మున్సిపల్ కమిషనర్‌పై ఉద్యోగుల దాడి | women employees attacks by municipal commissioner | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కమిషనర్‌పై ఉద్యోగుల దాడి

Aug 28 2015 12:01 PM | Updated on Oct 16 2018 6:08 PM

వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణ మునిసిపల్ కమిషనర్‌పై మహిళా ఉద్యోగులు శుక్రవారం దాడి చేశారు.

బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణ మునిసిపల్ కమిషనర్‌పై మహిళా ఉద్యోగులు శుక్రవారం దాడి చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎ.శంకరరావు కొంత కాలంగా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీపీఐ నాయకులతో కలసి ఉద్యోగినులు కమిషనర్‌ను ఆయన చాంబర్ నుంచి బయటకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. కాగా, సెలవుపై వెళ్లిపోవాలని కమిషనర్‌ను పురపాలక సంఘం చైర్మన్ పార్థసారధి కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement