Published
Fri, Sep 16 2016 8:27 PM
| Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి
మర్రిగూడ : కస్తూర్భా పాఠశాలలో మౌలిక వసతులు కలిపించకపోవడంతో పాఠశాల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఎంపీపీ అనంతరాజుగౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నుంచి∙పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక విద్యార్థినులు ఆరుబయటికి పోతున్నారన్నారు. పాలు ప్యాకెట్లు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు. మెను ప్రకారం భోజనం అందక విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల నిర్వాహణను మెరుగు పర్చాలని కోరారు. ఆయనlవెంట ఎంఈఓ ఎం.సుధాకర్ ఉన్నారు.