Badvel
-
మాట నిలబెట్టుకున్న YS జగన్.. తక్షణమే 10 లక్షల సాయం
-
బద్వేల్ బాధిత తల్లిదండ్రుల ప్రశ్నలకు టీడీపీ నేత పరారు..
-
LIVE : టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
ఎందుకు చంద్రబాబు అంత భయం.. నేను వస్తే కానీ సాయం అందలేదు..
-
బద్వేల్: బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు (ఫొటోలు)
-
బాబూ నీ పాలన ఇలానే ఉంటే ఇక తిరుగుబాటే
-
బద్వేల్ లో వైఎస్ జగన్ క్రేజ్ మాములుగా లేదు..
-
చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదు.. ప్రజలకు భరోసా లేదంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి బాలిక బలికాగా, బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. వారిని ఓదార్చి.. ధైర్యం చెప్పారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘బద్వేలు ఘటన శనివారం జరిగితే ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించలేదు. కనీసం పట్టించుకోలేదు. ఇవాళ జగన్ ఇక్కడకు వస్తున్నాడని తెలిసిన తర్వాత మాత్రమే కాసేపటి కిందటే వీళ్లకు సహాయం అందింది. రాష్ట్రంలో దారుణమైన అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ లేని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు పాలన ఉంది.ఇదీ చదవండి: లోకేష్ను పప్పు అనడంలో తప్పే లేదు: వైఎస్ జగన్చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. తమ పార్టీ వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మాట పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయమని చంద్రబాబుకు చెబుతున్నాను. బద్వేలు జడ్పీ స్కూల్లో టాపర్గా నిలబడిన పాప పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై ఇప్పటికైనా మేల్కొనాలని, రాక్షస పాలనకు అంతం పలకాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నాను. ఇదే మాదిరిగా చంద్రబాబు పాలన కొనసాగిస్తే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు రావడం ఖాయం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ దెబ్బకు దిగి వచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ముఖమంత్రి చంద్రబాబు దిగి వచ్చారు. ఎట్టకేలకు బద్వేల్ ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా ఆమె సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.బద్వేల్లో యువకుడి దుర్మార్గానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో యువతిని మభ్యపెట్టి.. పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నేడు వైఎస్ జగన్ బద్వేల్ వెళ్తున్నారు. వైఎస్ పరామర్శ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగివచ్చారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించని చంద్రబాబులో ఎట్టకేలకు స్పందించారు. వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తున్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్ చేశారు.తాజాగా బాధితురాలి తల్లితో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికం సాయంతో పాటు.. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. -
బద్వేల్ బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు.బద్వేల్లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీ అనినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన మాటల్లో చెప్పలేని అమానుషం. ఈ దారుణంపై ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 2021లో ఇలాంటి ఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లో ఇలాంటి 74 ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?.ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి అమ్మాయి చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కోవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని చెప్పారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే మహిళా హోం మంత్రి ఏం చేస్తున్నారు?. దీంట్లో రాజకీయాలకు తావు లేదు.. గట్టి చర్యలు తీసుకోవాలి. నా బిడ్డ చనిపోయినట్లు మరొకరు చనిపోరని నమ్మకం ఏంటి అని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. ఆమెకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
బద్వేలు అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ విమర్శించారు. బద్వేలు సమీపంలో బాలిక దస్తగిరమ్మ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న వరుస ఘటనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. లిక్కర్, ఇసుక దందాలతో శాంతిభద్రతలు గాలికి..హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్రేప్ ఘటన.. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని హత్య ఘటన మరువక ముందే తాజాగా బద్వేలులో దస్తగిరమ్మ హత్య.. ఇలా వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. లిక్కర్, ఇసుక స్కాంలలో పాలకులు నిండా మునిగిపోయి మహిళల రక్షణ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని, శాంతిభద్రతలను పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో మునుపెన్నడూ లేవన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీటఇక గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే విప్లవాత్మకంగా దిశ యాప్ను తీసుకొచ్చారన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటుచేశారని వారు గుర్తుచేశారు. అంతేకాక.. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరిచామన్నారు. అయితే, రాజకీయ కక్షతో చంద్రబాబు దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. -
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
బద్వేలులో YSRCP నేతల బైక్ ర్యాలీ
-
షర్మిల వ్యాఖ్యలపై దాసరి సుధా ఫైర్
-
బద్వేల్: చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బట్టబయలు
సాక్షి, ఢిల్లీ: బద్వేల్లో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బట్టబయలైంది. బద్వేలు టికెట్ను బీజేపీకి బలవంతంగా అంటగట్టిన బాబు.. అక్కడ తన పార్టీ నాయకుడు రోషన్నను పంపేందుకు గేమ్ ప్లాన్కు తెరతీశారు. నెలరోజులు బీజేపీ కండువా వేసుకుందామని క్యాడర్కు బద్వేల్ టీడీపీ నేతలు నచ్చ చెబుతున్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీ జెండానే పట్టుకోవాలని బద్వేల్ నేతలు అంటున్నారు. గత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన యువ మోర్చా జాతీయ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి సురేష్ 20 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఒరిజినల్ బీజేపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని పురందేశ్వరిపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ ద్వారా టీడీపీ అభ్యర్థులను బీజేపీలోకి పంపి చంద్రబాబు రాజకీయం నడుపుతున్నారు. సీఎం రమేష్ చెప్పినట్లుగా హై కమాండ్కి పురందేశ్వరి పేర్లు పంపుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు -
బద్వేల్.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు. ఇప్పటివరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావమయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. అమృత్కుమార్ నుంచి డాక్టర్ రాజశేఖర్ వరకూ.. అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్కుమార్ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరుగయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న ఎన్డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్కు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల నాటికి డాక్టర్ రాజశేఖర్ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. బాబుది సైతం అదే ధోరణి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్ రాజశేఖర్ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే’
సాక్షి, బద్వేల్: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. ‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్ను బీజేపీకి, రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్ పరుగులు -
మాకు ఉద్యోగాలొచ్చాయ్...ఏపీకి తరలివస్తున్న ప్రముఖ కంపెనీలు
-
సీమ సిగలో ‘సెంచురీ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత, రైతులకు ప్రయోజనం చేకూరే మరో భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్లే ఉడ్ ప్యానల్స్ తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచురీ ప్యానల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వైఎస్సార్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచురీ ప్యానల్స్ను శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పిస్తోంది. సెంచురీ ప్యానల్స్కు డిసెంబర్ 23, 2021న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది. అంతేకాకుండా అనుమతులను వేగంగా మంజూరు చేసింది. దీంతో రెండేళ్లలోనే సెంచురీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి మొత్తం 490 ఎకరాల్లో గోపవరం వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసింది. ఇందులో యాంకర్ యూనిట్గా సెంచురీ ప్యానల్స్కు 100 ఎకరాలను 33 ఏళ్ల లీజుకు కేటాయించారు. రైతులకు ప్రయోజనం సెంచురీ ప్యానల్స్లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్) మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్లను తయారు చేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలోని వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి యూకలిప్టస్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో యూకలిç³్టస్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా యూకలిప్టస్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80 శాతం మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇ ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీ, సబ్సిడీపై విద్యుత్ ఇచ్చాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ సొంతూరులోనే ఉపాధి లభించింది.. 2018లో ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉపాధి కోసం బయటి నగరాలకు వెళ్లలేక ఊర్లోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నా. ఇప్పుడు గోపవరంలో సెంచురీ ప్యానల్స్ ఏర్పాటుతో నాలాంటి ఎంతోమందికి స్థానికంగానే ఉపాధి లభించింది. సొంత ఊరిలో ఉద్యోగం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. – కాళ్ల రాజేష్, బుచ్చనపల్లె, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు.– గుడి మెగురయ్య, కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ చెట్లు సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. – రూకల దేవదాసు, గోపవరం ప్రాజెక్టు కాలనీ, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా -
బద్వేలులో చంద్రబాబుకు నిరసన సెగ
-
చంద్రబాబుకు నిరసన సెగ.. నల్ల జెండాలతో గోబ్యాక్ అంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్వేలులో నిరసన సెగ తగిలింది. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. వివరాల ప్రకారం.. బద్వేలు పర్యటన వేళ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసనలు చెప్పారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు -
ప్రియుడితో కలిసి రెండేళ్ల కొడుకును చంపిన తల్లి
-
బద్వేలులో దారుణం.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ..
సాక్షి, వైఎస్సార్ కడప: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన మారుతినాయక్ లారీడ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఇతను 14 ఏళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన కవితను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ ఇటీవలే ఖాజీపేటలోని చెమ్మళ్ళపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. లారీడ్రైవర్గా పనిచేసే మారుతినాయక్కు అదే వృత్తిలో ఉండే వినోద్ అనే యువకుడు పరిచమయ్యాడు. తరుచూ మారుతినాయక్ ఇంటికి వస్తూపోతూ ఉండే వినోద్ కవితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం వినోద్, కవితలు ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. కొద్దిరోజుల పాటు అక్కడక్కడ తిరుగుతూ మూడు నెలల క్రితం బద్వేలులోని రూపరాంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తుండేవారు. అప్పట్లో మారుతినాయక్ తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. చదవండి: (కొంతకాలంగా పెళ్లి సంబంధాలు.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా..) ఈ క్రమంలో కవిత, వినోద్లు బద్వేలులో ఉన్నట్లు తెలిసి మారుతినాయక్ తన సోదరితో వచ్చి కవితను ప్రశ్నించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న వినోద్ పరారయ్యాడు. కుమార్తె ఒక్కతే ఉంది, కుమారుడు ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మారుతినాయక్ బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అర్బన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే 15 రోజుల కిందట రాత్రివేళల్లో బాలుడు ఎక్కువగా ఏడుస్తుండటంతో వినోద్ తీవ్రంగా కొట్టడంతో మృతిచెందినట్లు సమాచారం. దీంతో ఇరువురు కలిసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోని ఖాళీస్థలంలో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేసినట్లు తెలిసింది. ఈ విషయంపై అర్బన్ సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ప్రస్తుతానికి బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో విచారించి తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. -
పద్దతి మార్చుకోమన్నందుకు కత్తితో దాడి
బద్వేలు అర్బన్ : అల్లరి చిల్లరిగా తిరుగుతూ వీధి ప్రజలను ఇబ్బందులు పెట్టే బదులు పద్దతి మార్చుకుని సక్రమంగా జీవించాలని ఓ వ్యక్తి చెప్పిన మాటలను అవమానంగా భావించిన యువకుడు తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేశాడు. బుధవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. పట్టణంలోని ఆరోగ్యపురంలో నివసించే శేషాద్రిరెడ్డి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అదే కాలనీలో ఉండే నరసాపురం పోలేరు వంటమాస్టర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటూ జులాయిగా తిరిగేవాడు. ఇదే సమయంలో వీధిప్రజలతో గొడవ పడుతుండేవాడు. ఇదే విషయంపై గతంలో శేషాద్రిరెడ్డి కూడా పోలేరును మందలించాడు. దీనిని అవమానంగా భావించిన పోలేరు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం ఇంటిలో ఉన్న శేషాద్రిరెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉండి అడ్డుకోబోయిన శేషాద్రిరెడ్డి కుమారుడు పవన్కార్తీక్రెడ్డిపై కూడా దాడి చేశాడు. ఈ సమయంలో శేషాద్రిరెడ్డి భార్య పార్వతి గట్టిగా కేకలు వేయడంతో పోలేరు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని గాయపడిన తండ్రి, కొడుకులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అరెస్టు పోలేరు ముఖానికి ముసుగు ధరించి ఉండటంతో దాడి చేసింది ఎవరనేది తొలుత అంతుపట్టలేదు. అంతేకాకుండా ముసుగు దొంగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారని పట్టణంలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలించారు. ఈ సమయంలో పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో నిందితుడిని అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. తర్వాత విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా
సాక్షి ప్రతినిధి, కడప : భూ దందాలతోపాటు పలు అక్రమాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలతో కొందరు అక్రమార్కులు బద్వేలు ప్రాంతంలో అలజడులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి చేరడంతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారెవరినీ వదిలి పెట్టవద్దంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్లను ఆదేశించారు. తన, పర తారమత్యం లేకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. సీఎంఓ నుంచి ఆదేశాలు అందుకున్న బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణ స్పందించారు. లోతైన విచారణకు దిగారు. బాధితులు తన వద్దకు రావాలంటూ ప్రకటించారు. దీంతో కొందరు బాధితులు తమ స్థలాలు, భూములను ఆక్రమించిన వారి వివరాలను ఆర్డీఓ, కలెక్టర్లకు అందజేశారు. వీటిపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. నకిలీ సీళ్లు, బోగస్ సంతకాలతో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను ఆక్రమిస్తున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. అటువంటి వారి జాబితాను సిద్ధ చేసుకున్న ఆర్డీఓ బద్వేలు ప్రాంతంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నకిలీ పట్టాలు, సీళ్లు, ఇతర సామగ్రి దొరికింది. దీంతో ప్రాథమికంగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు, అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు సైతం ఈ వ్యవహారంలో ఉన్నట్లు బట్టబయలైంది. బుధవారం నాటికి వీరిలో 8 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఇంకొందరిపైన కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. బద్వేలుతోపాటు పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు, గోపవరం, అట్లూరు ప్రాంతాల్లోనూ ఈ తరహా అక్రమాలపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. ఆర్మీ వారి పేర్లతో బోగస్ ఐడీలు కొందరు ఆర్మీలో ఉన్న వారి పేర్లతో బోగస్ ఐడీలు సృష్టించి కొత్త తరహా అక్రమాలకు తెరలేపారు. ఆక్రమించిన స్థలాలు, భూములు పది సంవత్సరాల క్రితమే సైనికుల పేరున పట్టాలు చేయించుకున్నట్లు రికార్డులు మార్చి ఎన్ఓసీల ద్వారా వాటిని వెంచర్లు వేసి కొందరు అమ్మకాలకు పెట్టగా, మరికొందరు వందలాది ఎకరాల భూములను సైనికుల పేరున మార్చి వేరొకరికి కోట్లాది రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన ప్రాంతాలతోపాటు బద్వేలు, గోవపరంలోనూ ఈ తరహా అక్రమాలు జరిగినట్లు ఆర్డీఓ, కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టారు. వీటితోపాటు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వివరాలను వెలికి తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినట్లు విచారణలో బయటపడుతోంది. డీకేటీల అమ్మకాలు సహించం డీకేటీ స్థలాలు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణలు ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్లాట్ల అమ్మకాలకు సిద్ధం చేసిన పలు వెంచర్లను ఇప్పటికే నిలిపివేశారు. వ్యవసాయానికి ఇచ్చిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల అమ్మకాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేయాలనుకుంటే ల్యాండ్ కన్వర్షన్ (భూ బదలాయింపు) తప్పనిసరి అని స్పష్టం చేశారు. బాధితులు, ప్రజల హర్షం భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించడం, అందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంపై బాధితులు, జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తన, పర అన్న బే«ధం లేకుండా నిస్పాక్షికంగా వ్యవహరించడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. అక్రమాల్లో ఇంటి దొంగలు బద్వేలుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన భూ దందాల్లో ఇంటి దొంగల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. బద్వేలు అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఇద్దరు వీఆర్వోలపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వీరు కాకుండా ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్ఐలు, ఓ ఆర్డీఓ స్థాయి అదికారి సైతం గతంలో జరిగిన భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే వీరిపై కేసులు నమోదు చేయబోతున్నారు. పేదలకు అన్యాయం జరగనివ్వం బద్వేలు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు అన్యాయం జరగనివ్వం. కొందరు అక్రమార్కులు నకిలీ సీళ్లు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను దౌర్జన్యకరంగా ఆక్రమించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి. ప్రభుత్వ ఆదేశాలతో నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే చాలామందిపై కేసులు పెట్టి అరెస్టులు చేశాం. మరికొంతమందిపైన కేసులు పెట్టబోతున్నాం. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా నా దృష్టికి తీసుకు రండి...కచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చూస్తా. – ఆకుల వెంకట రమణ, ఆర్డీఓ, బద్వేలు -
వైభవం..చెన్నకేశవ రథోత్సవం
బద్వేలు అర్బన్ : చెన్నంపల్లె సమీపంలోని శ్రీదేవి, భూదేవి సమేత ఆదిచెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నెరవేరిం. ఉదయం నుంచే భక్తులు రథాన్ని విద్యుత్ దీపాలు, పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. వేలాదిమంది భక్తులు స్వామివారి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. రథోత్సవంలో ఆలయ కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రథోత్సవం ముగిసిన అనంతరం భక్తుల దర్శనం కోసం స్వామివారిని రథంపై నుంచి కిందకు దించి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సాహంగా బండలాగుడు పోటీలు ఆదిచెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. తొలుత పోటీలను మున్సిపల్ చైర్మన్ వీ.రాజగోపాల్రెడ్డి ప్రారంభించారు. సుమారు 6 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో మొదటి బహుమతిని రాజుపాలెం మండలం వెలవలి గ్రామానికి చెందిన కమ్ముసాహెబ్ రసూల్ ఎడ్లు కైవసం చేసుకోగా, వీరికి రూ.40,116ల నగదును బహుమతిగా అందజేశారు. ద్వితీయ బహుమతిని కమలాపురం గ్రామానికి చెందిన చల్లా శివారెడ్డి వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.20,116ల బహుమతిని అందజేశారు. తృతీయ బహుమతిని గోపవరం మండలానికి చెందిన నెమలయ్య వృషభాలు కైవసం చేసుకోగా వీరికి రూ.10,116ల బహుమతిని అందించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రంగారెడ్డి, పోటీల నిర్వాహకులు నారాయణరెడ్డి, మనోహర్రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ బర్త్డే: బద్వేలును రెవెన్యూ డివిజన్గా కేటాయిస్తూ జీవో విడుదల..
సాక్షి, వైఎస్సార్ కడప: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బద్వేలుకు సీఎం జగన్ కానుక అందించారు. బద్వేల్ను రెవెన్యూ డివిజన్గా కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధకు బద్వేలు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది జూలైలో బద్వేలు పర్యటనకు వచ్చిన సీఎం జగన్ బద్వేల్కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బద్వేలను రెవెన్యూ డివిజన్గా కేటాయిస్తూ మంగళవారం జీవో విడుదల చేశారు. -
మ్యాగజైన్ స్టోరీ 02 november 2021
-
మరో 30 ఏళ్ళు ఏపీకి సీఎంగా జగనే ఉంటారు
-
బద్వేలు ఉపఎన్నికలో వైఎస్ఆర్ సీపీ చారిత్రాత్మక విజయం
-
బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ఫొటోలు
-
పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: దాసరి సుధ
-
బద్వేల్ లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు
-
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బద్వేల్లో పోలింగ్
-
కొనసాగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్
-
బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు
-
చివరి దశకు చేరుకున్న బుద్వేలు, హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం
-
తిరుపతిలో రాళ్లు వేసిన సంగతిని అమిత్షాకు గుర్తు చేస్తారా?
-
AP Special: బద్వేలు బరిలో మూడో డాక్టర్
వైఎస్సార్ జిల్లా: బద్వేలు శాసన సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికకు మరో వైద్యురాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లాంఛనం కానుంది. గతంలో జరిగిన ఎన్నికలో ఇద్దరు వైద్యులు ఈ శాసనసభకు, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఎంఎస్ జనరల్ సర్జన్ చదివిన డాక్టర్ శివరామక్రిష్ణయ్య రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటి పర్యాయం 1978లో జనతాపార్టీ తరపున 10,187 ఓట్లతో, రెండో పర్యాయం కాంగ్రెస్ తరపున 10,001 మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్య వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా 44,7354 ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. ఈయన ఎంబీబీఎస్,ఎంఎస్ ఆర్థోపెడిక్ చదివారు. ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తరపున డాక్టర్ సుధా పోటీలో ఉన్నారు. ఈమె ఎంబీబీఎస్ చదివి గైనకాలజిస్ట్గా వైద్య సేవలందిస్తున్నారు. డాక్టర్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ సుధ భార్యభర్తలు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ప్రస్తుత.. ఉప ఎన్నికలో ఆయన భార్య సుధా నామినేషన్ వేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పోటీచేయమని ప్రకటించాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం సుధ ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. చదవండి: Badvel bypoll: బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ -
నేడు బద్వేల్ ,హుజురాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్
-
YSR Kadapa: ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
-
YS Jagan: అభివృద్ధిలో టాప్గేర్
సాక్షి, కడప: వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులతో బద్వేలు, కడప రూపురేఖలు మారుస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా బద్వేలు, కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తొలుత బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేలు ఒకటన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, దివంగత ప్రియతమ నేత నాన్న గారి హయాంలో మాత్రమే ఈ నియోజకవర్గానికి మంచి జరిగిన పరిస్థితి కనిపించిందని చెప్పారు. అప్పట్లో బ్రహ్మంసాగర్లో 14 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశారన్నారు. ఆ తర్వాత నాలుగైదు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదన్నారు. పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం, మంచి చేయాలనే తపన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. బ్యాట్ పట్టి.. షాట్ కొట్టి.. కడప అర్బన్ / స్పోర్ట్స్: తాత వైఎస్ రాజారెడ్డి పేరుతో తండ్రి నిర్మించిన స్టేడియంలో మనవడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగారు. చూడముచ్చటైన షాట్లతో అలరించారు. ఈ అద్భుతమైన సన్నివేశం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో చోటుచేసుకుంది. ఈ మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ, రూ.4 కోట్లతో ఫ్లడ్లైట్ల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ బ్యాట్ పట్టుకుని క్రీజ్లో నిలుచున్నారు. తొలుత కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బంతిని తిన్నగా వేయగా.. నిబంధనల మేరకు వికెట్ వైపు నుంచే బంతిని వేయాలని సూచించారు. దీంతో ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడిన వేణుగోపాల్, మధుసూదన్లు బౌలింగ్ చేయడంతో సీఎం జగన్ బ్యాట్ ఝుళిపించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులతో గ్రూప్ ఫొటో దిగారు. ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. బ్రహ్మంసాగర్ ఎప్పుడూ నిండుకుండలా ఉండాలి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో రెండేళ్లుగా ఇదే బ్రహ్మంసాగర్ నిండు కుండలా ఉందని సీఎం జగన్ అన్నారు. ఎప్పుడూ ఇలానే ఉండాలనే ఉద్దేశంతో ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను తీర్చేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గత పాలకుల హయాంలో వెలుగోడు ప్రాజెక్టు 0–18 కిలోమీటర్ల వరకు కెనాల్ లైనింగ్ పనులను పట్టించుకోలేదన్నారు. దీంతో నీళ్లు కిందకు రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితి మారిస్తే తప్ప బ్రహ్మంసాగర్కు సెక్యూరిటీ ఉండదని భావించి రూ.300 కోట్లు మంజూరు చేసి, లైనింగ్ పనులు ప్రారంభించి దాదాపు 80 శాతం పూర్తి చేశామన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే అక్టోబర్ నాటికి లైనింగ్ పూర్తయి, నీళ్లు నేరుగా బ్రహ్మంసాగర్కు వచ్చేలా చూస్తామని చెప్పారు. బ్రహ్మంసాగర్ ఎప్పుడూ నిండు కుండలా ఉండాలని భావించి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కుందూ నది మీద లిఫ్ట్ ప్రాజెక్టు పనులకు రూ.564.60 కోట్లతో శ్రీకారం చుట్టామని తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ..500 కోట్లతో అభివృద్ధి పనులు బద్వేలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి రూ.500 కోట్లతో పనులు చేస్తున్నాం. దీంతో నియోజకవర్గం రూపురేఖలు మారతాయి. బద్వేలు పట్టణంలో రూ.130.60 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శ్రీకారం చుట్టాం. పట్టణంలో సుమారు 140 కిలోమీటర్ల పొడవుతో కొత్త సీసీ రోడ్లతో పాటు మూడు పార్కులు, కూరగాయలు.. చేపల మార్కెట్, మూడు వాణిజ్య సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఆరు శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. ►రూ.79.67 కోట్లతో దిగువ సగిలేరు ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేలు, బి.కోడూరు మండలాల్లో 35 చెరువులకు ఏటా నీళ్లు నింపుకునే వెసులుబాటు కలుగుతుంది. ►బ్రహ్మంసాగర్ ఎడమ, కుడి కాలువలకు సంబంధించి రూ.37.452 కోట్లతో పెండింగ్ పనులు చేపడుతున్నాం. తద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించొచ్చు. మరోవైపు బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ఆనకట్టకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రం కటాఫ్ వాల్ నిర్మాణ పనులకు రూ.46.68 కోట్లతో శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపొచ్చు. ►మనం వచ్చాక పూర్తి స్థాయిలో నీటిని పెట్టడంతో అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి. వీటిని అరికట్టేందుకు రూ.46.68 కోట్లతో మరమ్మతులు చేస్తున్నాం. దీంతో 17 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. సభకు హాజరైన ప్రజలు మూడు ఎత్తిపోతల పథకాలు ►రూ.35.90 కోట్లతో బ్రహ్మంసాగర్ ఎడమ కాలువలో మూడు ఎత్తిపొతల పథకాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా 8,268 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లె, కొండ్రాజుపల్లె, వరికుంట్ల, గంగన్నపల్లె చెరువులకు తరలించొచ్చు. తద్వారా కాశినాయన మండలంలోని పలు గ్రామాల్లో 3,500 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురాబోతున్నాం. ►రూ.పది కోట్ల వ్యయంతో ఐదు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. పోరుమామిళ్ల పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రోడ్లను నాలుగు లేన్ల రోడ్డుగా రూ.25 కోట్లతో విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ►రూ.20 కోట్లతో సగిలేరు నది మీద వేమలూరు వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. బ్రహ్మణపల్లె సమీపంలో సగిలేరు నదిపై రూ.9.50 కోట్లతో మరో వంతెన నిర్మిస్తున్నాం. దీనివల్ల కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రవాణా మెరుగవుతుంది. ►బద్వేలు మార్కెట్ యార్డులో బద్వేలు, పోరుమామిళ్లలో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రైతుల కోసం రెండు గోదాములను నిర్మించే పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ►బద్వేలులో ప్రసన్నవెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆది చెన్నకేశవ దేవాలయంతో పాటు కాశినాయన మండలంలో మరో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు రూ.4.70 కోట్లతో శంకుస్థాపనలు చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే ►బద్వేలు నియోజకవర్గ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వారి కోరిక మేరకు మంజూరు చేస్తున్నాం. ►బద్వేలులో రూ.5 కోట్లతో ఆర్అండ్బీ బంగ్లా, రూ.15 కోట్లతో పంచాయతీ రాజ్ రోడ్లు, ఎంపీడీఓ, తహశీల్దార్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం మంజూరు చేస్తున్నాం. బద్వేలు మండలం వీరబల్లి, కొత్త చెరువు ఎత్తిపొతల పథకానికి రూ.50 లక్షలు అందిస్తున్నాం. ►నియోజకవర్గంలో ఇండ్రస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు మెరుగవుతాయని మాజీ ఎమ్మెల్సీ కోరారు. ఆయన విన్నపం మేరకు మంజూరు చేస్తున్నాం. ►కడప జిల్లాకు ఎంత చేసినా తక్కువే. జిల్లా ప్రజలు నన్నెప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. మీరిచ్చిన చలువ వల్లనే ఈరోజు నేను రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాను. మీ ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు. కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో వైఎస్సార్, రాజారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్ ఇక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్వేగంగా చెప్పారు. నాన్నగారి మరణం తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ కడపలో అభివృద్ధి పనులు చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇకపై అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మంచి నగరాల జాబితాలో కచ్చితంగా కడప ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్లో రోడ్లను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి మాట్లాడుతూ.. కడప నగరంలో దాదాపు రూ.459.29 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో శంకుస్థాపన చేసిన పనులను కూడా వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. కడపలో అభివృద్ధి పనులు ఇలా.. ►జిల్లా కేంద్రమైన కడపలో మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లె వరకు ఆరు వరుసలతో 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం.. రైల్వేస్టేషన్ నుంచి మహావీర్ సర్కిల్ వరకు నాలుగు లేన్లతో 60 అడుగుల వెడల్పుతో మరో రోడ్డు.. ఈ రెండు రోడ్లను సుమారు రూ.80 కోట్లకు పైగా వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్ది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ►ఇదే తరహాలో కడప నగరంలో మరికొన్ని రోడ్లను విస్తరించాలని సంకల్పించి శంకుస్థాపనలు చేస్తున్నాం. రూ.101 కోట్లతో కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డును విస్తరిస్తున్నాం. అన్నమయ్య సర్కిల్ నుంచి కృష్ణా సర్కిల్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు రూ.74 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశాం. ►అంబేడ్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు విస్తరణకు రూ.62 కోట్లు కేటాయించాం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లె వరకు రోడ్డు విస్తరణ పనులను రూ.9.90 కోట్లతో చేపట్టనున్నాం. బుగ్గవంక కష్టాలు రాకుండా చర్యలు ►బుగ్గవంక వరద కష్టాలు నాకు తెలుసు. నాన్నగారి హయాంలో బుగ్గవంక నుంచి ప్రమాదం లేకుండా ఉండేందుకు ఐదు హైలెవెల్ బ్రిడ్జిలు, రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అనంతరం వచ్చిన పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. ►మరోసారి బుగ్గవంక వరద పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు రూ. 49.60 కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. చెర్లోపల్లె, పుట్లంపల్లె, బుడ్డాయపల్లె, రామనపల్లె చెరువుల సుందరీకరణ పనులను రూ.5.73 కోట్లతో చేపట్టనున్నాం. ►చిన్నపాటి వర్షాలు కురిసినా నగరంలోని ఆర్కే నగర్, తిలక్నగర్, మృత్యుంజయకుంట, ఎస్బీఐ కాలనీ, ఎన్జీఓ కాలనీ, ఏఎస్ఆర్ నగర్, గంజికుంట తదితర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువల (స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్) నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. సూపర్ స్పెషాలిటీగా రిమ్స్.. ►రిమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేలా నిర్ణయించి రూ.125 కోట్లతో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శిలాఫలకం వేశాం. ఆ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ వైఎస్సార్ మానసిక చికిత్సాలయానికి సంబంధించి సుమారు రూ.40 కోట్లతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ►డాక్టర్ వైఎస్సార్ కేన్సర్ కేర్ సెంటర్కు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోంది. కడపలో రాజీవ్ మార్గ్ పనులు సుమారు రూ.4 కోట్లతో జోరుగా జరుగుతున్నాయి. దేవుని కడప చెరువు సుందరీకరణకు రూ.55 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ దశలో ఉంది. నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని అద్భుత నిర్మాణాలకు శ్రీకారం చుడతాం. ►కడప, బద్వేలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప నగర మేయర్ సురేష్బాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో తామ్రపత్రాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శనీయుడు బ్రౌన్ కడప కల్చరల్ : తెలుగు భాషాసాహిత్యాన్ని కాపాడిన ఆంగ్లేయుడు, తెలుగుభాషాభిమాని చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ తెలుగు భాషాసాహితీ వేత్తలకు ఆదర్శనీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ కేంద్రం ఆవరణలో జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ, బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి సభ్యుడు జానమద్ది విజయభాస్కర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రౌన్ లేని తెలుగు సాహిత్యాన్ని ఊహించుకోలేమని, ఆయన బాషా సాహిత్య సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అనంతరం ఛాయా చిత్ర ప్రదర్శన, తాళపత్ర గ్రంథాలు, రాత పరికరాలు, అరుదైన గ్రంథాలను తిలకించారు. ఈ కేంద్రం విస్తరణలో భాగంగా ప్రముఖ ఆడిటర్ సంపత్కుమార్ కుమార్తె చిత్రకూటం అమృతవల్లి సౌజన్యంతో రూ.5.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన నూతన భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమృతవల్లిని సత్కరించారు. బ్రౌన్ విగ్రహాన్ని రూపొందించిన జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పి గొల్లపల్లి జయన్నను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం బ్రౌన్ కేంద్రం బాధ్యులు ముఖ్యమంత్రికి బ్రౌన్ గ్రంథాలయ రజతోత్సవ సంచికలను అందజేశారు. -
గత పాలకులు బద్వేలును పట్టించుకోలేదు
-
గత పాలకులు బద్వేలును పట్టించుకోలేదు: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలోనే వెనుకబాటులో ఉన్న నియోజకవర్గం బద్వేలు అని.. గత పాలకులు ఎప్పుడూ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బద్వేలులో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడూ నిండుకుండలా ఉండాలన్నారు. కుందూ నదిపై లిఫ్ట్ ద్వారా బ్రహ్మసాగర్కు నీళ్లు అందిస్తామని తెలిపారు. బద్వేలులో కూరగాయలు, చేపల మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటుతో పాటు రూ.80 కోట్లతో లోయర్ సగిలేరు కాల్వల విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. రూ.56 కోట్లతో తెలుగు గంగ పెండింగ్ పనులతో పాటు, రూ.36 కోట్లతో బ్రహ్మసాగర్ ఎడమ కాల్వలో 3 ఎత్తిపోతలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రాహ్మణపల్లి వద్ద సగిలేరుపై రూ.9.5 కోట్లతో మరో వంతెన నిర్మిస్తామన్నారు. రూ.7.5 కోట్లతో గోదాముల నిర్మాణంతో పాటు బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. నీటి లీకేజీ లేకుండా..: మరోవైపున బహ్మంసాగర్ ప్రాజెక్టు గట్టుకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ కటాఫ్ వాల్ నిర్మాణం పనులు రూ.45 కోట్లతో ఇవాళ మొదలు పెడుతున్నాం. ఎందుకుంటే నిండు కుండలా జలాశయం నిండితే లీకేజీలు కనిపించాయి. కాబట్టి ఈ మరమ్మతులు చేపట్టాం. దీని వల్ల ప్రాజెక్టులో మొత్తం 17 టీఎంసీలు ఎప్పుడూ నింపుకోవచ్చు. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. పెరగనున్న ఆయకట్టు: ఇంకా రూ.36 కోట్లతో బ్రహ్మంసాగర్ జలాశయం ఎడమ కాలువలో మూడు ఎత్తిపోతల పథకాలకు ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. దీని వల్ల అక్షరాలా 8,268 క్యూబిక్ లీటర్ల నీటిని, సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల, గంగనపల్లి చెరువులను పూర్తిగా నింపడంతో పాటు, కాశినాయన మండలంలో సుమారు 3500 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావచ్చు. ఈ మంచి కార్యక్రమానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్ సరఫరా: రూ.10 కోట్లతో 5 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 5 సబ్ స్టేషన్ల నిర్మాణం. ఇది ఇక్కడి వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుంది. విద్యుత్ సరఫరాలో నాణ్యత చాలా పెరుగుతుంది. రహదారుల విస్తరణ–రవాణా సదుపాయం: పోరుమామిళ్ల పట్టణంలో 3.6 కిలోమీటర్ల రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్లకు రూ.25 కోట్లతో విస్తరణ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. దీని వల్ల పోరుమామిళ్ల చక్కగా మారుతుంది. మరో రూ.22 కోట్లతో సగిలేరు నది మీద వేములూరు గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన. దీని వల్ల 30 గ్రామాల ప్రజలకు రవాణ సదుపాయం కలుగుతుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో సగిలేరు నది మీద రూ.9.5 కోట్లతో వంతన నిర్మాణం పనులు ఇవాళ మొదలు. కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు, ప్రకాశం జిల్లాకు రాకపోకలు మెరుగవుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గోదాముల నిర్మాణం: బద్వేలు మార్కెట్ యార్డులో రైతుల కోసం 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఒక గోదాము, పోరుమామిళ్లలోని మార్కెట్ యార్డులో కూడా 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రూ.7.5 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. ఆలయాల అభివృద్ధి: బద్వేలులో శ్రీ ప్రసన్న వెంటటేశ్వర ఆలయం, శ్రీ ఆదికేశవ దేవాలయంతో పాటు, కాశినాయన మండలంలో మరో 6 దేవాలయాల అభివృద్ధి కోసం దాదాపు రూ.4.7 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేశాం. బద్వేలులో ఆర్డీఓ ఆఫీస్: ఇక్కడ ఎప్పటినుంచో ఒక డిమాండ్. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం కావాలని అడుగుతున్నారు. ఆ ఆఫీస్ కోసం కాశినాయన, కలసపాడు మండలాల వారు ఎంతో దూరంలో ఉన్న రాజంపేటకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అక్కడి వారు రాజంపేటకు వెళ్లి రావడానికి దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి వస్తోందని, ఎంపీ అవినాష్రెడ్డి కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కావాలని కోరారు. అందుకే ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ను మంజూరు చేస్తున్నానని తెలియజేస్తున్నాను. అవన్నీ శాంక్షన్ చేస్తున్నాను: ఇంకా రూ.34 కోట్ల విలువైన చిన్న చిన్న పనులను మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కోరారన్న సీఎం శ్రీ వైయస్ జగన్, అవన్నీ శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ అండ్ బీ బంగ్లా మరమ్మతులు. రూ.5 కోట్లు. పంచాయతీ రాజ్ రోడ్ల మరమ్మతులతో పాటు, శిధిలావస్థలో ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు రూ.15 కోట్లు. బద్వేలు మండలంలో వీరబల్లి, కొత్తచెరువు ఎత్తిపోతల పథకం కోసం రూ.50 లక్షలు. బద్వేలు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్. ఎంత చేసినా తక్కువే: ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత చేసినా తక్కువే. ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ నా మీద ఎంతో ఆదరణ చూపారు. తమ బిడ్డలా ఆప్యాయత చూపారు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేస్తున్నాను. -
బద్వేలులో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
-
బద్వేలులో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: రెండో రోజూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బద్వేలులో పర్యటిస్తున్నారు. బద్వేలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్కు చేరుకుని బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్కు చేరుకుని శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుంచి వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం చేరుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. -
బద్వేలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో రెండు రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి బద్వేలు చేరుకున్నారు. బద్వేలులో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. బద్వేలుతో పాటు కడప నియోజకవర్గంలోను సీఎం పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు. -
బద్వేలు, కడపలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు. ►9వ తేదీ ఉదయం 10.15 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్లోని హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.40కి బద్వేల్లోని విద్యానగర్ హెలీప్యాడ్కు చేరుకుంటారు. ►11.10 గంటల నుంచి 12.45 వరకూ బహిరంగ సభ జరిగే మైదానంలో బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తారు. ►మధ్యాహ్నం 1.20 గంటలకు హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1.45గంటలకు రిమ్స్ జనరల్ హాస్పిటల్లోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. ►1.50కి అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.05 గంటలకు ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్కు చేరుకుంటారు. ►2.10 నుంచి 2.20 గంటల వరకూ అక్కడ బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ►2.35 గంటలకు కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్కు చేరుకుంటారు. ►2.40 గంటల నుంచి 3.25 గంటల వరకూ శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. ►3.45 గంటలకు వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం చేరుకుంటారు. ►3.50 గంటల నుంచి 4.20 గంటల వరకూ అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ►సాయంత్రం 4.25 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం నుంచి బయలుదేరి 4.35 గంటలకు రిమ్స్లోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. ►5 గంటలకు కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ► 6.10కి అమరావతిలోని నివాసానికి చేరుకుంటారు. -
బద్వేల్ ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్వర్యంలో దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వేల్లో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన శిరీష ఘటనను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. ఇటీవల ప్రేమోన్మాది చేతిలో శిరీష హత్యకు గురైన విషయం తెలిసిందే. చదవండి: వైఎస్సార్ కడప: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది -
బద్వేల్లో దారుణం.. యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలోని బద్వేలు మండలంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసి హత్య చేశాడు యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మకు 18 ఏళ్ల కూతురు శిరీష ఉంది. ఆమె బద్వేల్ వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొంత కాలంగా కచరణ్ అనే యువకుడు శిరీషను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. ప్రస్తుతం కాలేజీ సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో చరణ్ శుక్రవారం చింతల చెరువు గ్రామంలోకి వెళ్లి శిరీషను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అక్కడే ఉన్న కత్తితో శిరీష గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శిరీష అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పృహ కోల్పోయిన చరణ్ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జగిత్యాల ఎస్సై.. వెక్కి వెక్కి ఏడుస్తూ -
భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..
బద్వేలు అర్బన్: తన జల్సాలకు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతోపాటు.. అనుమానం పెంచుకున్న ఓ శాడిస్టు కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసిన ఘటన వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం సుందరయ్య కాలనీలో సంచలనం సృష్టించింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. జిల్లాలోని జమ్మలమడుగు పట్టణం వెంకటేశ్వరకాలనీకి చెందిన మంజుల (23)కు నాగరాజు అనే వ్యక్తితో గతంలో వివాహం జరిపించారు. అయితే మనస్పర్థలతో నెల రోజుల్లోనే వారు విడిపోయారు. అనంతరం మంజుల జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి 8 నెలల క్రితం జమ్మలమడుగులోని అమ్మగారింటికి వచ్చింది. ఈ సమయంలో కడప తిలక్నగర్కు చెందిన దూరపు బంధువు మన్నూరుహరి మంజులను ప్రేమించానని, ఆమెతో వివాహం జరిపించాలని పట్టుబట్టి గతేడాది నవంబర్లో వివాహం చేసుకున్నాడు. కడపలో కాపురముంటూ పెయింటింగ్ పని చేసుకునే హరి మద్యానికి బానిసవ్వడంతో పాటు అనుమానంతో మంజులను వేధించసాగాడు. ఇందుకు హరి తల్లి లక్ష్మి కూడా సహకరిస్తుండేది. అనుమానం ఓ వైపు.. డబ్బులు ఇవ్వడం లేదన్న కోపం మరో వైపుతో మంజులను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే కాపురాన్ని బద్వేలులోని సుందరయ్యకాలనీలోకి మార్చాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవకు దిగిన హరి శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఆమెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై తాను కూడా ఎడమవైపు చాతీపై చిన్నపాటి గాయమయ్యేలా పొడుచుకుని ఆత్మహత్య నాటకానికి తెరలేపాడు. అంతటితో ఆగక భార్య మృతదేహం పక్కనే పడుకుని సెల్ఫీ తీసుకుని కుటుంబ సభ్యులకు, మిత్రులకు పంపించాడు. తెల్లవారుజామున విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రామలక్షుమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బద్వేలులో దారుణం: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
-
అమెజాన్లో హార్డ్ డిస్క్ ఆర్డర్.. పార్సిల్ విప్పగానే షాక్!
ఇంట్లో నుంచి కాలు కదపకుండా అన్ని పనులు ఆన్లైన్లో చేసకోవడం చాలామందికి అలవాటైపోయింది. కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో ఆన్లైన్ ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనిని అదునుగా భావించిన సైబర్ నేరగాళ్ల దొరికినంత దోచేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. వస్తువు మన చేతిలోకి చేరే వరకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఈ క్రమంలో కడప జిల్లాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ఆన్లైన్ మోసానికి అద్దం పడుతోంది. బద్వేలుకు చెందిన ప్రదీప్ ఓ వ్యక్తి అమెజాన్లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ అవసరమై బుక్ చేశారు. సిద్దవటం రోడ్డులోని సర్వీసు సెంటర్కు మంగళవారం పార్సిల్ వచ్చింది. అతడు రూ.3,099 డబ్బు చెల్లించి పార్శిల్ తీసుకున్నాడు. అయితే పార్సిల్పై ఎందుకో అనుమానం రావడంతో దాన్ని ఓపెన్ చేస్తూ వీడియో తీశాడు. చివరికి అందులో హార్డ్ డిస్క్ లేకపోవడంతో షాకయ్యాడు. అందులో పది రూపాయలవి రెండు బట్టల సబ్బులు ఉండటాన్ని చూసి దిమ్మ తిరిగింది. హార్డ్ డిస్క్కు బదులు సబ్బులు పంపించారని.. చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరారు. తమకు సంబంధంలేదని అమెజాన్ డెలివరీ బాయ్ చేతులెత్తేశాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా.. రూ.1.2కోట్లు స్వాహా -
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అభినందనీయం
-
18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని బ్రాహ్మణపల్లె సెక్షన్ గానుగపెంట బీటులోని కత్తిబండ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలను, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు బద్వేలు ఎఫ్ఆర్ఓ పి.సుభాష్ పేర్కొన్నారు. గురువారం ఫారెస్టు బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గానుగపెంట బీటు సమీపంలోని కత్తిబండ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించగా కొందరు స్మగ్లర్లు తారసపడ్డారన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోరుమామిళ్ల మండలం రేపల్లె గ్రామానికి చెందిన బేరిగురప్ప, పట్టణంలోని గౌరీశంకర్నగర్కు చెందిన కొండేటిరమణయ్యలు దొరికారన్నారు. అట్లూరు మండలం చలమగారిపల్లెకు చెందిన గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, పట్టణంలోని గౌరీశంకర్నగర్కు చెందిన మడమకుంట్ల నాగార్జున, పోరుమామిళ్ల మండలం రేపల్లెకు చెందిన అనకర్ల ప్రకాష్, ఏసిపోగు కిరణ్, ఏసిపోగు వెంకటేష్, అనకర్ల ప్రభాకర్, సోమిరెడ్డిపల్లె జయరాజ్లతో పాటు బద్వేలు మండలం బాలాయపల్లెకు చెందిన నాగిపోగు కల్యాణ్లు పరారయ్యారని తెలిపారు. వీరందరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న 426.5 కేజీల దుంగల విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో డీఆర్ఓ జి.సుబ్బయ్య, ఎఫ్బీఓలు మునెయ్య, జాకీర్హుస్సేన్, రామసుబ్బారెడ్డి, నారాయణస్వామి, సుధాకర్, ఏబీఓ అక్బర్షరీఫ్లు పాల్గొన్నారు. -
తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వచ్చే శాసనసభ సమావేశాల నాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పులను ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్షకు దిగుతానని గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ప్రజలకు మేలు చేసే కొత్త యువ నాయకత్వాన్ని అందించింనందుకు కృతజ్ఞతగా ఈ నెల 4న గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించిన తిరుమల పాదయాత్ర 8వ రోజైన బుధవారం నాటికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ శివార్లలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయి ఫంక్షన్హాలులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, అది జీర్ణించుకోలేని చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. -
‘చంద్రబాబు ఇంటి ముందు దీక్షకు దిగుతా’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. తిరుమలకు పాదయాత్రలో భాగంగా నేడు రాంబాబు వైఎస్సార్ జిల్లాలోని బద్వేల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య, వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్య వైశ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో చేసిన తప్పిదాలను వచ్చే శాసనసభ సమావేశాల కల్లా ఒప్పుకోకపోతే బాబు ఇంటిముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’నని అన్నా రాంబాబు ప్రకటించారు. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తానన్న ఆయన ఇప్పుడు మొక్కు తీర్చుకుంటున్నారు. అందులో భాగంగానే 4వ తేదీన ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
బంగారం కోసం వృద్ధ దంపతుల హత్యకు కుట్ర
సాక్షి,బద్వేల్(కడప) : పట్టణంలోని నెల్లూరు రోడ్డులో నివసించే వృద్ధ దంపతులను హత్యచేసి వారి వద్ద నుంచి బంగారు నగలు దోచుకోవాలనుకున్న కొంత మంది యువకుల కుట్రను బద్వేలు అర్బన్ పోలీసులు, కడప సీసీఎస్ పోలీసులు భగ్నం చేశారు. హత్యకు రెక్కీ నిర్వహించి వెళుతున్న సమయంలో పో లీసులను చూసి పారిపోతుండగా 5 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య కుట్రతో సంబంధం ఉన్న మరొక యువకుడు పరారయ్యాడు. బుధవారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ బి.ఆర్.శ్రీనివాసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని నెల్లూరురోడ్డులో చిన్నివెంకటసుబ్బయ్య తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఈయన ఇంటిలోనే బంగారు దుకాణం నిర్వహిస్తుంటాడు. ఇదే సమయంలో పట్టణంలోని గాంధీనగర్కు చెందిన మోటు సుభాష్ అనే యువకుడు సిద్దవటం రోడ్డులోని ఓ బంగారు దుకాణంలో పనిచేస్తూ అప్పుడప్పుడు వెంకటసుబ్బయ్య ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో వృద్ధులైన వెంకటసుబ్బయ్య, అతని భార్యను హతమార్చి బంగారు, డబ్బును దోచుకోవాలనే ఉద్దేశంతో సుభాష్ కడపలోని రామాంజనేయపురంలో నివసిస్తున్న తన సమీప బంధువైన మోటు వెంకటసుబ్బయ్యకు విషయం తెలిపాడు. అప్పటికే నేరచరిత్ర ఉన్న వెంకటసుబ్బయ్య కడపలోని రామాంజనేయపురంలో తనకు పరిచయమున్న పాత నేరస్తులైన వల్లెపు శశికుమార్ అలియాస్ నాని, కొమ్మరి ధనుష్రెడ్డి అలియాస్ ధనుష్, పోతురాజు చందులతో పాటు కమలాపురానికి చెందిన వెంకటరమణతో చర్చించి హత్యకు ప్రణాళికను రూపొందించారు. వారం రోజులుగా రెక్కీ వృద్ధ దంపతులను హతమార్చి బంగారు, నగదు దోచుకోవాలన్న ఉద్దేశంతో నిందితులు ఆరుగురు కలిసి వారం రోజుల కిందట నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఇందులో బంగారు వ్యాపారి వెంకటసుబ్బయ్య ఇంటికి నమ్మకంగా తరచూ వెళుతుండే సుభాష్ ఇంట్లోకి వెళ్లగానే మిగిలిన ఐదుగురు నిందితులు కూడా ఇంటిలోకి వెళ్లి వృద్ధ దంపతులను చంపి డబ్బు, బంగారు దోచుకువెళ్లాలని పక్కా ప్లాన్ వేశారు. హత్యకుట్రను భగ్నం చేసిన పోలీసులు నిందితులు ఆరుగురు హత్యకు రెక్కీ నిర్వహించి సిద్దవటంరోడ్డులో వెళుతుండగా సమీపంలోని ఎరుకలబావి వద్ద అర్బన్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అప్పటికే మారణాయుధాలు దగ్గర ఉంచుకుని ఉన్న నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించగా కమలాపురానికి చెందిన వెంకటరమణ మినహా మిగిలిన ఐదురుగు పోలీసులకు చిక్కారు. అదుపులోకి తీసుకుని విచారించగా వృద్ధ దంపతుల హత్యకు కుట్ర పన్నినట్లు వివరించారు. వారి వద్ద నుంచి రెండు పిడిబాకులు, రెండు ఇనుపరాడ్లు, ఒక ఇనుప ఎక్సలేటర్ వైరుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వృద్ధ దంపతుల హత్య కుట్రను భగ్నం చేయడంలో కీలకంగా వ్యవహరించిన అర్బన్ ఇన్స్పెక్టర్ రమేష్బాబు, సీసీఎస్ ఎస్ఐ జీవన్రెడ్డి, ఏఎస్ఐ సుధాకర్, కానిస్టేబుళ్లు పుష్పరాజ్, రఫి, శ్రీనులను మైదుకూరు డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ బొజ్జప్ప పాల్గొన్నారు. -
పిల్లనిచ్చిన మామకే భరోసా ఇవ్వలేకపోయావ్..
-
చంద్రబాబు.. ఎవరికి భద్రత ఇచ్చారు..
సాక్షి, బద్వేల్ (వైఎస్సార్ జిల్లా) : ‘ఇసుక మాఫియా అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టుపట్టుకుని లాక్కుని వెళ్తుంటే.. చంద్రబాబు భద్రత ఇచ్చింది ఆ మహిళా అధికారికా? ఆయన ఎమ్మెల్యేకా? కాల్మనీ సెక్స్ రాకెట్ ద్వారా మహిళలను వేధింపులకు గురిచేస్తుంటే చంద్రబాబు భద్రత ఇచ్చింది ఎవరికీ? ఇసుక నుంచి భూములు దాకా, భూముల నుంచి రాజధాని వరకు చంద్రబాబు దోపిడీ చేయంది ఏదైనా ఉందా? ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఎవరికీ భద్రత ఇచ్చారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎవరికీ భద్రత ఇచ్చాడు? రాష్ట్ర ప్రజలకా.. ఆయన కుమారుడు లోకేష్కా? ’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా బద్వేల్లో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్ధానాలు గుర్తు తెచ్చుకోమని, మరోసారి అలాంటి అబద్దపు హామీలకు మోసపోవద్దని కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి.వెంకటసుబ్బయ్య, కడప లోక్సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. రెండేళ్లలో పరిష్కరిస్తా.. బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ ద్వారా 14 టీఎంసీలు ఇచ్చిన ఘనత దివంగత నేత వైఎస్సార్దే. చంద్రబాబు పాలనలో బద్వేల్ నియోజకవర్గంలో కరువు కాటకాలే. నా పాదయాత్రలో మీరు చెప్పిన సమస్యలు నాకు గుర్తుకున్నాయి. మీ సమస్యలన్నీ నాకు తెలుసు.. మీ అందరికి నేను ఉన్నాను అని మాట ఇస్తున్నాను. కుందు నదిపై లిఫ్ట్ పెట్టి బ్రహ్మం సాగర్కు నీరు ఇవ్వాలని, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి కలిశపాడు, పోరుమామిళ్ల ప్రజలకు నీళ్లివ్వాలని మీరు చెప్పిన సమస్యలన్నీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పరిష్కరిస్తా. చంద్రబాబుకు అధికారంలో ఉన్న 57 నెలలు ప్రజలు.. అభివృద్ధి గుర్తుకు రాదు. ఎన్నికలంటేనే ఆయనకు ప్రజలు గుర్తుకువస్తారు. బద్వేల్లో టీడీపీ కౌన్సిలర్లే ధర్నాలు చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ ఎన్నికలకు ముందు యాడ్స్ ఇస్తున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎవరికీ భద్రత ఇచ్చారు. ప్రజల వ్యక్తిగత సమాచారమైన ఆధార్, బ్యాంక్ ఖాతాలు, మహిళల ఫోన్ నంబర్లు, ఓటర్ల వివరాలు, ఇంటిలోకేషన్లు దొంగతనంగా చోరీ చేసి టీడీపీ సేవా మిత్ర యాప్లో పెట్టి జన్మభూమి కమిటీలకు ఇస్తున్నాడు.మన ఆడపిల్లల నెంబర్లు వారి దగ్గర ఉంటే భద్రత ఉందా? ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఎవరికి భద్రత ఇచ్చారు. ఇసుక నుంచి భూముల దాకా.. భూముల నుంచి రాజధాని వరకు దోపిడీ చేయనిది ఏమైనా ఉందా? ఇంత అడ్డగోలుగా దోపిడీ చేసి ఎవరికీ భద్రత ఇచ్చాడు. రాష్ట్ర ప్రజలకా ఆయన కుమారుడు లోక్ష్కా? అప్పుడు గుర్తుకు రాలేదా? ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిని జుట్టుపట్టుకుని లాక్కుని వెళ్తుంటే చంద్రబాబు భద్రత ఇచ్చింది ఆ మహిళా అధికిరాకా? ఆయన ఎమ్మెల్యేకా? చంద్రబాబు నివాసం ఉంటున్న విజయవాడలోనే తన కళ్ల ఎదుటనే ఆడవాళ్లకు అప్పులు ఇచ్చి మానాలు దోచుకుంటుంటే.. కాల్మనీ సెక్స్ రాకెట్ పేరిట వేదింపులకు గుర్తి చేస్తే.. చంద్రబాబు భద్రత ఇచ్చింది ఎవరికి? నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేనపుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ప్రత్యేక హోదా విషయం గుర్తుకు రాదు. ఈ రెండింటిని తాకట్టు పెట్టి ఎవ్వరికి భద్రతా ఇచ్చారు. రైతన్న రుణమాఫీ అని మోసం చేశారు. ఐదేళ్లు కరువు వచ్చినా పట్టించుకోలేదు. ఇంతటి దారుణంగా పరిపాలించిన ఈయన ఏ రైతుకు భరోసా ఇచ్చారు. డ్రాక్రా మహిళలు రుణమాఫీ అని ఎగ్గొట్టాడు. ఇలా మోసం చేసిన ఆయన ఏ అక్కచెల్లెమ్మకు భరోసా ఇచ్చారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా? ఏ నిరుద్యోగికి చంద్రబాబు భరోసా ఇచ్చాడు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.. ఆయన పదవిని లాక్కొని.. సొంత కూతురిని ఇచ్చిన మామకే భరోసా ఇవ్వలేకపోయావ్.. రాష్ట్ర ప్రజలకు ఏం ఇస్తావ్? జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో మాఫియా ఏర్పాటు చేశావ్.. ఏ పని జరుగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఆఖరికి మరుగుదొడ్ల మంజూరుకు లంచం ఇవ్వాల్సిందే. ఆరోగ్యశ్రీని అటకెక్కించాడు. 108, 104 రాని పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ భ్రష్టు పట్టించాడు. ఇంజనీరింగ్ చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. 108కి ఫోన్ కొడితే కుయ్కుయ్ అంటూ రావాల్సిన అంబులెన్స్ వస్తుందనే భరోసా లేదు. ఆరోగ్యశ్రీతో జబ్బులు నయం అవుతుందన్న నమ్మకం లేదు. దొంగ పనులన్నీ చేసి చట్టానికి దొరక్కుండా ఆయనకు ఆయన భరోసా ఇచ్చుకుంటున్నారు. ఇంత దారుణమైన పాలన జరుగుతుంటే టీవీ ప్రకటనలు ఇస్తారు. 2014లో ఆయన ఇచ్చిన ప్రకటనలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మరీ బంగారం వచ్చిందా? జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. వచ్చిందా? ఐదేళ్లు అయిపోయింది. మళ్లీ కొత్త ప్రకటనలు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటు మరో మోసానికి తెర లేపారు. అన్న ఉన్నాడని చెప్పండి.. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 15 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
నా రూ.3కోట్లు తిరిగి ఇచ్చేయండి
-
నా రూ.3కోట్లు తిరిగి ఇచ్చేయండి: టీడీపీ అభ్యర్థి
సాక్షి, కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన ఓటమిని ఖరారు చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్ రాజశేఖర్ ....పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన బద్వేల్లో పరాజయం తప్పదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. చదవండి...(భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి ) దీంతో తన ఓటమి ఖాయమని నిర్థారించుకున్న రాజశేఖర్ నిన్న తన కుటుంబసభ్యులతో సమావేశం అయ్యారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే అంశంపై చర్చించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం తాను ఇచ్చిన రూ.3 కోట్లు తిరిగి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సమయంలో రాజశేఖర్ ఉదంతం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీలో అవమానించారు వైయస్సార్ జిల్లా బద్వేల్ టీడీపీ నాయకురాలు విజయజ్యోతి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీడీపీలో ఉన్నంత కాలము తనను చిత్ర హింసలకు గురిచేశారని, అవమానించారని వాపోయారు. టీడీపీ మోసం చేయడంతో ఆ పార్టీని వదిలిపెట్టినట్టు చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారు. చదవండి...(టీడీపీలో చల్లారని అసమ్మతి) -
బద్వేలులో టీడీపీ నాయకుడు తీరుపై విమర్శలు
-
బద్వేలులో నిన్నునమ్మం బాబు కార్యక్రమం
-
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, బద్వేలు అర్బన్: వైఎస్సార్జిల్లా బద్వేలు మండల పరిధిలోని గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి (32) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ బుధవారం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతిచెందాడు. గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి భాస్కర్రెడ్డి, నరసమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రెండో సంతానమైన వెంకటసుబ్బారెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఈయనకు 13 నెలల క్రితం బి.మఠం మండలం గంగిరెడ్డిపల్లెకు చెందిన స్వర్ణలతతో వివాహమైంది. ఆమె కూడా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరుకున్న వెంకటసుబ్బారెడ్డి కొద్దిసేపటికే ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రులు కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు. కొన్ని నెలలుగా భార్యభర్తల మధ్య ఏర్పడిన విబేధాల వల్ల ఇరువురు వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. తన భార్యను కాపురానికి రావాలని అడుగుతున్నప్పటికీ రాకుండా వేధింపులకు గురి చేస్తుండేదని, అందుకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
చంద్రబాబు పర్యటన లొల్లి..! అయోమయంలో అధికారులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి నేతృత్వం వహించేందుకు బద్వేలు నియోజకవర్గంలోని రెండు వర్గాల మధ్య కుమ్ములాట మొదలైంది. వివరాలు.. బద్వేల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఆగస్టు 17) పర్యటించనున్నారని టీడీపీ వెల్లడించించి. అయితే హెలీప్యాడ్, బహిరంగ సభ వీరారెడ్డి కాలేజీలో పెట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సన్నాహకాలు చేస్తుండగా.. ఎమ్మెల్యే జయరాములు ఆమెకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాలేజీలో సభ ఏర్పాట్లు చేయొద్దంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో సభ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గ పోరుతో అయోమయంలో పడ్డారు. -
పోలీసు అధికారులపై టీడీపీ ఎమ్మెల్యేల పెత్తనం
-
వైఎస్సార్ జిల్లాలో 17 ఏళ్ల యువతిపై అత్యాచారం
-
బద్వేలు టీడీపీలో బహిర్గతమైన వర్గపోరు
-
మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం..
సాక్షి, బద్వేలు: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తార స్థాయికి చేరింది. నియోజకవర్గంలో పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు, ఎమ్మెల్యే జయరాములు విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో విజయమ్మపై ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండగా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. జిల్లా స్థాయి నాయకులు సైతం కుల వివక్ష చూపుతూ ఎస్సీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. పార్టీని నమ్మి టీడీపీ కండువా వేసుకుంటే, ఎస్సీ ఎమ్మెల్యే అని అగ్రవర్గాలవారు అణగదొక్కే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై జరుగుతున్న అన్యాయాలపై అధిష్టానం వెంటనే స్పందించపోతే ఏ ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనని ఆయన హెచ్చరించారు. లేకుంటే నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లతో కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఆయన వెల్లడించారు. -
ఔరా.. ఆమె ఎంత పని చేసింది!
సాక్షి, బద్వేలు అర్బన్ : చీటీల పేరుతో ఓ మహిళ రూ.30లక్షలతో ఉడాయించిన ఘటన బుధవారం పట్టణంలో వెలుగుచూసింది. వారం రోజులుగా సదరు మహిళ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మదీనా సమీపంలో గల బెస్తకాలనీలో నివసిస్తుండే దస్తగిరమ్మ అనే మహిళ గత కొన్నేళ్లుగా శివానగర్, పూసలవాడ, సుందరయ్యకాలనీ, మదీనామసీదు వీధి, మేదరకాలనీలకు చెందిన సుమారు 60 మంది మహిళలతో చీటీలు నిర్వహిస్తుండేది. పరిసర ప్రాంతాలకు చెందిన చాలామంది ఆమె దగ్గర సుమారు రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు చీటీలు వేశారు. కొన్నేళ్ల పాటు చీటీలు పాడుకున్న వారికి సక్రమంగా చెల్లిస్తూ బాగా నమ్మకం పెంచుకుంది. ఆ తర్వాత 6 నెలలుగా చీటీలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. గట్టిగా అడిగిన వారికి వడ్డీ చెల్లిస్తానని ప్రామిసరీనోట్లు సైతం రాయించి నమ్మపలికించింది. అయితే గత వారం రోజులుగా ఇంటికి తాళం వేసి కనిపించడకుండా పోయింది. ఫోన్ను సైతం స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంది. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. లబోదిబోమంటున్న బాధితులు : కాయాకష్టం చేసుకుని సంపాదించకున్న సొమ్ముతో చీటీలు వేసుకుంటే, ఆపద సమయంలో ఉపయోగపడుతుందని భావించి చీటీలు వేసుకున్న మహిళలు మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నారు. వీరిలో కొందరు పిల్లల చదువుల కోసం, మరికొందరు పెళ్ళిళ్ళ కోసం, గల్ఫ్ దేశాలకు వెళ్లే నిమిత్తము, ఆసుపత్రి అవసరాల కోసం చీటీలు వేసిన వారు ఉండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. నమ్మకంగా ఉంటూ అందరి వద్ద డబ్బులు వసూలు చేసుకుని ఉడాయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చీటీ నిర్వాహకురాలిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
స్టేషన్లోనే తన్నుకున్నారు..!
బద్వేలు(అట్లూరు): బద్వేలు పోలీస్స్టేషన్లో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు రాజు, మంత్రిగా రాజ్యమేలుతున్నారు. తప్పులు చేసిన వారి నుంచి డబ్బులు తీసుకుని కేసుల నుంచి తప్పిస్తున్నారు. పై అధికారులు సైతం వారు చెప్పినదే తడవుగా తలూపుతున్నట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెచ్చుకున్న మామూళ్లను పంచుకోవడంలో తలెత్తిన విభేదాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒకరు హెడ్కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ రైటర్గా, కానిస్టేబుల్ ఐడీ పార్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ స్టేషన్లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఎర్రచందనం దుంగల లోడుతో వాహనం వెళ్తోందని.. ఆ ఇద్దరికి వేర్వేరుగా సమాచారం అందింది. వారు ఎవరికి వారు మైదుకూరు రోడ్డులోని చెన్నంపల్లి, నందిపల్లి మార్గంమధ్యలో ఆ వాహనాన్ని నిలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఆ వాహనాన్ని స్టేషన్కు తీసుకు రావాల్సింది పోయి స్మగ్లర్లతో బేరసారాలకు దిగారు. ఇద్దరు వేర్వేరుగా డిమాండ్ చేస్తే ఎలా.. ఇద్దరు కలసి చెప్పాలని వారు అన్నారు. దీంతో ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. వారు మూడు లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ మూడు లక్షల పంపకంలో హెడ్ కానిస్టేబుల్ నాకు రెండు భాగాలు కావాలనడంతో.. ఆయనకు కానిస్టేబుల్కు మధ్య గొడవ జరిగింది. స్టేషన్లోనే నోటి మాటలతో మొదలై బూతులకు దారి తీసింది. చివరకు కొట్టుకున్నారు. దీంతో ఆ స్టేషన్ ఎస్ఐ వారి మధ్య సర్దుబాటు చేసినట్లు తెలిసింది. అలాగే వారు ఆరుగురు మట్కా నిర్వాహకులను ఇటీవల తీసుకొచ్చారు. అందులో తండ్రీకొడుకు ఉండగా కొడుకును తప్పించి భారీ మొత్తంలో వసూలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా అన్ని పంచాయితీలలో ఆ ఇద్దరిదే స్టేషన్లో కీలక పాత్ర. గతంలోనూ ఇంతే.. ఆ ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వీరిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నత అధికారులు ఒకరిని రైల్వేపోలీస్స్టేషన్కు, ఒకరిని జిల్లా చివరి మండలానికి పనిష్మెంట్ కింద సాగనంపారు. తర్వాత పలుకుబడిని ఉపయోగించుకుని నెలలలోనే మళ్లీ అదే స్టేషన్కు వచ్చారు. విచారణ చేస్తా.. ఈ విషయంపై బద్వేలు సీఐ రెడ్డెప్పను ‘సాక్షి’ వివరణ అడగగా.. ‘ఎవరండీ మీరు. ఎక్కడ రిపోర్టరు. మాస్టేషన్లో జరిగినట్లు నా దృష్టికి రాలేదు. అయినా సరే విచారణ చేస్తా’ అని అన్నారు. -
కళాశాల విద్యార్ధులతో పార్టీ ప్రచారం
-
భర్త కోసం మౌనవేదన
బద్వేల్ (అట్లూరు): తెలుగుదేశం పార్టీ పాల్పడుతున్న నీచరాజకీయాలు ఒక నిండు గర్భిణికి చేటు తెచ్చాయి. వివరాల్లోకి వెళ్లితే పోరుమామిళ్లకు చెందిన ఎంపీటీసీ డాక్టర్ గౌస్పీర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే తనమద్దతని తెలిపారు. అతనిని ఏలాగైనా లొంగదీసుకునేందుకు పన్నాగం పన్నిన టీడీపీ నాయకులు ఎంపీటీసీ కుమారుడు ముర్తుజా హుసేన్ను పోరుమామిళ్లలో ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు. ముర్తుజా హుసేన్ భార్య రేష్మా కాన్పు కోసం పుట్టిళ్లు దువ్వూరుకు వెళ్లింది. తనభర్త కిడ్నాప్ అయిన విషయం తెలిసి రెండు రోజులుగా తిండి తిప్పలు మానేసింది. ఆమె పడుతున్న వేదనను చూసి పోరుమామిళ్ల పట్టణ ప్రజలు తెలుగుదేశంపార్టీని,నాయకులను తూర్పారపడుతున్నారు. ఓటు కోసం ఇంత ఘతానికి దిగుతారా..? అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. -
అలరించిన సంగీత విభావరి
బద్వేలు అర్బన్: నూతన సంవత్సర వేడుకలలో భాగంగా శృతిసినీఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొల్ల సాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు విద్వాన్గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ ప్రస్తుత ఉరకల, పరుగుల జీవితంలో ఎన్నో ఒత్తిడులు , ఆటుపోట్లు ఎదురవుతుంటాయని అలాంటి సమయంలో పాటలు వినడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పాటలకు అంతగొప్పశక్తి ఉందన్నారు. అలాగే ప్రభుత్వం కళాకారులకు ఆర్థిక చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం గాయకులు లక్కినేని వినయ్కుమార్, శ్రేయలు ఆలపించిన గీతాలు, శ్రీ కళాఆర్ట్స్ అకాడమి విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు రంగరాజు, విశ్రాంత ఉద్యోగులు సిహెచ్కె. నరసింహులు, మల్లారెడ్డి, రాణా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క పథకమూ అందలేదు
- ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు బద్వేలు అర్బన్: ఎన్నికలలో గెలిపిస్తే పక్కాగృహాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం అంటూ ఏవేవో హామీలిస్తే నమ్మి ఓట్లేశాం. గెలిచిన తర్వాత ఏ ఒక్క పథమూ అందించలేదని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు చెందిన మంగళకాలని, పూసలవాడ ప్రజలు వాపోయారు. బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని ఆయా కాలనీలలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలు తమగోడు వెళ్లబోసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్లు, పక్కాగృహాలు , మరుగుదొడ్లు మంజూరుచేయడంలో వివక్షచూపుతున్నారని వాపోయారు. ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన సమయంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని, కాలనీలలో సిమెంటు రోడ్లు , తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అనేక హామీలిచ్చిన టీడీపీ నాయకులు కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే చంద్రబాబును నమ్మి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామని, ఇక నమ్మే పరిస్థితులలో లేమని తేల్చి చెప్పారు. అనంతరం సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కేవలం ఎన్నికలలో గెలుపొందేందుకే ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణపల్లె సింగిల్విండో అధ్యక్షుడు గుర్రంపాటి సుందరరామిరెడ్డి , జిల్లా సంయుక్త కార్యదర్శి కొండు శేఖర్రెడ్డి , మున్సిపాలిటీ కన్వీనర్ కరిముల్లా , మాజీ సర్పంచ్ ఆదిశేషయ్య, నాయకులు రఘురామిరెడ్డి, గాజులపల్లె కేశవరెడ్డి,యద్దారెడ్డి, మల్లేష్, ఎస్ఎం. షరీఫ్, సాంబశివారెడ్డి, శేఖర్రెడ్డి, రాము,మురళి,చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులో నూరున్నిసా(29) అనే వివాహిత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వైజాగ్ ఎం.వి.పి కాలనీలో నివసించే కుదావన్, ఖాజాబిల మొదటి సంతానమైన నూరున్నిసాను పట్టణంలోని హుసేన్బాషా,, హుసేన్బీల మూడవ కుమారుడైన తొగరిగుంట కరిముల్లాకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఆరేళ్ల హబీబా అనే అమ్మాయి , కరామత్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం పిల్లలు చదువుకునే స్కూల్కు వెళ్లి భోజనం తినిపించి వచ్చిన నూరున్నిసా మేడపై గదిని శుభ్రం చేసేందుకు వెళ్తున్నానని అత్తతో చెప్పి వెళ్లింది. సాయంత్రం బడి ముగించుకుని ఇంటికి వచ్చిన కుమార్తె హబీబా మేడపైకి వెళ్లి తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా గడియపెట్టి ఉండడంతో కిటికిలోనుంచి చూసేసరికి నూరున్నిసా ఫ్యాన్కు వేళాడుతూ కనిపించింది. వెంటనే చిన్నారి నాన్నమ్మకు విషయం తెలపడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపు పగులగొట్టి మృతదేహన్ని కిందకు తీశారు. విషయం తెలుసుకున్న సీఐ రామాంజినాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
- పలుచోట్ల సేవా కార్యక్రమాలు బద్వేలు అర్బన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక సుమిత్రానగర్లోని షాలోమ్ అనాథ శరణాలయంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అనాథ పిల్లల నడుమ కేక్ కట్చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ జనహృదయ నేతగా నిలిచారన్నారు. ఇది సహించలేని టీడీపీ నేతలు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కుటిల రాజకీయాలు చేస్తుందన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజల మనసుల్లో ఆయన స్థానం అలాగే కొనసాగుతుందన్నారు. అలాగే 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. అలాగే స్థానిక మైదుకూరురోడ్డులోని దివ్యజ్యోతి వృద్ధాశ్రమంలో కలసపాడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సింగసాని గురుమోహన్, బ్రాహ్మణపల్లె సింగిల్విండో ప్రెసిడెంట్ సుందర రామిరెడ్డి, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు అందూరి రామకృష్ణారెడ్డి, సింగసాని శివయ్య, కొండుశేఖర్రెడ్డి, కౌన్సిలర్ గోపాలస్వామి, చిన్నకేశంపల్లె సింగిల్విండో అ«ధ్యక్షుడు చిన్నపోలిరెడ్డి, సర్పంచ్ జయసుబ్బారెడ్డి, మున్సిపాలిటీ కన్వీనర్ కరిముల్లా, గోపవరం మండల అ«ధ్యక్షురాలు సరస్వతమ్మ, నాయకులు పుత్తా శ్రీరాములు, రాజగోపాల్రెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, యద్దారెడ్డి, బాలాజీ శ్రీను,కేశవరెడ్డి, మాధవరెడ్డి, వెంకటరత్నం, రఘురామిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, మాధవరెడ్డి, సాంబశివారెడ్డి, శేఖర్రెడ్డి, ఎస్ఎం. షరీఫ్, సుబ్బరాయుడు యాదవ్, బిజ్జం రమణ, ఆకుల శివ, నాగేశ్వరరావు, కుప్పాల రమణ, మురళి, సిద్దయ్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడండి
- డీఎస్పీ రామక్రిష్ణయ్య బద్వేలు అర్బన్: మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం బ్యాంక్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఖాతాదారులు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఇందుకోసం బ్యాంక్ల వద్ద ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మైదుకూరు డీఎస్పీ ఎన్.రామకృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్బీఐ మెయిన్బ్రాంచ్లో పట్టణంలోని వివిధ బ్యాంక్ల మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ రద్దీ ఉండే బ్యాంక్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు టోకన్ సిస్టం అమలు పరచాలని కోరారు. అలాగే క్యూలైన్లలో ఉన్నవారికి తాగునీటి వసతి కల్పించాలన్నారు. ప్రజలు కూడా సంయమనం పాటించి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. బ్యాంక్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐ రామాంజినాయక్కు సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఇన్చార్జి మేనేజర్ కోటానాయక్, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ రాంనాయక్, ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ మేనేజర్ సుజితలతోపాటు వివిధ బ్యాంక్ల మేనేజర్లు , బద్వేలు , గోపవరం ఎస్ఐలు నూర్ అహ్మద్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యక్తి మృతి
బద్వేలు అర్బన్: స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం ఆర్టీసీ అద్దెబస్సు ఢీకొన్న సంఘటనలో పంగా రమణారెడ్డి (59) అనే వ్యక్తి మృతి చెందాడు. పంగావాండ్లపల్లెకు చెందిన రమణారెడ్డి కొన్నేళ్లుగా పట్టణంలోని సురేంద్రనగర్లో నివసిస్తున్నాడు. ఆదివారం తన సొంత పనిమీద నాలుగురోడ్ల కూడలికి వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో బద్వేలు డిపోకు చెందిన ఏపీ04 టీడబ్ల్యు 0456 నంబరుగల అద్దెబస్సు అనంతపురం నుంచి బద్వేలుకు వస్తున్న సమయంలో రోడ్డుదాటుతున్న రమణారెడ్డిని ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. పట్టణ పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సుతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కాగా మృతుడి భార్య 15 సంవత్సరాల క్రితమే మృతిచెందగా ఇద్దరు కుమారులు ఉన్నారు.