మండల పరిధిలోని చాయాపురం గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహాన్ని వజ్రకరూరు పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు.
మిరప పంటకు శుక్రవారం నీరు పెడుతుండగా డీజిల్ ఇంజ¯ŒS ఆగిపోయింది. సరస్వతి ఇంజి¯ŒSలోకి డీజిల్ పోస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువలోకి కాలుజారి పడిపోయింది. మృతదేహాన్ని శనివారం రాత్రి చాయాపురం వద్ద గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.