బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వివాహిత మృతి | wife died and husband injured in a road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వివాహిత మృతి

Sep 4 2016 10:01 AM | Updated on Sep 4 2017 12:18 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

రాయచోటి(వైఎస్సార్‌జిల్లా): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది.


లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన అంజనమ్మ(20) భర్తతో కలిసి బైక్‌పై రాయచోటికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అంజనమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement