పాముకాటుతో విద్యార్థి మృతి | The student died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో విద్యార్థి మృతి

Published Sun, Dec 20 2015 10:28 AM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM

The student died of snakebite

ఖమ్మం జిల్లా భద్రా చలం నియోజక వర్గం ఆశ్వాపురం మండం బొండుగూడెం ఐటీడీసీ ఆశ్రమ పాఠశాలలో పాము కాటుకుగురై ఓ విద్యార్ధి మృతి చెందాడు. పాఠశాల బయట అపస్మారక స్థితిలో పడిఉన్న ముగ్గురు విద్యార్థులను గుర్తించి.. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే... 5తరగతి చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

పరిస్థితి విషమంగా ఉన్న రాజారాం అనే విద్యార్ధిని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. మరో విద్యార్థి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆడుకుంటూ ఉండగా.. విద్యార్థులకు పాము కాటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా.. భద్రాచలం ఆస్పత్రిలో ఉన్న విద్యార్థిని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement