్కిన్, టాలీవుడ్ నటుడు సునీల్ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని అరుణ్ విశ్వ భారీస్థాయిలో నిర్మించారు. దీన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ విడుదల చేసింది. (ఇది చదవండి: స్లిమ్ కోసం కసరత్తులు.. హీరోయిన్పై దారుణంగా ట్రోల్స్!) అయితే ఈ చిత్రాన్ని తొలి రోజు మొదటి షోను చూడడానికి స్టార్ హీరో విజయ్ సతీమణి సంగీత థియేటర్కు రావడం విశేషం. ఇటీవల విజయ్, సంగీత దంపతుల గురించి పలు రకాల రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సంగీత విజయ్ నిర్వహించిన ఏ కార్యక్రమానికి హాజరుకాలేదు. విజయ్ విద్యార్థులకు ప్రోత్సాహకాల అందించిన కార్యక్రమంలో కూడా సంగీత పాల్గొనలేదు. కారణం ఆమె తన బిడ్డల సంరక్షణ బాధ్యతలను కోసం విదేశాల్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఒక్కసారిగా శుక్రవారం సంగీత ముఖానికి ముసుగేసుకుని శివకార్తికేయన్ నటించిన మావీరన్ చిత్రాన్ని చూడ్డానికి చైన్నెలోని ఒక థియేటర్కు రావడం హాట్ టాపిక్గా మారింది. ఆమె రావడం ఈ చిత్రానికి అదనపు ప్రచారాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. దీంతో విజయ్ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. కారణం ఇటీవల విజయ్ నిర్వహించిన ఏ కార్యక్రమానికి సంగీత హాజరు కాకపోవడంతో పలు రకాల వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరలైన సంగతి తెలిసిందే. కాగా విజయ్ తాజాగా నటిస్తున్న లియో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఈ వేడుకల్లో సంగీత కచ్చితంగా పాల్గొంటారనే విశ్వాసాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓ వైపు విజయ్ అభిమానులు మావీరన్పై నెగిటివ్ రివ్యూలు ఇస్తూనే.. మరోవైపు శివకార్తికేయన్కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతలో సంగీత థియేటర్లో శివకార్తికేయన్ భార్య ఆర్తితో కలిసి ఆమె చేయి పట్టుకుని చాలా సంతోషంగా మాట్లాడింది. ఈ సినిమా గురించి శివకార్తికేయన్ను కూడా అడిగినట్లు కోలీవుడ్ సమాచారం. (ఇది చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
GST Council : సినిమా హాళ్లలో తినుబండారాలపై జీఎస్టీ మోత!
న్యూఢిల్లీ: ప్రముఖ కేన్సర్ ఔషధం డినుటుక్సిమాబ్ను వ్యక్తులు దిగుమతి చేసుకుంటే దానిపై 12 శాతం ఐజీఎస్టీని మినహాయించే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. ఈ నెల 11న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. అలాగే, మల్టీప్లెక్స్లలో ఆహారం, పానీయాల విక్రయాలపై 5 శాతం జీఎస్టీ అంశాన్ని కూడా తేల్చనుంది. 18 శాతం కాకుండా రెస్టారెంట్ సర్వీస్ మాదిరే 5 శాతం పన్నును అమలు చేయాలని ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేటు అమలు చేస్తుండడం గమనించొచ్చు. యుటిలిటీ వాహనాలపై 22 శాతం కాంపన్సేషన్ సెస్సు వేటికి వర్తించనుందనేది కూడా స్పష్టత రానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్, ప్రైవేటు సంస్థలు ప్రారంభించే శాటిలైట్ సేవలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదనపైనా నిర్ణయం తీసుకోనుంది. అరుదైన వ్యాధుల చికిత్సలో భాగంగా దిగుమతి చేసుకునే ప్రత్యేక ఔషధాలు, ఔషధాల తయారీలో వినియోగించే ఆహారం (ఎఫ్ఎస్ఎంపీ)పై ప్రస్తుతం ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) 5–12 శాతం మధ్య ఉంది. ఇవి ఖరీదైన మందులు కావడంతో రోగులపై ఎంతో భారం పడుతోంది. దీంతో ఐజీఎస్టీని మినహాయించాలనే అభ్యర్థన కౌన్సిల్ ముందుకు రానుంది. కేంద్ర, రాష్ట్రాల పన్నుల అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ ఈ అంశాలపై కౌన్సిల్కు మంగళవారం నాటి సమావేశంలో స్పష్టత ఇవ్వనుంది. ఆన్లైన్ గేమింగ్పై మంత్రుల గ్రూప్ నివేదిక, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపైనా కౌన్సిల్ చర్చించనుంది. 11 పర్వత ప్రాంతాల రాష్ట్రాలకు బడ్జెటరీ మద్దతు కింద సీజీఎస్టీని పూర్తి మేర, ఐజీఎస్టీలో 50 శాతం రీయింబర్స్మెంట్ (తిరిగి చెల్లించడం) ఇవ్వాలనే డిమాండ్పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కార్లపై స్పష్టత ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ)పై 28 శాతం జీఎస్టీకి అదనంగా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమల్లో ఉంది. కానీ, అన్ని రకాల యుటిలిటీ వాహనాలు అంటే..ఎస్యూవీలతోపాటు మల్టీ యుటిలిటీ వెహికల్స్ (ఎంయూవీ), క్రాసోవర్ యుటిలిటీ వెహికల్స్ (ఎక్స్యూవీ)పైనా 22 శాతం కాంపెన్సేషన్ సెస్సు అమలు చేయాలంటూ ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. 4 మీటర్ల పొడవు, 1,500సీసీకి మించిన ఇంజన్ సామర్థ్యం, 170ఎంఎం కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాటికి ఈ సెస్సును అమలు చేయాలని సూచించింది. డినుటుక్సిమ్యాబ్ ఔషధం ఖరీదు రూ.36 లక్షలుగా ఉండడంతో, రోగులు క్రౌడ్ఫండింగ్ సాయం ద్వారా దిగుమతి చేసుకోవాల్సి వస్తుందంటూ, ఐజీఎస్టీని మినహాయించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఇస్రో, యాంత్రిక్స్ కార్పొరేషన్ (ఏసీఎల్), న్యూ స్పేస్ ఇండియా (ఎన్ఎస్ఐఎల్)ను జీఎస్టీ నుంచి మినహాయించి, ప్రైవేటు సంస్థలు చేసే శాటిలైట్ ప్రయోగ సేవలపై 18 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి : విడుదల కాకుండానే..మెటా ‘థ్రెడ్స్’కు ఎదురు దెబ్బ! -
బాయ్ఫ్రెండ్తో కనిపించిన సాహో భామ.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆషిక్-2 సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ తర్వాత పలు చిత్రాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఈ ఏడాది రణ్బీర్ కపూర్ సరసన తూ జూటి మెయిన్ మక్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో బాగీ, ఎక్ విలన్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, స్త్రీ, ఓకే జాను లాంటి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో కనిపించింది శ్రద్ధా కపూర్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!) అయితే తాజాగా ఈ సాహో భామ ముంబయిలో ఓ థియేటర్ వద్ద కనిపించి ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసి బయటకు వస్తుండగా కెమెరాల కంటికి చిక్కింది. అయితే ఆమెతో పాటు బాయ్ఫ్రెండ్ రాహుల్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి థియేటర్లో సినిమా చూసి వెళ్తుండగా ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ బీ టౌన్లో చర్చ మొదలైంది. కానీ ఇంతవరకు వీరి రిలేషన్పై ఎక్కడా స్పందించలేదు. అయితే వీరిద్దరు వేరు వేరు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. రాహుల్ తూ జూతీ మైన్ మక్కార్ సినిమాకు రచయితగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అంతే కాకుండా రాహుల్ ప్యార్ కా పంచ్నామా- 2, సోను కే టిటు కి స్వీటీతో సహా లవ్ రంజన్ చిత్రాలకు కూడా పనిచేశాడు. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్.. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2022లో విడిపోయినట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపించాయి. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
థియేటర్ ధ్వంసం.. పవన్ అభిమానులపై కేసు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా శుక్రవారం నగరంలోని గాంధీనగర్లో ఉన్న కపర్థి థియేటర్లో ప్రదర్శించారు. సెకండ్ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్ను చింపేందుకు ప్రయతి్నంచగా, థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్ అభిమానులు రెచి్చపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారని థియేటర్ మేనేజర్ బి.మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు శనివారం కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: చనిపోయినట్లు భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు -
బిజినెస్లోనూ బన్నీనే టాప్.. కేఫ్ నుంచి థియేటర్ దాకా..
టాలీవుడ్ చిత్ర సీమలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'అల్లు అర్జున్' (Allu Arjun) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్లో బఫెలో వైల్డ్ వింగ్స్, అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్ వంటి బిజినెస్లు చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు. బన్నీ వ్యాపారాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బఫెలో వైల్డ్ వింగ్స్ (Buffalo Wild Wings) అల్లు అర్జున్ ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ అయిన 'బఫెలో వైల్డ్ వింగ్స్' కోసం ఫ్రాంచైజీని కలిగి ఉన్నాడు. హైదరాబాద్ రోడ్ నెం. 36 జూబ్లీహిల్స్లో సందడిగా ఉండే ప్రాంతంలో ఇది ఎంతో మంది ఆహార ప్రియులకు మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫారమ్ (Aha OTT Platform) తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతించే ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్ఫామ్కి అల్లు అర్జున్ కో-ఫౌండర్. ఆహా ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఉంది. ఇది మంచి కార్యకలాపాలకు, కంటెంట్ సృష్టికి కేంద్రంగా పనిచేస్తుంది. (ఇదీ చదవండి: పాకిస్థాన్ ప్రజల మనసు దోచిన పాపులర్ కార్లు ఇవే!) అల్లు స్టూడియోస్ (Allu Studios) అల్లు స్టూడియోస్ అనేది అల్లు అర్జున్కి చెందిన అత్యాధునిక చిత్ర నిర్మాణ సంస్థ. ఇది రోడ్ నెం.10, జూబ్లీహిల్స్ హైదరాబాద్లో ఉంది. ఇందులో పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, ఆడియో రికార్డింగ్ వంటి అనేక సేవలు, మౌలిక సదుపాయాలు లభిస్తాయి. దీనిని హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. (ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!) ఏఏఏ సినిమాస్ (AAA Cinemas) ఇటీవల అల్లు అర్జున్ హైదరాబాద్ అమీర్పేట్లో ఏఏఏ సినిమాస్ అనే ఆధునిక మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇందులో మొత్తం 5 స్క్రీన్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దక్షిణాదిలో ఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక్క థియేటర్ ఇదే కావడం గమనార్హం. -
Adipurush: ప్రభాస్ గురించి కామెంట్ చేసిన కృతి సనన్ తండ్రి
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా 'ఆదిపురుష్' గురించే టాపిక్.. ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందు అంటే జూన్ 15 గురువారం రాత్రి ముంబయిలో ఒక షో వేశారు. చిత్ర తారాగణం, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా మేకర్స్ ఏర్పాటు చేశారు. సీత పాత్రలో నటించిన కృతి సనన్ నెమలి నీలం రంగు అనార్కలీ సూట్లో అక్కడ అద్భుతంగా కనిపించింది. సినిమా చూసేందుకు ఆమె తల్లిదండ్రులు రాహుల్ సనన్, గీతా సనన్ వచ్చారు. సీతాదేవి పాత్రలో తమ కుమార్తె నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని కృతి తల్లిదండ్రులు తెలిపారు. (ఇదీ చదవండి: ఆదిపురుష్కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్) రాముడిగా ప్రభాస్ అద్భుతంగా నటించాడని, సినిమా చూసిన తర్వాత రాముడిగా అందరికీ ప్రభాసే గుర్తుండిపోతాడని ఆయన అన్నారు. అదిపురుష్ కోసం దేశవ్యాప్తంగా ఇంతమంది ఎదురుచూడటం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. అనంతరం కృతి సనన్తో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఆమె ఎంతో ఓపికతో వారందరితో సెల్ఫీలు దిగింది. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులు సంతోషంగా ఉన్నారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) -
Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా నేడు (జూన్ 16) విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద జై శ్రీరామ్ నామంతో ప్రభాస్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. సినిమా ఇప్పటికే హిట్ టాక్ అందుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు మంచి బజ్ రావడంతో థియేటర్లలో బొమ్మ పడటం ఒక నిమిషం ఆలస్యం అయినా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: ఎవరైనా అలాంటి వేషాలు వేస్తే.. తాట తీస్తాం: ప్రభాస్ ఫ్యాన్స్) తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం వల్ల యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవకు దిగారు. థియేటర్ సిబ్బంది సర్దిచెప్పడంతో సమస్య సద్దుమనిగింది. కానీ వారు థియేటర్లోకి వెళ్లిన తర్వాత అసలు సమస్య మొదలైంది. సినిమా ప్రారంభం అయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో వారికి డైలాగ్లు అర్థం అవ్వడం లేదని మళ్లీ గొడవకు దిగడమే కాకుండా థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో చేసేదేమి లేక థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపేశారు. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్కు ఎలా పరిచయం?) -
అల్లు అర్జున్ థియేటర్ అదిరిపోయింది
-
అత్యంత అందమైన టాప్ 10 రోమన్ యాంఫీథియేటర్స్
-
AAA Cinemas Images: అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్ను నిర్మించాడు. తాజాగా వీరి రూట్లోనే అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నాడు. హైదరాబాద్లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్ను నడిపిస్తున్నాడు బన్నీ. వీటంన్నిటితో పాటు గతేడాది అమీర్ పేట్లో మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు మొదలుపెట్టిన విషయం తెల్సిందే. (ఇదీ చదవండి: ఇలియానాపై ట్రోల్స్.. అతని ఫోటో రివీల్) ఇప్పటికే అది పూర్తయ్యింది. ఏషియన్స్ సినిమాస్, అల్లు అర్జున్ పేరు వచ్చేలా 'AAA' సినిమాస్ పేరు కూడా పెట్టేశాడు. తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ థియేటర్ను జూన్ 16న బన్నీ ప్రారంభించనున్నారట. అదేరోజు ప్రభాస్ 'ఆదిపురుష్' విడదల కానుంది. రాముని సినిమాతో మల్టీప్లెక్స్ను ప్రారంభిస్తే శుభసూచకమని భావించి పనులను కూడా వేగవంతం చేయించాడట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. అన్ని అనుకూలిస్తే.. జూన్ 16 న 'AAA' సినిమాస్లో మొట్టమొదటి స్క్రీనింగ్గా ఆదిపురుష్ ఉండనుంది. (ఇదీ చదవండి: నిశ్చితార్థ వేడుకలో మెరిసిపోయిన లావణ్య.. చీర ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!) -
'2018' సినిమాపై వివాదం.. ఆ విషయంలో తీవ్ర అభ్యంతరం!
మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం '2018'. మాలీవుడ్లో సూపర్హిట్గా నిలిచిన ఈ చిత్రం తెలుగులోనూ ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 7న ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) ఓటీటీ రిలీజ్పై అభ్యంతరం హిట్ టాక్తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలపై కేరళలోని థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ల చేయడంపై 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సినిమాను కేవలం ఐదు వారాల లోపే ఓటీటీలో విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్తో తాము రూ.200 కోట్లు నష్టపోతామని ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, అజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!) -
‘ఆదిపురుష్’ థియేటర్లో అక్కడ ఎవరూ కూర్చోకండి
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ‘ఆదిపురుష్’ పోస్టర్లతో నిండిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతుండటంతో.. చివరి దశ ప్రమోషన్స్ను మేకర్స్ ప్రారంభించారు. తాజాగా ఆదిపురుష్ టీమ్ సినిమా రిలీజ్కు సంబంధించి ఓ ప్రకటన చేసింది. ఆదిపురుష్ స్క్రీనింగ్ సమయంలో ప్రతి థియేటర్లో ఒక సీటు అమ్ముడుపోదు.. ఆ సీటులో ఎవరూ కూర్చోకూడదని మేకర్స్ చెప్పారు. ప్రజల విశ్వాసాలను కాపాడేందకు ఆ సీటును రామ భక్తుడు హనుమంతునికి అంకితం చేయబడుతుందని వారు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: లలితా జ్యువెలరీలో బంగారు ఆభరణాలు దొచుకున్న ఆ దొంగ కథే 'జపాన్'!) అంతే కాకుండా వారు ఇలా ప్రకటించారు. "రామాయణం ఎక్కడ పఠించినా హనుమంతుడు కనిపిస్తాడు. ఇది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు అమ్మకుండా హనుమంతుడికి రిజర్వ్ చేయబడుతుంది. రాముని గొప్ప భక్తుడు హనుమంతుడి గురించి జూన్ 16న అందరూ తెలుసుకోండి.'' అని యూనిట్ తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు కన్నడ ఐదు భాషల్లో ‘ఆదిపురుష్’ తెరపైకి రానుంది. చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్6)న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరగనుంది. (ఇదీ చదవండి: ఎంత టార్చర్ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా: నటి) -
ఈ వారం థియేటర్/ఓటీటీ అలరించే చిత్రాలివే!
ఈ ఏడాది వేసవిలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్లతోపాటు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో ఓటీటీలో అలరించే చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. దగ్గుబాటి హీరో అహింస ప్రముఖ నిర్మాత సురేష్బాబు తనయుడు, రానా సోదరుడు అభిరామ్ అహింస చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్కు జోడీగా గీతికా తివారీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: చాలా రోజుల తర్వాత అలాంటి చిత్రాన్ని చూశా: రాజమౌళి ప్రశంసలు) థ్రిల్లింగ్ కథతో.. స్టూడెంట్గా థియేటర్స్కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఆసక్తి రేకెత్తించే ఐక్యూ సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ స్టూడెంట్’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. కామెడీతో పరేషాన్ ‘మసూద’ ఫేమ్ తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్గా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పరేషాన్’. రానా దగ్గుబాటి సమర్పణలో వాల్తేర్ ప్రొడక్షన్స్పై విశ్వతేజ్ రాచకొండ, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూన్ 2న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ చక్రవ్యూహం సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ఈ సినిమా పోస్టర్ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. (ఇది చదవండి: భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?) ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే! నెట్ఫ్లిక్స్ ఫేక్ ప్రొఫైల్ -వెబ్సిరీస్- మే 31 ఎ బ్యూటిఫుల్ లైఫ్ -హాలీవుడ్- జూన్ 1 న్యూ ఆమ్స్టర్ డామ్ -వెబ్సిరీస్- జూన్ 1 ఇన్ఫినిటీ స్టోర్మ్ -హాలీవుడ్- జూన్ 1 స్కూప్ -హిందీ సిరీస్- జూన్ 2 మ్యానిఫెస్ట్ -వెబ్సిరీస్- జూన్2 జీ 5 విష్వక్ -తెలుగు- జూన్ 2 డిస్నీ+ హాట్స్టార్ సులైకా మంజిల్ -మలయాళం- మే 30 బుక్ మై షో ఈవిల్ డెడ్ రైజ్ -హాలీవుడ్- జూన్ 2 జియో సినిమా అసుర్ 2 -హిందీ సిరీస్- జూన్ 1 -
కొత్త వ్యాపారంలోకి నయన్, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ?
సాక్షి,ముంబై: లేడీ సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నయనతార మరోసారి తన ప్రత్యకతను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. అటు సినిమాలు ఇటు వ్యాపారం లోనూ రాణిస్తున్న నయనతార తాజాగా మరో కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతోన్నట్లు తెలుస్తోంది. భర్త విఘ్నేష్ శివన్తో కలిసి ఉత్తర చెన్నైలోని 56 ఏళ్ల నాటి పాత అగస్త్య థియేటర్ను కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాంటిదేమీలేదు నయనతార, విఘ్నేష్ శివన్ కోలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నై థియేటర్ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లకు చెక్ పడినట్టే కనిపిస్తోంది. దర్శకుడు, నయన్ సన్నిహితుడు ఈ వార్తలను కొట్టి పారేశారు. ఎలాంటి థియేటర్ను కొనడానికి ప్లాన్ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. అయితే దీనిపై నయన్, విఘ్నేష్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప క్లారిటీ ఉండదు. ఇప్పటికే అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన టాప్ సౌత్ ఇండియాన్ స్టార్ నయన్ ఇపుడిక థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. తమ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ కింద చెన్నైలో తొలి ఆస్తిని కొనుగోలు చేసారనేది టాక్. ఉత్తర చెన్నై ప్రాంతంలో, దేవి థియేటర్ గ్రూప్ యాజమాన్యంలోని అగస్త్య థియేటర్ 1967నుంచి పనిచేస్తోంది. తమిళ టాప్ స్టార్లు ఎంజీఆర్, శివాజీ గణేశన్ మొదలు రజనీ కాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ దాకా లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రదర్శించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ కరోనా, లాక్డౌన్ కాలంలో చిక్కుల్లో పడింది. దీంతో 2020లో దీన్ని మూసి వేశారు. 1000 సీటింగ్ కెపాసిటీతో కూడిన థియేటర్ను రెండు స్క్రీన్లతో మల్టీప్లెక్స్గా రెన్నోవేట్ చేసి ఈ ఏడాది చివరికి తిరిగి లాంచ్ చేయనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాగా నయనతార ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో బాలీవుడ్ మూవీ 'జవాన్' లో విజయ్ సేతుపతి, షారుక్ ఖాన్ సరసన నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 7 న విడుదల కానుంది. దీంతోపాటు 'లేడీ సూపర్ స్టార్ 75' ఆర్. మాధవన్తో తన తొలిచిత్రం 'ద టెస్ట్' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, విఘ్నేష్ శివన్ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరైనాడు. -
సింహాద్రి రీ రిలీజ్.. ఏకంగా థియేటర్ తగలబెట్టేశారుగా!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమా రిలీజైతే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) అయితే ఈ సినిమా రిలీజ్ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా రిలీజైన థియేటర్ల ముందు పాలాభిషేకాలు, కేక్లు చేసి సందడి చేశారు. అయితే విజయవాడలోని గాంధీనగర్ అప్సర థియేటర్లో అభిమానులు ఏకంగా టపాసులు పేల్చారు. దీంతో సీట్లకు మంటలు అంటుకుని థియేటర్ మొత్తం వ్యాపించాయి. అయితే అక్కడే ఉన్న పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ ఘటనతో సాయంత్రం ప్రదర్శించాల్సిన షోలను నిర్వాహకులు రద్దు చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. (ఇది చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
ఈ వారం ఓటీటీ/ థియేటర్స్లో సందడి చేసే చిత్రాలివే
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. థియేటర్లతో పాటు ఓటీటీల్లో చిత్రాలు చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పటిలాగే సినీ ప్రియులను అలరించేందుకు ఈ వారం కూడా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. టాలీవుడ్తో పాటు మిమ్మల్ని అలరించే వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్లపై ఓ లుక్కేద్దాం. ‘అన్నీ మంచి శకునములే’ సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. యువ నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బిచ్చగాడు-2’ ‘బిచ్చగాడు’ సినిమాతో తన కెరీర్లోనే భారీ విజయాన్ని అందుకున్నారు తమిళ హీరో, దర్శకుడు విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్గా బిచ్చగాడు-2 అలరించేందుకు వస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాస్ట్ ఎక్స్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులకు పరిచయమున్న సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. ఆ సిరీస్లో రాబోతున్న తర్వాతి చిత్రం ఫాస్ట్ ఎక్స్. జస్టిన్ లిన్ దర్శకుడు. ఈ చిత్రంలో జాసన్ మొమోవా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది రెండు భాగాలుగా రానుంది. వీటిలో మొదటి భాగమైన ఫాస్ట్ ఎక్స్ మే 19న రిలీజ్ కానుంది. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్సిరీస్లు అఖిల్ ఏజెంట్ అక్కినేని హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం సోనీలివ్ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించగా.. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు. నిహారిక 'డెడ్ పిక్సెల్స్' మెగా డాటర్ నిహారిక కొణిదెల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఓటీటీ డిస్నీ+ హాట్స్టార్లో ఈ నెల 19న రిలీజ్ కానుంది. నెట్ఫ్లిక్స్ అయాలవాషి -మలయాళం-మే 19 కథల్ - హిందీ - మే 19 బయీ అజైబి -ఇంగ్లీష్ - మే 19 మ్యూటెడ్- ఇంగ్లీష్- మే 19 నామ్- సీజన్-2- మే 1 సోనీ లివ్ కడిన కదోరమీ అంద కదహం -మలయాళం- మే 19 అమెజాన్ ప్రైమ్ వీడియో మోడ్రన్ లవ్ చెన్నై -తమిళ్- మే 18 -
ఒక్కోక్కడికి ఇచ్చి పడేసారు వామ్మో మామూలుగా రెచ్చిపోలేదుగా
-
థియేటర్ లో ఆదిపురుష్ ట్రైలర్ చూసి రచ్చ రచ్చ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
-
విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్పై తేజ్ ఫ్యాన్స్ దాడి
ఎక్కడ చూసినా విరూపాక్ష సందడే కనిపిస్తోంది. ఈ హారర్ సినిమాతో థియేటర్లు మోత మోగిపోతున్నాయి. ఎలాగోలా వీలు చేసుకుని మరీ ఈ సినిమాకు వెళ్తున్నారు ప్రేక్షకులు. అయితే హైదరాబాద్ మూసాపేటలో ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లో సినిమా టిక్కెట్లు కొనుగోలు చేసి లోనికి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. సాయంత్రం ఆరు గంటలకు లోపలకు వెళ్లిన ప్రేక్షకులు గంటకు పైగా షో కోసం వేచి చూశారు. కానీ ఎంతకూ షో ప్రారంభమవలేదు. గంటన్నర తర్వాత కూడా షో వేయకపోవడంతో ఆగ్రహానికి గురైన సాయిధరమ్ తేజ్ అభిమానులు థియేటర్పై దాడి చేశారు. థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అటు థియేటర్ యజమానులు సైతం టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి డబ్బులు తిరిగిచ్చేశారు. అయితే చాలామందికి జీఎస్టీ, పార్కింగ్ ఫీజు అంటూ సగం టికెట్ డబ్బులే ఇచ్చారని, కొద్దిమందికి మాత్రమే పూర్తి మొత్తం డబ్బు వాపస్ చేశారని ఓ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో వాపోయాడు. కాగా సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21న విడుదలైంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుండటం విశేషం. మొత్తానికి రీఎంట్రీతోనే సాయిధరమ్ తేజ్ భారీ హిట్ కొట్టడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. చదవండి: నగ్న ఫోటోలు ఫ్రేమ్ కట్టిస్తానన్న ఫ్రెండ్ మాటలకు నటి ఎమోషనల్ -
కాంతారకు బిగ్ షాక్ ఇచ్చిన కేరళ హైకోర్ట్
-
ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలివే
ప్రతివారం బక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలా ఈ వారం పాన్ ఇండియా సినిమాతో పాటు మరిన్ని కొత్త చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. అలాగే ఓటీటీలు వచ్చాక సినీ ప్రియులకు వినోదం మరింత రెట్టింపు అయ్యింది. పెద్ద సినిమాలన్ని తమకు నచ్చినప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది. ప్రతివారం ప్రేక్షకులను అలరించేందుకు ఇటూ థియేటర్లు, అటూ ఓటీటీలు కొత్త సినిమాలతో సిద్ధమవుతాయి. గతవారం థియేటర్లో రావణాసుర, మీటర్ వంటి సినిమాల అలరించగా ఈ వారం శాకుంతలం వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు పెద్ద హీరోలు చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే. శాకుంతలం సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిర్మాణాంతర పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్లో విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాతో అర్హ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటం విశేషం. ‘రుద్రుడు’గా మారిన లారెన్స్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేశన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి ‘విడుదల’ తమిళంలో మంచి విజయం సాధించిన ‘విడుదలై’ చిత్రం ఇప్పుడు తెలుగులో అలరించేందుకు రెడీ అయ్యింది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, నటుడు సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రీబ్యూషన్ విడుదల పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 15న తెలుగులో విడుదల కాబోతోంది. ఓటీటీలో అలరించే చిత్రాలు విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్, హైపర్ ఆది, రంగస్థలం మహేష్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న థియేటర్లో విడుదలైంది. విశ్వక్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ (తొలిరోజు రూ.8 కోట్లు) రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. విడుదలైన నెల రోజులకు ముందే దాస్ కా ధమ్కీ ఓటీటీకి రావడం గమనార్హం. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఏప్రిల్ 14 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ+హాట్స్టార్ ఓ కల (తెలుగు) ఏప్రిల్ 13 టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 9 నెట్ఫ్లిక్స్ ఫ్లోరియా మాన్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 13 అబ్సెషన్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 13 క్వీన్ మేకర్ (కొరియన్ సిరీస్) ఏప్రిల్ 14 ది లాస్ట్ కింగ్డమ్ (హాలీవుడ్) ఏప్రిల్ 14 అమెజాన్ ది మార్వెలస్ మిస్సెస్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 14 జీ5 మిస్సెస్ అండర్కవర్ (హిందీ) ఏప్రిల్ 14 -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!
ఇప్పుడిప్పుడే థియేటర్లలో వేసవి సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే మక్కువ చూపుతున్నారు. విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా మిమ్మల్ని అలరించేందుకు ఏకంగా 21 సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈవారంలో థియేటర్లలో టాలీవుడ్ చిత్రాలు మాస్ హీరో రవితేజ నటించిన రావణాసుర, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఈ వారంలో విడుదలయ్యే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలేవో తెలుసుకుందాం. రవితేజ రావణాసుర మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ నటింటారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ 'మీటర్' హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ‘ఆగస్టు 16, 1947’ ప్రముఖ దర్శకుడు ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్.ఎస్ పొన్కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. గౌతమ్ కార్తిక్, రిచర్డ్ ఆస్టన్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్సిరీస్లివే నెట్ఫ్లిక్స్ బీఫ్ (వెబ్సిరీస్) -ఏప్రిల్ 6 ఇన్ రియల్ లవ్ -(టీవీ షో) ఏప్రిల్ 6 చుపా (హాలీవుడ్)- ఏప్రిల్ 7 హంగర్ (హాలీవుడ్)- ఏప్రిల్8 జీ5 అయోథి (తమిళం) -ఏప్రిల్ 7 డిస్నీ ప్లస్ హాట్స్టార్ ది క్రాసోవర్ (వెబ్సిరీస్) ఏప్రిల్ 4 బుక్ మై షో బ్యాట్మ్యాన్ (హాలీవుడ్) ఏప్రిల్ 5 కాస్మోస్ (హాలీవుడ్) ఏప్రిల్ 7 -
మహేష్ బాబు థియేటర్ లో టికెట్లు అమ్ముతున్న రావణాసుర టీం
-
'దసరా' హంగామా.. థియేటర్లో ఊరమాస్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. భారీ అంచనాల నడుమ నేడు(గురువారం)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్తో దూసుకుపోతుందీ చిత్రం. నాని మాస్ సీన్స్కు కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియెన్స్ మనసు దోచుకుంటుంది. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇక హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సుదర్శన్ థియేటర్లో సందడి చేశారు. ఆ తర్వాత మరో థియేటర్లో నాని, కీర్తిసురేష్లు అభిమానుల మధ్య సినిమాను వీక్షించి ఎంజాయ్ చేశారు. ఇక నాని, కీర్తిసురేష్లను చూసేందుకు, వాళ్లతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. Oora Mass Performance @NameisNani ❤️ Normal story with Best Cinematography , Top Notch BGM 🔥 @Music_Santhosh @KeerthyOfficial Mahanati 🙏@odela_srikanth nachindi anna ni Taking ✨#Dasarareview #dasara #DasaraOnMarch30th #Nani #Sudarshan35MM pic.twitter.com/XyN4AOEZHJ — Rowdy Nani (@Rowdyfan_Nani) March 30, 2023 -
ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్కు రెడీ
జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్కు చేరువలో ఉంది. హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్తో పాటు ఇతర నటీనటులు ఆర్ఆర్ఆర్పై ప్రశంసలు కురిపించారు. చదవండి: ఆ గుడ్న్యూస్ని ముందు తారక్తో పంచుకున్నా: రామ్ చరణ్ ఇందులోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్గా సాంగ్ కేటగిరీలో ఆస్కార్కు పోటీపడుతోన్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముందే ఆర్ఆర్ఆర్ మూవీని మళ్లీ భారీ స్థాయిలో రిరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది ఇండియాలో మాత్రం కాదు. అమెరికన్ థియేటర్లో. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్కు చుక్కెదురు! అక్కడ దాదాపు 200 థియేటర్లలో రిరిలీజ్ చేస్తున్నట్లు యూఎస్ ఆర్ఆర్ఆర్ డిస్ట్రీబ్యూషన్ సంస్థ వేరియెన్స్ ఫిలింస్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఈ ప్రకటన ఇచ్చింది. ఈ కొత్త ట్రైలర్లో పలు యాక్షన్ సీన్స్, నాటు నాటు పాటతో పాటు హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్ట్ సహా అంతర్జాతీయంగా ఈ సినిమా అందుకున్న అన్ని ప్రశంసల క్లిప్పింగ్స్ జత చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 3న అమెరికాలో 200 థియేటర్లో రిరిలీజ్ కానుండటం విశేషం. #RRR FINAL TRAILER Let the CelebRRRation begin! S.S. Rajamouli's masterpiece #RRRMovie is roaring back to over 200 theaters nationwide starting March 3rd. Tickets and theater list here: https://t.co/VUSJeHFLGW #RRRforOscars @sarigamacinemas pic.twitter.com/5xtqbQFKjJ — Variance Films (@VarianceFilms) February 22, 2023 -
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!
జనవరిలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసిపోయింది. పెద్ద హీరోల చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఫిబ్రవరిలోనూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారంలో కల్యాణ్ రామ్ అమిగోస్ విడుదలవుతోంది. అలాగే ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వచ్చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. కల్యాణ్రామ్ అమిగోస్ నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 10న రిలీజ్ చేయనున్నారు. కన్నడ మూవీ వేద కన్నడ హీరో శివ రాజ్కుమార్ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. పాప్కార్న్ ఆవికా గోర్, సాయి రోనక్ జంటగా నటించిన చిత్రం పాప్ కార్న్. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించగా.. భోగేంద్రగుప్త నిర్మించారు. మురళీగంధం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఐపీఎల్: ఇట్స్ ప్యూర్ లవ్ విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఐపీఎల్. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. బీరం శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. దేశం కోసం భగత్ సింగ్ రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్, జీవా, సుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం దేశం కోసం భగత్ సింగ్. ఈ సినిమాకు రవీంద్ర గోపాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటరల్లో సందడి చేయనుంది. చెడ్డి గ్యాంగ్ తమాషా సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మించారు. ఈ వారం ఓటీటీ చిత్రాలు/ వెబ్సిరీస్లు నెట్ఫ్లిక్స్ తునివు/తెగింపు- ఫిబ్రవరి 8, 2023 డిస్నీ+హాట్స్టార్ రాజయోగం- ఫిబ్రవరి 09, 2023 అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్సిరీస్: ఫర్జీ- ఫిబ్రవరి 10, 2023 ఆహా కళ్యాణం కమనీయం- ఫిబ్రవరి 10, 2023 ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు నెట్ఫ్లిక్స్ బిల్ రస్సెల్: లెజెండ్ (వెబ్సిరీస్) ఫిబ్రవరి 8 ద ఎక్స్ఛేంజ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 8 యు (వెబ్సిరీస్-4) ఫిబ్రవరి 9 డియర్ డేవిడ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 9 యువర్ ప్లేస్ ఆర్ మైన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10 టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్మాన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10 డిస్నీ+హాట్స్టార్ నాట్ డెడ్ ఎట్ (వెబ్సిరీస్) ఫిబ్రవరి 09 హన్నికాస్ లవ్ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10 సోనీలివ్ నిజం విత్ స్మిత (టాక్ షో) ఫిబ్రవరి 10 -
ఈ వారం థియేటర్/ఓటీటీలో రానున్న సినిమాలివే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఆ తర్వాత చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్కు సిద్ధమైన సినిమాలేవో ఓసారి చూసేద్దాం. సందీప్ కిషన్- మైఖేల్ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహాస్- రైటర్ పద్మభూషణ్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జయప్రద- సువర్ణ సుందరి సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రేమదేశం త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. బుట్టబొమ్మ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్సిరీస్లు నెట్ఫ్లిక్స్ పమీలా (హాలీవుడ్) జనవరి 31 గంతర్స్ మిలియన్స్ (వెబ్సిరీస్) ఫిబ్రవరి 1 క్లాస్ (వెబ్సిరీస్- సీజన్-1) ఫిబ్రవరి 3 ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3 ఇన్ఫయీస్టో (హాలీవుడ్) ఫిబ్రవరి 3 స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3 వైకింగ్ ఊల్ఫ్ ఫిబ్రవరి 3 డిస్నీ+హాట్స్టార్ బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 1 సెంబి (తమిళ్) ఫిబ్రవరి 3 ఆహా అన్స్టాపబుల్ సీజన్-2 విత్ ఎన్బీకే- ఫిబ్రవరి 3 ముఖచిత్రం(తెలుగు)- ఫిబ్రవరి 3 కపుల్ ఆన్ బ్యాక్ట్రాక్( కొరియన్ మూవీ ఇన్ తెలుగు)- ఫిబ్రవరి 4 కామెడీ స్టాక్ ఎక్సేంజ్- ఫినాలే ఎపిసోడ్- ఫిబ్రవరి 4 సోనీలివ్ జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) ఫిబ్రవరి 3 -
Waltair Veerayya : ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
థియేటర్లలో పాప్ కార్న్ 500 రూపాయలా..?
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఓ ఆసక్తికర అంశంపై మాట్లాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సమావేశంలో ఆయన తన మాటలతో కాసేపు నవ్వులు పూయించారు. యూపీలో షూటింగ్లు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాలీవుడ్ ప్రముఖులతో ముంబైలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు జాకీ ష్రాఫ్ సీఎం యోగిని అభ్యర్థించారు. థియేటర్లలో పాప్కార్న్ ధరను తగ్గించాలని జాకీ ష్రాఫ్ యోగి ఆదిత్యనాథ్ను కోరారు. పాప్కార్న్ 500 రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. 'థియేటర్లలో పాప్కార్న్ కోసం రూ.500 తీసుకుంటున్నారు. దయచేసి పాప్కార్న్ ధర తగ్గించండి. సినిమా తీస్తున్నాం. స్టూడియోలు కడుతున్నాం. కానీ సినిమా టికెట్ కంటే ఎక్కువగా పాప్ కార్న్ ధరలు ఉంటే థియేటర్కు వచ్చేదేవరు?' అని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఉత్తరప్రదేశ్లోని సినిమాల షూటింగ్పై హిందీ చిత్రనిర్మాతలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. CM योगी से बोले जैकी श्रॉफ़- घर का खाना चाहिए तो मिल जाएगा. थिएटर में पॉपकॉर्न की कीमत कम करो. pic.twitter.com/dqXFXXhrPo — UnSeen India (@USIndia_) January 6, 2023 -
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పవన్ అభిమానుల అత్యుత్సాహం
-
జగ్గయ్య పేటలో పవన్ అభిమానుల అత్యుత్సాహం
ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని జగ్గయ్యపేటలోని ఓ థియేటర్లో పవన్ కల్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా థియేటర్లో భోగి మంట వేసి అలజడి రేపారు. డిసెంబర్ 31వ తేదీన ఖుషీ సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్లో అభిమానులు భోగి మంటలు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రదర్శన సమయంలో ధియేటర్ లోనే పేపర్లతో మంటలు వేశారు పవన్ అభిమానులు. స్క్రీన్ దగ్గర మంటలు వేసి డాన్సులు చేశారు. థియేటర్లో మంట ఎందుకు వేసారని ప్రశ్నించిన యజమానిపై పవన్ కల్యాణ్ అభిమానులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై థియేటర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..!
క్రిస్మస్ సందర్భంగా ఈవారం థియేటర్లకు కొత్త సినిమాలు క్యూ కట్టాయి. సినీ ప్రేక్షకులకు విందు పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే జేమ్స్ కామెరూన్ 'అవతార్-2' థియేటర్లలో అలరిస్తోంది. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: రవితేజ 'ధమాకా' ట్రైలర్ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది) రవితేజ 'ధమాకా': మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. 18 పేజెస్ లవ్ స్టోరీ: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 23న ప్రేక్షకులను అలరించనుంది. 'లాఠీ'తో వస్తున్న విశాల్: విశాల్ తాజా చిత్రం 'లాఠీ'. సునయన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు ముఖ్య పాత్ర పోషించారు. ఆర్. వినోద్ కుమార్ను దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నటులు నందా, రమణ కలిసి రాణా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ భారీ చిత్రానికి సుబ్రమణ్యం చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. నయన్తో కనెక్ట్: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో లేటెస్ట్ హార్రర్ చిత్రం 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ‘సర్కస్’ రణ్వీర్ సింగ్, పూజాహెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, బాద్షా, లీజో జార్జ్ సంగీతమందించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 23 విడుదల కానుంది. ఓటీటీకీ రెడీ అయిన చిత్రాలు ♦ ఆహా ►'మసూద'- డిసెంబర్ 21 ♦ నెట్ఫ్లిక్స్ ► జయ జయ జయ జయహే-డిసెంబర్ 22 ♦ వెబ్సిరీస్లు నెట్ఫ్లిక్స్ ఎమిలి ఇన్ పారిస్ - డిసెంబరు 21 ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్ - డిసెంబరు 22 గ్లాస్ ఆనియన్: నైవ్స్ అవుట్ మిస్టరీ - డిసెంబరు 23 ద ఫాబ్యూలస్ - డిసెంబరు 23 ద టీచర్ - డిసెంబరు 23 అమెజాన్ ప్రైమ్ టామ్ క్లాన్సీస్ జాక్ ర్యాన్- డిసెంబరు 21 జీ5 షడ్యంత్ర -డిసెంబరు 18 పిచర్స్ -డిసెంబరు 23 డిస్నీ+హాట్స్టార్ బిగ్బెట్ - డిసెంబరు 21 సోనీ లివ్ కాఠ్మాండు కనెక్షన్ - డిసెంబరు 23 తారా వర్సెస్ బిలాల్- డిసెంబరు 23 -
Avtar 2: అవతార్-2 కోసం భారీ త్రీడీ తెర.. ఏ థియేటర్లో అంటే?
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): అవతార్ –2 చిత్రం ఈనెల 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని శైలజా థియేటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా భారీ త్రీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మంగళవారం థియేటర్లో ఏర్పాటు చేసిన త్రీడీ స్క్రీన్ను మేనేజర్ బాబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్– 2 సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను కనువిందు చేసేందుకు త్రీడీ తెర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి నిపుణుల పర్యవేక్షణలో థియేటర్లో అమర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2.6 గైన్ నుంచి 3.8 గైన్ స్క్రీన్ అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. అవతార్ సినిమాకు బుకింగ్ ప్రారంభించామని, రోజూ ఐదు షోలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. చదవండి: అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్ -
టికెట్ ధరలు అలా ఉంటేనే ఇండస్ట్రీకి మంచిది: బాలకృష్ణ
సినిమా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటేనే చిత్రపరిశ్రమకు మంచిదని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్లో కాచిగూడలో తారకరామ థియేటర్ను ఆయన పునః ప్రారంభించారు. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, నందమూరి తారక రామారావుపై అభిమానంతో 'ఏషియన్ తారకరామ' థియేటర్ను పునరుద్ధరించారు. ఇవాళ 'ఏషియన్ తారకరామ' థియేటర్ను బాలకృష్ణతో పాటు ప్రొడ్యూసర్ శిరీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ' మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడైన ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా నా అభినందనలు. తారకరామ థియేటర్కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. 1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ ప్రారంభించడం జరిగింది. సునీల్ నారంగ్ అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైన విషయం. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ ఉంది. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది.' అని అన్నారు సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. 'మహనీయుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ థియేటర్ ఉంది. బాలకృష్ణ థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. సరి కొత్త టెక్నాలజీతో థియేటర్ అద్భుతంగా నిర్మించాం. 600 సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రిజనబుల్గానే పెట్టాం. మా నాన్న, ఎన్టీఆర్ చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
హైదరాబాద్లోని కాచిగూడ తారకరామ థియేటర్ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్ తారకరామ పేరుతో డిసెంబర్ 14న ఈ థియేటర్ గ్రాండ్గా రీఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ పున:ప్రారంభించనున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్ను రెనొవేట్ చేయించారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్తో పాటు, సీటింగ్లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ. భరత్ నారంగ్, సురేశ్ బాబు సదానంద గౌడ్లు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్కు వర్మ గట్టి కౌంటర్ పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టేనా? యామీ గౌతమ్ ఏమన్నదంటే.. -
సూపర్స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి
సాక్షి, విజయవాడ: సూపర్స్టార్ కృష్ణకు నవరంగ్ థియేటర్ యాజమాన్యం ఘననివాళులు అర్పించింది. విజయవాడలో గల ఈ థియేటర్కు కృష్ణ గతంలో అనేకమార్లు వచ్చారు. ఈనేపథ్యంలో సూపర్స్టార్ కృష్ణ కోసం థియేటర్ యాజమాన్యం రోజు మొత్తం ఒక సీటు రిజర్వ్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంది. సూపర్ కృష్ణ మృతికి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు సైతం ఘన నివాళి అర్పించారు. ఆయన అకాల మృతికి సంతాపంగా మంగళవారం(నవంబర్ 15) పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్లో ఉదయం ఆటలను రద్దు చేసినట్లు జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తెలిపారు. ఇదిలాఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈమేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్కు సీఎం జగన్) -
ఈ వారంలో థియేటర్లు, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే
సినీ ప్రేక్షకులకు ఈ వారం మరింత వినోదం అందనుంది. మిమ్మల్ని అలరించేందుకు ప్రతి వారంలాగే కొత్త కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో అగ్రహీరోల చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీకి రానున్న చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. భయపెట్టేందుకు సిద్ధమైన 'మసూద'..!: సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ కథతో వస్తున్న‘గాలోడు’ సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఉత్కంఠభరిత కథతో..: ఎన్.రావన్రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. ఈ చిత్రానికి ఫణి కల్యాణ్ సంగీతమందిస్తున్నారు. రెడ్డి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ దబ్బుగొట్టు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. విలేజ్ బ్యాక్డ్రాప్ ప్రేమ కథ: శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. హిందీలో దృశ్యం-2..: అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్సిరీస్లివే మెగాస్టార్ ‘గాడ్ఫాదర్’: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈనెల 19 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. రాజ్తరుణ్ 'పెళ్లి సందడి': రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్సిరీస్కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీకి కార్తి థ్రిల్లర్ మూవీ: కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈనెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు /వెబ్సిరీస్లు నెట్ఫ్లిక్స్ ది వండర్ (హాలీవుడ్) నవంబరు 16 1899 (హాలీవుడ్) నవంబరు 17 రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబరు 17 ఇలైట్ (హాలీవుడ్) నవంబరు 18 స్లంబర్ల్యాండ్( హాలీవుడ్) నవంబరు 18 అమెజాన్ ప్రైమ్ వీడియో హాస్టల్డేజ్ సీజన్-3 (వెబ్సిరీస్-హిందీ) నవంబరు 16 ది సెక్స్లైవ్స్ ఆఫ్ కాలేజ్గర్ల్స్ (వెబ్సిరీస్) నవంబరు 18 డిస్నీ+హాట్స్టార్ ఇరవతం (తమిళ్/తెలుగు) నవంబరు 17 సీతారామం (తమిళ్) నవంబరు 18 సోనీ లివ్ అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబరు 18 వండర్ ఉమెన్ (తెలుగు) నవంబరు 18 -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
ప్రతి వారం కొత్త సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరోల హడావుడి కనిపంచడం లేదు. గతవారం రిలీజ్ అయిన చిత్రాల్లో ఊర్వశివో రాక్షసివో మంచి విజయం సాధించింది. ఇక ఈ వారం స్టార్ హీరోయిన్ సమంత చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అంతేకాదు పలు వెబ్ సరీస్లు, సినిమాలు కూడా ఓటీటీకి రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలోకి రాబోయే సినిమాలేంటో చూద్దాం! సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావూ రమేశ్తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. అమితాబ్బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊంచాయి’. ప్రేమ కథ నిండిన కుటుంబ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శక-నిర్మాత సూరజ్ బర్జాత్య దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక విభిన్న కథతో రూపొందిన ఈ చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెన్నీఫర్ హీరోయిన్. డా. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక రోజులో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమకథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన చిత్రం ‘మది’. నాగధనుష్ దర్శకత్వం వహించారు. రామ్కిషన్ నిర్మాత. పీవీఆర్ రాజా స్వరకర్త. యువతరానికి నచ్చే మంచి కథతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ‘మది’లో ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 11న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు అమెజాన్ ప్రైమ్: బ్రీత్ : ఇన్ టు ది షాడోస్ (హిందీ సిరీస్2) నవంబరు 9 ఇరావిన్ నిగళ్ (తమిళ చిత్రం) నవంబరు 11 సిక్సర్ (హిందీ సిరీస్) నవంబరు 11 డిస్నీ పస్ల్ హాట్స్టార్: సేవ్ ఔర్ స్క్వాడ్ (ఒరిజినల్ సిరీస్) నవంబరు 09 మనీ మాఫియా (హిందీ సిరీస్3) నవంబరు 10 రోషాక్ (తెలుగు) నవంబరు 11 నెట్ ఫ్లిక్స్: బిహైండ్ ఎవ్రీ స్టార్ (కొరియన్ సిరీస్)- నవంబర్ 8 ద క్లాజ్ ఫ్యామిలీ 2 (డచ్ సిరీస్)- నవంబర్ 8 ట్రివియా వర్స్ (ఇంగ్లీష్) -నవంబర్ 8 ది క్రౌన్ (సిరీస్ 5) ఇంగ్లీష్- నవంబర్ 9 ది సాకర్ ఫుట్ బాల్ (ఇంగ్లీష్)- నవంబర్ 9 ఫిఫా అన్ కవర్డ్(డాక్యుమెంటరీ)-నవంబర్ 9 ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్)-నవంబర్ 10 లాస్ట్ బుల్లెట్ (ఫ్రెంచ్), నవంబర్ 10 వారియర్ నన్ (సిరీస్ 2)-నవంబర్ 10 లవ్ నెవర్ లైస్ (ఇంగ్లీష్)-నవంబర్ 10 ఈజ్ దట్ బ్లాక్ ఎనఫ్ ఫర్ యూ (ఇంగ్లీష్)-నవంబర్ 11 మోనికా ఓ మై డార్లింగ్ (హిందీ)-నవంబర్ 11 సోనీలివ్: తనవ్ – హిందీ సిరీస్- నవంబరు 11 జీ5: ముఖ్ బీర్ (సిరీస్ – హిందీ)-నవంబర్ 11 లయన్స్ గేట్ ప్లే హాట్సీట్ (హాలీవుడ్) నవంబరు 11 -
అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ప్రభాస్ బర్త్డే సందర్భంగా అభిమానులు సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు. రెబల్ పుట్టినరోజు సందర్బంగా బిల్లా సినిమాను పలు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. దీంతో థియేటర్లకు భారీగా చేరుకున్న అభిమానులు దీపావళి పేల్చినట్లు టపాసులు కాల్చి రచ్చ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో బాణాసంచా పేల్చడంతో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. ఫ్యాన్స్ అత్యుత్సాహమే దీనికి కారణం. సీట్లకు మంటలు వ్యాపించడంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు. అయితే ఈ సంఘటనపై తాజాగా సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. తనదైన శైలిలో ప్రభాస్ అభిమానుల చర్యను అభివర్ణించారు. ఇంతకీ ఏమన్నారంటే..! (చదవండి: అరాచకం.. థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ ఫ్యాన్స్) ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్జీవీ ఇలా రాసుకొచ్చారు. ' అక్కడ జరుగుతున్నది దీపావళి వేడుక కాదు. ప్రభాస్ సినిమా తెరపై ప్రదర్శిస్తుండగా థియేటర్లోనే బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకోవడం. ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి చర్య. ఆయన ఫ్యాన్స్ జరుపుకున్న దీపావళి పండుగ స్టైల్ ఇది' అంటూ ట్వీట్ చేశారు. అయితే సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చడంతో యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. Celebrating Diwali #Prabhas fans style https://t.co/ocr0OUEet6 — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2022 No it’s not Diwali celebration ..It’s the madness of #Prabhas fans celebrating by burning a theatre while his film is running on the screen pic.twitter.com/lbYje0t356 — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2022 -
థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ అభిమానులు
-
అరాచకం.. థియేటర్లో బాణాసంచా పేల్చిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ బర్త్డే సందర్భంగా అభిమానులు చేసిన అత్యుత్సాహంతో థియేటర్లో అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా వెంకట్రామ థియేరట్లో బిల్లా సినిమాను రీరిలీజ్ చేశారు. చాలాకాలంగా మూతబడిన ఈ థియేరట్ను అభిమానుల కోరిక మేరకు బిల్లా స్పెషల్ షో వేయించారు. అయితే సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చడంతో సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగుతు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. అయితే షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. Rebels on rampage mode 😎🔥🔥🔥💥#HappyBirthdayPrabhas #Billa4KCelebrations pic.twitter.com/A9IvJ4uKKx — 𝖵𝗂𝗃𝖺𝗒𝖺𝗐𝖺𝖽𝖺 𝖯𝗋𝖺𝖻𝗁𝖺𝗌 𝖥𝖢™ (@VJYPrabhasFC) October 23, 2022 -
ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే
థియేటర్లలో దసరా సందడి ముగిసింది. ఇక దీపావళి హంగామా మొదలు కాబోతోంది. గతవారం చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న బాక్సాఫిస్ దీపావళికి పెద్ద సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వారం జిన్నా, ఓరి దేవుడా వంటి ఆసక్తికర సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలో సైతం థియేటర్లో అలరించిన బ్లాక్బస్టర్ చిత్రాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మొత్తానికి సినీ ప్రియులకు దీపావళి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఇటు థియేటర్లు, అటు ఓటీటీలు ముస్తాబవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీ వచ్చేస్తున్న చిత్రాలేవో చూద్దాం! మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్గా నటించారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్’ (Sardar). రాశీఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు. చుంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో జాతిరాత్నాలు ఫేం అనుదీప్ కేవి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ మూవీ తెరకెక్కింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. విశ్వక్సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. టాలీవుడ్ అగ్ర హీరో విక్టరి వెంకటేశ్ ఈ సినిమాలో అతిథిగా కనిపించనున్నారు. ఇటీవల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21 థియేటర్లోకి రాబోతోంది. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. లియన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 21 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సోని లివ్లో అక్టోబర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ * అమ్ము (తెలుగు) అక్టోబరు 19 * ద పెరిఫెరల్ (వెబ్సిరీస్) అక్టోబరు 21 * ఫోర్ మోర్ షాట్స్ (వెబ్సిరీస్) అక్టోబరు 21 నెట్ఫ్లిక్స్ * ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ (హాలీవుడ్) అక్టోబరు 19 * బార్బేరియన్స్ (వెబ్సిరీస్-2) అక్టోబరు 21 * ఫ్రమ్ స్క్రాచ్ (వెబ్సిరీస్) అక్టోబరు 21 జీ5 * ట్రిప్లింగ్ (హిందీ సిరీస్-3) అక్టోబరు 21 ఆహా * పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21 -
ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
దసరా పండుగ సందర్భంగా గతవారం ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’ వంటి చిత్రాలు థియేటర్లో సందడి చేశాయి. ఇందులో గాడ్ ఫాదర్ బ్లాక్బాస్టర్ విజయం సాధించగా ది ఘోస్ట్, స్వాతిముత్యం చిత్రాలు యావరేజ్గా నిలిచాయి. గత వారం పెద్ద చిత్రాలు ఉండటం చిన్న సినిమాలు ఈ వారం థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. మరి అందులో ఏ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి. అలాగే ఓటీటీలో కూడా పలు పెద్ద సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ అలరించబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్లోకి వచ్చే చిత్రాలేవో ఓసారి చూద్దాం! థియేటర్లో విడుదల కాబోయే వచ్చే సినిమాలు ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆది సాయికుమార్ ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’ చిత్రంతో రాబోతున్నాడు. దర్శకుడు ఫణికృష్ణ సిరికి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 14న విడుదల కానుంది. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్ హీరోయిన్లుగా నటించారు. ‘కేరింత’ ఫేం విశ్వంత్, మాళవిక సతీషన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘బాయ్ఫ్రెండ్ ఫర్ హైర్’. సరికొత్త కథాంశంతో దర్శకుడు కంభంపాటి రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ‘కేజీయఫ్’ సిరీస్ చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణ పొందిన కన్నడ నటుడు యశ్. ఆ క్రేజ్ను దృష్టిని పెట్టుకొని పలువురు నిర్మాతలు యశ్ గతంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అలా.. ‘సంతు.. స్ట్రయిట్ ఫార్వార్డ్’ అనే సినిమా ‘రారాజు’గా తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. ఆయన భార్య రాధిక పండిట్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 14న థియేటర్లో సందడి చేయబోతుంది. మహేశ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ (2016)లో విడుదలై మంచి విజయం అందుకుంది. కన్నడ దర్శక-నిర్మాత, నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతారా’. సెప్టెంబరు 30న కన్నడనాట విడుదలైన ఈ సినిమా రికార్డు సృష్టించింది. దాంతో చిత్ర బృందం ఈ సినిమాని ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది. అలా తెలుగులో కంతారాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటుడు సునీల్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గీతా. దర్శుడకు విశ్వా రావ్ రూపొందించిన ఈ మూవీకి రచ్చయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రముక కమెడియన్ సప్తగిరి, పృథ్వీలు కీ రోల్ పోషించిన ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లో విడుదల కానుంది. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందకు రాబోతోంది. సీనియర్ నటి ఇంద్రజ, సాయికుమార్లు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించాడు. ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు నెట్ఫ్లిక్స్ ది ప్లే లిస్ట్ (అక్టోబరు 13) మిస్ మ్యాచ్చ్డ్ (Miss matched) హీందీ (అక్టోబర్ 14) తాప్సీ దోబారా (అక్టోబర్ 15) సోనీ లివ్ ఈషో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) గుడ్ బ్యాడ్ గర్ల్ (Good bad girl) (అక్టోబర్ 14) అమెజాన్ ప్రైమ్ ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్ (అక్టోబర్ 14) నేను మీకు బాగా కావాల్సిన వాడిని (అక్టోబర్ 14) డిస్నీ+హాట్స్టార్ ఆషికానా సీజన్ 2 హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ 8th ఎపిసోడ్( House of the dragon 8th episode) షి హల్క్ డిస్కవరీ ప్లస్(Discovery+): ది జర్నీ ఆఫ్ ఇండియా(స్ట్రీమింగ్) -
ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ దీపావళి వెలుగులతో మెరవనుంది. యాక్షన్ టపాసులు, ప్రేమ కాకరపువ్వొత్తులు, నవ్వుల చిచ్చుబుడ్డులు ఆడియన్స్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక పండగ సందర్భంగా వస్తున్న సినిమాల వివరాల్లోకి ఓసారి వెళదాం. దీపావళికి యాక్షన్ ‘జిన్నా’గా వస్తున్నారు మంచు విష్ణు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ఓ టెంట్ హౌస్ను రన్ చేసే జిన్నా అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు మంచు విష్ణు. తన వాళ్ల కోసం జిన్నా ఎలాంటి రిస్క్లు తీసుకున్నాడు? ఎవరి రాక కారణంగా జిన్నా లైఫ్ టర్న్ అయ్యింది? అనేది సినిమా కథ. డా. మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. మరోవైపు ‘ఓరి దేవుడా..!’ అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేశ్ నటించారు. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగుకి పరిచయమవుతున్న చిత్రం ఇది. ‘వైఫ్లో ఫ్రెండ్ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండే వైఫ్లా వచ్చిందా..!’ అనే డైలాగ్ ‘ఓరి దేవుడా..!’ ట్రైలర్లో ఉంది. సో.. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ యువకుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఇక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ ‘సర్దార్’గా రానున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా చేయగా, కీలక పాత్రలో లైలా నటించారు. ఓ గూఢచారి చేసే పోరాటం నేపథ్యంలో ‘సర్దార్’ సాగుతుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జిన్నా’, ఓరి దేవుడా..!’, ‘సర్దార్’ చిత్రాలు రిలీజ్ అవుతున్న రోజునే ‘ప్రిన్స్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకుడు. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్గా చేశారు. ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది. సునీల్ నారంగ్, డి. సురేబాబు, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ను విజయ్ దేవరకొండ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు దీపావళికి కన్ఫార్మ్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు పండగ రేసులో నిలిచే అవకాశం ఉంది. -
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే..!
దసరా సెలవుల్లో వినోదం పంచేందుకు సినిమాలు వరుస కట్టేశాయి. స్కూళ్లు, కాలేజీలకు వరుస హాలీడేస్ రావడంతో థియేటర్లకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం రండి. ధనుష్ నేనే వస్తున్నా: తమిళ స్టార్ ధనుష్ నటించిన చిత్రం 'నానే వరునెన్'. తెలుగులో ఈ సినిమా 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ సినిమాలో ఇలి అవ్రామ్, ఇందుజా, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1: భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో రూపొందించిన మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 30న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది. హృతిక్ రోషన్ మూవీ విక్రమ్ వేద: బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. ఈ సినిమాకు పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించగా.. సీఎస్ సామ్ సంగీతమందించారు. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు/ వెబ్ సిరీస్లు ఇవే: నెట్ఫ్లిక్స్ బ్లోండీ సెప్టెంబరు 28 ప్లాన్ ఏ ప్లాన్ బి సెప్టెంబరు 30 జీ5 బుల్లెట్ ట్రైన్ సెప్టెంబరు 29 కెప్టెన్ సెప్టెంబరు 30 సోనీ లివ్ కోబ్రా సెప్టెంబరు 28 అమెజాన్ ప్రైమ్ వీడియో 777 చార్లీ సెప్టెంబరు 30 డిస్నీ+హాట్ స్టార్ కర్మయుద్ధ్ సెప్టెంబరు 30 హాకస్ పోకస్ 2 -
సంధ్య థియేటర్లో మెగా హీరో రచ్చ.. వీడియో వైరల్
మెగా మేనల్లుడు, ‘సుప్రీమ్’ హీరో సాయి ధరమ్ తేజ్ థియేటర్లో రచ్చ రచ్చ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ రోజు(సెప్టెంబర్ 2న) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా పవన్ సూపర్ హిట్ చిత్రాలైన తమ్ముడు, జల్సా సినిమాలను పలు థియేటర్లో రీరిలీజ్ చేస్తూ స్పెషల్ షోలను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లోకి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ నేడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో జల్సా స్పెషల్ షోను ప్రదర్శించారు. చదవండి: లైగర్ ఫ్లాప్.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్ ఈ సందర్భంగా మేనమామ చిత్రాన్ని చూసేందుకు థియేటర్కు వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యాన్స్తో కలిసి థియేటర్లో రచ్చ చేశాడు. తెరపైకి కాగితాలు విసురుతూ సినిమాను సాధారణ అభిమానిగా తేజ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఆయన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్ ఎన్నో సందర్భాల్లో తాను పవన్ కల్యాణ్కి వీరాభిమానిని అని చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ట్రెడిషనల్ లుక్లో తారక్ భార్య, కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రణతి Fan Boy @IamSaiDharamTej Anna❤️❤️❤️❤️#HBDJanasenani #HBDJanasenaniPawanKalyan#PSPK #Jalsa4KCelebrations #SaiDharamTej pic.twitter.com/be6WsgGm6c — Bhavani (@Bhavani00285593) September 2, 2022 -
పవన్ కల్యాణ్ అభిమానుల బీభత్సం
-
పవన్ ఫ్యాన్స్ బీభత్సం.. బీర్ బాటిల్స్తో థియేటర్లో అరాచకం
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో పవన్ అభిమానులు బీభత్సం సృష్టించారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా వైజాగ్లోని లీలా మహల్ థియేటర్లో జల్సా సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ షోను ప్రదర్శించారు. అయితే థియేటర్లో హంగామా సృష్టించిన పవన్ ఫ్యాన్స్ బీర్ బాటిల్స్ పగలకొట్టి స్క్రీన్ చించేశారు. సీట్లు ధ్వంసం చేయడంతో పాటు సీలింగ్ కూడా డామేజ్ చేశారు. పేపర్ ముక్కలు, గాజు పెంకులతో ప్రస్తుతం థియేటర్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో థియేటర్ యాజమాన్యం గగ్గోలు పెడుతోంది. పవన్ అభిమానులు చేసిన ఈ అరాచకానికి సుమారు రూ. 20 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. -
థియేటర్పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం
పవర్స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు కర్నూలులోని శ్రీరామ థియేటర్పై దాడికి దిగారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ థియేటర్లో 'జల్సా' సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ సినిమా చూసేందుకు అక్కడికి వచ్చారు. అయితే థియేటర్లో సౌండ్ సిస్టం సరిగాలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా పవన్ నేడు 51 వసంతంలోకి అడుడుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ 'హరిహరి వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. -
షాకింగ్: నిర్మాత సురేష్ బాబు ఆ థియేటర్ను అమ్మేశారా?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన డిస్ట్రిబ్యూటర్గా సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా సురేష్ బాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. వైజాగ్లోని జ్యోతి అనే ప్రముఖ థియేటర్ను ఆయన అమ్మేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు కొత్త సినిమాలు రిలీజైతే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సూపర్ సూపర్ హిట్ అనే టాక్ వస్తే తప్పా జనాలు థియేటర్లకు రాని పరిస్థితి. ఓటీటీ వినియోగం పెరగిపోవడంతో ప్రేక్షకులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే పలు థియేరట్లు మూతపడ్డాయి. తాజాగా సురేష్ బాబు సైతం ఓ థియేటర్ను అమ్మేసినట్లు సమాచారం. వైజాగ్లో ఐకానిక్ థియేటర్గా పేరున్న అలాంటి థియేటర్ను సురేష్ బాబు అమ్మేసినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. -
విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన అనన్య పాండే
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పూరి కనెక్ట్స్ ,ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో లైగర్పై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో భారీ అంచనాల మధ్య నేడు(గురువారం)లైగర్ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసేందుకు విజయ్, అనన్య హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లారు. వీళ్లు ఎంట్రీ కాగానే ఆడియెన్స్ థియేటర్లో రచ్చరచ్చ చేశారు. విజిల్స్ వేస్తూ పేపర్లు చింపుతూ హంగామా సృష్టించారు. దీంతో విజయ్ క్రేజ్ చూసిన అనన్య పాండే కాస్త భయపడినట్లుంది. కాస్త కంగారుగానే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఈ వారం విడుదలకు రెడీ అయిన చిన్న సినిమాలు
సమ్మర్ తర్వాత విడుదలైన పలు సినిమాలు చప్పగా ఉంటూ సినీప్రియులను ఉసూరుమనిపించాయి. దీంతో జనాలు ఆగస్టు వైపు ఆశగా ఎదురు చూశారు. వారి ఆశలకు మించిన చిత్రాలను అందించింది టాలీవుడ్ చిత్రపరిశ్రమ. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. ఇక ఈ చిత్రాల స్ఫూర్తితో ఆగస్టు మూడో వారంలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి మరి కొన్ని సినిమాలు. అయితే ఈ వారం అన్ని చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, సిరీస్లు ఏంటో ఓ లుక్కేద్దామా ! 1. తిరు- ఆగస్టు 18 2. తీస్ మార్ ఖాన్- ఆగస్టు 19 3. వాంటెడ్ పండుగాడ్- ఆగస్టు 19 4. అం.. అః- ఆగస్టు 19 5. మాటరాని మౌనమిది- ఆగస్టు 19 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు/సిరీస్లు నెట్ఫ్లిక్స్: ►రాయల్టీన్- ఆగస్టు 17 ►లుక్ బోత్ వేస్- ఆగస్టు 17 ►హీ-మ్యాన్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 18 ►టేకేన్ బ్లడ్ లైన్ (యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 18 ►ది నెక్ట్స్ 365 డేస్- ఆగస్టు 19 ►ఎకోస్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 19 ►ది గర్ల్ ఇన్ ది మిర్రర్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 19 ►యాడ్ ఆస్ట్రా- ఆగస్టు 20 ►ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 20 ►షెర్డిల్- ఆగస్టు 20 డిస్నీ ప్లస్ హాట్స్టార్: ►షి హల్క్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- ఆగస్టు 17 ►హెవెన్- ఆగస్టు 19 ►హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 22 జీ 5: ►దురంగ (వెబ్ సిరీస్)- ఆగస్టు 19 ►యానై- ఆగస్టు 19 ఆహా: ►హైవే- ఆగస్టు 19 ►జీవీ 2- ఆగస్టు 19 సోనీ లివ్: ►తమిళ్ రాకర్స్- ఆగస్టు 19 చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి -
అది చూసి బాధనిపించింది, థియేటర్కు వెళ్లడం మానేశా: చై
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా ద్వారా నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాలరాజుగా కీలక పాత్రలో కనిపించిన చై తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని చెప్పిన చె కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతో బాధపెట్టిందని తెలిపాడు. 'నా ఫస్ట్ మూవీ జోష్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల రెస్పాన్స్ చూడాలన్న ఉద్దేశంతో ఎంతో ఉత్సాహాంగా ఫస్ట్డే ఓ థియేటర్కి వెళ్లా. సినిమా మొదలైనప్పుడు బానే ఉంది కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి చాలామంది ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్ల నుంచి బయటికి వెళ్లిపోవడం చూశా. అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. అప్పుడు చాలా బాధనిపించింది. అప్పటి నుంచి నేనెప్పుడూ థియేటర్కు వెళ్లలేదు. ఆరోజు జరిగిన సంఘటన నా మైండ్లోంచి ఇంకా పోలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్కి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటాన్నా' అని చై చెప్పుకొచ్చాడు. -
ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్లు ఇవే..
Upcoming Movies Web Series July Last Week: సినీ ప్రియుల కోసం ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలో అలరిస్తుంటాయి. సమ్మర్లో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ సందడి చేయగా తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే జులై చివరి వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో మేం ఉన్నామంటూ సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్లు ఏంటో ఓ లుక్కేద్దామా ! 1 విక్రాంత్ రోణ- జులై 28, 2022 2. ది లెజెండ్- జులై 28, 2022 3. రామారావు ఆన్ డ్యూటీ- జులై 29, 2022 4. ఏక్ విలన్ రిటర్న్స్- జులై 29, 2022 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్లు అమెజాన్ ప్రైమ్ వీడియో 1. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్- జులై 26 2. ది బ్యాట్ మ్యాన్- జులై 27 3. బిగ్ మౌత (వెబ్ సిరీస్)- జులై 29 డిస్నీ ప్లస్ హాట్స్టార్ 1. అదమస్ (వెబ్ సిరీస్)- జులై 27 2. గుడ్ లక్ జెర్రీ- జులై 29 3. 19 (1) (ఎ)- జులై 29 నెట్ఫ్లిక్స్ 1. ది మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఆన్ ది ఇంటర్నెట్ (వెబ్ సిరీస్)- జులై 27 2. డ్రీమ్ హోమ్ మేకోవర్ (వెబ్ సిరీస్)- జులై 27 3. కీప్ బ్రీతింగ్ (వెబ్ సిరీస్)- జులై 28 4. మసాబా మసాబా (వెబ్ సిరీస్)- జులై 29 5. పర్పుల్ హార్ట్స్ (వెబ్ సిరీస్)- జులై 29 1. షికారు- జులై 29 (ఆహా) 2. పేపర్ రాకెట్- జులై 29 (జీ5) 3. 777 చార్లీ- జులై 29 (వూట్) -
సర్ప్రైజ్ విజిట్.. థియేటర్స్లో సాయిపల్లవి సందడి
న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేడీ పవర్ స్టార్గా సాయిపల్లవికి క్రేజ్ ఉంది. రీసెంట్గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గార్గి' సినిమా ఈనెల 15న విడుదలైన సంగతి తెలిసిందే. గౌతమ్ రామచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం థియేటర్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రెస్పాన్స్ను స్వయంగా చూసేందుకు సాయిపల్లవి థియేటర్స్లో సందడి చేసింది. చెన్నై, హైదరాబాద్లోని పలు థియేటర్లకు వెళ్లిన ఆమె ఫ్యాన్స్తో కలిసి సినిమాను చూడటమే కాకుండా, వారితో కాసేపు సరదాగా ముచ్చటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Good to see @Sai_Pallavi92 owning and promoting #Gargi She is doing theatre visits, not only in Chennai but also in Hyderabad.. Presented by @2D_ENTPVTLTD Release by @SakthiFilmFctry Produced by @blacky_genie@Suriya_offl #Jyotika @prgautham83 pic.twitter.com/ZI2BJBKAdq — Ramesh Bala (@rameshlaus) July 17, 2022 -
బర్త్డే స్పెషల్: సూర్య ఫ్యాన్స్కు క్రేజీ సర్ప్రైజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు గుడ్న్యూస్. ఆయన నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ఇప్పుడు అభిమానుల కోసం థియేటర్లో విడుదల కానున్నాయి. లాక్డౌన్ టైమ్లో డైరెక్ట్గా డిజిటల్ రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం సూర్య కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఇక గతడాది సూర్య నటించి మరో చిత్రం ‘జై భీమ్’ సైతం ఓటీటీలో విడుదలైన దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు బిగ్ స్క్రీన్పై సందడి చేయనున్నాయి. జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులోని థియేటర్స్లో జులై 22 నుంచి రెండు రోజుల వరకు ప్రత్యేకంగా ఈ చిత్రాలు స్క్రీనింగ్ కానున్నాయి.దీంతో పాటు తమిళనాడు వ్యాప్తంగా సూర్య అభిమానులు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ఈవారం థియేటర్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఓటీటీలు వచ్చాక సినీ లవర్స్ పెరిగిపోయారు. మొన్నటి దాకా థియేటర్లలో ఆదరించిన సినిమాలను ఓటీటీలో కూడా రిపీటెడ్గా చూస్తూ ఆదరిస్తున్నారు. ఇందుకు ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2, విక్రమ్ సినిమాలే ఉదాహరణ. అయితే విక్రమ్, మేజర్ తర్వాత అంత పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు. ఈ వారం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితోపాటు పలు సినిమాలు థియేటర్లో అలరించేందుకు సిద్ధమయ్యాయి. ది వారియర్ రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి విలన్గా నటించనుండగా, హీరోయిన్గా కృతిశెట్టి అలరించనుంది. అక్షరా గౌడ, నదియ తదితరులు మరో కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గార్గి ఇటీవల 'విరాట పర్వం'తో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి మరోసారి తన నటనతో ఆకట్టుకునేందుకు 'గార్గి' చిత్రంతో రానుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. జులై 15న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అమ్మాయి: డ్రాగన్ గర్ల్ సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'అమ్మాయి: డ్రాగన్ గర్ల్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్, లవ్ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అభిమన్యు సింగ్, మియా ముఖి తదితరులు నటించగా, పాల్ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు. జులై 15న విడుదల కానుంది. మై డియర్ భూతం ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్ర్ ప్రభుదేవా భూతంగా అలరించేందుకు సిద్ధంగా ఉన్న మూవీ 'మై డియర్ భూతం'. ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్ నటించిన ఈ చిత్రానికి ఎస్. రాఘవన్ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించగా, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జులై 15న రిలీజ్ కానుంది. హిట్: ది ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్గా నటించి హిట్టు కొట్టిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. ఈ సినిమాను ఇదే టైటిల్తో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు. రాజ్ కుమార్ రావు, సాన్య మల్హోత్ర, దలిప్ తహిల్, శిల్ప శుక్ల నటించిన ఈ మూవీ ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. హైవేపై మిస్ అయిన ఓ అమ్మాయి ఏమైంది ? అనే కథతో సినిమా రూపొందింది. ఇక ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ల కోసం స్పీడు మీదున్న ఓటీటీలు, ఈ వారం కొత్త సినిమాలివే! క్లిక్ చేయండి. -
పందిపిల్ల ఇతివృత్తంతో కమెడియన్ మూవీ.. థియేటర్లలో సందడి
చెన్నై సినిమా: 'పన్నికుట్టి' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త దర్శకుడు అను చరణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో కమెడియన్ యోగిబాబు, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించారు. సమీర్ భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్ పొంది శుక్రవారం (జులై 8) విడుదల చేసింది. వినోదం మేళవించిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. యోగిబాబు కామెడీ పంచ్ డైలాగ్స్కు ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. నటుడు కరుణాకరన్ నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పందిపిల్ల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే కరుణాకరన్ వాటి నుంచి బయటపడేందుకు ఒక స్వామిజీని ఆశ్రయిస్తాడు. ఆయన ఏం చేశాడు? కరుణాకరన్ సమస్యల నుంచి బయటపడ్డాడా? అంశాలకు దర్శకుడు హాస్యాన్ని జోడించి చిత్రాన్ని జనరంజకంగా తీర్చి దిద్దారు. నమ్మకమే జీవితం అనే చక్కని సందేశంతో కూడిన ఈ చిత్రం థియేటర్లలో వినోదాలు విందులో సందడి చేస్తోంది. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ నితిన్కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ -
సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం..
పళ్లిపట్టు: షోళింగర్ బస్టాండ్ సమీపంలోని సుమతి మినీ సినిమా థియేటర్లో సోమవారం (జులై 4) అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో మంటలు వేగంగా చుట్టుముట్టాయి. షోళింగర్, అరక్కోణం, రాణిపేట పరిసర ప్రాంతాల నుంచి పదికి పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో థియేటర్లోని కుర్చీలు, స్క్రీన్, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? కోమాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి.. 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు -
ఈవారం అలరించే సినిమాలు / సిరీస్లు..
Upcoming Theatre OTT Movies Web Series July 1st Week 2022: థియేటర్లలో సినిమా రీల్ తిరిగినట్లుగా సమయం గిర్రున తిరుగుతోంది. అలా చూస్తుండగానే 2022 అర్ధభాగం పూర్తయింది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పాన్ ఇండియా, మల్టీ స్టారర్ సినిమాలు ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ సందడితోనే 2022 సగభాగం ముగిసింది. ఇక ఇంకోభాగం మిగిలి ఉంది. ఈ క్రమంలోనే జులై మొదటి వారంలో అలరించేందుకు సిద్ధమవుతున్న ఓటీటీ, థియేటర్ సినిమాలు, సిరీస్లేంటో చూసేద్దామా ! 1. గోపీచంద్ 'పక్కా కమర్షియల్'- జులై 1 2. మాధవన్ 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'- జులై 1 3. సందీప్ మాధవ్ 'గంధర్వ'- జులై 1 4. అరుణ్ విజయ్ 'ఏనుగు'- జులై 1 5. అవికా గోర్, శ్రీరామ్ '10 క్లాస్ డైరీస్'- జులై 1 ఈ వారం ఓటీటీకి సిద్ధమైన సినిమాలు, సిరీస్లు 1. ధాకడ్- జులై 1 (జీ5) 2. సామ్రాట్ పృథ్వీరాజ్- జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 3. అన్యాస్ ట్యుటోరియల్- జులై 1 (ఆహా) 4. ది టెర్మినల్ లిస్ట్- జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 5. స్ట్రేంజర్ థింగ్స్ 4 (వెబ్ సిరీస్)- జులై 1 (నెట్ఫ్లిక్స్) 6. షటప్ సోనా (వెబ్ సిరీస్)- జులై 1 (జీ5) 7. మియా బీవీ ఔర్ మర్డర్- జులై 1 (ఎంఎక్స్ ప్లేయర్) 8. ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ 2 (వెబ్ సిరీస్)- జూన్ 28 9. బ్లాస్టెడ్- జూన్ 28 (నెట్ఫ్లిక్స్) 10. డియర్ విక్రమ్- జున్ 30 (వూట్) -
థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్
Sadha Cried In Theater While Watching Major Movie: 'జయం' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అయింది ముద్దుగుమ్మ సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ను సొంతం చేసుకుని వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్గా తెరకెక్కిన 'మేజర్'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఆఫ్లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిచింది. View this post on Instagram A post shared by Major (@majorthefilm) -
AP: సినిమా టికెట్ల కలెక్షన్లు.. ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలోకి
సాక్షి, అమరావతి: ‘సినిమా టికెట్ల కలెక్షన్లు ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలో జమవుతాయి. రోజువారి ప్రాతిపదికన టికెట్ల కలెక్షన్లు థియేటర్లకు చెల్లిస్తారు’.. ఇదీ ఏపీ స్టేట్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ) సినిమా థియేటర్ల యజమానులతో కుదర్చుకునే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో స్పష్టంగా పేర్కొన్న అంశం. ఈ విధానంతోనే థియేటర్ల యజమానులతో కార్పొరేషన్ ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో టికెట్లు విక్రయిస్తే ఇక దశాబ్దాలుగా తాము సాగిస్తున్న దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనతో కొందరు తాజాగా ఓ దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ‘ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం మొదలైతే.. టికెట్ల కలెక్షన్ల మొత్తం ప్రభుత్వం థియేటర్ల యజమానులకు ఎప్పుడిస్తుందో’.. అంటూ థియేటర్ల యజమానులను గందరగోళపరిచేందుకు యత్నిస్తున్నారు. కానీ, దీంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో విక్రయించే విధానాన్ని త్వరలో ప్రారంభించడానికి ఉద్యుక్తమవుతోంది. రోజువారీ ప్రాతిపదికన థియేటర్ల ఖాతాకు బదిలీ ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం జీఓ జారీచేసి మార్గదర్శకాలను వెల్లడించింది. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. మరోవైపు.. ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యజమానులతో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ చేపట్టింది. ఆన్లైన్ విధానంపై ఎలాంటి సందేహాలకు ఆస్కారంలేకుండా అన్ని అంశాలను సమగ్రంగా ఒప్పంద పత్రంలో పేర్కొంది. ప్రధానంగా ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం ద్వారా వసూలైన మొత్తాన్ని థియేటర్ల యాజమాన్యానికి తిరిగి ఎప్పుడు బదిలీ చేస్తారు అనే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎంఓయూలోని ఆరో నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. టికెట్ల కలెక్షన్ను రోజువారి ప్రాతిపదికన సంబంధిత థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామని వెల్లడించింది. సినిమా టికెట్ల కలెక్షన్లలో సర్వీస్ చార్జి (1.95శాతం) మినహాయించుకుని మిగిలిన మొత్తం అంటే జీఎస్టీతో సహా థియేటర్ల బ్యాంకు ఖాతాలో ఒక్క రోజులోనే జమవుతుంది. థియేటర్ల యాజమాన్యమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకరోజు కలెక్షన్ ఆ మర్నాడే థియేటర్ల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. కాబట్టి సినిమా టికెట్ల విక్రయ మొత్తం తమకు ఎప్పుడు చేరుతుంది అనేదానిపై థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరమేలేదని ఎఫ్డీసీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. అంతేకాదు.. ఆన్లైన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మరికొన్ని నిబంధనలను కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అవి.. ♦ఆన్లైన్ వెబ్సైట్ లాగిన్ సౌకర్యం థియేటర్ కౌంటర్ వద్ద, మేనేజర్ చాంబర్లోనూ కల్పిస్తారు. ♦థియేటర్లకు బీఫాం లైసెన్సులు రెన్యువల్ కూడా ఆన్లైన్ విధానంలోనే సులభంగా చేస్తారు. ♦సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందుగా రిజర్వ్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తారు. అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ మొత్తం కూడా సంబంధిత షో ముగిసిన తరువాతే థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీచేస్తారు. అక్రమాలకు కళ్లెంపడుతుందనే ఆందోళన దశాబ్దాలుగా సినిమా టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న కొందరికి ఆన్లైన్ విధానం సంకటప్రాయంగా మారింది. ఆన్లైన్ విధానాన్ని పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను ప్రకటించడమే అందుకు కారణం. సినిమా సీట్లను మ్యాపింగ్ చేయనుండటంతో కలెక్షన్లను తక్కువగా చూపించి పన్ను ఎగవేయడం ఇకపై సాధ్యంకాదు. థియేటర్లు కచ్చితంగా బీఫామ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అందుకే.. ఆన్లైన్ విధానాన్ని అడ్డుకునేందుకు కొందరు దుష్ప్రచారానికి తెరతీశారు. ప్రధానంగా.. హైదరాబాద్లో ఉంటున్న కొందరు ఏపీ థియేటర్ల యజమానులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఎంఓయూ కుదుర్చుకోకుంటే.. ఆన్లైన్ విధానానికి కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్ణీత గడువులోనే థియేటర్ల యజమానులు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని స్పష్టంచేసింది. జూలై మొదటివారంలో ఆన్లైన్ టికెట్ల విక్రయం విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈలోగా ఎంవోయూల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు విరుద్ధంగా వ్యవహరించే థియేటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంచేసింది. -
ఈ వారం సందడి చేసే సినిమాలు, సిరీస్లు ఇవే..
థియేటర్లలో సినిమాల సందడి జోరుగా కొనసాగుతోంది. జూన్ మొదటి వారంలో విడుదలైన మేజర్, విక్రమ్ చిత్రాలు సక్సెస్ఫుల్గా ప్రదర్శింపబడుతుండగా, సెకండ్ వీక్లో రిలీజైన నాని 'అంటే.. సుందరానికీ', '777 చార్లీ' సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు జూన్ మూడో వారంలో ఇటు థియేటర్, అటు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్లు ఏంటో చూసేద్దాం. 1. విరాట పర్వం దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అనేకామార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17 ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. 1990 దశకంలో జరిగిన యాదార్థ సంఘటనల స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించారు. 2. గాడ్సే విభిన్నకథలతో, మంచి పాత్రలతో ముందుకు వెళ్తున్నాడు సత్యదేవ్. ఆయన హీరోగా నటించిన చిత్రం గాడ్సే. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సి. కల్యాణ్ నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ మూవీ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 3. కిరోసిన్ మిస్టరీ నేపథ్యంలో వస్తున్న చిత్రం కిరోసిన్. ధృవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి దిప్తీ కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వీటితోపాటు హీరో, మొనగాడు తదితర చిత్రాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి. ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్లు 1. జయమ్మ పంచాయితీ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో అలరించిన సినిమా జయమ్మ పంచాయితీ. మే 6న విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2. O2 లేడీ సూపర్స్టార్ నయన తార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 (ఆక్సిజన్). జీఎస్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 3. రెక్కీ శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ రెక్కీ. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో జూన్ 17 నుంచి ప్రదర్శించబడనుంది. 1990లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్యకు సంబంధించిన కథాంశంతో ఈ సిరీస్ రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అవతార పురుషా-1 (కన్నడ), జూన్ 14 సుడల్ (వెబ్ సిరీస్), జూన్ 17 నెట్ఫ్లిక్స్ గాడ్స్ ఫేవరెట్ ఇడియట్ (వెబ్ సిరీస్), జూన్ 15 ది రాత్ ఆఫ్ గాడ్ (హాలీవుడ్), జూన్ 15 షి (హిందీ వెబ్ సిరీస్ 2), జూన్ 17 ఆపరేషన్ రోమియో (హిందీ), జూన్ 18 జీ5 ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్), జూన్ 14 ఫింగర్ టిప్ (హిందీ, తమిళ వెబ్ సిరీస్ సీజన్ 2), జూన్ 17 డిస్నీ ప్లస్ హాట్స్టార్ మసూమ్ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 17 సోనీలివ్ సాల్ట్ సిటీ (హిందీ వెబ్ సిరీస్), జూన్ 16 -
ఉక్రెయిన్: యుద్ధం ఉన్నా జీవించాల్సిందే..వాళ్లలో కొత్త ఉత్సాహం
కీవ్: గత మూడు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాలపై రష్యా పట్టు సాధించినా, అనేక ప్రాంతాల్లో ఇంకా ఉక్రెయిన్ దళాలు పోరాడుతునే ఉన్నాయి. ఫిబ్రవరి 24 నుంచి సుమారు 100 రోజులకుపైగా రష్యా దాడులను శక్తి మేరకు ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చర్యలను మరింత తీవ్రం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగామే నెలాఖరులో నేషనల్ ఒపెరా, సినిమాహాళ్లు తిరిగి తెరవడం ప్రారంభమైనాయి. అయితే పొండిల్లోని ఒక డ్రామా థియేటర్లో యుద్ధ వాతావరణంలోనే సాగిన తొలి ప్రదర్శన అద్భుతంగా నిలిచింది. రాజధాని కీవ్లో సాహసోపేతంగా థియేటర్ తెరుచుకోవడమే కాదు తొలిరోజు టికెట్లన్నీ అమ్ముడయ్యాయట. యుద్ధ సమయంలో ప్రదర్శన ఇవ్వడానికి సంకోచించాం..కానీ కీవ్లో కాస్త ఆందోళన తగ్గిన తరువాత థియేటర్ను తెరవాలనుకున్నాం. యుద్ధం ఉందని మర్చి పోనప్పటికీ, జీవించడం కొనసాగించాలి. అయితే దీనికి నటీనటులు ఎలా సహాయపడతారనేది ప్రధాన ప్రశ్న అని నటుడు కోస్త్యా టామ్ల్యాక్ వ్యాఖ్యానించారు. యుద్ధం సమయంలో ప్రేక్షకులు వస్తారా అని భయపడ్డాం. అసలు ఈ సంక్షోభ సమయంలో ప్రజలు థియేటర్ గురించి ఆలోచిస్తారా, వారికంత ఆసక్తి ఉంటుందా అనుకున్నాం. కానీ రానున్న మూడు నాటకాలకు టికెట్లు అమ్ముడుపోయాయి అంటూ నటుడు యూరి ఫెలిపెంకో సంతోషం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Театр на Подолі (@theatre_on_podil) చారిత్రక థియేటర్ పొడిల్ నగరంలో డ్నీపర్ నది ఒడ్డున ఉంది ఈ చారిత్రక థియేటర్, ఇది కీవ్లో అత్యంత అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక ప్రాంతాలలో ఒకటి. 1987లో స్థాపించిన ఈ థియేటర్ కళాత్మక దర్శకుడు విటాలియ్ మలఖోవ్చే సారధ్యంలో నడుస్తోంది. ఉక్రెయిన్లోని ఆధునిక థియేటర్లకు ఇదే ఏకైక హబ్. -
ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్లు
Theatres OTT Releases: 22 Movies Web Series In June 2nd Week 2022: మొన్నటివరకు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోయాయి. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్, పృథ్వీరాజ్ మూవీస్ మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇక ఇప్పుడు చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్, ఓటీటీలతో కలుపుకుని ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో నేచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించిన 'అంటే.. సుందరానికీ'తోపాటు మరో 12 చిత్రాలు ఉన్నాయి. అలాగే 10 వెబ్ సిరీస్లు కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దామా ! 1. అంటే సుందరానికీ- జూన్ 10 2. సురాపానం- జూన్ 10 3. చార్లీ 777-జూన్ 10 4. జరిగిన కథ- జూన్ 10 5. డియర్ ఫ్రెండ్ (మలయాళం)-జూన్ 10 6. జన్హిత్ మే జారీ (హిందీ)- జూన్ 10 7. జురాసిక్ వరల్డ్ డొమినియన్- జూన్ 10 8. హసెల్ (Hustle)(నెట్ఫ్లిక్స్)- జూన్ 8 9. ఇన్నలే వార్ (సోనీ లివ్)- జూన్ 9 10. డాన్ (నెట్ఫ్లిక్స్)- జూన్ 10 11. కిన్నెరసాని (జీ5)- జూన్ 10 12. సీబీఐ5: ది బ్రెయిన్ (నెట్ఫ్లిక్స్)- జూన్ 12 వెబ్ సిరీస్లు.. 1. మిస్ మార్వెల్ (వెబ్ సిరీస్-డిస్నీ ప్లస్ హాట్స్టార్)- జూన్ 8 2. కోడ్ ఎమ్ (సీజన్ 2-ఊట్, జీ5)- జూన్ 8 3. బేబీ ఫీవర్ (వెబ్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 8 4. ది బ్రోకెన్ న్యూస్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10 5. అర్థ్ (వెబ్ సిరీస్-జీ5)- జూన్ 10 6. ఉడాన్ పటోలాస్ (వెబ్ సిరీస్-అమెజాన్ మినీ టీవీ)- జూన్ 10 7. ఫస్ట్ కిల్ (వెబ్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 10 8. ఇంటిమసీ (స్పానిష్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 10 9. పీకీ బ్లైండర్స్ (వెబ్ సిరీస్-నెట్ఫ్లిక్స్)- జూన్ 10 10. సైబర్ వార్ (వెబ్ సిరీస్-ఊట్)- జూన్ 10 -
ఈవారం అలరించే సినిమాలు, సిరీస్లు ఇవే..
Upcoming Theater OTT Movies Web Series In June 1st Week 2022: థియేటర్ల వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ 'అఖండ'తో మొదలైన మూవీ పండుగ మే 27న విడుదలైన 'ఎఫ్ 3' (F3)తో కంటిన్యూ అవుతోంది. ఈ నెలలో 'సర్కారు వారి పాట', 'ఎఫ్3' విజయంగా దూసుకుపోతున్నాయి. ప్రతి వారం ఓ కొత్త సినిమా ప్రేక్షకులను కచ్చితంగా పలకిస్తుండంగా.. జూన్ మొదటి వారంలో అలరించే సినిమాలు, సిరీస్లు ఏంటో లుక్కేద్దామా ! 1. మేజర్ డిఫరెంట్ కథలు, సినిమాలతో అలరించే అడవి శేష్ మేజర్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 36/11 ఉగ్రదాడుల్లో ప్రజల ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్రివ్యూలు వేసిన విషయం తెలిసిందే. 2. విక్రమ్ ముగ్గురు విలక్షణ నటులందరు కలిసి ఉర్రూతలూగించేందుకు వస్తుంది 'విక్రమ్'. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య అతిథిగా మెరవబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన 'విక్రమ్' జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. 3. పృథ్వీరాజ్ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాజ్పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా రూపొందిన చిత్రం 'పృథ్వీరాజ్'. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజవనుంది. ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్లు ఇవే.. 1. 9 అవర్స్ (వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్స్టార్, జూన్ 2 2. జనగణమన (మలయాళం)- నెట్ఫ్లిక్స్, జూన్ 2 3. అశోకవనంలో అర్జున కల్యాణం- ఆహా, జూన్ 3 4. ది పర్ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్)- నెట్ఫ్లిక్స్, జూన్ 3 5. సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్)- నెట్ఫ్లిక్స్, జూన్ 3 6. ది బాయ్స్ (వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 3 7. ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్-సీజన్ 3)- ఎంఎక్స్ ప్లేయర్, జూన్ 3 8. బెల్ఫాస్ట్ (హాలీవుడ్)- బుక్ మై షో, జూన్ 3 చదవండి: రీల్స్తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. -
ఆ సీన్స్తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ!
RRR Movie Re Releasing On Theaters With Uncut Version: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్తో జక్కన ఈ సినిమాను రూపొందించాడు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది. చదవండి: తెలుగు ఫిలిం చాంబర్పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు అయితే రిలీజ్ సమయంలో మూవీ నిడివిని తగ్గించేందుకు చిత్రం బృందం కొన్ని సన్నివేశాలను కట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తారక్,చరణ్కు సంబంధించిన కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా పోయాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా తొలగించిన సన్నివేశాలను అలాగే ఉంచి మళ్లీ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తున్నారట. అయితే ఇది ఇక్కడ కాదు అమెరికాలో. చదవండి: గుడ్న్యూస్ అందించిన జీ5, ఫ్రీగా ఆర్ఆర్ఆర్ చూడొచ్చు! జూన్ 1న దాదాపు 100 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.స్పెషల్ స్క్రీనింగ్ పేరుతో సినిమాలో తొలగించిన సన్నివేశాలను యథాతథంగా ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీం తెలిపింది. అయితే ఇది ఆ ఒక్క రోజు నైట్ షో మాత్రమే ఉండనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ సెకండ్ రిలీజ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. #RRRMovie re-releasing in USA on June 1st!! 🙌🏻 https://t.co/lUvISLzj2v — RRR Movie (@RRRMovie) May 18, 2022 -
ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు..
Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week: థియేటర్లలో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు చేసిన రచ్చను 'సర్కారు వారి పాట' కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పెద్ద సినిమాలు ఏవి థియేటర్లలో అడుగుపెట్టట్లేదు. చిన్న సినిమాలు మాత్రం ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో లుక్కేద్దామా ! 1. శేఖర్ యాంగ్రీ ఎంగ్ మ్యాన్ రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళంలో విజయం సాధించిన 'జోసేఫ్' సినిమాకు రీమేక్గా రానుంది. మనసున్న ప్రతి ఒక్కరికీ 'శేఖర్' నచ్చుతాడని, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని డైరెక్టర్ జీవిత ఆదివారం ప్రెస్ మీట్లో తెలిపారు. 2. ధగడ్ సాంబ నవ్వులు పంచేందుకు రెడీ అయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సంపూ, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ధగడ్ సాంబ. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎన్ఆర్ రెడ్డి డైరెక్టర్. 'సంపూర్ణేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా మూవీ ఉంది.' అని చిత్ర యూనిట్ పేర్కొంది. 3. ధాకడ్ బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా 'ధాకడ్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే యాక్షన్ సీన్స్తో అదరిపోయింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. 4. భూల్ భులయా 2 హారర్, కామెడీ నేపథ్యంలో వస్తున్న హిందీ చిత్రం 'భూల్ భులయా 2'. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియరా అడ్వాణీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ డైరెక్షన్ చేశారు. టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకులను భయంతో నవ్వించనుంది. ఓటీటీలో.. మే 20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనాన, 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్, జాంబీవ్లీ చిత్రాలు, పంచాయత్ సీజన్ 2, నైట్ స్కై సీజన్ 1 వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి. 1. ది ఇన్విజబుల్ మ్యాన్- మే 16 (నెట్ఫ్లిక్స్) 2. ది హంట్- మే 16 (నెట్ఫ్లిక్స్) 3. వూ కిల్డ్ సారా సీజన్ 3- మే 18 (నెట్ఫ్లిక్స్) 4. హనీమూన్- మే 20 (వూట్) చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్కు జీ5 షాక్.. సినిమాకు డబ్బులు చెల్లించాల్సిందే ! రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్ -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఏంటో చూసేయండి.. సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్ను షేక్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. జయేశ్ భాయ్ జోర్దార్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్. డైరెక్టర్ దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 13న విడుదలకు సిద్దమైంది. భ్రూణహత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, రత్నాపాఠక్ షాలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యశ్రాజ్ ఫిలింస్ పతాకాంపై ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మలు ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు: దీ కశ్మీర్ ఫైల్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ ‘బీస్ట్’ మూవీ దళపతి విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కావడంతో బీస్ట్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ నెక్స్ట్తో పాటు నెట్ఫ్లిక్స్లో మే11 నుంచి బీస్ట్ ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు మే 12: ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ మోడర్స్ లవ్(తెలుగు) మే 13: మోడర్న్ లవ్ ముంబై(హిందీ సిరీస్) డిస్నీ ప్లస్ హాట్స్టార్ మే 13: స్నీకరెల్లా ఆహా మే 13: కుతుకు పత్తు(తమిళం) నెట్ఫ్లిక్స్ మే 12: సేవేజ్ బ్యూటీ వెబ్ సిరీస్ -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఏంటో చూసేయండి.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తాజాగా హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లో మే4 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే6న విడుదల కానుంది. పల్లెటూరి బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంతో సుమ పల్లెటూరి మహిళ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. 'మహానటి' కీర్తి సురేష్ సెల్వ రాఘవన్తో కలిసి నటించిన తాజా చిత్రం 'సాని కాయిధం' . చిన్ని పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. అరుణ్ మథేశ్వరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిచారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. థియేరట్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే6న చిన్ని స్ట్రీమింగ్ కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మించారు. పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్ సేన్ నటించినట్లు తెలుస్తోందినీ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ప్రేమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ)- మే5 ద వైల్డ్(వెబ్సిరీస్2)- మే6 నెట్ప్లిక్స్ రాధేశ్యామ్(హిందీ)-మే4 థార్(మిందీ)-మే6 40 ఇయర్స్ యంగ్(హాలీవుడ్)-మే4 ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(వెబ్సిరీస్)-మే6 డిస్నీ+హాట్స్టార్ హోమ్ శాంతి(హిందీ సిరీస్)-మే6 స్టోరీస్ ఆన్ది నెక్ట్స్ పేజ్(హిందీ సిరీస్)-మే6 జీ5 ఝండ్(హిందీ)-మే6 -
ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రానున్న సినిమాలు, వెబ్ సిరీస్లు..
Upcoming Theatre OTT Movies Web Series In April Last Week 2022: మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సందడి పండుగల కనువిందు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వసూళ్ల పరంపర కొనసాగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత తాజాగా విడుదలయ్యే చిత్రాలపై పడింది సినీ ప్రియుల కన్ను. మూవీ లవర్స్ కోసమే అన్నట్లుగా ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఒక పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అలాగే ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దామా ! 1. ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందులోనూ సక్సెస్ఫుల్ డైరెక్టర్తోపాటు ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ అంటే.. ఆ అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు 'ఆచార్య'. 'ధర్మస్థలి' అనే ప్రాంతం చుట్టూ తిరిగే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే. 2. కణ్మనీ రాంబో ఖతీజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతారలతో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. చిరంజీవి 'ఆచార్య' సినిమా కంటే ఒక్క రోజు ముందుగా థియేటర్లలో తన ప్రేమాయణంతో సందడి చేయనున్నాడు ఈ హీరో. అంటే ఏప్రిల్ 28న ఈ మూవీ విడుదల కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్'ను తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా'గా రిలీజ్ చేస్తున్నారు. 3. రన్ వే 34 బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కలిసి నటించిన చిత్రం 'రన్ వే 34'. ఈ సినిమాతో సుమారు ఆరేళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు అజయ్ దేవగణ్. ఇందులో టాలీవుడ్ కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ అలరించనున్నారు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్, అజయ్ దేవగణ్ పైలట్లుగా నటించగా, అమితాబ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా అలరించనున్నారు. 4. హీరోపంతీ 2 బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన తాజా చిత్రం హీరోపంతీ 2. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారా సుతారియా హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియద్వాలా నిర్మించారు. లైలా అనే విలన్ రోల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ తన యాక్టింగ్ మార్క్ను చూపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల విడుదలకు సిద్ధంగా ఉంది. ఓటీటీల్లో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు.. చదవండి: ఐఎమ్డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్లు.. నెట్ఫ్లిక్స్ గంగుబాయి కతియావాడి-ఏప్రిల్ 26 (తెలుగు) 365 డేస్: దిస్ డే-ఏప్రిల్ 27 (హాలీవుడ్) మిషన్ ఇంపాజిబుల్-ఏప్రిల్ 29 (తెలుగు) ఓ జార్క్-ఏప్రిల్ 29 (వెబ్ సిరీస్) ఆక్వాఫినా ఈజ్ నోరా ఫ్రమ్ క్వీన్స్-ఏప్రిల్ 29 (హాలీవుడ్) డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనుపమ: నమస్తే అమెరికా-ఏప్రిల్ 25 (హిందీ) బ్యారీ-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) మిషన్ సిండ్రెల్లా-ఏప్రిల్ 29 (హిందీ) జీ5 నెవర్ కిస్ యువర్ బెస్ట్ఫ్రెండ్-ఏప్రిల్ 29 (హిందీ) అమెజాన్ ప్రైమ్ వీడియో అన్డన్-ఏప్రిల్ 29 (కార్టూన్ సిరీస్) వూట్ బేక్డ్-ఏప్రిల్ 25 (వెబ్ సిరీస్, సీజన్ 3) ది ఆఫర్-ఏప్రిల్ 28 (వెబ్ సిరీస్) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్లు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేజీఎఫ్–2 చూస్తూ రచ్చ రచ్చ... థియేటర్లో కాల్పులు
యశ్వంతపుర (కర్ణాటక): తెరపై కేజీఎఫ్2 నడుస్తోంది. హీరో, విలన్ల మధ్య భారీ కాల్పులు, పోరాట దృశ్యాలు చూస్తూ ప్రేక్షకులు మైమరచిపోయారు. కానీ అవే కాల్పులు ఉన్నట్టుండి థియేటర్లోనే తమ కళ్ల ముందే జరగడంతో అంతా భయంతో పరుగులు తీశారు. కర్ణాటకలో హావేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సెకండ్ షో చూస్తుండగా వసంతకుమార అనే ప్రేక్షకుని కాలు ముందు కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తగిలింది. దాంతో గొడవ పడ్డారు. అతను బయటకు వెళ్లి పిస్టల్తో తిరిగొచ్చి ఏకంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు వసంత కాలు, కడుపులోకి దూసుకెళ్లాయి. దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఏపీలో తొలి ఎయిర్ బెలూన్ థియేటర్.. ఎక్కడో తెలుసా?
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాత పద్ధతులకు కొత్త హంగులు అద్దితే అది థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు సినిమా థియేటర్లకు కూడా ఆ కళ వచ్చింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శనలు ఎక్కువగా టూరింగ్ టాకీస్ల్లో నడిచేవి. ఇప్పుడు అదే తరహాలో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఆధునిక హంగులతో సరికొత్త థియేటర్లు సిద్ధమవుతున్నాయి. మల్టీప్లెక్స్ హంగులు కల్పిస్తూ.. ఎక్కడకి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించగలిగే సినిమా థియేటర్ను తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సిద్ధం చేస్తున్నారు. చదవండి: నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు! ఇక్కడి జాతీయ రహదారి పక్కనే ఉన్న హాబిటేట్ ఫుడ్కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్ను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ మొబైల్ థియేటర్ను ఢిల్లీకి చెందిన పిక్చర్ డిజిటల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 23న థియేటర్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి చైతన్య తెలిపారు. అయితే తొలి ప్రదర్శన మాత్రం 29న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం కానుందని చెబుతున్నారు. ప్రత్యేకతలు ఇవీ.. గాలిని నింపే బెలూన్ల వంటి షీట్లను అమర్చి ఓ షామియానా (టెంట్) మాదిరి మొబైల్ థియేటర్ను తయారు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకునే టెక్నాలజీ వినియోగిస్తున్నారు. 120 సీట్ల సామర్థ్యం ఉంటుంది. బయట నుంచి చూస్తే గాలి నింపుకుని కలర్ ఫుల్గా ఉన్న ఓ సెట్టింగ్లా ఈ థియేటర్ కనిపిస్తుంది. సులువుగా తరలించేందుకు వీలుగా ఈ థియేటర్ తయారీలో ప్లాస్టిక్, స్పాంజ్లను అధికంగా వినియోగిస్తున్నారు. ఓ ట్రక్కులో దీనిని తరలించవచ్చు. ఇటీవలే తెలంగాణలోని ఆసిఫాబాద్లో ఈ తరహా థియేటర్కు శ్రీకారం చుట్టారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రెండోవారం కూడా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కొమురం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజుగా రామ్చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ చూసేందుకు సినీప్రియులు ఎగబడుతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం దూకుడు చూస్తుంటే మరి కొన్ని రోజుల దాకా దీని ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమాను కొద్దిగా ఇరకాటంలో పెట్టేందుకు ఈ వారం వచ్చేస్తున్నాయి మరికొన్ని చిత్రాలు. అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఓసారి చూద్దామా ! 1. గని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయి మంజ్రేకర్ జోడీగా వస్తున్న క్రీడా నేపథ్యం ఉన్న సినిమా 'గని.' కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న 'గని' ఏప్రిల్ 8న ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. బాబాయి పవన్ కల్యాణ్ 'తమ్ముడు' సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం చేసినట్లు వరుణ్ చెబుతున్నాడు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి భారీతారగణంతో వస్తున్న 'గని' ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. 2. మా ఇష్టం (డేంజరస్) సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందిన క్రైమ్ డ్రామా చిత్రం 'మా ఇష్టం (డేంజరస్)'. అప్సరారాణి, నైనా గంగూలీ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఏప్రిల్ 8న విడుదల కానుంది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. వర్మ చేసిన ఈ ప్రయోగాన్ని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. 1. స్టాండప్ రాహుల్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా వచ్చిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. శాంటో మోహన వీరంకి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 18న విడదలైంది. కాగా ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ఫ్లిక్స్ చస్వీ (హిందీ) ఏప్రిల్ 7 ఎత్తర్కుం తునిందావన్ (ఈటీ, తమిళం) ఏప్రిల్ 7 ఎలైట్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 8 మెటల్ లార్డ్స్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 ది ఇన్బిట్విన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 అమెజాన్ ప్రైమ్ వీడియో మర్డర్ ఇన్ అగోండా (హిందీ) ఏప్రిల్ 8 నారదన్ (మలయాళం) ఏప్రిల్ 8 జీ5 ఎక్ లవ్ యా (కన్నడ) ఏప్రిల్ 8 అభయ్ 3 (హిందీ) ఏప్రిల్ 8 డిస్నీ ప్లస్ హాట్స్టార్ ది కింగ్స్ మెన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 -
ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న కళాకారిణిపై యాసిడ్ దాడి
యశవంతపుర(బెంగళూరు): రంగస్థల కళాకారిణి దేవిపై యాసిడ్ దాడికి పాల్పడిన రమేశ్, స్వాతి, యోగేశ్ అనేవారిని నందిని లేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందినిలేఔట్ గణేశ్బ్లాక్లో ఉంటున్న దేవి బీఎంటీసీ కండక్టర్గా పనిచేసి రాజీనామా చేసింది. కొన్నిరోజుల నుంచి నాటక కళాకారిణిగా ప్రదర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దేవిపై ముగ్గురూ యాసిడ్ దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ఘటనలో.. వేర్వేరుగా ఇద్దరు ఆత్మహత్య హోసూరు: బాగలూరు సమీపంలో వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొన్నారు. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని బెగ్గిళి గ్రామానికి చెందిన నాగరాజ్ (35) కొంత మంది వద్ద అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో నాగరాజ్ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. నందిమంగలం ప్రాంతానికి చెందిన కూలికార్మికుడు నారాయణన్ (56)కు తాగుడు అలవాటుండడంతో భార్యాభర్తల మద్య తరచూ గొడవలేర్పడుతుండేది. శనివారం రాత్రి జరిగిన గొడవల్లో ఆవేశం చెందిన నారాయణన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు ఘటనల్లోనూ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రష్యా vs ఉక్రెయిన్: మారియుపోల్ మారణహోమం..!!
-
యుద్ధకాంక్షలో దిగజారిపోతున్న రష్యా.. పిల్లలనే కనికరం లేకుండా!
Mariupol theatre sheltering children bombed: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ నానాటికీ మరింత వికృతంగా మారిపోతుంది. మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నిరవధిక దాడిలో ఉక్రెయిన్ని నేలమట్టం చేసే దిశగా రష్యా ఘోరంగా దాడి చేస్తోంది. అందులో భాగంగా ఆసుపత్రులు, నిరాశ్రయులై మానవతా కారిడార్ సాయంతో ఆశ్రయం పొందుతన్న స్థావరాలను సైతం విడిచిపెట్టకుండా భయంకరమైన దాడులకు దిగుతోంది అంతేకాదు చిన్నారుల ఆశ్రయం పొందుతున్న మారియుపోల్ థియేటర్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ డ్రామా థియేటర్లో సుమారు వెయ్యి మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారని మారియుపోల్ స్థానిక కౌన్సిల్ పేర్కొంది. అభంశుభం తెలియని చిన్నారులని కనికరం లేకుండా అత్యంత క్రూరమైన దాడులకు దిగుతున్న రష్యాని తాము ఎప్పటికి క్షమించమని స్థానిక కౌన్సిల్ ఆవేదనగా వెల్లడించింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్లోని థియేటర్పై రష్యా దళాలు శక్తివంతమైన బాంబులతో దాడి చేసినట్లు పేర్కొంది. అంతేకాదు ఆ భవనం శిథిలాల కింద దాదాపు వెయ్యి మంది వరకు చిక్కుకుని ఉండవచ్చునని తెలిపింది. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదంటూ ఉక్రెయిన్ ఆరోపణలను ఖండించింది. దీంతో మీడియా అవుట్లెట్ నెక్స్టా ట్విట్టర్లో రష్యా దళాలచే బాంబు దాడికి ముందు డ్రామా థియేటర్ లోపల దృశ్యాలను చూపుతున్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భవనంలో చాలా మంది పిల్లలు కూర్చుని ఉన్నారు. మారియుపోల్లో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా పౌరులు మరణించినట్లు వెల్లడించింది. అదీగాక నగరంలో 13 రోజులుగా విద్యుత్, గ్యాస్ లేదా తాగు నీరు లేవు దీనికి తోడు రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతున్నాయని తెలిపింది. అంతేగాక రష్యా ఎందుకు మారియుపోల్నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందంటే మారియుపోల్ అజోవ్ సముద్రంలోని అతి ముఖ్యమైన ఉక్రెనియన్ ఓడరేవు మాత్రమే గాక ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే గనుక రష్యా చాలా కాలంగా కలలు కంటున్న క్రిమియాకు ల్యాండ్ కారిడార్ లభిస్తుందని మీడియా అవుట్లెట్ నెక్స్టా ట్విట్టర్ పేర్కొంది. ‼️This is all that remains of the Drama Theater in #Mariupol According to local media, up to 1,000 people could have been inside the building. All of them are now under the rubble of the building. The exact number of casualties is still unknown. pic.twitter.com/4L3D8lt39E — NEXTA (@nexta_tv) March 16, 2022 (చదవండి: మా కలలను కల్లోలం చేశారు: జెలెన్ స్కీ ఆవేదన) -
అద్దెకు ఫ్యామిలీ థియేటర్ ! హైదరాబాద్లో న్యూ బిజినెస్ !
కోవిడ్ మహమ్మారి ఎటాక్ చేసినప్పటి నుంచి ఇంటి బయట కాలు పెట్టాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. వైరస్ భయంతో కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తామంటే మనసు రావడం లేదు. చిన్న చిన్న సరదాలకు కూడా దూరం కావాల్సి వస్తోంది. ఇంటిల్లిపాది సినిమాకి వెళ్లి ఏళ్లు నెలలు దాటిన కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ప్రైవేటుగా సినిమా చూసేందుకు వీలుగా ఫ్యామిలీ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లో ఈ కొత్త రకం ఫ్యామిలీ థియేటర్ బిజినెస్ ఊపందుకుంటోంది. అద్దెకు థియేటర్ కరోనా తెర మీదకు వచ్చిన తర్వాత వెండి తెర మీద సినిమాలు చూడటం చాలా అరుదైన విషయంగా మారింది. వందల మందితో కలిసి సినిమా చూడాలంటే భయపడే కుటుంబాల సంఖ్య పెరిగింది. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్ఫామ్ అందుబాటులో ఉన్నా థియేటర్లో చూసిన ఫీల్ అయితే మిస్ అవుతున్నారు. ఇలాంటి వారి కోసం కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా అత్యాధునిక సౌకర్యాలతో థియేటర్ను స్టార్ ట్రాక్ గ్రూప్ హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చింది. థియేటర్ను అద్దెకు తీసుకుని నచ్చిన సినిమాను చూసేయోచ్చు. మల్టీప్లెక్స్ స్థాయిలో స్టార్ట్రాక్ గ్రూపు థియేటర్లో ఏడుగురు కుటుంబ సభ్యుల వరకు సినిమా చూసే వీలుంది. ఈ థియేటర్లో 142 ఇంచెస్ ఆధునిక స్క్రీన్, మెయిన్ స్ట్రీమ్ థియేటర్కి ఏ మాత్రం తీసిపోని ఆడియో సిస్టమ్తో పాటు రిక్లెయినర్ చైయిర్లు అందుబాటులో ఉన్నాయి. థియేటర్ ఇంటీరియర్ సైతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. థియేటర్ అనుభూతిని అందివ్వడంలో ఈ ఫ్యామిలీ థియేటర్ మల్టీప్లెక్స్కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించారు. కంటెంట్ మనదే ఈ రెంటెండ్ థియేటర్లో ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోలతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, హాట్స్టార్ తదితర ఓటీటీ కంటెంట్లపై వచ్చే సినిమాలను సైతం ఇక్కడ చూసే వీలుంది. ఈ రోజుల్లో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ ఫీల్ కావాలనుకునే వారు ఈ రెంటెండ్ థియేటర్లో కరోనా భయాలు లేకుండా సినిమాలను ఆస్వాదించవచ్చు. రోజుకి మూడు షోలు ఈ ఫ్యామిలీ థియేటర్ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తున్నారు. మార్నింగ్ , ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ సమయాల్లో ఇందులో ఫ్యామిలీతో సినిమాను చూసేయోచ్చు. షో టైమింగ్, వారాన్ని బట్టి ఒక్కో షోకి కనిష్టంగా రూ. 1500ల నుంచి గరిష్టంగా రూ.1900ల వరకు రెంట్ తీసుకుంటారు. ప్రతీ షో తర్వాత థియేటర్ మొత్తాన్ని ఆధునిక పద్దతిలో శానిటైజ్ చేస్తున్నారు. ఈ గ్రూప్కి చెందిన వెబ్సైట్కి వెళ్లి ముందుగా షోని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెండ్కి తగ్గట్టుగా హైదరాబాద్ నగరంలో ఒకప్పటి సంగీత్ థియేటర్ మొదలు ఆర్టీసీ క్రాస్రోడ్లో సంధ్య థియేటర్స్ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లను డిజైన్ చేయడంలో స్టార్ ట్రాక్ గ్రూపుకి మంచి రికార్డు ఉంది. ఈ గ్రూపు ఓనర్లు మూడు తరాలు నగరంలో దాదాపు 300ల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బ్రిటీష్ జమానాలో ఇంజీనింగ్లో గోల్డ్ మెడల్ పొంది బీకే మూర్తితో ఈ పరంపర మొదలైంది. ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా రూపొందిన ఫ్యామిలీ థియేటర్ సికింద్రాబాద్, సర్థార్పటేల్ రోడ్లోని పైగా హౌసింగ్ కాలనీలో ఉంది. చదవండి: కింగ్డమ్ ఆఫ్ కిడ్స్.. హైదరాబాద్లో కొత్త స్టూడియో -
హైదరాబాద్ లో అగ్నికి ఆహుతైన సినిమా థియేటర్
-
శివపార్వతి థియేటర్లో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: కూకట్పల్లి శివపార్వతి థియేటర్లో భారీ అగ్నిప్రమాదం
కూకట్పల్లి: సుమారు రెండున్నర దశాబ్దాల పాటు బిగ్ స్క్రీన్పై సినీ వినోదాన్ని అందించిన కూకట్పల్లి శివపార్వతి థియేటర్ అగ్నికి ఆహుతైంది. నామరూపాల్లేకుండా థియేటర్ సర్వం బుగ్గిపాలుకావడం సినీ ప్రేక్షకులను కలచివేసింది. ఆదివారం రాత్రి సెకండ్ షో ముగిసిన తరువాత రోజుమాదిరిగా థియేటర్ను మూసివేయగా, తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అకస్మాత్తుగా థియేటర్లో మంటలు వ్యాప్తి చెంది క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. థియేటర్ రూఫ్ సైతం మంటలకు కాలి కుప్పకూలింది. సినిమా ప్రదర్శన ముగిశాక ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఏరియాలో మొదటిది.. కేపీహెచ్బీకాలనీ ఎదురుగా భాగ్యనగ్కాలనీలో కూకట్పల్లి ప్రాంతంలోనే మొదటిసారిగా దాదాపు 25 ఏళ్లుగా శ్రీనివాస్బాబు అనే వ్యక్తి శివపార్వతి థియేటర్ను ప్రారంభించారు. ఆ పక్కనే అర్జున్, వెనుక విశ్వనాథ్ థియేటర్లు కూడా ఉన్నాయి. థియేటర్లు మూడు పక్కపక్కనే ఉండడంతో ఎప్పుడూ సినీ ప్రియులతో ఆ ప్రాంతం సందడిగా ఉంటుంది. ఆదివారం రాత్రి శ్యామ్సింగరాయ్ సినిమా సెకండ్ షో ముగియగానే ఒంటి గంట సమయంలో సిబ్బంది థియేటర్లోని అన్ని లైట్లను, డోర్లను మూసివేసి తాళాలు వేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో థియేటర్ లోపల మంటలు వ్యాపించాయి. మంటలు కొద్దికొద్దిగా వ్యాపిస్తూ రూఫ్ వరకు వచ్చేవరకు వాచ్మెన్ గమనించలేకపోయారు. గంట తరువాత 4.35 గంటలకు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. అంటే ఈ గంటలోనే థియేటర్ను పూర్తిస్థాయిలో మంటలు చుట్టుముట్టాయి. నిమిషాల వ్యవధిలోనే కూకట్పల్లి, సనత్నగర్, మాదాపూర్ ఫైర్స్టేషన్ల నుంచి ఫైరింజన్లు అక్కడికి చేరుకుని 5.30 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో బిగ్ స్క్రీన్, ప్రొజెక్టర్, సీట్లు, స్క్రీన్ సౌండ్ సిస్టమ్, థియేటర్ రూఫ్ పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. కేపీహెచ్బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బురఖా ధరించి సినిమా వీక్షించిన సాయిపల్లవి
-
బుర్ఖాలో సీక్రెట్గా థియేటర్కు వెళ్లిన హీరోయిన్
Sai Pallavi Secret Visit To Sriramulu Theatre For Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’హిట్ టాక్తో దూసుకుపోతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే తాజాగా ఆడియెన్స్ రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూసేందుకు హీరోయిన్ సాయి పల్లవి బుర్ఖా వేసుకొని థియేటర్లో సందడి చేసింది. బుధవారం హైదరాబాద్ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్కు డైరెక్టర్ రాహుల్తో కలిసి థియేటర్కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. కాగా ఈ చిత్రంలో కృతిశెట్టి మారో హీరోయిన్గా నటించింది. -
టీకా వేసుకుంటేనే థియేటర్లోకి అనుమతి
తిరుత్తణి: కరోనా టీకా వేసుకున్న వారికి మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతి ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఆల్పీ జాన్ వర్గీస్ తెలిపారు. ఆయన శుక్రవారం తిరుత్తణిలో సినిమా థియేటర్ల వద్ద ప్రత్యేక కరోనా వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో జిల్లాలో గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇంకా 20 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోలేదన్నారు. ఈ క్రమంలో రద్దీగా ఎక్కువగా ఉండే ఆలయాలు, సినిమా థియేటర్లు, మాల్స్, రైల్వేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతించాలని యాజమాన్యాలను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జవహర్హలాల్, ఆర్డీవో సత్య, మున్సిపల్ కమిషనర్ రామజయం పాల్గొన్నారు. -
ఈ అత్యుత్సాహం మానుకోండి : సల్మాన్ ఖాన్
న్యూఢిల్లీ: సాధారణంగా ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో సినిమా షోను మొదటి రోజు... మొదటి షోను చూడటానికి ఇష్టపడుతుంటారు. సినిమా హాల్లో పేపర్ కటింగ్స్, అల్లరి చేయడం, విజిల్స్ వేయడం చేస్తుంటారు. మరికొందరు పూలు చల్లుతూ.. ఫ్లెక్సీలపై పాలను పోసి తమ అభిమానాన్ని చాటుకుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహాం ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన న్యూఢిల్లీలోని స్థానిక సినిమా థియేటర్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ కొత్త సినిమా.. ‘ఆంటీమ్ దిఫైనల్ ట్రూత్’ సినిమా విడుదలైంది. ఈ క్రమంలో కొందరు అభిమానులు థియేటర్లో క్రాకర్లను కాల్చారు. అంతటితో ఆగకుండా.. గట్టిగా కేకలు వేస్తూ పక్కవారికి ఇబ్బందులకు గురిచేశారు. ఈ హఠాత్పరిణామంతో.. థియేటర్కు హజరైన చాలా మంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్వీటర్ వేదికగా స్పందించారు. థియేటర్లలో ఇలాంటి పనులు చేయకూడదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పనులతో.. మీ ప్రాణాలతోపాటు.. తోటివారి ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. అదే విధంగా.. ఫ్యాన్స్ క్రాకర్స్ తీసుకోని సినిమాహల్లోకి ప్రవేశించకుండా సెక్యురీటి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కొందరు అభిమానులు ‘ఆంటీమ్ దిఫైనల్ ట్రూత్’ సినిమా ఫ్లెక్సీపై పాలాభిషేకం నిర్వహించారు. దీనిపై కూడా సల్మాన్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘ కొంత మందికి తాగటానికి సరైన మంచి నీరు దొరకడం లేదు.. మీరు పాలను ఈ విధంగా వృథా చేయకూడదని’ పేర్కొన్నారు. ఈ విధంగా.. పాలను వృథా చేసే బదులు అవసరమైన పిల్లలకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
కొత్త బిజినెస్ను కన్మర్ఫ్ చేసిన సూపర్స్టార్
Salman Khan About Salman Talkies: నటుడిగానే కాదు.. నిర్మాతగా, ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా , బీయింగ్ హ్యూమన్ లాంటి బ్రాండ్తో వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్. ఇప్పుడీ సీనియర్ హీరో కొత్త బిజినెస్లోకి అడుగుపెడుతున్నాడు. చిన్న చిన్న పట్టణాల్లో థియేటర్ల చెయిన్తో ప్రేక్షకుడిని అలరించబోతున్నాడు. ‘సల్మాన్ టాకీస్’ పేరిట వీటిని నడిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముందు మహారాష్ట్రలో మొదలుపెట్టి.. ఆ తర్వాతి పదేళ్లలో దేశం మొత్తం విస్తరించాలన్నది సల్లూ భాయ్ ప్లాన్. నిజానికి ఈ ప్రాజెక్టు కొన్నేళ్ల క్రితం ప్రతిపాదనే. అయితే అది ఆగిపోయిందని అంతా భావించారు. ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా సల్మాన్ టాకీస్ గురించి వార్త చక్కర్లు కొడుతుండడంతో.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సల్మాన్ ధృవీకరించాడు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సల్మాన్ టాకీస్ ప్రాజెక్ట్ను లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు. ‘ముంబై లాంటి మహానగరాల్లో కాదు.. థియేటర్ సౌలభ్యం లేని చిన్న ఊర్లలో వీటిని ప్రారంభిస్తాం. పనులు కరోనా వల్ల కాస్త ఆలస్యం అవుతోంది అంతే!’ అని సల్మాన్ వెల్లడించాడు. చిన్న చిన్న పట్టణాల్లో ట్యాక్స్ ఫ్రీ టికెట్లతో అనుమతులతో థియేటర్ల చెయిన్ ‘సల్మాన్ టాకీస్’గా వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముఖ్యంగా మాస్ ఆడియొన్స్ను దృష్టిలో పెట్టుకుని వీటిని మొదలుపెడుతున్నాడు సల్మాన్. అంతేకాదు టికెట్లపై సబ్సిడీ రేట్లు, పిల్లలకు ఉచిత టికెట్లతో వీటిని నడిపించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో చాలాకాలం సల్మాన్ చర్చలు జరిపినట్లు ముంబై మిర్రర్ ఒక కథనం ప్రచురించింది. సినిమాలతోనే కాదు.. బిగ్బాస్లాంటి రియాలిటీ షోల ద్వారా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు సల్మాన్. ఇక 2011లో సల్మాన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ ‘సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ ప్రొడక్షన్స్ హౌజ్ ప్రారంభించాడు. ఈ బ్యానర్లో తీసిన సినిమాల ద్వారా వచ్చిన సొమ్ము.. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్కు వెళ్తోంది. ఇక బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ బ్రాండ్ సాలీనా టర్నోవర్ 500 కోట్ల రూపాయలుగా ఉంటోంది. -
సూర్య నెక్ట్స్ మూవీ ట్రైలర్ చూశారా?..ఈసారి బొమ్మ థియేటర్లోనే
సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలయ్యాయని నిరాశ చెందిన ఆయన అభిమానులకు ఓ గుడ్ న్యూస్. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎదర్కుమ్ తునిందవన్’ (దేనికైనా తెగించేవాడు) చిత్రం థియేటర్స్లో రానుంది. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్స్లో విడుదల కానుంది. ప్రియాంకా అరుళ్ మోహనన్, వినయ్ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ స్వరకర్త. #EtharkkumThunindhavan is releasing on Feb 4th, 2022!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop #SaranyaPonvannan #MSBhaskar @priyankaamohan #Vinay @sooriofficial @AntonyLRuben @VijaytvpugazhO #ETOnFeb4th pic.twitter.com/hwuwEkX3Bm — Sun Pictures (@sunpictures) November 19, 2021 -
మోహన్లాల్ మరక్కర్ చిత్రం థియేటర్లోనే..
Mohanlals Marakkar To Release In Theatres: ‘మరక్కర్’ థియేటర్స్కే వస్తున్నాడు. ప్రచారంలో ఉన్నట్లు ఓటీటీలోకి కాదు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్లాల్ టైటిల్ రోల్లో నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’. 15వ శతాబ్దానికి చెందిన న్యావల్ చీఫ్ మహ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అర్జున్, సునీల్ శెట్టి, కీర్తీ సురేశ్, మంజు వారియర్, కల్యాణీ ప్రియదర్శన్ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలకు ఫుల్స్టాప్ పడేలా.. ‘‘ఇంతకాలం సీల్ చేసి ఉన్న విషయాన్ని బ్రేక్ చేసి, స్టన్నింగ్ సర్ప్రైజ్గా చెబుతున్నాం. ‘మరక్కర్’ చిత్రం థియేటర్స్లో ఈ ఏడాది డిసెంబరు 2న విడుదల కానుంది’’ అని శుక్రవారం మోహన్లాల్ స్పష్టం చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. 67వ జాతీయ అవార్డ్స్లో ఈ చిత్రం మూడు (బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్) విభాగాల్లో అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. -
బాత్రూం గోడలో దూరిన వ్యక్తి.. 2 రోజుల తర్వాత నగ్నంగా దర్శనం
న్యూయార్క్: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సినిమా థియేటర్కు వెళ్లాడు. ఏం అయ్యిందో తెలియదు కానీ.. బాత్రూం గోడకున్న కన్నంలో దూరాడు. దాదాపు రెండు రోజుల తర్వాత గోడ పగలగొట్టిన పోలీసులకు అక్కడ నగ్నంగా ఉన్న వ్యక్తి కనిపించాడు. అతడిని బయటకు తీసుకువచ్చి.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి న్యూయార్క్లోని ఓ థియేటర్కు వెళ్లాడు. బాత్రూంకు వెళ్లిన వ్యక్తి.. అనుకోకుండా అక్కడ గోడకున్న పెద్ద కన్నంలోంచి లోపలికి వెళ్లాడు. అలా రెండు, మూడు రోజులు గడిచాయి. అప్పటి వరకు కన్నంలో ఉండిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత సాయం కోసం కేకలు వేయసాగాడు. అప్పుడుగానీ అతగాడి గురించి థియేటర్ యాజమాన్యానికి తెలియలేదు. (చదవండి: అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ ఇది) ఇక విషయం తెలిసిన వెంటనే థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాత్రూం గోడకు వేరే చోట కన్నం చేసి.. దాని గుండా ఫైబర్ ఆప్టిక్ కెమరాను పంపి.. అతడు ఉన్న ఎగ్జాక్ట్ లోకేషన్ని గుర్తించారు. ఆ తర్వాత గోడను పగలకొట్టి చూడగా.. సదరు వ్యక్తి నగ్నంగా దర్శనమిచ్చాడు. (చదవండి: ఫస్ట్డేట్ రోజే విషాదం: టిక్టాక్ స్టార్ కాల్చివేత) అతడిని బయటకు తీసుకువచ్చిన పోలీసులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘సదరు వ్యక్తి మానసిక వికలాంగుడు. సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక అతడు బాత్రూం గోడ కన్నంలోకి ఎందుకు వెళ్లాడనే విషయం అర్థం కావడం లేదు. బహుశా వెచ్చగా ఉంటుందని భావించి వెళ్లాడేమో’’ అని తెలిపాడు. చదవండి: అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్కు పోటీగా! -
థియేటర్స్ ఓపెన్: విడుదలకు బడా బాలీవుడ్ చిత్రాలు
‘‘ఇక థియేటర్లు తెరవొచ్చు’’ అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అక్టోబర్ 22నుంచి థియేటర్లు తెరవడానికి అనుమతించింది. ఇలా అనుమతి వచ్చిందో లేదో అలా విడుదల పర్వం మొదలైంది. ఆదివారం ఏకంగా హిందీ పరిశ్రమ పది సినిమాలకు పైగా రిలీజ్ తేదీలు ప్రకటించడం విశేషం. ఒక్క యశ్ రాజ్ సంస్థ నుంచే నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్రాలేంటో చూద్దాం. కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత ముందుగా విడుదల కానున్న చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ 2’. నవంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వరుణ్ వి. శర్మ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ బంటీగా సైఫ్ అలీఖాన్, జూనియర్ బంటీగా సిద్ధార్థ్ చతుర్వేది, బబ్లీగా రాణీ ముఖర్జీ నటించారు. ఇది కాకుండా యశ్ రాజ్ మరో మూడు చిత్రాల విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అక్షయ్ కమార్, మనూషీ చిల్లర్, సంజయ్ దత్ ప్రధాన తారాగణంగా డా.చందప్రకాశ్ ద్వివేదీ దర్శకత్వంలో యశ్ రాజ్ నిర్మించిన ‘పృథ్వీరాజ్’ సినిమా 2022 జనవరి 21న విడుదల కానుంది. చౌహానా వంశానికి చెందిన చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా విడుదలైన నెలకు ఫిబ్రవరి 25న యశ్ రాజ్ నుంచి రానున్న మరో చిత్రం ‘జయేష్భాయ్ జోర్దార్’. సోషల్ కామెడీ డ్రామా నేపథ్యంలో రణ్వీర్ సింగ్, షాలినీ పాండే జంటగా దివ్యాంగ్ తక్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మార్చి నెలలో 18వ తేదీన యశ్ రాజ్ నుంచి రానున్న మరో చిత్రం ‘షంషేరా’. రణ్బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీ కపూర్ కాంబినేషన్లో రూపొందిన ఈ పీరియాడికల్ మూవీకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఇక యశ్ రాజ్ నుంచి రానున్న నాలుగు చిత్రాలతో పాటు ఇంకా విడుదల ఖరారు చేసుకున్న చిత్రాల్లో 2021 చివరి నెలలో డిసెంబర్ 3న ‘తడప్’ ఒకటి.. అహన్ శెట్టి, తారా సుతారియా జంటగా సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని మిలన్ లూథ్రియా దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మించారు. ఇక క్రిస్మస్కి పండగకి తెలుగు తెరపై క్రికెట్ చూపించడానికి రెడీ అయింది ‘83’ టీమ్. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ ఎలా సాధించింది? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ చేశారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన ఓ వారానికి మళ్లీ క్రికెట్ సినిమానే ప్రేక్షకులు చూడనున్నారు. క్రికెట్ నేపథ్యంలో నాని నటించిన ‘జెర్సీ’ హిందీ రీమేక్ డిసెంబర్ 31న విడుదల కానుంది. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ రీమేక్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మించారు. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్గా ఆమిర్ ఖాన్, నాగచైతన్య, కరీనా కపూర్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘లాల్సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఇంకా అక్షయ్కుమార్ హీరోగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మించిన ‘బచ్చన్ పాండే’ మార్చి 4న, కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ కాంబినేషన్లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భూల్ భులయ్యా 2’ మార్చి 25న, అజయ్ దేవగన్ నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘మేడే’ ఏప్రిల్ 29న, అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా నటిస్తున్న చిత్రం మే 6న, అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్న ‘రామ సేతు’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఇలా.. ఒకేరోజున ఇన్ని చిత్రాల విడుదల తేదీల ప్రకటన రావడం సినిమా లవర్స్కు ఓ పండగ అని చెప్పొచ్చు. -
తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు వ్యాపారం వైపు కూడా దృష్టి సారించాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో దూసుకెళ్తున్న విజయ్ తాజాగా థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తెలంగాణలోని మహబూబ్నగర్లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్ను ఏవీడీ (ఏషియన్ విజయ్ దేవరకొండ)గా పేరుతో నిర్మించాడు. ఈ థియేటర్ను నిన్న ప్రారంభించాడు. ఆ థియేటర్లో తొలిసారి తన గురువు సినిమాను ప్రదర్శనకు ఉంచాడు. తనకు సినిమా అవకాశాలతో గుర్తింపు ఇచ్చిన శేఖర్ కమ్ములకు కృతజ్ఞతగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్స్టోరీ’ సినిమాను ప్రదర్శించాడు. అయితే శుక్రవారం తన తల్లి మాధవి జన్మదినం సందర్భంగా ఆ టాకీస్ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా థియేటర్ హాల్లో తల్లి మాధవి ఉన్న ఫొటోను పంచుకుంటూ ‘హ్యాపీ బర్త్ డే మమ్ములు. ఈ ఏవీడీ (థియేటర్) నీకోసం. నీవు ఆరోగ్యంగా ఉంటే నేను మరింత కష్టపడతా. నీకు మరిన్ని జ్ఞాపకాలు ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్ ప్రారంభానికి విజయ్ అందుబాటులో లేడు. Happy Birthday mummuluu ❤️ This one is for you! #AVD If you workout and stay healthy, I will work harder and give you more memories 😘🤗 pic.twitter.com/edGhLLnGn0 — Vijay Deverakonda (@TheDeverakonda) September 24, 2021 -
కొత్త బిజినెస్ ప్రారంభించనున్న విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్న రౌడీ హీరో, అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి మల్టీప్లెక్స్ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ఏవీడీ (ఆసియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో ఆ మల్టీప్లెక్స్ను సెప్టెంబర్ 24న ప్రారంభించనున్నట్లు ఈ కుర్ర హీరో తెలిపాడు. నటుడిగా రాణించాలనే కల నుంచి సొంతంగా మల్టీప్లెక్స్ సినిమాను నిర్మించే వరకు రావడం ఆనందంగా ఉందని చెప్పాడు. కాగా, విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగర్’ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. చదవండి: బన్నీ రికార్డు బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ From dreaming of becoming an Actor to now owning my own Multiplex Cinema 😊 I share with you all, Asian Vijay Deverakonda cinemas 🤗 The 1st AVD will officially open in Mahbubnagar, from September 24th 2021. https://t.co/rv5l22B16U — Vijay Deverakonda (@TheDeverakonda) September 19, 2021 -
ఓటీటీలోకి నితిన్.. థియేటర్లోకి సందీప్, ఇంకా మరెన్నో..
కరోనా సెకండ్ వేవ్ తర్వాత గతవారం గోపిచంద్ ‘సీటీమార్’ వంటి సినిమాలు థియేటర్లో విడుదలవగా, నాని ‘టక్ జగదీష్’ వంటి కొన్నిసినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇలా కొన్ని వెండితెరపై, మరికొన్ని బుల్లితెరపై సినీ ప్రేక్షకులను అలరించాయి. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ వారం విడుదలయ్యే మూవీస్ ఏంటో చూద్దాం! థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు: గల్లీలో రౌడీయిజం చేస్తానంటున్న సందీప్ జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో సందీప్కిషన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఫుల్టైమ్ కామెడీ ఎంటర్టైనర్ రానున్న ఈ చిత్రంలో నేహాశెట్టి కథానాయిక. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 17న థియేటర్ల్లో విడుదల కానుంది. ఇటీవల అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్ మిరియాల, సాయికార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ట్యూషన్ చెప్పబోతున్న విజయ్ ఆంటోని బిచ్చగాడు ‘ఫేం’ విజయ్ ఆంటోని తాజాగా నటించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఆయన ట్యూషన్ మాస్టర్గా చేస్తున్న ఈ సినిమాకి ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి, ఈ నెల 17న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మంచగా, నివాస్ కె. ప్రసన్న సంగీతం అందించారు. తెరపైకి క్రికెటర్ హర్భజన్ సింగ్ క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు అర్జున్ కథానాయకులు నటించిన చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబరు 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మహిళల్ని ఎలా గౌరవించాలనే అంశం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎ.ఎన్.బాలాజీ నిర్మించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ‘జెమ్’ సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో విజయ్రాజా, రాశీసింగ్, నక్షత్ర నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘జెమ్’. పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. ‘రాయలసీమ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సాగే ఈనెల 17న థియేటర్లలో విడుదల విడుదల అవుతోంది. ‘ప్లాన్ బి’తో ఉందంటున్న శ్రీనివాసరెడ్డి కమెడియన్ శ్రీనివాస్రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నచిత్రం ‘ప్లాన్ బి’. కె.వి.రాజమహి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చ్రితానికి ఏవీఆర్ నిర్మాత. మురళీశర్మ, రవిప్రకాష్, సూర్య వశిష్ఠ, ముఖ్యపాత్రల్లో నటించారు. నేర నేపథ్యంలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాని ఈ నెల 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్. ‘హనీట్రాప్’ చేసేదెవరు? పడేదెవరు? దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి ‘సొంతవూరు’, ‘గల్ఫ్’వంటి చిత్రాలతో తనకంటూ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. ఆయన కొత్త చిత్రం ‘హనీ ట్రాప్’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వివి వామనరావు నిర్మించిన ఈ చిత్రంలో ఆయనే ఓ కీలక పాత్రలో సైతం నటించారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరాలందించిన ఈ సినిమాని ఈనెల 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఓటీటీ వేదికగా అలరించనున్న చిత్రాలు, సిరీస్లు: ‘మ్యాస్ట్రో’గా వస్తున్న నితిన్ నితిన్, నభా నటేశ్ హీరో, హీరోయిన్స్గా నటించిన చిత్రం ‘మ్యాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’కి రిమేక్ వస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్స్టార్లో సెప్టెంబరు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంధుడిగా నితిన్ నటన ప్రేక్షకులను ఆకట్టకునేలా ఉంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అదించాడు. మరో చిత్రంతో విజయ్సేతుపతి! తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన రెండో సినిమాలు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మూడో చిత్రం ‘అనబెల్.. సేతుపతి’ ఈ నెల 17న విడుదల కానుంది. డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రానికి దీపక్ సుందర్రాజన్ దర్శకుడు. సేతుపతికి జోడిగా తాప్సీ పన్ను నటించింది. ఓటీటీలోకి రానున్న సుశాంత్ సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ రొమాంటిక్ డ్రామా థ్రిల్లర్కి దర్శకుడు ఎస్.దర్శన్. వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా, ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబరు 17 ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ♦ డోర్ ఏ అండ్ మీ -సెప్టెంబరు 17 ♦ వీడ్స్ - సెప్టెంబరు 15 ♦ సెర్చింగ్ -సెప్టెంబరు 14 ♦ ఆజ్ ఎబౌ సో బిలో -సెప్టెంబరు 16 డిస్నీ ప్లస్ హాట్స్టార్ ♦ అన్ హియర్డ్- సెప్టెంబరు 17 ♦ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ షోఫాహోలిక్- సెప్టెంబరు 17 నెట్ఫ్లిక్స్ ♦ అన్కహీ కహానియా- సెప్టెంబరు 17 ♦ నైట్ బుక్స్ -సెప్టెంబరు 15 జీ5 ♦ సర్వైవర్- సెప్టెంబరు 12(రియాల్టీ షో) ♦ బుక్ మై షో - ది సూసైడ్ స్క్వాడ్ -సెప్టెంబరు 16 సోనీ లైవ్ ♦ ప్రియురాలు - సెప్టెంబరు 17 హెచ్బీవో మ్యాక్స్ ♦ హథీ మేరీ సాథీ (సెప్టెంబరు 18) -
అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ ఇది
‘‘డియర్ మేఘ’ ఒక భావోద్వేగంతో కూడిన ప్రేమకథ. ఇప్పటివరకూ అబ్బాయిల వైపు నుంచి వచ్చిన ప్రేమకథలు చాలా చూసి ఉంటాం. కానీ, ఇది మేఘ అనే అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ’’ అని నిర్మాత అర్జున్ దాస్యన్ అన్నారు. మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ– ‘‘ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేసి, లండన్, హైదరాబాద్లో పనిచేశాను. చిరంజీవిగారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాతగా స్థిరపడాలనే టాలీవుడ్లో అడుగుపెట్టాను. ప్రొడక్షన్ ప్రారంభించకముందు రెండేళ్ల పాటు దర్శకుడు వీఎన్ ఆదిత్యతో ప్రయాణం చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. నా తొలి చిత్రం ఆదిత్యగారి దర్శకత్వంలోనే నిర్మించాను. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్ల నేను తీసిన రెండో చిత్రం ‘డియర్ మేఘ’ తొలి చిత్రంగా విడుదలవుతోంది. ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. ఆ ధైర్యంతోనే ఓటీటీకి వెళ్లకుండా థియేటర్లో విడుదల చేస్తున్నాం. కొందరు కొత్త దర్శకులు, రచయితలు కథలు చెప్పారు.. నాలుగైదు కథలను ఓకే చేశాం. వీఎన్ ఆదిత్యతో తీసిన సినిమా రిలీజ్ తర్వాత పెద్ద హీరోతో ఓ సినిమాని ప్రకటించబోతున్నాం’’ అన్నారు. చదవండి : ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి: ఆర్జీవీ అప్పుడు నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా – నాని -
'ఓ హీరోను టార్గెట్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు'
‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఓ సినిమాకు పునాది వేసి, ఆ సినిమాను నిర్మించే నిర్మాతకు తన సినిమాను ఎప్పుడు.. ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది’’ అని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ఏటీఎఫ్పీజీ) ప్రతినిధులు సోమవారం ఓ ప్రెస్నోట్ను విడుదల చేశారు. సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్స్కు ఇవ్వడంవల్ల థియేటర్ల మనుగడ కష్టమవుతుందంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ (టీఎస్సీటీఏ) ఈ నెల 20న ఓ మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ఓటీటీలో తమ సినిమాను విడుదల చేయాలనుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం అమోదయోగ్యం కాదని ఏటీఎఫ్పీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్ ఉన్న హీరోల వల్లే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోందని, ప్రత్యేకంగా ఒక హీరోని టార్గెట్ చేయడం అనేది ఇండస్ట్రీలోని స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీస్తుందని కూడా ఏటీఎఫ్పీజీ పేర్కొంది. ఏ నిర్మాత అయినా ప్రాథమికంగా థియేటర్స్లోనే సినిమాను విడుదల చేయాలనుకుంటాడని, మారిన పరిస్థితుల దృష్ట్యా తన పెట్టుబడిని రాబట్టుకునే క్రమంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్కు అమ్ముకునే ఆలోచన చేయవచ్చని ఏటీఎఫ్పీజీ అంటోంది. అలాగే డిమాండ్ ఉన్న సినిమాలపైనే ఎగ్జిబిటర్స్ ఆసక్తి చూపిస్తారు కానీ ఓ మాదిరి సినిమాలను పట్టించుకోరని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. చదవండి : ముచ్చటగా మూడోసారి!..బుట్టబొమ్మతో బన్నీ స్టెప్పులు హీరోగా దిల్రాజు తమ్ముడి కొడుకు..ఫస్ట్లుక్ రిలీజ్ -
హౌస్ ఫుల్లా ? నిల్లా ?
-
ఫస్ట్డేట్ రోజే విషాదం: టిక్టాక్ స్టార్ కాల్చివేత
కాలిఫోర్నియా: అమెరికాలోని కరోనా థియేటర్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన టిక్టాక్ స్టార్ ఆంథోనీ బరాజాస్ (19) తుది శ్వాస విడిచాడు. గతం వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆంథోనీ మెదడులోని తీవ్ర గాయాల కారణంగా చనిపోయినట్టు కాలిఫోర్నియా పోలీసులు ప్రకటించారు. గత నెల 26 న దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా థియేటర్లో హారర్ మూవీ "ది ఫరెవర్ పర్జ్" ప్రదర్శిస్తున్న సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సినిమా ముగిసిన తర్వాత, ఆడిటోరియం శుభ్రం చేస్తున్నథియేటర్ ఉద్యోగులు రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరు బాధితులను గుర్తించారని రివర్సైడ్ కౌంటీ ప్రాసిక్యూటర్ మైక్ హెస్ట్రిన్ ఒక ప్రకటనలో తెలిపారు. చాలా సమీపంనుంచి ఇద్దర్నీ తలపై గురిపెట్టి మరీ కాల్చిన ఈ ఘటనలో ఆంథోనీ ఫ్రెండ్ రైలీ గుడ్రిచ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన ఆంథోనీని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోవడంతో వైద్యులు లైఫ్ సపోర్టు తొలగించారు. దీంతో అతను సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కాలిఫోర్నియా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇది అనాలోచిత చర్యగా ప్రకటించారు. ఈ ఘటనలో నిందితుడు జోసెఫ్ జిమెనెజ్ (20)ను అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రైలీ గుడ్రిచ్ (ఫైల్ ఫోటో) చెరగని చిరునవ్వు, దయగల హృదయం ఆంథోనీ సొంతం.తన గురించి తెలిసిన వారందరికీ అతడొక గిప్ట్..ఆయనలేని లోటు తీరనిది అంటూ ఆంథోనీ కుటుంబం నివాళులర్పించింది. అటు ఆంథోనీ అకాల మరణంపై స్నేహితులు తీవ్ర విచారం చేశారు. ఫస్ట్ డేట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆంథోనీ, రైలీని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు ఆంథోనీ బరాజాస్ అవయవాలను దానం చేయన్నారని అతని స్నేహితుడు మాలిక్ ఎర్నెస్ట్ ట్విట్ర్లో తెలిపారు. కాగా ఆంథోనికి టిక్టాక్లో దాదాపు 10 లక్షల మంది, ఇన్స్టాలో 50 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. హైస్కూల్ స్థాయిలో అద్భుతమైన సాకర్ ప్లేయర్గా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆంథోని లైఫ్ సపోర్ట్లో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం ‘గోఫండ్మీ’ ద్వారా 80వేల డాలర్లకు పైగా విరాళాలు రావడం గమనార్హం. నిందితుడు నజోసెఫ్ జిమెనెజ్(ఫైల్ ఫోటో) -
తెలుగు రాష్ట్రాల్లో రేపటినుండి తెరుచుకోనున్న థియేటర్స్
-
తెరుచుకోనున్న థియేటర్లు.. టికెట్ ధరలపై నిర్ణయం?
సాక్షి, అమరావతి : కరోనా ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. ఫస్ట్వేవ్ నుంచి కోలుకుంటున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ వచ్చి పడటంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో థియేటర్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈనెల 31 నుంచి థియేటర్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు, లైసెన్సింగ్ విధానం, థియేటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యల పరిష్కారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలించాంబర్ మాజీ అధ్యక్షుడు ఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘చాలా మంది థియేటర్లలో సినిమాలు ప్రదర్శించలేని పరిస్థితి ఉంది. సినీ రాజధాని విజయవాడకు పూర్వ వైభవం తీసుకురావాలి. సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిగణలోకి తీసుకొని స్పందిస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు. ఈ సమావేశంలో 13 జిల్లాల థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. -
జూలై చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
కొత్త సినిమా రిలీజవుతుందంటే చాలు, థియేటర్ల దగ్గర బోలెడంత హడావుడి ఉండేది. కానీ కరోనా కారణంగా షూటింగులకు, మూవీస్ రిలీజ్కు బ్రేక్ పడటంతోపాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. మరికొన్ని మాత్రం అప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్తో డీల్ కుదుర్చుకోవడంతో డిజిటల్ స్ట్రీమింగ్కు సై అంటున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూసేద్దాం.. ఇష్క్ జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ఇష్క్: నాట్ ఎ లవ్ స్టోరీ. ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన ఈ సినిమాను థియేటర్లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఇటీవలే కరాఖండిగా చెప్పేసిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ రాజు దర్శకత్వంలో ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్కుమార్ నిర్మించిన ఈ చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అలాంటి తెలివితేటలున్న లాయర్ పాత్రలో సత్యదేవ్ నటించిన చిత్రం తిమ్మరుసు. ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. వీటితో పాటు రిలీజ్ కానున్న మరిన్ని చిత్రాలు... మిమి: నెట్ఫ్లిక్స్, జూలై 26 లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కరోనా(లఘు చిత్రం): వూట్ సెలక్ట్, జూలై 27 లైన్స్ (లఘు చిత్రం): వూట్ సెలక్ట్, జూలై 29 ఛత్రసల్(వెబ్ సిరీస్): ఎమ్ఎక్స్ ప్లేయర్, జూలై 29 వన్: ఆహా, జూలై 30 సిటీ ఆఫ్ డ్రీమ్స్ రెండో సీజన్: డిస్నీ ప్లస్ హాట్స్టార్, జూలై 30 లిహాఫ్(లఘు చిత్రం): వూట్ సెలక్ట్, జూలై 31 -
ఆట మొదలుకానుంది.. ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందే!
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): కరోనా సెకండ్వేవ్తో మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం నుంచి తెరచుకోనున్నాయి. గురువారం థియేటర్లను శానిటైజ్ చేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ సింగిల్ స్క్రీన్ థియేటర్లను మాత్రమే తెరవనున్నారు. కరోనా లాక్డౌన్తో గతేడాది మార్చి 14వ తేదీన థియేటర్లను మూసేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 4న థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కరోనా సెకండ్వేవ్ విశ్వరూపం దాల్చి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఈ ఏడాది మే 1 నుంచి మళ్లీ మూతపడ్డాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం సినిమా హాళ్లను తెరిచేందుకు మళ్లీ అనుమతినిచ్చింది. శుక్రవారం నగరంలోని 60 శాతం థియేటర్లు తెరచుకోనున్నాయి. మరో మూడు వారాల్లోగా 100 శాతం థియేటర్లను తెరవనున్నారు. -
ఇకపై థియేటర్స్లో పార్కింగ్ ఫీజు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జీవో నెం.63ను సవరించింది. అయితే మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. మల్టీఫ్లెక్స్ లకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమలవుతాయన్న ప్రభుత్వం..పార్కింగ్ ఫీజు ధరలను థియేటర్ యాజమాన్యాలకే వదిలేసింది. గతంలో 2018లో కారుకు రూ.30, ద్విచక్రవాహనాలకు రూ. 20లను థియేటర్ యాజమాన్యాలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఉత్వర్వుల నేపథ్యంలో గతంలో కంటే పార్కింగ్ ఫీజులు తగ్గిస్తామని థియేటర్ యాజమాన్యాల వెల్లడించాయి. ఇక ఈ నెల 23నుంచి తెలంగాణలో థియేటర్లు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. అయితే నాగచైతన్య ‘లవ్స్టోరి’, నాని ‘టక్ జగదీష్’ సహా మరికొన్ని పెద్ద సినిమాలు మాత్రం థియేటర్ రిలీజ్ కోసం వేచి ఉన్నాయి. క్యూలో ఉన్న సినిమాలన్నీ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
థియేటర్స్లోనే 'ఇష్క్' అంటున్న తేజ-ప్రియా ప్రకాశ్
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్’. నాట్ ఎ లవ్స్టోరీ అనేది ట్యాగ్లైన్. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్కు బ్రేక్ పడింది. తాజాగా థియేటర్లు తెరుచుకున్న కారణంగా ఈ నెల 30న థియేటర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. కాగా చెల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. జాంబిరెడ్డితో హిట్ ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి హనుమాన్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
తెలంగాణలో 23 నుంచి వందశాతం ఆకుపెన్సీతో థియేటర్లు ఓపెన్
-
తెలంగాణ: ఈనెల 23 నుంచి థియేటర్లు ఓపెన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా వరకు సినిమాలు ఓటీటీని ఆశ్రయించాయి. అయితే కొన్ని పెద్ద సినిమాలు థియేటర్ రిలీజ్కోసం వేచి ఉన్నాయి. క్యూలో ఉన్న సినిమాలన్నీ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
ఈ నెలాఖర్లో థియేటర్లు తెరుచుకోవడం ఖాయం!
ఓ పక్క కరోనా, మరో పక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. దీంతోపాటు నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతుండటంతో థియేటర్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయి? జనాలు తిరిగి థియేటర్లలో బొమ్మ చూసేదెప్పుడు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఏదేమైనా జూలై నెలాఖరు వరకు థియేటర్లు ఓపెన్ చేస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ వీఎల్ శ్రీధర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ జాయింట్ సెక్రటరీ బాలగోవిందరాజు స్పష్టం చేశారు. ఆగస్టు 15కు రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా ఓ 15 సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయని తెలిపారు. ఓటీటీ కేవలం కంటెంట్ను అందించేది మాత్రమేనని, థియేటర్లు దాన్ని ప్రదర్శించేదని చెప్పుకొచ్చారు. -
థియేటర్స్ V/S ఓటిటి
-
'మూడు నెలల వరకు సినిమాలను ఓటీటీలో విడుదల చెయ్యొద్దు'
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని థియేటర్ల ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే మూడు నెలల వరకైనా సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దు. ఇప్పటికే మా ఒంటి నిండా బాణాలు గుచ్చుకున్నాయి. దయచేసి కత్తితో పొడిచి చంపకండి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా అక్టోబర్ తరువాతే ఓటీటీకి ఇవ్వండి అంటూ నిర్మాతలను కోరారు.ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ గోవింద్ రాజ్, విజయేంద్ర రెడ్డి, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా సహా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... "మా అందరి అభిప్రాయం ఒక్కటే..అక్టోబర్ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలెవ్వరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి’అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. "ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందుకు అందరికీ థ్యాంక్స్. ఈ విషయం అందరికీ తెలియాలి. మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతోన్నామనేది అందరికీ తెలియాలి. మీ రిక్వెస్ట్ ఏంటి? అని చాలా మంది నిర్మాతలు ఫోన్ చేసి అడుగుతున్నారు. అందరికీ తెలియాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఆగస్ట్ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు.. కనీసం పెద్ద వాళ్లు అయినా కూడా ఆపుకోవాలి కదా?. కనీసం అక్టోబర్ 30 వరకైనా ఆపుకోండి. సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్ ఎక్కువ బాధలు పడుతున్నారు. అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. మేం నిర్మించిన 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను.. నమస్కారం పెట్టి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40, 50 కోట్ల ఆఫర్లు ఇవ్వవు. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయి. అందుకని, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి’ అని అన్నారు. తెలంగాణ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీ చట్టం కల్పించిన హక్కు కానే కాదు. సినిమాలను ఎవ్వరికైనా అమ్ముకోడం నిర్మాత హక్కు. సినిమాలు రిలీజైన పది వారాలకో ఎప్పుడో ఓటీటీకి అమ్ముకోవాలనే కండీషన్ తో పది కోట్లకో ఇరవై కోట్లకో డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్న రోజునే అగ్రిమెంట్లో ఎంటర్ చేస్తే.. మా ఛాంబర్ చర్య తీసుకుంటుంది. నిర్మాతలం మాకు హక్కు ఉంటుందని కాకుండా.. అక్టోబర్ వరకు ఎదురు చూడండి. అక్టోబర్ వరకు పరిస్థితు సద్దుమణకపోతే, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే, కరోనా తగ్గకపోతే అప్పుడు ఓటీటీకి వెళ్లండి. నిర్మాతలందరికీ ఇది మా రిక్వెస్ట్. అందరూ ఓపికతో ఉండండి. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి చూస్తున్నాయి. ఈ రోజు మమ్మల్ని కిల్ చేస్తే రేపు నిర్మాతలను కిల్ చేస్తాయి. నిర్మాతలకు వెంటనే షేర్ ఇచ్చేది మేమే. పీవీఆర్, ఐనాక్స్ వంటి కంపెనీలు ఎప్పుడు ఇస్తాయో తెలిసిందే. అలాగే, ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ చేస్తాయి’ అని అన్నారు. చైర్మన్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘ఈ పాండమిక్ వల్ల అందరూ ఎంత బాధ పడ్డారో అందరం చూశాం. అందరి కంటే ఎక్కువగా కష్టాలు పడింది సినిమా పరిశమ్రకు చెందిన వాళే. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కోలుకుంటున్నాయి. కానీ ఒక్క సినీ ఇండస్ట్రీ మాత్రం ఇంకా అలానే ఉంది. ప్రతీ శుక్రవారం రాగానే థియేటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఓటీటీ వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షోను తీసేసింది. నిర్మాతలకు మంచి అమౌంట్ ఇచ్చి సినిమాలను తీసేసుకుంటున్నారు. అయితే థియేటర్లో సినిమా రిలీజ్ చేసిన ఆ తరువాత ఓ 20 రోజులకు ఓటీటీకి ఇస్తే అందరూ బాగుంటారు. థియేటర్లో టిక్కెట్ ఇచ్చే వ్యక్తి నుంచి ఎంతో మంది ఆధారపడి ఉన్నారు.. మీడియా కూడా ఆధారపడి ఉంది.. మీ సహకారం కూడా కావాలి.. అందరి సపోర్ట్ లేకపోతే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లలేమ’ని అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఓటీటీల గురించి నిర్మాతలందరినీ మేం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా.. వాళ్లు తమ ఇష్టం మేరకు వెళ్తే.. మేం ఏం చేయాలో అది చేస్తాం.. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసి చూపెట్టాం.. అది వారికి తెలియడం లేదు.. ఇప్పుడైతే మేం రిక్వెస్ట్ చేస్తున్నాం.. నిన్న కూడా రిక్వెస్ట్ చేసినం.. భవిష్యత్ అంతా కూడా సినిమా పరిశ్రమదే, థియేటర్లదే. ఫ్యామిలీలు అంతా కూడా సినిమాకు వెళ్లాలంటే పిక్నిక్ టైప్ ప్లానింగ్ చేసుకుంటున్నాయ్. ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్లకి సినిమా ఏం అర్థమవుతుంది. ఇంకా 25 ఏళ్లు అయినా 50 ఏళ్లు అయినా కూడా థియేటర్ బతికే ఉంటుంది.. ఇది నా అభిప్రాయం’ అని అన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్ ఓనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం లాక్డౌన్ కూడా ఎత్తివేసిన క్రమంలో అక్టోబర్ వరకు తెలుగు నిర్మాతలెవరూ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాల్ని విడుదల చేయడం అక్టోబరు వరకు ఆపాలని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ సూచించిన సంగతి తెలిసిందే. -
థియేటర్లు తెరుచుకున్నా.. సినిమా రిలీజ్లు మాత్రం లేనట్లే!
తెలుగు నేలపై థియేటర్లు మళ్ళీ కొత్త సినిమాలతో కళకళలాడేదెప్పుడు? ఇప్పుడు అందరి ప్రశ్నా ఇదే. ఒకటి రెండు రోజుల్లో థియేటర్లలో యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమాల ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని సినీ వర్గాల భోగట్టా. ఇటు తెలంగాణలో ఇప్పటికే థియేటర్స్లో వంద శాతం సామర్థ్యంతో సినిమాల ప్రదర్శనలకు అనుమతులు ఉన్నాయి. అంటే... ఇక సినిమాలు విడుదల కావడమే ఆలస్యం. నిజానికి లాక్డౌన్కి ముందే నాగచైతన్య ‘లవ్స్టోరి’, నాని ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’ వంటివి విడుదలకు సిద్ధమయ్యాయి. మరి.. థియేటర్ల రీ–ఓపెన్ అయితే, ఇవి వెంటనే తెర మీదకు వస్తాయా? సినీ వర్గాల కథనం ప్రకారం... ఈ నెలాఖరున లేక వచ్చే నెల మొదట్లో కానీ కొత్త సినిమాలు రాకపోవచ్చు. ఎందుకంటే, తెలంగాణలో విద్యుత్ ఛార్జీల రాయితీలకు హామీ, పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతి వంటి విషయాల్లో ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అవి నెరవేరితేనే థియేటర్ల మనుగడకు మార్గం సుగమం అవుతుందని కొందరు ఎగ్జిబిటర్ల వాదన. అలాగే ఏపీలో తగ్గించిన టికెట్ ధరలలో కొంత పెరుగుదలను ఆశిస్తున్నామని కూడా వారు అన్నారు. థియేటర్ల మనుగడ కోసం‡రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నామని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. -
సినీ ప్రియులకు గుడ్న్యూస్.. థియేటర్లకు అనుమతి
సినీ ప్రియులకు గుడ్న్యూస్. ఎప్పుడెప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. జులై 8వ తేదీ నుంచి 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా కారణంగా వేల కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది ఈ మాయదారి వైరస్. అయితే కేసులు తగ్గిపోతున్న తరుణంలో అన్లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. అలా థియేటర్లు ఓపెన్ అయిన రెండు, మూడు నెలలకే కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో దాదాపు అన్ని రాషష్ష్ర్టాల్లో లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో థియేటర్ల అనుమతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాయిదా పడిన సినిమా షూటింగులు కొద్ది రోజుల నుంచి జోరందుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు తెలంగాణలో ఇప్పటికే థియేటర్లకు అనుమతిచ్చినా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వందశాతం ఆక్యూపెన్సీతో త్వరలోనే థియేటర్ల అనుమతికి తెలంగాణ ప్రభత్వం పచ్చజెండా ఊపుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సమస్యలను పరిష్కరిస్తేనే థియేటర్లను తెరుస్తామంటున్న యజమానులు
-
లాక్డౌన్ తర్వాత రిలీజైన తొలి పెద్ద సినిమా గుర్తుందా?
గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్బాబు, ప్రభాస్, రామ్చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. -
ఏది ఏమైనా మా సినిమా రిలీజవుతుంది
‘‘కరోనా నేపథ్యంలో థియేటర్లు మూసివేత అంటున్నారు. కానీ, ఏది ఏమైనా ‘శుక్ర’ సినిమాను విడుదల చేయడానికే నిర్ణయించుకున్నాం. మా చిత్రం విడుదలకు సహకరించిన ‘మధుర’ శ్రీధర్గారికి థ్యాంక్స్’’ అని దర్శకుడు సుకు పూర్వజ్ అన్నారు. అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మించిన ‘శుక్ర’ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘వోట్ ఆఫ్ థ్యాంక్స్ మీట్’లో సుకు పూర్వజ్ మాట్లాడుతూ– ‘‘శుక్ర’ అంటే డైమండ్ అని మా సినిమాలో అర్థం చెబుతున్నాం. మా చిత్రం ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇంకో 10, 15 ఏళ్లు ఇండస్ట్రీలో దర్శకుడిగా ఉంటానన్న నమ్మకం ఉంది’’ అన్నారు. తేజ్ పల్లె మాట్లాడుతూ– ‘‘మాకున్న బడ్జెట్కు ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్ వచ్చిందంటే సినిమాటోగ్రాఫర్ జగదీశ్ ప్రతిభే కారణం. సుకు పూర్వజ్ మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు. అరవింద్ కృష్ణ వన్ మ్యాన్ షో లాగా ఈ సినిమా చేశాడు’’ అన్నారు. ‘‘మీకు మా సినిమా పాటలు, ట్రైలర్, విజువల్స్ నచ్చితే థియేటర్లకు రండి. మాస్క్ పెట్టుకుని, సామాజిక దూరం పాటిస్తూ సినిమా చూడండి’’ అన్నారు అరవింద్ కృష్ణ -
అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్కు పోటీగా!
సినిమాలతోపాటు ఇతర బిజినెస్లపై దృష్టిపెట్టారు మన టాలీవుడ్ హీరోలు.. కొత్త రంగాల్లో పెట్టిబడి పెడుతూ చేతికి అందినంత సంపాదించుకునేదుకు సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. స్టార్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ఇప్పుడు థియేటర్ల రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఏషియన్ సినిమాస్తో కలిసి ఏఏఏ(AAA) సినిమాస్ మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ వ్యాపారంలో మహేశ్బాబు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్తో కలిసి ఏఎంబీ(AMB) సినిమాస్ పేరుతో మహేష్ బిజినెస్ చేస్తున్నాడు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఏవీడీ(AVD) సినిమాస్ పేరుతో తన సొంత పట్టణం మహబూబ్నగర్లో మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం బన్నీ కూడా థియేటర్ల బిజినెస్లోకి రావడంతో వీరిద్దరి మధ్య మంచి పోటీ నెలకొనబోతోందని టాక్ వినిపిస్తోంది. సినిమా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మల్టిప్లెక్స్ నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ ఇమేజ్కు తగ్గట్టుగానే ఏఏఏ సినిమాస్ నిర్మాణం జరుగుతోంది. అమీర్పేట్ పరిసరాల్లోనే అత్యంత విలాసవంతమైన భవంతిగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాతి వరకు ఈ థియేటర్ రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ ఫోటోతో ఏఏఏ లోగో కూడా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ రేంజ్ మించిపోయేలా ఏఏఏ సినిమాస్ ఉంటుదా అనేది తెలియాలంటే నిర్మాణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. చదవండి: పుష్పరాజ్ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు -
సినీ అభిమానులకు గుడ్న్యూస్..
హైదరాబాద్: లాక్డౌన్ అనంతరం థియేటర్లు యాభై శాతం ప్రేక్షకులతో కొనసాగగా.. తాజాగా వంద శాతం ప్రేక్షకులతో సినిమా థియేటర్లు కొనసాగించవచ్చని తెలంగాణ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. హౌస్ ఫుల్కు అవకాశం కల్పించింది. ఈ మేరకు థియేటర్లలో వందశాతం ప్రేక్షకులకు అనుమతిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమా థియేటర్లలో పూర్తిస్థాయిలో టికెట్లను అమ్ముకోవచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కొనసాగవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్లలో వంద శాతం సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ అనంతరం గతేడాది అక్టోబర్లో యాభై శాతం ప్రేక్షకులతో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం వంద శాతానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో తాము తీవ్ర నష్టాల పాలయ్యామని గతంలో థియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు హౌస్ఫుల్కు అనుమతి ఇవ్వడంతో థియేటర్లకు పూర్వ వైభవం రానుంది. అయితే ప్రేక్షకులను వంద శాతం అనుమతిచ్చినా కరోనా నిబంధనలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భౌతిక దూరం, మాస్క్లు, శానిటైజర్లు, టెంపరేచర్ చెకింగ్లు, షో టైమింగ్స్, బుకింగ్స్లో మార్పులు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే సినిమా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీ పెంచుకోవాలని తెలిపింది. ఈ నిర్ణయంతో థియేటర్లలో ఇప్పుడు ప్రేక్షకులతో మళ్లీ సందడి వాతావరణం ఏర్పడనుంది.