మహిళ మృతదేహం లభ్యం | woman found dead | Sakshi
Sakshi News home page

మహిళ మృతదేహం లభ్యం

Dec 19 2016 12:23 AM | Updated on Sep 4 2017 11:03 PM

మండల పరిధిలోని చాయాపురం గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహాన్ని వజ్రకరూరు పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు.

వజ్రకరూరు: మండల పరిధిలోని చాయాపురం గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహాన్ని వజ్రకరూరు పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు. వజ్రకరూరు ఎస్‌ఐ జనార్ద¯ŒS నాయుడు తెలిపిన వివరాల మేరకు..పెంచలపాడు గ్రామానికి చెందిన సరస్వతి (26), ఆమె భర్త నాగభూషణంలు కొనకొండ్ల సమీపంలో పొలాన్ని కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నారు.

మిరప పంటకు శుక్రవారం నీరు పెడుతుండగా డీజిల్‌ ఇంజ¯ŒS ఆగిపోయింది. సరస్వతి ఇంజి¯ŒSలోకి డీజిల్‌ పోస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న  హంద్రీనీవా కాలువలోకి కాలుజారి పడిపోయింది. మృతదేహాన్ని శనివారం రాత్రి చాయాపురం వద్ద గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement