Municipal Commissioners
-
సచివాలయ ఉద్యోగులను దూషించిన కమిషనర్
-
కమిషనర్ పులి శ్రీనివాసులు అక్రమాలకు పాల్పడ్డారు: మనోహర్ నాయుడు
-
మీటింగ్కు కమిషనర్ డుమ్మా.. గుంటూరు మేయర్ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు, సాక్షి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ..మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందే. ఈనెల 4వ తేదీన జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తాం. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. నగర వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్మును9 కోట్ల 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతెంత సాయం చేశారన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకే క్లారిటీ లేకుండా పోయింది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు 9 కోట్ల 24 లక్షలు దోచేశారు. పైగా ఖర్చులకు సంబంధించిన తప్పుడు నివేదిక అందించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు. కనీసం ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా కమిషనర్ చెప్పటం లేదు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై వెంటనే విచారణ చేయాలని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తా. మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) కు ఓపిక, సహనం ఉండాలి. నేనొక ఐఏఎస్ని.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ప్రజలకు ఆయన జవాబుదారిగా వ్యవహరించాలి. పది రోజుల క్రితం కౌన్సిల్ జరుగుతుండగా మధ్యలో అర్ధాంతరంగా కమీషనర్ పులి శ్రీనివాస్ వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదు. పులి శ్రీనివాస్ కేవలం మేయర్ను, కార్పొరేటర్లను మాత్రమే కాదు.. 11 లక్షల మంది జనాల్ని అవమానించారు. ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న సిబ్బందిని కూడా ఏకపక్షంగా తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని ఎనిమిదో తారీకు కమిషనర్ పులి శ్రీనివాసులుకు లెటర్ రాశాను. అయినా ఆయన రాలేదు. ఎక్కడ తాను చేసిన అవినీతి చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల పేరుతో సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు.. అని మేయర్ కావట్టి మనోహర్ నాయుడు అన్నారాయన. -
గుంటూరు మున్సిపల్ కమిషనర్ తీరుపై డిప్యూటీ మేయర్ ఫైర్
-
‘ఇందిరమ్మ’లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. లబ్ధిదారులను గుర్తించేందుకు వీలుగా ఇందిరమ్మ కమిటీల విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించింది. మూడు నెలల తర్వా త ఈ పథకాన్ని భద్రాచలంలో మంత్రులందరితో కలిసి సీఎం ప్రారంభించారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడున్నర నెలల తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి వీలుగా కసరత్తు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్కోటి రూ.5 లక్షల వ్యయంతో నియోజకవర్గానికి మూడున్నర వేలు చొప్పున ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగా ఉన్నవారికే.. గ్రామ, పట్టణ స్థాయి (వార్డు/డివిజన్లవారీగా)లో ఏర్పాటయ్యే ఈ కమిటీలే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు, సోషల్ ఆడిట్ వరకు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్రామ స్థాయి కమిటీలను ఎంపీడీవోలు, వార్డు స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగాలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. సొంత జాగా లేని వారికి ఇళ్లను మంజూరు చేయరు. సొంత జాగాలో కచ్చా ఇల్లు ఉన్నవారు, పక్కా ఇల్లు ఉన్నవారెవరన్న విషయంలో జాగ్రత్తగా వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అనర్హులను లబ్ధిదారులుగా గుర్తిస్తే నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపులో జాగ్రత్త అవసరమని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. కాగా కమిటీ సభ్యులు లబ్ధిదారుల వివరాలను సేకరించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. కొత్త దరఖాస్తులు తీసుకుంటారా? ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పది నెలల క్రితం సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులందాయి. వాటిల్లో ప్రాథమిక స్థాయి వడపోత తర్వాత 50 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వీటిల్లో అర్హమైనవి ఎన్ననే విషయం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. కాగా పాత దరఖాస్తులే పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తవి కూడా స్వీకరిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఎంపికకు సుదీర్ఘ సమయం! లబ్ధిదారుల ఎంపికకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకున్నా.. ఒక్కో దరఖాస్తు ఆధారంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి అర్హతను తేల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం జాబితాను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాతే నిధుల విడుదల ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హడ్కో నుంచి ఇళ్ల కోసం దాదాపు రూ.3 వేల కోట్ల రుణం పొందింది. కేంద్రం నుంచి మరో రూ.8 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష చెల్లించి మిగతా విడతలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసే ఇళ్లకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయి. గ్రామస్థాయి కమిటీ: సర్పంచ్/ పంచాయితీ ప్రత్యేక అధికారి చైర్మన్గా ఉండే కమిటీలో స్వయం సహాయక బృందాలకు చెందిన ఇద్దరు మహిళలు, గ్రామ పురోగతికి పాటుపడే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, పంచాయితీ కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు. పట్టణ స్థాయి కమిటీ: వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృంద సభ్యులు, స్థానికంగా అభివృద్ధి పనులకు సహకరించే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, వార్డు అధికారి కన్వీనర్గా ఉంటారు. -
లేటు ఎందుకని అడిగితే.. ప్రజావాణిలో అధికారుల మధ్య లొల్లి
-
ముగ్గురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, అమరావతి: పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ముగ్గురు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్కుమార్ను ధర్మవరం కమిషనర్గా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వి.మల్లికార్జునను ప్రొద్దుటూరుకు మార్చారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు కమిషనర్గా ఉన్న జి.రఘునాథరెడ్డిని బాపట్ల కమిషనర్గా నియమించారు. ఈ స్థానంలో పనిచేస్తున్న వి.నిర్మల్ కుమార్ను కేంద్ర ఆరి్థక శాఖ (సీసీఏఎస్)కు పంపారు. -
ధర్మవరంలో నెగ్గేదెవరూ? తగ్గేదెవరు?!
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు తమ స్వేచ్ఛను కోల్పోయారు. నిజాయితీతో పని చేస్తూ నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు తమకు అవసరం లేదంటూ స్థానిక టీడీపీ నాయకులు తమ అధినేత బాటలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఇందుకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం నిలువుటద్దమైంది. విధులకు హాజరైతే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానంటూ కార్యకర్తల సమావేశంలో పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చి అహంకారాన్ని ప్రదర్శించగా... ప్రభుత్వం తనని నియమించింది కాబట్టి విధులను నిజాయితీతో నిర్వర్తించి తీరుతానంటూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రతిగా స్పందించారు. ఎవరికి వారే పంతం పట్టడంతో వీరిద్దరిలో నెగ్గేదెవరు? తగ్గేదెవ్వరూ? అన్నది ప్రస్తుతం ధర్మవరంలో హాట్ టాపిక్గా మారింది.పరిటాలకు మింగుడు పడని అంశం..ధర్మవరం మున్సిపాలిటీకి నూతన కమిషనర్గా మల్లికార్జునను 15రోజుల క్రితం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే సదరు కమిషనర్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ధర్మవరం మున్సిపాలిటి కమిషనర్గా పనిచేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో పని చేసిన అనుభవం ఉండడంతో ఆయన పర్యవేక్షణలో ధర్మవరం మరింత అభివృద్ధి చెందుతుందని భావించిన కూటమి ప్రభుత్వం ఇటీవల ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న పరిటాల శ్రీరామ్కు మింగుడు పడలేదు. కమిషనర్గా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించక ముందే పరిటాల శ్రీరామ్ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున కమిషనర్గా బాధ్యతలు చేపడితే చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి బయటకు గెంటేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా మల్లికార్జున కార్యాలయానికి రాకుండా ఉండేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి అల్లర్లకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నాయకులు తిష్ట వేసి నిరసన తెలుపుతుండటంతో పోలీసులు ఇరుకున పడ్డారు. తమను మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రతకు కేటాయిస్తే రోజువారీ డ్యూటీలు ఎలా చేయాలంటూ వారిలో వారు మదన పడుతున్నారు.అమ్మో ధర్మవరమా?మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారడంతో ధర్మవరానికి బదిలీపై వెళ్లాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడం తమ వల్ల కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ధర్మవరానికి పోస్టింగ్ అయిన అధికారులు సైతం తమను మరో ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓ ముఖ్య అధికారి సైతం ఇక్కడ పని చేయలేక వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి టీడీపీ నేతల వైఖరితో ధర్మవరం వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేతల తీరుపై మండిపడుతున్నారు. -
పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె.. కమిషనర్
సాక్షి, చెన్నై: తిరువారూర్ జిల్లాకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె అదే జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–2 ఉత్తీర్ణతతో తిరుత్తురైపూండి మునిసిపాలిటీ కమిషనర్గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి పుదుపాలం గ్రామం సత్యమూర్తి నగర్ చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్ మన్నార్ కుడి కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది. మన్నార్కుడి ప్రభుత్వ ఎయిడెడ్ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్–2 వరకు చదవింది. ఆ తర్వాత అతి కష్టంతో మన్నార్ కుడి రాజగోపాల స్వామి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా, చివరకు 2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్ ఆమెకు సహకారం అందించాడు. 2019 నుంచి పట్టువదలని విక్రమార్కుడి తరహాలో టీఎన్పీఎస్సీ పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది. 2023 గ్రూప్ –2 లో మెరిట్ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూలలోనూ 30కు 30 మార్కులు సాధించారు. తొలుత పోలీసు విభాగంలో లోని స్పెషల్ బ్రాంచ్ సీఐడీలో పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి కారి్మకుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి కమిషనర్ కావాలని తాపత్రయం పడింది. పరిస్థితులు అనుకూలించడంతో తిరువారూర్ జిల్లా పరిధిలోని మన్నార్కుడి మునిసిపాలిటికీ పొరుగున ఉన్న తిరుత్తురైపూండికి కమిషనర్ అయ్యే అవకాశం దక్కింది. సోమవారం సీఎం స్టాలిన్ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా మంగళవారం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా, పారిశుద్ధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గా పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె కమిషనర్గా మునిసిపాలిటీలోకి అడుగు పెట్టినా, కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్కు దక్కలేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించడం గమనార్హం. -
బల్దియాలో బదిలీలు నై?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో బదిలీలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలోనూ బదిలీల పర్వం ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు పదిమంది మున్సిపల్ కమిషనర్లు, ఇతర త్రా విభాగాల్లో ఒకరో, ఇద్దరివో బదిలీలు మాత్రమే జరిగాయి తప్ప కీలక విభాగాల్లో ఉన్న వారివి జరగలేదు. వారితో పాటు సీనియర్లుగా ఎంతోకాలంగా ఇక్కడే పాతుకుపోయిన ఉన్నతస్థాయిల్లోని వారి బదిలీలూ జరగలేదు. వారిలో చాలా మంది తామిక్కడే ఉంటామని, తమనెవరూ కదల్చలేరని సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం మున్సిపల్ శాఖలో తమ హోదాకు తగిన పోస్టులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లలో ఖాళీ లేనందున తమను ఎక్కడికీ పంపలేరని చెబుతున్నారు. రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా ఉన్నందున, తమను ఎక్కడికీ ఎవరూ కదల్చలేరని భరోసాగా ఉన్నారు. అంతేకాదు బదిలీలు 40 శాతానికి మించి జరగరాదనే నిబంధనతోనూ అన్ని స్థాయిల పోస్టులను పరిగణనలోకి తీసుకొని తమను కదల్చలేరని పదేళ్లకుపైగా పని చేస్తున్నవారు సైతం నమ్మకంగా ఉన్నారు. వారే కాదు.. ఎంటమాలజీ వంటి విభాగాల్లోని వారిది సైతం అదే ధీమా. సీనియర్ ఎంటమాలజిస్టు పోస్టు లు రాష్ట్రంలో చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నందున తాము ఇక్కడే ఉంటామని ధీమాగా ఉన్నారు. కదలరు అంతే.. జీహెచ్ఎంసీలో దాదాపు రెండేళ్లు పనిచేసినా చాలు ఎవరైనే సరే ఇక్కడినుంచి ఇంకెక్కడికీ కదలరు. అందుకు కారణం ఇక్కడ లభించే సదుపాయాలు, పై ఆదాయాలు ఇంకెక్కడా లభించవు. అందుకే పదోన్నతులను సైతం కాదనుకొని ఇక్కడే ఉంటున్నవారు. ఉండేందుకు ప్రయతి్నస్తున్న వారూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో కమిషనర్ స్థాయి వారికి, క్షేత్రస్థాయి పర్యటనలు ఉండేవారికి మాత్రమే వాహన సదుపాయం ఉంటుంది. ఇక్కడైతే సూపరింటెండెంట్లకు, అంతకంటే దిగువ స్థాయి వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. అంతేకాదు.. కార్యాలయం నుంచి కాలు బయట పెట్టని వారికి సైతం వాహన సదుపాయం ఉంటుంది. దాన్ని మరోలా వినియోగించుకొని నెలవారీ ఆదాయం పొందుతున్న వారూ తక్కువేం లేరు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా వివిధ వై¿ోగాలకు అవకాశం ఉన్నందున, వాటికి అలవడిన వారు ఇక్కడి నుంచి కదలడం లేదు. వచ్చేవారే.. వెళ్లేవారు లేరు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్లపై బల్దియాకు వచ్చిన వారు సైతం ఇక్కడి నుంచి కదలనే కదలరు. డిప్యుటేషన్లు ముగిసినా, ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన ఎందరో ఉన్నారు. యూసీడీ విభాగం నుంచి మొదలు పెడితే ఇలాంటి వారికీ లెక్కేలేదు. బదిలీల సమయంలో సైతం వారిని కదల్చలేకపోతున్నారంటే వారి ‘పవర్’ ఏమిటో అంచనా వేసుకోవచ్చు. మున్సిపల్ శాఖకు చెందిన వారు ఎందరో కొందరు బదిలీ అవుతున్నప్పటికీ, ఇతర విభాగాల వారు మాత్రం కావడం లేదంటే వారి హవా ఎంతో ఊహించుకోవచ్చు. ఏళ్లకేళ్లుగా.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరిలో ఇరవయ్యేళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నవారు ఎందరో ఉన్నారు. అంతేకాదు.. 30 నుంచి 40 ఏళ్లుగా నగరంలోనే ఉంటున్నవారు కూడా ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సీనియర్లయిన తమను ఎక్కడకూ పంపలేరని భావిస్తున్న వారు ఇతర ప్రాంతాల్లో తమ హోదాకు తగ్గ పోస్టుల్లేవంటున్నారు. కానీ.. ఇతర విభాగాల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్పై వస్తుండగా లేనిది మున్సిపల్ శాఖ నుంచి ఇతర విభాగాలకు ఎందుకు డిప్యుటేషన్లపై వెళ్లడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటికీ ఒకటే సమాధానం. సదుపాయాలు.. పై ఆదాయం. ప్రత్యేక చాంబర్లు. అందుకే వచ్చేవారు తప్ప వెళ్లేవారు కనబడటం లేదు. గతంలో ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రం అలా ఇతర విభాగాలకు వెళ్లారు. అలా మిగతా వారెందుకు వెళ్లరో వారితోపాటు ఉన్నతాధికారులకే తెలియాలి. బల్దియాకు భారం.. స్టాఫింగ్ ప్యాటర్న్పై ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్ఎంసీలో ఆరుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం డజను మంది ఉన్నారు. గతంలో ఐదారుగురు అడిషనల్ కమిషనర్లు మాత్రమే అన్ని విభాగాలనూ నిర్వహించేవారు. ప్రస్తుతం అధికారులు పెరిగారు. పనులు తగ్గాయి. పనులు తగ్గినందున సమర్థంగా పని చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎస్టేట్స్, అడ్వర్టయిజ్మెంట్స్, ట్రేడ్లైసెన్స్ల వంటి విభాగాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయంలో ఇరవై శాతం కూడా రావడం లేదంటే పరిస్థితిని అంచనా వేసుకోవవచ్చు. సీనియర్లు, పెద్ద హోదాల వల్ల వారి జీతభత్యాలు, సదుపాయాల కల్పనతో జీహెచ్ఎంసీకి ఆర్థిక భారం పెరుగుతోంది. అయినా.. మేమింతే. ఇక్కడే ఉంటామంటున్న వారిని ఎవరైనా కదల్చగలరా? వేచి చూడాల్సిందే! ప్రసాదరావు కమిటీ సిఫారసుల మేరకు సర్కిల్ కార్యాలయాలను 12 నుంచి 30కి పెంచారు. అయిదు జోన్లను ఆరుగా చేశారు. ప్రధాన కార్యాలయంలో 11 మంది అడిషనల్ కమిషనర్లను 6కు తగ్గించాలని సిఫారస్ చేస్తే ప్రస్తుతం డజను మంది ఉన్నారు. బదిలీలపై వచ్చేవారితో ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. టౌన్ న్ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్, ఎస్టేట్స్, అడ్వర్టయిజ్మెంట్స్ తదితర విభాగాలను బలోపేతం చేయాల్సి ఉందని కమిటీ సూచించింది. కానీ మెరుగవలేదు. -
YSRCP ఆఫీసు కూల్చివేతపై అధికారులకు హైకోర్టు మొట్టికాయలు
-
తాడేపల్లి వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేత కేసులో హైకోర్టు కీలక నోటీసులు
-
మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
తెలంగాణ భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. నిన్న(మంగళవారం) 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వలు జారీ చేయగా, కాగా తాజాగా బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పురుపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. రూరల్ డెవలప్మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేసింది. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ రజిత
జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఇంటి నిర్మాణానికి మార్టిగేజ్ చేసిన స్థలం రిలీజ్ కోసం లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, రాజు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చిట్టిపల్లి రాజు జిల్లా కేంద్రంలోని సూర్యాపేటరోడ్డు కెమిస్ట్రీ భవనం ఎదురుగా 2022 జూన్లో జీ ప్లస్–3 భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయంలో నిబంధనల మేరకు 10 శాతం స్థలం మున్సిపల్ పేరిట మార్టిగేజ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా నిర్మాణ పనులు పూర్తి కావడంతో, మార్టిగేజ్ స్థలం రిలీజ్ చేయాలని దరఖాస్తు చేయగా, కమిషనర్ రూ.40వేలు నగదు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రాజు సహాయంతో ఫోన్ సంభాషణల రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, సోమవారం కమిషనర్ను ట్రాప్ చేసేందుకు జనగామకు వచ్చారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రాజు కమిషనర్కు ఫోన్ చేసి డబ్బులు తీసుకు వచ్చానని చెప్పడంతో ఇంటి వద్ద ఉన్న ఆమె ఆఫీసుకు చేరుకున్నారు. రాజు కమిషనర్కు నగదు ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమె తీసుకోకుండా, కారు డ్రైవర్ నవీన్కు ఇవ్వాలని చెప్పారు. అదే సమయంలో టౌన్ ప్లానింగ్లో ఓ అధికారి లేకపోవడంతో డబ్బులను డ్రైవర్కు ఇవ్వగా, అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు.. వల పన్ని డ్రైవర్ వద్ద ఉన్న రూ.40వేల నగదును స్వాధీనం చేసుకుని విచారించారు. కమిషనర్ రజిత ఆదేశాల మేరకు రాజు వద్ద డబ్బులు తీసుకున్నానని నవీన్ ఒప్పుకొని తమకు వాంగ్మూలం ఇచ్చినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కమిషనర్తో పాటు డ్రైవర్ నవీన్ను కస్టడీలోకి తీసుకుని, నేడు(మంగళవారం) హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామన్నారు. కాగా జనగామలో కమిషనర్ ఉంటున్న అద్దె ఇంటితో పాటు ఆమెకు సంబంధించిన పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టు సమాచారం. తరువాయి.. టౌన్ ప్లానింగేనా? జనగామ పురపాలికలో లంచాలకు అడ్డు లేకుండా పోతుందనే విమర్శలు లేకపోలేదు. భవన నిర్మాణ అనుమతి, పునర్నిర్మాణం, ఎక్స్ టెన్షన్ ఇలా ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి చిన్న కారణాలతో తిరస్కరిస్తూ, ఖద్దర్ దుస్తులు వేసుకున్న ఇద్దరు.. పైరవీల పేరిట ముడుపుల పేరిట అనుమతులు ఇప్పిస్తున్నారని ప్రచారం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు సైతం వీరిని సంప్రదిస్తే.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అంటూ పుకార్లు ఉన్నాయి. లంచాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన మున్సిపల్ బాగోతంలో కమిషనర్ ఏసీబీకి ట్రాప్ కావడంతో.. మిగతా భాగస్వామ్యులకు భయం పట్టుకుంది. కాగా టౌన్ ప్లానింగ్లో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారంతో ఏసీబీ ఇందులో పనిచేస్తున్న ఓ అధికారిపై ఆరా తీసినట్టు సమాచారం. రూ.60వేలు డిమాండ్ చేశారు మార్టిగేజ్లో ఉన్న స్థలం రిలీజ్ కోసం కమిషనర్ రజిత మొదటగా రూ.60వేలు డిమాండ్ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని బతిమిలాడడంతో బంపర్ ఆఫర్గా రూ.40వేలకు సెటిల్ చేశారు. భవన నిర్మాణ సమయం నుంచి తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయగా, ఏసీబీని కలిసి, ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాల బాగోతంపై చెప్పాను. ఏసీబీ అధికారుల సూచనల మేరకు కమిషనర్ రజిత, డ్రైవర్ నవీన్ పట్టుబడ్డారు. – చిట్టిపల్లి రాజు, బాధితుడు -
ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్ కమిషనర్.. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు
పశ్చిమ గోదావరి : కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టిన భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తింపు - చెత్త సేకరణ మొదలు, కారుణ్య నియామకాల వరకు అంతా అవినీతే - వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్న శివరామకృష్ణ - అక్రమ సంపాదనతో విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ గుర్తింపు - శివరామకృష్ణ ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు - ఇవాళ కూడా కొనసాగనున్న సోదాలు -
భీమవరం మున్సిపల్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ దాడులు
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదుతో డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేకువజామున భీమవరంలోని మున్సిపల్ కమిషనర్ ఇల్లు, కార్యాలయం, మున్సిపల్ ఉద్యోగి(ఆర్ఐ) కృష్ణమోహన్ ఇంట్లో, తణుకు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం, పాలకొల్లు, బాపట్ల, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణకు సంబంధించి రూ.10 కోట్ల దాకా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 3.03 ఎకరాల భూమి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జీప్లస్ 1 భవనం, తణుకులో రెండు జీప్లస్ 1 భవనాలు, పాలకొల్లులో జీప్లస్ భవనం, ఒక ఖాళీ నివాస స్థలం, విజయవాడలో రెండు అపార్ట్మెంట్లు, ఇంట్లో నగదు రూ.20 లక్షలు, 500 గ్రాముల బంగారం, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు విలువైన పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే విజయవాడలో ఒక అపార్ట్మెంట్కు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. -
రాజకీయ క్రీడలో ప్రభుత్వ అధికారి ఔట్.. ఇక్కడ ఇంతే!
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్): మేడ్చల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆడిన రాజకీయ క్రీడలో కమిషనర్ అవుట్ అయ్యారు. చైర్పర్సన్ లక్ష్యంగా సాగిన ఈ రాజకీయ క్రీడలో కౌన్సిలర్ల బంతికి చైర్పర్సన్ కాకుండా కమిషనర్ చిక్కాడు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీలోని అధికార పార్టీలో 16 మంది కౌన్సిలర్లు, చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డిల మధ్య రాజకీయ అగాధం ఏర్పడింది. 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్, కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా కుమ్మక్కై అభివృధ్ధి చేయకుండా అవినితీకి పాల్పడుతున్నారని విమర్శిస్తూ చైర్పర్సన్పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా వీడి జోరుగా రాజకీయాలు చేస్తున్నారు. కొందరు వైస్ చైర్మన్ గ్రూపుగా, మరి కొందరూ చైర్పర్సన్ గ్రూపుగా మారారు. చైర్పర్సన్పై అవిశ్వాస నోటీసులు ఇవ్వగా రెండో డిమాండ్ కింద కమిషనర్ను బదిలీ చేయాలని పట్టుబట్టారు. కమిషనర్ చైర్పర్సన్తో కుమ్మక్కై తమను ఖాతరు చేయడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అధిష్టానం వద్ద పట్టుబట్టి కూర్చున్నారు. మంత్రి ఇంట్లో సమావేశంతోనే.. మేడ్చల్ మున్సిపాలిటీలో సమావేశాలు నిర్వహిస్తే తరుచూ రచ్చ చేస్తున్నారని, మీడియా ముంగిట అసమ్మతి వెల్లగక్కుతున్నారని మంత్రి మల్లారెడ్డి చైర్పర్సన్, అధికారులు, కమిషనర్, అధికార పార్టీ కౌన్సిలర్లతో తమ ఇంట్లో రెండు రోజుల క్రితం రహస్య సమావేశం నిర్వహించారు. అవిశ్వాస విషయం చట్ట పరిధిలో ఉండటంతో అది పక్కన పెట్టి అసమ్మతి కౌన్సిలర్ల వాదనను మంత్రి విన్నారు. తమకు విలువ ఇవ్వని కమిషనర్ అహ్మద్ షఫిఉల్లాను బదిలీ చేయాలని గట్టిగా వాదించడం, ఒక్కసారిగా బదిలీ చేసే అధికారం లేకపోవడంతో మంత్రి మల్లారెడ్డి ఇక్కడ రాజకీయం ప్రదర్శించారు. కౌన్సిలర్ల డిమాండ్ మేరకు కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా వెళ్లిపోవాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. బదిలీకి వెంటనే ఆస్కారం లేకపోవడంతో కమిషనర్ 15 రోజుల పాటు దీర్ఘకాలికంగా సెలవు పెట్టి వెళ్లిపోయారు. చట్టం చెప్పే కమిషనర్... సెలవులపై వెళ్లిన కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా ముక్కుసూటిగా మాట్లాడే అధికారిగా మేడ్చల్లో తన ముద్ర వేశారు. ప్రతి విషయంలో తాను చట్టం ప్రకారంగా ఉంటూ పనులను ఆ ప్రకారంగానే చేస్తానని బల్ల గుద్ది చెప్పేవాడు. ఎవరికి అనుకూలంగా ఉండకుండా తన దైన శైలిలో పనిచేసి ఆఖరుకు సెలవు పెట్టే వరకు తెచ్చుకున్నాడు. తనపై ఆరోపణలు చేసిన కౌన్సిలర్లకు ఆయన గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే నాపై ఆరోపణలు చేసిన వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏది ఉన్నా తాను ఉన్నతాధికారులకు చెప్పుకుంటానని మీడియా ముందు తేల్చి చెప్పాడు. అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లకు అండగా ఉండకపోవడంతో ప్రభుత్వ అధికారి తనకు ఇష్టం, అవసరం లేకున్నా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ నాయకుల క్రీడలో ఓ అధికారి సెల్ఫ్ అవుట్ అవ్వడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదవండి యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ -
తల్లి కాటికి.. తండ్రి కటకటాల్లోకి.. ఒంటరిగా మిగిలిన చిన్నారులు
సాక్షి, మంచిర్యాల: ఏం జరిగిందో తెలియదు గానీ ఆ తల్లి ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. కన్నపిల్లలపై మమకారాన్ని చంపుకుని కాటికి చేరింది. తండ్రిపై కేసు నమోదు కావడంతో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తల్లిని కోల్పోయి.. తండ్రికి దూరమైన ఇద్దరు చిన్నారులు ఒంటరిగా మిగిలారు. తల్లి మృతదేహం వద్ద దిగాలుగా నిలబడిన పిల్లలను చూసి అక్కడున్నవారు చలించిపోయారు. మంచిర్యాల మున్సి పల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహం వద్ద బంధువులు రోదిస్తుండగా.. ఆమె పిల్లలు రిత్విక్(8), భవిష్య(6) బిక్కుబిక్కుమంటూ అమాయకపు చూపులు చూస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది. జ్యోతి ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం రాత్రి 12గంటల ప్రాంతంలో జ్యోతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై వరకట్న వేధింపులు 498(ఏ), ఆత్మహత్యకు ప్రేరేపణ 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని మంచిర్యాల కోర్టులో హాజరుపర్చగా 14రోజుల రిమాండ్ విధించారు. పోస్టుమార్టం అడ్డగింత మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా ఆమె తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టా రు. దీంతో పోలీసులు జ్యోతి భర్త బాలకృష్ణ, అతడి తండ్రి నల్లమల్ల మురళి, తల్లి కన్నమ్మ, తమ్ముడు హరికృష్ణ, అక్కాచెల్లెలు కృష్ణకుమారి, జ్యోతిపై కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టానికి మృతురాలి అంగీకరించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బాలకృష్ణ స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవపురం తరలించారు. అక్కడ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. పిల్లలతో జ్యోతి(ఫైల్) మెసేజ్ చేసి డిలీట్ జ్యోతి ఆత్మహత్యకు ముందు వాట్సాప్లో ఓ మెసేజ్ చేసి డిలీట్ చేసిందని బాలకృష్ణ రోదించడం, ఉదయం 9.30గంటలకు తన తల్లికి ఫోన్ చేసిన జ్యోతి చనిపోయే ముందు ఏదైనా చెప్పాలనే ప్రయత్నం చేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన సమయంలో బాలకృష్ణతోపాటు ఇంటి పక్కన ఉండే అతడు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఆధారాలు కనిపించకుండా చేసి ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు ముందు రోజు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు, జ్యోతిని బాలకృష్ణ కొట్టిన తీరును కూతురు భవిష్య మంచిర్యాల సీఐ నారాయణ్నాయక్కు వివరించింది. దర్యాప్తు కోసం పోలీసులు జ్యోతికి సంబంధించిన రెండు ఫోన్లు, బాలకృష్ణ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అమ్మమ్మ చెంతకు చిన్నారులు.. బాలకృష్ణను రిమాండ్కు తరలించడంతో ఇద్దరు చిన్నారులు రిత్విక్, భవిష్యలను అమ్మమ్మ గంగవరం రవీంద్రకుమారి, తాత రాంబాబు చెంతకు చేరారు. తల్లి మృతదేహంతో మంచిర్యాల నుంచి వెళ్లిపోయారు. కాగా, ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని స్థానిక బీజేపీ నాయకుడు తులా మధుసూదన్రావు డిమాండ్ చేశారు. ఆమె మృతిలో అనుమానాలెన్నో ! ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవ చివరికి ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి(32) మరణం వెనక రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అమ్మా నన్ను చంపేసేలా ఉన్నాడు’ అని మృతురాలు తన తల్లితో చనిపోయే రోజే బాధగా ఫోన్లో చెప్పడం, ‘నాన్న అమ్మను తరచూ కొడుతూ, తిడుతున్నారని’ చిన్నారి భవిష్య చెప్పడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వీటితోపాటు గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలపై పంచాయతీలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మృతురాలి తల్లితండ్రులు పలుమార్లు కమిషనర్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఇతర మహిళలతో సంబంధాలు నెరపడంపైనా ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్మల్ పని చేసినప్పుడు కంటే మంచిర్యాలకు వచ్చాక, ఆర్థికంగా బలపడినట్లుగా చెబుతున్నారు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగంతో మొదలై, గ్రూప్ వచ్చి కమిషనర్ స్థాయికి చేరడంతో తన హోదాకు తగిన భార్య కాదని, అతనితోపాటు కుటుంబీకులు కూడా మృతురాలిపై ఆరోపణలు చేయడం పట్ల ఆత్మహత్యనా? లేక హత్యనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఓ ఉన్నతాధికారి భార్య మరణం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కాల్డేటా, వాట్సాప్ చాట్, చనిపోవడానికి ముందు రోజు జరిగిన వాటిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ప్రేరేపణ, వరకట్న వేధింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని స్థానికులు కోరుతున్నారు. -
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య
ఆదిలాబాద్: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి(32) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ స్థానిక ఆదిత్య ఎన్క్లేవ్లో భార్య, కుమారుడు రిత్విక్, కూతురు భవిష్యలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం విధుల్లోకి వెళ్లిన కమిషనర్ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉంది. అనుమానంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్లో జ్యోతి ఫ్యానుకు చున్నితో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. జ్యోతి మృతదేహాన్ని కిందకు దింపి పోలీసులకు సమాచారం అందించాడు. మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి, ఎస్సైలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ భార్య కావడంతో చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్య కాదు.. హత్యే..! జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆందోళనకు దిగారు. ఉదయం తమ కూతురు వీడియో కాల్ చేసి మాట్లాడిందని, చంపేసేలా ఉన్నాడని రోదించిందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేశవపురానికి చెందిన బాలకృష్ణ కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాడని, 2014, ఆగస్టు 15న పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, మూడెకరాల పొలం, రూ.2 లక్షల విలువైన బంగారం అందజేసినట్లు తెలిపారు. కమిషనర్గా ఎంపికైన తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయని, తాను కమిషనర్నని, ఎక్కువ కట్నం వచ్చేదంటూ వేధించేవాడని ఆరోపించారు. పలుమార్లు కుటుంబ పెద్దల సమక్షంలో మందలించినట్లు తెలిపారు. జ్యోతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ నారాయణ్నాయక్ తెలిపారు. అమ్మా.. ఏమైంది..! మంచిర్యాలటౌన్: ఉన్నత ఉద్యోగి భార్య.. కుమారుడు, కూతురుతో హాయిగా జీవితం సాగిపోతోంది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలను రోజూ మాదిరిగా సిద్ధం చేసి, టిఫిన్ బాక్సు పెట్టి నవ్వుతూ టాటా చెప్పి బడికి పంపించింది. ఏం జరిగిందో గానీ మధ్యాహ్నం వరకు ఆ తల్లి విగతజీవిగా మారింది. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు రిత్విక్, భవిష్య ‘‘అమ్మా.. ఏమైంది..’’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. ‘‘అమ్మా లే అమ్మా... ఏమైంది అమ్మా.. ఎందుకు లేస్తలేవు..’’ అంటూ తల్లి మృతదేహం వద్ద విలపించారు. -
అఫిడవిట్ ఇస్తేనే భవన నిర్మాణానికి అనుమతా?
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో కారిడార్కు ఎలాంటి అభ్యంతరం తెలపకుండా, ఎలాంటి పరిహారం కోరకుండా భూమిని ఉచితంగా అందజేస్తానంటూ అఫిడవిట్ ఇస్తేనే భవన నిర్మాణానికి అనుమతినిస్తామని 2016లో అప్పటి విజయవాడ మునిసిపల్ కమిషనర్ షరతు విధించడంపై హైకోర్టు మండిపడింది. అంతేకాకుండా అందుకు అంగీకరించకపోవడంతో మునిసిపల్ కమిషనర్ భవన నిర్మాణానికి అనుమతిని నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. మునిసిపల్ కమిషనర్ ఉత్తర్వులను చట్ట విరుద్ధమని, ఏకపక్షమని, అహేతుకమని ప్రకటించింది. అంతేకాకుండా అప్పటి విజయవాడ మునిసిపల్ కమిషనర్ రూ.25 వేలను ఖర్చుల కింద పిటిషనర్కు చెల్లించాలని ఆదేశించింది. పరిహారం కోరకుండా ఉచితంగా స్థలం ఇవ్వాలని కోరడం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆస్తి హక్కును హరించడమే అవుతుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు. అప్పటి కమిషనర్ ప్రస్తుతం ఇతర పోస్టులో ఉన్నా, పదవీ విరమణ చేసినా కూడా ఆయనకు ఈ తీర్పు కాపీని పంపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. పిటిషనర్ భవన నిర్మాణానికి అనుమతినిచ్చే విషయాన్ని తాజాగా పరిశీలించాలని విజయవాడ మునిసిపల్ అధికారులకు న్యాయమూర్తి సూచించారు. విజయవాడ బందరు రోడ్డులో 346 చదరపు గజాల స్థలాన్ని వేణుగోపాలరావు అనే వ్యక్తి నుంచి బొమ్మదేవర వెంకట సుబ్బారావు అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఈ స్థలంలో భవన నిర్మాణం అనుమతినివ్వాలంటే మెట్రో కారిడార్ నిర్మాణం కోసం భూమి అవసరమైనప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా, ఎలాంటి పరిహారం కోరకుండా భూమిని ఉచితంగా ఇస్తానని అఫిడవిట్ ఇవ్వాలని కమిషనర్ 2016లో ఉత్తర్వులు ఇచ్చారు, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
వ్యక్తిపూజకు నేను దూరం: కేటీఆర్
హైదరాబాద్/బెల్లంపల్లి: ‘రాజకీయాల్లోకానీ, పాలనలో కానీ వ్యక్తిపూజను ప్రోత్సహించేవారిలో నేను చివరి వ్యక్తిని. నా జన్మదిన వేడుకలకు హాజరుకాలేదంటూ అత్యుత్సాహం కలిగిన ఓ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులకు మెమో జారీ చేసిన వార్త నా దృష్టికి వచ్చింది. అసంబద్ధ వైఖరి ప్రదర్శించిన కమిషనర్ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ కమిషనర్(సీడీఎంఏ)ను ఆదేశించా’ అని కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు. ఈ నెల 24న కేటీఆర్ బర్త్డే వేడుకలకు హాజరుకాలేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ నలుగురు సిబ్బందికి మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెమోల జారీపై ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ట్విట్టర్లో స్పందించారు. గంగాధర్ విధుల్లో చేరిన 50 రోజుల్లోనే సస్పెండ్ కావడం గమనార్హం. కాగా, ‘కేంద్రంలోని ఎన్పీయే(నిరర్థక) ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే దేశీయంగా బొగ్గుకొరత ఏర్పడింది. దీంతో పది రెట్లు ఎక్కువ ధర పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు పెరిగితే ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో మీకు తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశంలో వచ్చే వంద ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి’అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. -
మా ఫ్లెక్సీలు తొలగిస్తావా?
పుత్తూరు రూరల్: మా ఫ్లెక్సీలనే తొలగిస్తావా? అంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్పైకి దూసుకెళ్లారు. పుత్తూరులో జరిగిన ఈ ఫ్లెక్సీల రాద్ధాంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మున్సిపల్ సిబ్బంది వైఎస్సార్ సర్కిల్ నుంచి ఫ్లెక్సీలను తొలగిస్తూ వస్తున్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వచ్చి మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామిరెడ్డిని టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అయినా 15 రోజులుగా గడువిచ్చామని, నేడు తొలగించాలని చెప్పారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేతలు కమిషనర్పైకి దూసుకెళ్తూ దుర్భాషలాడారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయినా కమిషనర్ అక్కడే నిలబడడంతో, కొంతసేపటికి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీవరత్నంనాయుడు తమ ఫ్లెక్సీలకు చలానాలను కట్టి అనుమతి తీసుకుంటామని, అంత వరకు ఫ్లెక్సీలు యథాస్థానంలో ఉండాలని కోరారు. ఇందుకు కమిషనర్ సమ్మతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులను అక్కడి నుంచి వాహనాల్లో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది అనుమతులు లేని ఫ్లెక్సీలను తొలగించారు. -
మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా ప్రమీల
మదనపల్లె సిటీ: మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా కె. ప్రమీలను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా రానున్నారు. మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న రఘనాథరెడ్డి కర్నూలు జిల్లా ఆదోనికి బదిలీ అయ్యారు. -
ఆ కమిషనర్ రూటే సెపరేటు?
స్థానిక మున్సిపాలిటీలో పాలకవర్గానికి, అధికారులకు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష అధ్యక్షతన ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోపాటు అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం బహిష్కరించడంతో వివాదం మరోమారు బహిర్గతమైంది. కోస్గి: ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లకే సమాచారం లేకుండా అధికారులు అజెండాలు తయారు చేయడం, కౌన్సిల్ ఆమోదించిన పనులు చేపట్టకపోవడం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషనర్పై పాలక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి పనితీరుపై కౌన్సిలర్లు పలుమార్లు జిల్లా కలెక్టర్తోపాటు రాష్ట్ర మున్సిపల్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ పేరుతో జిల్లా అధికారులు రావడం, కమిషనర్ బదిలీ అంటూ కౌన్సిలర్లు సంబరపడటం తప్పా నేటికీ కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ వసూళ్లకు పాల్పడిన పలువురు సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న అధికారులు కమిషనర్ను మాత్రం పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన పలువురు వ్యక్తుల నుంచి పనులు చేయడానికి కమిషనర్ డబ్బులు వసూ లు చేశారనే విషయమై గతంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే నరేందర్రెడ్డి బాధితుల సమక్షంలోనే విచారణ చేశారు. కార్యాలయ ఖర్చుల నిమిత్తం తీసుకున్నట్లు కమిషనర్ సమాధానం ఇవ్వడం బాధితులతోపాటు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులను విస్మయానికి గురి చేసింది. అన్నీ అక్రమాలే.. పట్టించుకునేవారు కరువు స్థానిక మున్సిపల్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారింది. కొత్తగా ఏర్పడిన మున్సిపల్లో ఇంటి పేర్లు మార్చుకునేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక అనుమతులు ఇచ్చిన నేటికీ అమలు చేయకుండా డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే మారుస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న వేతనాల కంటే తక్కువ వేతనం అందిస్తు కార్మికులను వేధిస్తున్నారనేది బహిరంగ సత్యం. కార్మికుల వేతనాలు, నియామకాల్లో అక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో గతంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి విచారణ జరిపారు. అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. అనుమతులు లేకుండా భవన నిర్మాణాల కు అనాధికారిక అనుమతులు ఇస్తూ మున్సిపల్ అధికారులు అందినంత దండుకుంటున్నారు. ఇలా ఒక్కటి కాదు టెండర్ నిర్వహించిన నర్సరీల్లో మున్సిపల్ కార్మికులతో పనులు చేయించడం, చేయని పనులకు బిల్లులు చేయడం, చేసిన బిల్లులకు కమీషన్ వసూలు చేయడం, ఆన్లైన్ విధానాన్ని పక్కన పెట్టి సగానికి పైగా పనులు నేటికీ కాగితాలపైనే చేయడం వంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. -
కుర్చీ నాది.. కాదు నాది
మణుగూరు టౌన్: భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘటనతో అటు ఉద్యోగులు, ఇటు పనుల కోసం వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కమిషనర్ కుర్చీ నాదంటే నాదేనని ఇద్దరు అధికారులు వాదించు కోవడంతో గందరగోళంలో పడిపోయారు. గతంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన వెంకటస్వామిని వైరా కమిషనర్గా బదిలీ చేశారు. మణుగూరు కమిషనర్గా నాగప్రసాద్ను నియమించారు. అయితే మున్సిపల్ ఉన్నతాధికారులు మణుగూరు మున్సిపల్ కమిషనర్గా తిరిగి వెం కటస్వామిని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటస్వామి సోమవారం కార్యాలయానికి వచ్చి కమిషనర్ సీటులో కూర్చు న్నారు. కాసేపటికి వచ్చిన నాగప్రసాద్ తనను రిలీవ్ చేస్తూ ఆదేశాలు రానందున తానే కమిషన ర్నని వాదించారు. సీటులో తననే కూర్చోనివ్వా లని సూచించారు. తనకు సీడీఎంఏ నుంచి ఉత్త ర్వులు వచ్చినందున తానే కమిషనర్నని, కలెక్టర్ ను కలిసి రిలీవ్ ఉత్తర్వులు తెచ్చుకోవాలని వెంక టస్వామి అన్నారు. ఈ విషయమై సాయంత్రం వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. -
సిద్దిపేట బల్దియాకు లీడర్షిప్ అవార్డు
సిద్దిపేటజోన్: వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్వర్క్ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్షిప్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. -
వైరా మున్సిపాలిటీలో ఏడాదికి ముగ్గురు కమిషనర్లు బదిలీ
-
ఊరంతా చెత్త.. ఎమ్మెల్యేకు మండింది.. కమిషనర్ ఇంటికెళ్లి
బెంగళూరు: ఆయనో నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకోవాలి. తాను నివసించే పట్టణంలో శుభ్రంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పట్టణమంతా ఎక్కడ చూసినా చెత్త ఉంటుండడంతో ఆయనకు మండింది. దీంతో వెంటనే ఓ ట్రాక్టర్ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు వేశాడు. ఈ సంఘటన స్థానికంగా హట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావి జిల్లా దక్షిణ బెళగావి ఎమ్మెల్యే అభయ్ పాటిల్ (బీజేపీ). బెళగావి పట్టణంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో వీధులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. బెళగావి పట్టణ మున్సిపల్ (బీసీసీ) అధికారులకు బుద్ధి చెప్పేందుకు ఓ ట్రాక్టర్ తీసుకుని చెత్త వేసుకుని ఆయనే స్వయంగా నడుపుతూ విశ్వేశ్వరనగరలోని మున్సిపల్ కమిషనర్ కేహెచ్ జగదీశ్ ఇంటికి వెళ్లాడు. చెత్తనంతా ఇంటిముందు కుమ్మరించాడు. వాస్తవ పరిస్థితులు ఏమిటో కమిషనర్కు చెప్పేందుకే తాను ఈ నిరసన చేపట్టినట్లు ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మీడియాకు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ కమిషనర్ ఇంటి ముందు కూడా ఇలాగే చేస్తామనని ఎమ్మెల్యే హెచ్చరించాడు. మరి ఇప్పటికైనా అధికారులు మారుతారో లేదో. ఈ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ గతంలో పలు వింత కార్యక్రమాలతో వార్తల్లో నిలిచాడు. కరోనా పోవాలని పట్టణంలో యాగం నిర్వహించడమే కాక నగరమంతా సామ్రాణి వేయించారు. Garbage full of tractor was dumped infront of City corporation commissioner K.H Jagadish's house today. Three month ago corporation officials were warned to maintain cleanliness in the city but there was no improvement, garbage is at every corner of city. pic.twitter.com/tv7ndkQw9T — Abhay Patil (@iamabhaypatil) July 25, 2021 -
పట్టణ ప్రాంతాల్లో ప్రస్ఫుటమైన మార్పే లక్ష్యంగా క్లాప్ కార్యక్రమం
విజయవాడ : పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్ద్య నిర్వహణను ప్రణాళికా బద్దంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) గా తీర్చిదిద్దాలని పురపాలక కమిషనర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ పరిశుభ్ర వాతావరణంలో జీవించేలా ప్రస్ఫుటమైన మార్పులు కనిపించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కమిషనర్లందరూ సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి నిర్లిప్తత వద్దని , ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. వంద రోజుల ప్రణాళికతో జూలై నెలలో ప్రారంభం కానున్న క్లాప్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం నాడు పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లతో విజయవాడలోని ఎఎంఆర్ డీఎ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, కార్యదర్శి రామమనోహర్, సిడిఎంఎ ఎం.ఎం.నాయక్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్, ఎపియుఐఎఫ్ డిసి ఎండి బసంత్ కుమార్, టిడ్కో ఎండి శ్రీధర్, మెప్మా ఎండి విజయలక్ష్మి, ఇంజనీరింగ్ ఛీప్ చంద్రయ్య తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పురపాలక కమీషనర్లందరూ ఉదయమే క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని తద్వారా పౌరులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణాల్లోని నివాస , వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్ధాల సేకరణ, తరలింపు కోసం త్వరలో 3100 ఆటోలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఆటోల ద్వారా వ్యర్ధాల తరలింపునకు అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పాలసీ తదితరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఇందుకోసం ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులను ఎంపిక చేసుకోవాలన్నారు. క్లాప్ కార్యక్రమం తాలూకు లక్ష్యాలు, ఉద్దేశ్యాలు కలిగే ప్రయోజనాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో కమిషనర్లు కీలక భూమిక వహించాలన్నారు. చదవండి: మూడు రాజధానులు మా విధానం : మంత్రి బొత్స -
కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి అధికారుల చర్యలు
-
స్వయంగా రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్
-
నైట్ క్లబ్లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది
సాక్షి, ముంబై: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న నైట్ క్లబ్బులపై బీఎంసీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో పట్టుబడిన నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీచేయడమే గాకుండా ఓ క్లబ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చర్యల్లో భాగంగా నాలుగు క్లబ్ల యజమానుల నుంచి రూ.43,200 జరిమానా వసూలు చేశారు. కోవిడ్ నియమాలు తుంగలో తొక్కి నైట్ క్టబ్బులు నడిపితే కఠిన చర్యలు తప్పవని, క్లబ్ యాజమాన్యాలు తమ వైఖరి మర్చుకోకుంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్సింగ్ చహల్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ క్లబ్ యాజమాన్యాలలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. అందులో పార్టీలు చేసుకునే కస్టమర్లు ముఖాలకు మాస్క్లు ధరించడం లేదు. సామాజిక దూరాన్ని పాటించడం లేదు. కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదముంది. నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని చహల్ సూచించారు. కఠిన చర్యలు తీసుకుంటాం: బీఎంసీ కమిషనర్. కొన్ని క్లబ్బుల యజమానులు కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ చహల్ దృష్టికి వచ్చింది. దీంతో నగరంతోపాటు ఉప నగరాలలో అర్ధరాత్రి దాటిన ఆకస్మిక దాడులు చేపట్టారు. అందులో దాదర్లోని ప్రీతం హోటల్లో, తూర్పు బాంద్రా, మలాడ్, కాందివలిలోని నైట్ క్లబ్బుల్లో నియమాలు ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, డ్యాన్స్లు చేస్తున్నట్లు బీఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్కో నైట్ క్లబ్లో 50 మందికే అనుమతి ఉంది. కానీ, 100–150 పైనే అందులో కస్టమర్లు ఉన్నారు. అనేక మంది మాస్క్ ధరించలేదు. సామాజిక దూరమైతే పటాపంచలైంది. దీంతో 275 మందిని అదుపులోకి తీసుకుని క్లబ్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులతోపాటు జరిమానా విధించారు. చదవండి: (సోదరిపై ప్రేమతో అతడు చేసిన పని ఇప్పుడు హాట్టాపిక్..) ప్రస్తుతం ముంబై, ఉప నగరాలలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్నప్పటకీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మరికొద్ది రోజులు ముఖాలకు మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి పనులు చేయాల్సి ఉంది. కానీ, కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల కరోనా మళ్లీ పడగలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి బీఎంసీ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. కానీ, నైట్ క్లబ్బుల్లో తొంగిచూసే నాథుడే లేకపోవడంతో అక్కడ విచ్చల విడిగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో కరోనా వైరస్ పూర్తిగా సద్దుమణిగే దాకా రాత్రి వేళ్లలో దాడులు ఇలాగే కొనసాగిస్తామని చహల్ హెచ్చరించారు. క్లబ్ యజమానుల్లో మార్పు రాని పక్షంలో చర్యలు మరింత కఠినం చేస్తామని హెచ్చరించారు. -
ఆధునాతన పారిశుధ్య యంత్రాల ప్రారంభం
సాక్షి, విజయవాడ : అధునాతన పారిశుధ్య యంత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎంసీ తరుపున కొత్త టెక్నాలజీతో ఏడు కొత్త వాహనాలను కొనుగోలు చేశామని ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వీటి ద్వారా కాలువల పూడికలను సులువుగా తీయోచ్చని పేర్కొన్నారు. జెసిబీలో మూడు మినీ వాహనాలు, కొత్తగా మూడు నాళామేన్ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. మూడు క్లీనింగ్ యంత్రాలను సైతం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కొత్త యంత్రాల వల్ల పని వేగవంతమవుతుందని, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. (మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి కన్నుమూత) -
30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. 40 శాతానికి పైగా రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తోందని, ఐదారేళ్లలో రాష్ట్రంలోని మెజారిటీ జనాభా పట్టణాల్లో నివసించే అవకాశముందని చెప్పారు. అత్యధిక శాతం పట్టణ జనాభా గల రాష్ట్రంగా త్వరలో తెలంగాణ మారుతుందన్నారు. పెరుగుతున్న పట్టణీకరణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం రానున్న 30 ఏళ్లలో ఏర్పడనున్న అవసరాలను తెలుసుకుని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ప్రారంభించాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు, హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల కమిషనర్లు, జిల్లా అదనపు కమిషనర్లకు ఎంసీఆర్హెచ్చార్డీలో నిర్వహించిన రెండ్రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆదాయ పెరుగుదలకు వినూత్న పద్ధతులు.. హైదరాబాద్ చుట్టుపక్కల పురపాలికల్లో, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పట్టణీకరణ వేగంగా జరుగుతుందని, అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. ప్రతి పురపాలిక తన ఆదాయ వనరుల విషయంలో ప్రత్యేక ఆడిట్ చేపట్టి రానున్న సంవత్సరాల్లో ఆదాయ పెరుగుదలకు సంబంధించిన వినూత్నమైన పద్ధతులను ఎంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో తొలుత మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేక యాప్ను ఆవిష్కరించారు. పరిపాలన వికేంద్రీకరణ సాధనంగా.. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సేవలను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఈ మేరకు పరిపాలన వికేంద్రీకరణ ఒక సాధనంగా ఎంచుకుందని కేటీఆర్ చెప్పారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచి ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. -
మానవత్వం ప్రదర్శించిన మున్సిపల్ కమిషనర్
రాయచోటి అర్బన్ : పట్టణంలోని ఓ వృద్ధుడు తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని తరలించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, తన తోటి అధికారులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలలోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అఫ్జల్ (65) మాసాపేటలోని ఒక మసీదులో మౌజన్గా పని చేస్తున్నాడు. వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతూ స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నాడు. శనివారం జ్వరం తీవ్రం కావడంతో ఓ విలేకరి విషయాన్ని మున్సిపల్, రెవెన్యూ అధికారులకు తెలిపారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రాంబాబు, తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి మాసాపేటకు వెళ్లి వృద్ధుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోవిడ్–19 లక్షణాలున్నట్లు వైద్యుడు అనుమానించి కడప రిమ్స్కు పంపాలంటూ అధికారులకు సూచించారు. రాత్రి కావడంతో ఉదయమే కడపకు తరలి స్తామని, ప్రస్తుతం వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వృద్ధుడిని వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో.. అతను రాత్రికి రాత్రే తిరిగి మాసాపేటలోని మసీదుకు వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం కడపకు తరలించేందుకు 108 అంబులెన్స్తో మున్సిపల్ అధికారి మల్లికార్జున మసీదు వద్దకు వెళ్లి.. వృద్ధుడికి పీపీఈ కిట్ అందించారు. పీపీఈ కిట్ ధరిస్తూ ఉండగానే కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం అంబులెన్స్లోకి చేర్చేందుకు 108 సిబ్బంది ముందుకు రాలేదు. మున్సిపల్ అధికారి మల్లికార్జున స్వయంగా రంగంలోకి దిగి.. మరో యువకుడితో కలిసి ఎలాగోలా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కరోనాతో మరణించాడన్న అనుమానంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ముందుకు రాలేదు. దీంతో కమిషనర్ రాంబాబు, మున్సిపల్ అధికారి మల్లికార్జున, సంఘ సేవకుడు మైనుద్దీన్, ప్రభుత్వ చీఫ్ విప్ పీఏ నిస్సార్ అహమ్మద్, మున్సిపల్ సిబ్బంది దర్బార్ మానవత్వంతో వ్యవహరించారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో మాసాపేట శ్మశాన వాటికకు చేర్చారు. అక్కడ కోవిడ్ – 19 కరోనా ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆ సమయంలో చాలెంజింగ్గా పనిచేశాం..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పీఎస్ గిరీషా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు. లాక్డౌన్ సమయంలో కరోనా కట్టడికి ఆదర్శవంతంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతులయ్యారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. – తిరుపతి తుడా కోవిడ్ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కొన్నారు..? సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి ఆ దిశగా పరుగులు పెట్టే సమయంలో కరోనా ఉపద్రవంగా వచ్చిపడింది. సుమారు 3నెలల పాటు మరో పనిలేకుండా చేసింది. కరోనా కట్టడిలో తిరుపతి కార్పొరేషన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛ సర్వేలోనూ నగరం అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాం. వారి ఇళ్లకు రెడ్ నోటీసులు, చేతికి స్టాంప్ వేయడం వంటివి సత్ఫలితాలు ఇచ్చాయి. కూరగాయల మార్కెట్ను వికేంద్రీకరించి, తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. స్పెషల్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్ల ద్వారా ప్రత్యేకంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాం. హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం, రెడ్ జోన్ల అమలు వంటి కీలక నిర్ణయాలు కరోనా కట్టిడికి దోహదపడ్డాయి. తిరుపతిలో నాలుగు లక్షలకుపైగా జనాభా ఉండగా లాక్ డౌన్ సమయంలో కేవలం తొమ్మిది పాజిటివ్ కేసులకే కట్టడి చేశామంటే సమష్టి కృషితోనే సాధ్యమైంది. అభివృద్ధిలో మీ మార్క్..? కరోనా కట్టిడికి 3 నెలలు, వార్డు సచివాలయాల ఏర్పాటుకు మరో మూడు నెలలు సమయం గడిచిపోయింది. మిగిలిన ఆరు నెలల్లో అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుని వాటిని పరుగులు పెట్టించాం. పద్మావతి, ప్రకాశం పార్కులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. గరుడ వారధికి నిధులు సమకూర్చి పనులకు ఆటంకం లేకుండా చేశాం. అమృత్ స్కీమ్ ద్వారా 90 శాతం పనులు పూర్తి చేశాం. 15 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశాం. సుమారు రూ.21 కోట్లతో వినాయక సాగర్కు అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాం. విలీన పంచాయతీల్లో రూ.16 కోట్లతో తాగునీటి సౌకర్యం, రోడ్లు, కాలువలు, యూడీఎస్ అందించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నాం. డీబీఆర్, కరకంబాడి–రేణిగుంట రోడ్లను కలిపే చెన్నగుంట లింక్ మాస్టర్ ప్లాన్ను అమలు చేయడంతో కమిషనర్గా నా మార్కు కనిపించడం ఆనందంగా ఉంది. చదవండి: పలమనేరులో నువ్వా- నేనా..? ఇళ్ల పట్టాల పంపిణీపై..? పట్టణాల్లో ఇళ్లు లేని ప్రజలకు బహుళ అంతస్తులు నిర్మించి ఇవ్వడం ఇప్పటి వరకు చూశాం. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. ఈ అపురూప ఘట్టం నా చేతుల మీదుగా జరుగుతుండడం జీవితంలో మరచిపోలేను. నగరంలో 23 వేల మంది అర్హులకు జూలై 8న ఇంటి పట్టాలు పంపిణీ చేస్తాం. ఏడాది పాలన ఎలాఉంది...? తిరుపతిలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదివరకు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసినా ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తించడం ప్రత్యేకమనే చెప్పాలి. బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో అధిగమించాం. పథకాల అమలులో రాష్ట్రంలోనే తిరుపతి ముందుంది. ఏడాది పాలన విజయవంతంగా పూర్తిచేసుకోవడం సంతోషంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 మొదలైందా..? స్వచ్ఛ సర్వేక్షణ్ 2020ను విజయవంతంగా పూర్తిచేశాం. కరోనా కారణంగా ర్యాంకులను ఇప్పటి వరకు ప్రకటించకపోయినా గతంలో కంటే మెరుగైన స్థానంలో ఉంటామని ఆశిస్తున్నాం. సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్లో దేశవ్యాప్తంగా ఏ నగరం కూడా మనకు సాటి రాదు. సుమారు రూ. 40 కోట్లతో బయోమైనింగ్, తడి చెత్త ద్వారా దేశంలోనే అతిపెద్ద బయో గ్యాస్ ప్లాంట్, భవన వ్యర్థాల ద్వారా ఉత్పత్తులు, ఇలా చెత్త నిర్వహణ చేపట్టాం. ఇదే స్ఫూర్తితో 2021 పోటీలకు సన్నద్ధమయ్యాం. మీకు చాలెంజింగ్గా అనిపించినవి ..? ప్రజలకు సులభంగా.. తొందరగా.. అవినీతిరహితంగా సేవంలదించాలనే సంకల్పంతో వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మాకు ఇదో పెద్ద టాస్క్. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు గత ఏడాది జూలై లోపు నగరంలో 102 సచివాలయాలను ఏర్పాటు చేశాం. భవనాల ఎంపిక, మౌలిక వసతుల కల్పన సమస్యలను అధిగమించాం. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన సచివాలయాలను నగరంలో ఏర్పాటు చేయడం, ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలను అందించడం, సుమారు 3 వేల మంది వార్డు వలంటీర్లను ఎంపిక చేయడం, కరోనా కట్టడి వంటివి చాలెంజింగ్గా తీసుకుని పనిచేశాం. అర్జీలను పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ మార్కండేయులు (ఫైల్) సేవలో విలక్షణ శైలి అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ అధికారి స్థాయికి చేరుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్గా రెవెన్యూ పాలనలో తన మార్క్ వేస్తున్నారు. భూ బకాసురులపై కొరడా ఝళిపిస్తున్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వా«దీనానికి చర్యలు చేపట్టారు. పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజల ప్రశంసలు అందుకున్నారు. బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న జేసీ (రెవెన్యూ) డి.మార్కండేయులుపై ప్రత్యేక కథనం. – చిత్తూరు కలెక్టరేట్ జిల్లా పాలనలో తనదైన మార్క్ వేసుకున్నారు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డి.మార్కండేయులు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సమర్థవంతగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీకి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేందుకు కిందిస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కింది స్థాయి నుంచి ఐఏఎస్గా ఎదిగిన ఆయన గతంలో డీఆర్ఓగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా, రాష్ట్ర ఎన్నికలసంఘం జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. 2019 జూన్ 24 న జాయింట్ కలెక్టర్గా జిల్లాకు వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తవుతోంది. భూఆక్రమణలపై ప్రత్యేక దృష్టి జాయింట్ కలెక్టర్ మార్కండేయులు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముందుగా వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఏడాదిలో సుమారు 225.12 ఎకరాల భూమిని ప్రభుత్వ పరం చేశారు. వెదురుకుప్పం మండలం అల్లమడుగు గ్రామంలో 86.38 ఎకరాలు, ఎస్ఆర్పురం మండలంలోని జీఎంఆర్ పురంలో 9.00 ఎకరాలు, పెనుమూరు మండలం గుంటిపల్లిలో 35 ఎకరాలు, నారాయణమండలం బొప్పరాజుపాళ్యంలో 36.97 ఎకరాలు, వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరులో 10.29 ఎకరాలను ప్రభుత్వానికి స్వా«దీనం చేశారు. అలాగే శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లిలో సర్వే నంబర్ 1లో 903.63 ఎకరాలు, సోమల మండలంలోని పెద్దఉప్పరపల్లిలో 269/7 సర్వే నంబర్లో 1.58 ఎకరాల గుట్టపోరంబోకును సర్కార్ ఆధీనంలోకి తీసుకువచ్చారు. ఎస్టేట్ అబాలి‹Ùమెంట్ యాక్ట్ 1948 ప్రకారం 11 కేసులకు గాను 92.10 ఎకరాల భూ సమస్యలను పరిష్కారించారు. 22ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం 166 కేసులకు గాను 314.70 ఎకరాల భూ సమస్యలకు తెరదించారు. 32 చుక్కల భూముల కేసులకు గాను 28.41 భూ సమస్యలకు పరిష్కారం చూపించారు. చదవండి: మాతృదేవతా మన్నించు! స్పందన సమస్యల పరిష్కారం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారు. ఏడాది కాలంలో భూ సమస్యలపై ప్రజలిచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల ద్వారా పరిష్కారం చేయించారు. హైవే విస్తరణ సమస్యలకు చెక్ జిల్లాలో జరుగుతున్న ఎన్హెచ్–140 హైవే పనుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. భూ విరాళదాతలకు వెంటనే పరిహారం అందించేందుకు కృషి చేశారు. ముఖ్యంగా కుక్కలపల్లి, కాణిపాకం, పూతలపట్టు, పి.అగ్రహారం, కొత్తకోట, పాకాల, గాదంకి, చంద్రగిరి ప్రాంతాల్లో భూ సమస్యలను పరిష్కరించారు. ఈ పనులకు రూ.21,11,66,852ల నష్టపరిహారం పంపిణీ చేశారు. అదేవిధంగా బెంగళూరు– చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పనులకు 1,57,113.70 చదరపు అడుగుల భూమిని కేటాయించి రూ. 84.80 కోట్ల పరిహారం అందించారు. జిల్లాలో పనిచేయడం అదృష్టం చిత్తూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి సాగుతున్న కసరత్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నా. ఆక్రమణకు గురైన భూములను తిరిగి ప్రభుత్వం పరం చేయడం సంతృప్తినిచ్చింది. కలెక్టర్ నారాయణభరత్గుప్తా సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నాం. – మార్కండేయులు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) -
పలమనేరులో నువ్వా- నేనా..?
సాక్షి, పలమనేరు: తాతపోతే బొంతనాదన్నట్టు తయారైంది పలమనేరు మున్సిపాలిటీలో పరిస్థితి. మరో మూడునెలల్లో ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి పదవీ విరమణ చెందనున్నారు. దీంతో ఆ పోస్టుపై ఇదే కార్యాలయానికి చెందిన కొందరి కన్ను పడింది. దీంతో పక్కాగా ఓ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వారి ప్రయత్నాల్లో వారు తలమునకలైనట్లు సృష్టమవుతోంది. నిబంధనలు ఇలా.. సాధారణంగా కమిషనర్ బదిలీ గానీ రిటైర్డ్ గానీ అయితే ఆ పోస్టుకు రెగ్యులర్ కమిషనర్ను నియమించాల్సి ఉంటుంది. అయితే వీలుగాని పక్షంలో అదే కార్యాలయంలోని గెజిటెడ్ హోదా కలిగిన ఇంజినీరింగ్ డీఈ, లేదా మేనేజర్ను ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీగా రెగ్యులర్ కమిషనర్ వచ్చే దాకా నియమించుకోవచ్చు. అయితే ఇన్చార్జ్ ఇస్తే పవర్ ఉండదు. అందుకే ఎవరు ఈ పోస్టుకొచ్చినా ఎఫ్ఏసీనే కోరుకుంటారు. ఈ తంతు స్థానిక రాజకీయ నేతలు, అధికారుల పలుకుబడిని బట్టి జరిగే అవకాశాలుంటాయి. ఇక్కడ సాగుతున్న తంతు మరోలా.. ఇదే కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగం ఏఈగా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాకు ముందు డీఈగా పదోన్నతి బదిలీపై వచ్చారు. ప్రాముఖ్యతను బట్టి కమిషనర్ లేనపుడు డీఈకి ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీ కమిషనర్ చాన్స్ ఉంటుంది. ఇదే ఆశతో సదరు అధికారి ఇప్పటికే స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకుని బెర్తు తనకేనని సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇన్చార్జ్ లేదా ఎఫ్ఏసీ కమిషనర్ అవకాశం మేనేజర్కు దక్కే అవకాశాలు లేకపోలేదు. దీన్ని గమనించిన ఇక్కడి మేనేజర్ తన సత్తా ఏంటో చూపింది. గత ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తూ తాజాగా గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2 మేనేజర్గా ప్రమోషన్ పొందారు. అయితే ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ వస్తుందని అందరూ భావించారు. కానీ చక్రం తిప్పిన ఆ మేనేజర్ ప్రమోషన్ పొంది ఇక్కడికే రిటైన్ చేయించుకున్నారు. ఈ తతంగం వెనుక బడాహస్తమే ఉన్నట్టు స్థానిక కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లాంగ్ స్టాండిగ్లో ఉన్న మేనేజర్ మళ్లీ ఇక్కడికే బదిలీ చేయించుకోవడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. దీన్నంతా గమనిస్తున్న రాయదుర్గం మున్సిపల్ మేనేజర్ తన పలుకుబడిని ఉపయోగించి పలమనేరు మేనేజర్గా బదిలీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ఆయన పెద్దనేతల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. చదవండి: మార్పు వైపు మరో అడుగు రెగ్యులర్ కమిషనర్ వస్తే అన్నిటికీ చెక్.. మున్సిపాలిటీలో సాగుతున్న ఎత్తులు, పైఎత్తులను స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఇప్పటికే పసిగట్టినట్టు తెలిసింది. గత కొన్నాళ్లుగా మున్సిపాలిటీలో గాడితíప్పిన పాలనపై తన షాడోల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఆయన కొందరు అధికారులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పలమనేరు పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 55,373 జనాభా ఉన్నారు. ఇప్పుడది 60 వేలకు మించింది. గత ఐదేళ్లుగా పురపాలకసంఘంలో సాగిన వ్యయ, ఆదాయాల మేరకు ప్రస్తుతం గ్రేడ్–3లో ఉన్న మున్సిపాలిటీని గ్రేడ్–2గా మార్చే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే రెగ్యులర్ కమిషనర్ను నియమించేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్ -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్
అబ్దుల్లాపూర్మెట్ (పెద్దఅంబర్పేట): మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపల్ కమిషనర్ రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో ప్రవాస భారతీయుడిని కమిషనర్, టౌన్ప్లానింగ్ అధికారి కలసి రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కమిషనర్ రూ.1.5 లక్షలు తీసుకోగా.. తన వాటాను మధ్యవర్తికి ఇవ్వాలని చెప్పి టీపీఓ లిప్తపాటు కాలంలో తప్పించుకున్నాడు. కుంట్లూర్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సురభి వెంకట్రెడ్డికి తన తండ్రి నుంచి సంక్రమించిన 300 గజాల స్థలంలోని పాత ఇంటిని తొలగించి దాని స్థానంలో కొత్త ఇల్లు నిర్మాణం చేస్తుండగా మున్సిపల్ కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుంట్లూర్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి తమకు ఫిర్యాదు చేశారంటూ పలుమార్లు నోటీసులు పంపించి సిబ్బందితో పనులు అడ్డుకున్నారు. దీంతో బాధితుడు కమిషనర్ రవీందర్రావు, టీపీఓ రమేశ్ను సంప్రదించగా రూ.2.5 లక్షలు (కమిషనర్కు రూ.1.5 లక్షలు, టీపీఓకు రూ.లక్ష) ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకట్రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్పేట కార్యాలయంలోనే వెంకట్రెడ్డి నుంచి కమిషనర్ రవీందర్రావు రూ.1.5 లక్షల లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్గా పట్టుకున్నారు. టీపీఓ తన వాటాను మధ్యవర్తి అయిన లైసెన్స్డ్ ప్లానర్ ఆదినారాయణ రూ.లక్ష తీసుకుంటుగా అతడిని కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్ రవీందర్రావుతోపాటు ఆదినారాయణపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
విజయనగరంలో మేస్త్రీ నిర్వాకం..
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అక్రమార్జనలకు అలవాటు పడి అడ్డంగా దొరికిపోయిన అవినీతి భాగోతం బట్టబయలైంది. రూ.1.50లక్షలు సొమ్ము కోసం బిల్లు కలెక్టర్గా వేషం మార్చి.. ఏకంగా కార్పొరేషన్ కమిషనర్ పేరిట దొంగ సంతకం చేయడంతో పాటు దొంగ స్టాంపులు వేయటం సంచలనం సృష్టించింది. డబ్బులిచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ తన సంతకం చేయలేదని తేల్చటంతో అసలు విషయం బట్టబయలైంది. తదుపరి సొమ్ములు తీసుకున్న ఉద్యోగిపై చట్టపరమైన క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో సార్జెంట్ (పీహెచ్ మేస్త్రీ)గా ఎం.ఎల్లారావు పని చేస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఎల్లారావు అడ్డగోలుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పట్టాడు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో రెవెన్యూ విభాగంలోని విధులు నిర్వహించాల్సిన బిల్లు కలెక్టర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. బిల్లు కలెక్టర్లు మాదిరి నగరంలోని కార్పొరేషన్కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్లో అద్దెకు ఉంటున్న వారి వద్దకు వెళ్లి షాపుల రెన్యువల్ చేయించుకునేందుకు చలానా రూపంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో 18, 21, 22, 23 షాపులు లీజుకు తీసుకున్న రేగాన ఆదినారాయణ అనే వ్యక్తి రూ.1.50 లక్షల మొత్తాన్ని ఎల్లారావుకు చెల్లించారు. ఈ మేరకు ఎల్లారావు కమిషనర్ సంతకం, స్టాంపులు ఉన్న కొన్ని కాగితాలను ఆదినారాయణకు ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా రెన్యువల్కు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవటంతో ఆదినారాయణ కార్పొరేషన్ ఉద్యోగి ఎల్లారావుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎల్లారావు రూ.50,000 నగదుకు సంబంధించి అగ్రిమెంట్స్ వస్తాయని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆదినారాయణ నేరుగా కార్పొరేషన్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎల్లారావు ఇచ్చిన కాగితాలను పరిశీలించిన కమిషనర్ ఆ కాగితాలపై ఉన్నవి తన సంతకాలు కావని తేల్చారు. ఎల్లారావు దొరికిపోయింది ఇలా...? అచ్చం కమిషనర్లానే సంతకాలు చేశానని అనుకుంటున్న మేస్త్రీ ఎం.ఎల్లారావు ఆ సంతకం చేయటంలో దొర్లిన తప్పిదంతో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి కమిషనర్ వర్మ ప్రతి ఫైల్పై తన పూర్తి పేరు ఎస్.సచ్చిదానంద వర్మ పేరిట సంతకం చేస్తారు. అయితే ఎల్లారావు బిల్లు కలెక్టర్గా మాయ చేసిన విషయంలో ఎస్ఎస్.వర్మ అంటూ సంతకం చేశాడు. సదరు పత్రాలను కమిషనర్ పరిశీలించిన సమయంలో ఎస్ఎస్ వర్మ అంటూ ఆ పత్రాలపై ఉండటంతో ఇవి తన సంతకాలు కాదని, మీరు మోసపోయారంటూ ఫిర్యాదుదారుడు రేగాన ఆదినారాయణకు వివరించారు. దీంతో అవాక్కయిన ఆదినారాయణ ఈ విషయంలో మీరే న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నాడు. ఎల్లారావుపై ఫిర్యాదు కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రూ1.50లక్షలు అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావుపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పాటు చట్టపరంగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్టు కమిషనర్ ఎస్ఎస్.వర్మ సాక్షికి తెలిపారు. అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావును 24 గంటల్లోగా విధుల నుంచి తొలగించాలని ప్రజారోగ్య విభాగాధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇటువంటి తప్పిదాలు ఎవ్వరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సీఎం జగన్ ఏడాది పాలన సందర్బంగా ప్రత్యేక సదస్సులు
-
సహజీవనం చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పట్లో కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్తో సహజీవనం చేయాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ఉపయోగం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం వంటి నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి.’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా ఇప్పట్లో వదిలిపెట్టదని, అందుకే దీని కట్టడికి అవసరమైన మార్గదర్శకాలను ఆరోగ్యశాఖతో కలిసి పురపాలక శాఖ విడుదల చేస్తోందన్నారు. వైరస్ కట్టడికి మున్సిపల్ కమిషనర్లు తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయనున్నారని, ఆ తర్వాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి, బేసి సంఖ్యల విధానంలోనే దుకాణాలు తెరిచేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పట్నుంచే సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు వచ్చే వర్షాకాలంలో డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని, గతంలో చేపట్టిన తరహాలోనే యాంటీ లార్వా కార్యక్రమాలను ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆరోగ్య శాఖతో కలసి పురపాలక శాఖ తయారు చేసిన సీజనల్ వ్యాధుల క్యాలెండర్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరారు. డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ప్రతి పట్టణంలోని మురికి కాలువలను శుభ్రం చేసి ఆ చెత్తను తరలించే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. ప్రతి పట్టణంలోని మ్యాన్ హోల్ మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది రక్షణ కవచాలైన మాస్కులు, గ్లౌజులు లేకుండా పని చేయరాదన్నారు. ఒకవేళ పారిశుద్ధ్య కార్మికులు ఇవి లేకుండా కార్య క్షేత్రంలో కనిపిస్తే పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్లదే అవుతుందని హెచ్చ రించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం పట్టణాల్లో తాగునీటి కొరత పెద్దగా లేదని మున్సిపల్ కమిషనర్లు మంత్రికి తెలియ జేశారు. ఇప్పటిదాకా పట్టణాలకి పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రూ.830 కోట్లను విడుదల చేశామని, ఈ నిధులతో చేపట్టిన కార్యక్రమాలపైన ఒక నివేదికను రూపొందించి వెంటనే మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు పంపించాలని కేటీఆర్ ఆదేశించారు. నేటి నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం ‘ప్రతి ఆదివారం 10 గంటలకు–10 నిమిషాలు’పేరిట సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమానికి పురపాలక శాఖ నేటి నుంచి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అంద రూ కూడా తమ తమ ఇళ్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని, నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ఎస్ఈసీతో మున్సిపల్ కమిషనర్, డీజీపీ భేటీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్ఈసీకి నివేదించారు. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంపై నివేదికను అందజేశారు. (ఏపీ ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్) ఎస్ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఈసీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎస్ఈసీ కనగరాజ్ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
మా భర్తలను అనుమతించండి
వేములవాడ: వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం పట్టణ ప్రగతిపై ఏర్పాటు చేసిన సమీక్షలో గందరగోళం నెలకొంది. సమావేశానికి తమ భర్తలను అనుమతించాలని మహిళా కౌన్సిలర్లు చేసిన డిమాండ్ను కమిషనర్ అంగీకరించలేదు. దీంతో కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. వేములవాడలో 5 రోజులుగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతోంది. దీని సమీక్షలో మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. ‘ఇది అధికారిక సమావేశం.. కౌన్సిలర్ల భర్తలు బయటికి వెళ్లిపోవాలి’అని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. దీనికి చైర్పర్సన్ సహా మిగిలిన కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ వాకౌట్ చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కమిషనర్ శ్రీనివాస్రెడ్డి.. అసంతృప్తితో ఉన్న చైర్పర్సన్ సహా కౌన్సిలర్లందరినీ ఆహ్వానించారు. అనంతరం సమావేశం కొనసాగింది. ఈ విషయంపై కమిషనర్ను వివరణ కోరగా, అధికారిక కార్యక్రమాల్లో కేవలం కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావాలి కదా అని బదులిచ్చారు. రెండోసారి కమిషనర్ కౌన్సిలర్లను ఆహ్వానించినప్పుడు మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా హాజరయ్యారు. అనంతరం సమావేశం సజావుగా సాగింది. -
ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై స్పందించని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్పై కఠిన చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ హాస్టల్ భవన నిర్మాణం కోసం 1975లో కేటాయిం చిన స్థలంలో ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా మున్సిపల్ కమిషనర్ చర్య లు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన గొట్టిముక్క ల వీఆర్ఆర్జీ రాజు వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు విచారించింది. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్పై కఠిన చర్యలు తీసుకోవాల ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఇక కలెక్టర్.. ‘పవర్ఫుల్’
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు ఇక సంక్రమిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ చట్టంలో వారి అధికారాలను ప్రభుత్వం స్పష్టం చేయగా, ఏ అంశంలో ఎలాంటి అధికారాలున్నాయనే దానిపై మున్సిపల్ శాఖ చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటివరకు మున్సిపల్ వ్యవహారాల్లో కలెక్టర్ల పాత్ర, జోక్యం నామమాత్రంగానే ఉండగా, ఇక నుంచి పట్టణ పాలనలో వారే కీలకం కానున్నారు. వీరి కనుసన్నల్లోనే బడ్జెట్ తయారీ నుంచి ప్రభుత్వ పథకాల అమలు, విధాన నిర్ణయాలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలను తమ నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పట్టణాభివృద్ధికి చెందిన అన్ని కీలకాంశాల్లోనూ కలెకర్లే సూపర్బాస్లుగా వ్యవహరించనున్నారు. భవన నిర్మాణ అనుమతుల నుంచి... పట్టణ ప్రాంతాల్లో ముఖ్య సమస్యలైన భవన నిర్మాణం, లేఅవుట్ల ఏర్పాటు, అనధికార భవనాల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణ లాంటి అంశాల్లో టౌన్ప్లానింగ్ విభాగం ఇప్పటివరకు కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక నుంచి వీటన్నింటిలో కలెక్టర్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు గాను వారే స్వీయ నిర్ధారిత అఫిడవిట్ ద్వారా నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. గతంలో 500 చదరపు మీటర్ల వైశాల్యం, 10 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాల కోసం మున్సిపాలిటీతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు సింగిల్విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులిచ్చే అధికారం కలెక్టర్లకు దఖలు పడుతోంది. కలెక్టర్లు చైర్మన్లుగా ఉండే కమిటీ ఈ అనుమతుల విధానాన్ని టీఎస్ఐపాస్ తరహాలో పరిశీలించనుంది. ఇక, అనధికార భవన నిర్మాణాలపై కలెక్టర్లకు గతంలో స్పష్టమైన అధికారాలు లేకపోగా, ఇక నుంచి వాటిని గుర్తించి కూల్చివేయడం, సదరు యజమానికి పెట్టుబడిలో 25 శాతం జరిమానా విధించే అధికారాన్ని సెక్షన్ 180 ద్వారా కలెక్టర్లకు ఇచ్చారు. వారి నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ ఈ అంశాలను పర్యవేక్షించనుంది. పుర పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన ఏడు రోజుల్లోపు అనధికార భవన నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారం సెక్షన్ 174(5) ద్వారా కలెక్టర్లకు దఖలు పరిచారు. కమిషనర్ల విధులన్నీ పర్యవేక్షించాల్సిందే పురపాలనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు నిర్వహించే విధులన్నింటినీ పర్యవేక్షించడంతో పాటు వాటినీ సంపూర్ణంగా కలెక్టర్లే నియంత్రించనున్నారు. మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల అన్ని విధులను కూడా పర్యవేక్షించడంతోపాటు ప్రతి పట్టణాన్ని మోడల్ టౌన్గా తీర్చిదిద్దే బాధ్యత కలెక్టర్లదే. పాలకవర్గాలు చేసే ప్రతి తీర్మానాన్ని పరిశీలించడం, పాలకవర్గ సభ్యుల ప్రవర్తనను బట్టి వారిని సస్పెండ్ చేయడం, మున్సిపాలిటీల చైర్పర్సన్లకు సూచనలు, సలహాలివ్వడం, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, గతంలో పాలకవర్గాలు చేసిన ఏదైనా చర్యను పునఃసమీక్షించడం, చైర్పర్సన్లు, కమిషనర్లను వివరణలు కోరడం, మున్సిపాలిటీలిచ్చిన లైసెన్సులను రద్దు చేయడం. స్క్వాడ్ల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో కలెక్టర్లకు విశేష అధికారాలిచ్చారు. వీటన్నిటినీ మున్సిపల్ చట్టంలోనే పేర్కొన్నప్పటికీ ప్రస్తుత చట్టం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయనే దానిపై అంశాల వారీ నివేదికను తాజాగా తయారు చేసింది. ఆ అంశాలనే ఇటీవల పురచట్టం–పట్టణ ప్రగతిపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ కూడా వివరించారు. -
తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 35 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. వారి వివరాలు.. ⇒ కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్గా జకీర్ అహ్మద్ ⇒బెల్లంపల్లి కమీషనర్గా ఆకుల వెంకటేశ్ ⇒లక్స్ట్టిపేట్ కమిషనర్గా త్రియంబకేశ్వర్రావు ⇒నాగర్కర్నూల్ కమిషనర్గా గోనే అన్వేశ్ ⇒జగిత్యాల కమిషనర్గా జయంత్కుమార్రెడ్డి ⇒నిర్మల్ కమిషనర్గా నల్లమాల బాలకృష్ణ ⇒అమీన్పూర్ కమిషనర్గా సుజాత ⇒హాలియా కమిషనర్గా వేమనరెడ్డి ⇒తెల్లాపూర్ కమిషనర్గా వెంకట మణికరణ్ ⇒షాద్నగర్ కమిషనర్గా లావణ్య ⇒సంగారెడ్డి కమిషనర్గా శరత్చంద్ర ⇒GHMCలో డిప్యూటీ కమిషనర్గా ప్రశాంతి ⇒తాండూరు కమిషనర్గా శ్రీనివాస్రెడ్డి ⇒శంషాబాద్ కమిషనర్గా సబీర్ అలీ ⇒నర్సంపేట కమిషనర్గా విద్యాధర్ ⇒పరకాల కమిషనర్గా యాదగిరి ⇒పెద్దపల్లి కమిషనర్గా చదల తిరుపతి ⇒వేములవాడ కమిషనర్గా మట్టా శ్రీనివాస్రెడ్డి ⇒సత్తుపల్లి కమిషనర్గా కె.సుజాత ⇒ఇల్లందు కమిషనర్గా వీరేందర్ ⇒మందమర్రి కమిషనర్గా గద్దె రాజు ⇒వనపర్తి కమిషనర్గా మహేశ్వర్రెడ్డి ⇒GHMCలో డిప్యూటీ కమిషనర్గా రజనికాంత్రెడ్డి ⇒సదాశివపేట కమిషనర్గా స్పందన ⇒యెల్లారెడ్డి కమిషనర్గా అహ్మద్ ⇒హుజూర్నగర్ కమిషనర్గా బట్టు నాగిరెడ్డి ⇒కామారెడ్డి కమిషనర్గా గంగాధర్ ⇒యాదగిరిగుట్ట కమిషనర్గా జంపాల రజిత ⇒నందికొండ కమిషనర్గా పల్లారావు ⇒చిట్యాల కమిషనర్గా ప్రభాకర్ ⇒GHMC డిప్యూటీ కమిషనర్గా త్రిలేశ్వర్ ⇒GHMC డిప్యూటీ కమిషనర్గా ముకుంద్ రెడ్డి ⇒ఆమనగల్లు కమిషనర్గా శ్యాంసుందర్ -
24 ఏళ్లకే ఐఏఎస్.. మున్సిపల్ కమిషనర్గా
సాక్షి, కరీంనగర్: దేశంలో చిన్న వయస్సులో ఐఏఎస్ సాధించిన వారిలో వెల్లూరి క్రాంతి కూడా ఒకరు. 24 ఏళ్లకే ఐఏఎస్ సాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన వల్లూరి రంగారెడ్డి, లక్షి్మలకు ఇద్దరు కుమార్తెలు నీలిమా, క్రాంతి ఉన్నారు. క్రాంతి తల్లిదండ్రులు, అక్క అందరూ వైద్యులే. తల్లిదండ్రులు కర్నూల్లో వైద్యులుగా స్థిరపడగా, అక్క నీలిమా అమెరికాలో ఉంటున్నారు. ఇంట్లో అందరూ వైద్యులుగా ఉండడంతో క్రాంతిని చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేసే సర్వీసులో ఉండాలని, అందుకోసం ఐఎఎస్ సాధించాలని తండ్రి రంగారెడ్డి చెప్పేవారు. 10వ తరగతి వరకూ కర్నూల్లో, ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేయగా ఐఐటీ సీట్ రావడంతో ఢిల్లీ ఐఐటీలో చేరారు. అక్కడి నుంచి ఐఏఎస్ కావాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆరునెలలపాటు శిక్షణ పొందుతూ ప్రిపరేషన్ ప్రారంభించారు. 2013లో మొదటిసారి సివిల్స్ రాసి మొదటి ప్రయత్నంలోనే 562 ర్యాంక్ సాధించారు. ఐఆర్టీఎస్(ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో జాయిన్ అయి వడోదర, లక్నోల్లో శిక్షణ కూడా పొందారు. 2014లో రెండవసారి మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశారు. ఈసారి 230 ర్యాంక్ సాధించారు. ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. 2015లో మళ్లీ సివిల్స్ రాశారు. 2016లో ప్రకటించిన తుది ఫలితాల్లో 65 ర్యాంక్తో ఐఏఎస్ సాధించారు. ఇలా 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించి రికార్డ్ సృష్టించారు. శిక్షణ అనంతరం క్రాంతిని తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. అలా మొదట నిర్మల్ జిల్లాలో పని చేశారు. అనంతరం ప్రత్యేకాధికారిగా మహబూబ్నగర్లో 15 నెలలపాటు పని చేయగా తాజాగా జరిగిన బదిలీల్లో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా వచ్చారు. ఆటలన్నా.. పాటలన్నా ఇష్టం... వల్లూరి క్రాంతికి ఆటలన్నా పాటలన్నా చాలా ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించారు. చిన్నపుడు బాస్కెట్బాల్ ప్లేయర్ అయిన క్రాంతి తర్వాత టెన్నిస్, బ్యాడ్మింటన్ బాగా ఆడుతారు. ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలు ఇష్టంగా చదువుతారు. వీటితోపాటు తెలంగాణ పాటలను బాగా ఇష్టపడుతారు. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం, సంస్కృతిపైన వచ్చిన పలు జానపదాలను ఇష్టంగా వింటారు. బతుకమ్మ పండుగను బాగా ఇష్టపడుతారు. -
ఏపిలో 12మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లో ఆర్ఎండీఏ జి.శ్రీనివాసరావును రాష్ట్ర మున్సిపల్ కమిషరేట్లో జాయింట్ డైరెక్టరేట్గా బదిలీ చేశారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కె.వెంకటేశ్వర్లును గుంటూరు మున్సిపల్కార్పోరేషన్ ఆర్ఎండీఏగా నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు,ఇతర అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్నికల కోడ్ నిబంధనలపై కమీషనర్లకు నాగిరెడ్డి సూచనలు
-
పరకాల కమిషనర్పై వేటు
పరకాల: వార్డుల పునర్విభజన డాక్యుమెంటేషన్ అందించడంలో జరిగిన జాప్యంపై పరకాల పురపాలక సంఘం కమిషనర్ బి.శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. కొత్త కమిషనర్గా పురపాలక శాఖ ఆడిట్ విభాగం సీనియర్ అధికారి ఎల్.రాజాకు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 17న అందించిన వార్డుల పునర్విభజన, మ్యాప్ వంటి డాక్యుమెంటేషన్ లో జరిగిన పొరపాట్లపై వివరణ కోరేందుకు సీడీఎంఏ ప్రయత్నించగా కమిషనర్ అందుబాటులో లేకపోవడం.. పైగా ఫోన్ చేసినా స్పందిం చకపోవడాన్ని సీరియస్గా తీసుకున్నారు. మార్పులు చేసిన డాక్యుమెంటేషన్ను మరుసటి రోజు కమిషనర్ శ్రీనివాస్ కార్యాలయంలో అందజేయకుండా కింది స్థాయి అధికారులతో పంపడాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణి స్తూ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ సీడీ ఎంఏ అధికారి శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. -
డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు! : మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. గురువారం విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల వర్క్షాప్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బొత్స మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకేసారి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారని గుర్తు చేశారు. సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది అధికారులు ప్రజలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదని, స్పందన కార్యక్రమంపై అధికారులు రాజీ పడడానికి వీల్లేదన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాల్లో నీటి కొరత రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఉగాదికి ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం నిర్ణయించినందున ఈ కార్యక్రమం కోసం వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయం అధికారుల సేవలను మున్సిపల్ అధికారులు వినియోగించుకోవాలన్నారు. చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయమని అడుగుతున్నారనీ, ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశముందని బొత్స పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మున్పిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ఇన్చార్జ్లతో డిశ్చార్జ్
సాక్షి, తాండూరు: తాండూరు పురపాలక సంఘంలో పాలన స్తంభించింది. మున్సిపల్ కార్యాలయంలో కీలక పోస్టులన్నీ ఖాళీగా మారాయి. అధికారులు లేకపోవడంతో ఇన్చార్జిల పెత్తనమే కొనసాగుతోంది. దీంతో పౌరసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుధ్యం క్షీణించి జనం రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత మున్సిపాలిటీని వేధిస్తోంది. తాండూరు మున్సిపల్ను ఆదర్శంగా నిలబెడతామని అధికారులు, ప్రజా ప్రతినిధుల అంటున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో సిబ్బంది అవినీతికి తెరలేపారు. తాండూరు మున్సిపల్ కార్యాలయ నిర్వహణ పూర్తిగా స్తంభించింది. అందుకు కారణం కార్యాలయంలో కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మేనేజర్, రెవెన్యూ అ«ధికారుల వంటి కీలక పొస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయం పరిధిలో 160 మంది సిబ్బంది టౌన్ప్లానింగ్, శానిటరీ, రెవెన్యూ, ఇంజినీరింగ్, అడ్మిస్ట్రేషన్ సెక్షన్లతోపాటు పలు విభాగాలలో విధులను నిర్వహించేందుకు సిబ్బంది అవసరం కాగా కేవలం 60 మంది మాత్రమే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 100 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో తాండూరు ప్రజలకు మున్సిపల్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 5 నెలలుగా ఇన్చార్జ్ కమిషనర్ పాలన మున్సిపల్ కార్యాలయంలో 5 నెలలుగా ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్లు కొనసాగుతున్నారు. గతంలో పరిగి కమిషనర్ తేజిరెడ్డికి తాండూరు మున్సిపల్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పక్షం రోజుల క్రితం తేజిరెడ్డి స్థానంలో తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావుకు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. వేణుమాధవరావుకు బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి కార్యాలయంలో గడిపిన సందర్భాలు కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డిప్యూటేషన్పై వెళ్లిన పారిశుధ్య అధికారి తాండూరు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే శానిటరీ ఇన్స్పెక్టర్ విక్రంసింహారెడ్డి ఏడాదిన్నర క్రితం జహీరాబాద్కు డిప్యూటేషన్పై వెళ్లారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో నిత్యం పారిశుధ్య పనులను పర్యవేక్షించే శానిటరీ ఇన్స్పెక్టర్ లేక పోవడంతో పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. ఎక్కడపడితే అక్కడ మురుగుమయంగా మారడంతో పాటు తాగునీరు సరిగా సరఫరా కావడం లేదు. మురుగుతో కూడిన కలుషిత నీరు సరఫరా కావడంలో పట్టణ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. పక్షం రోజులుగా పట్టణంలోని ఆసుపత్రులలో జనాలు బారులు తీరుతున్నారు. తాండూరు డీఈఈకి 4 మున్సిపాలిటీల బాధ్యతలు తాండూరు మున్సిపల్ డీఈఈకి మూడు జిల్లాల్లోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్చార్జ్ బా ధ్యతలు అప్పగించారు. నాటి నుంచి తాండూరు మున్సిపల్కు ఉన్నతాధికారులు వచ్చిన సమ యంలో తప్ప మిగతా సమయంలో కనిపించిన దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఫ్రీజర్లలో కిలోల కొద్దీ మురిగిపోయిన మాంసం..
చికెన్ – 65.. తందూరీ చికెన్.. చికెన్ టిక్కా..లాలిపప్.. పెప్పర్ చికెన్.. మొఘలాయ్ చికెన్.. చికెన్ మంచూరియా.. ధమ్ బిరియానీ.. రొయ్యల ఫ్రై, చేపల పులుసు .. హోటళ్లలో మెనూ చూస్తే నోరూరాల్సిందే. అయితే వీటిని తింటే మాత్రం మంచమెక్కాల్సిందే. రంగురంగుల్లో ఉన్న చికెన్ ముక్కను తిన్నారంటే రోగాన్ని కొనితెచ్చుకున్నట్టే. వారం రోజులుగా జిల్లాలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఫ్రీజర్లలో కిలోల కొద్దీ నిల్వ ఉంచి మురిగిపోయిన మాంసం వెలుగు చూస్తోంది. ఫలితంగా హోటళ్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకూ ఎందులో చూసినా అంతా కల్తీనే. కల్తీరాయుళ్లపై కలెక్టర్ శేషగిరిబాబు కన్నెర్ర చేశారు. నాణ్యత పెరిగే వరకు అధికారులు దాడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: హైదరాబాద్ తర్వాత నాన్వెజ్ను అమితంగా ఇష్టపడే ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. జాతీయ రహదారిని ఆనుకొని నగరం ఉండటంతో నిత్యం నగరంలోని వినియోగదారులతో పాటు ఇతర జిల్లాల వాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడి హోటళ్లకు వస్తుంటారు. అయితే అన్నిట్లో నాసిరక మాంసాహారం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో నాణ్యతను పాటించడంలేదని ప్రాథమికంగా నిర్ధారించుకొని ఐస్క్రీమ్ షాపుల మొదలుకొని బార్ల వరకు తనిఖీలు నిర్వహించి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో ఫుడ్ కంట్రోల్ విభాగాధికారులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వరుస తనిఖీలు నిర్వహించి భారీగా కేసులు నమోదు చేసి హోటళ్ల నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న యజమానులు కొందరు హోటళ్ల యజమానులు కాసులకు కక్కుర్తిపడి చెడిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. వేడిపై మాంసం తినడంతో చెడిపోయిందా లేదాననేది గుర్తించడం కష్టమే. దీన్ని అదునుగా చేసుకొని కొందరు హోటళ్ల యజమానులు వారాల తరబడి నిల్వచేసిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. నగరంలో దాదాపు 80 హోటళ్ల వరకు ఉండగా, ప్రధానమైన హోటళ్లు 20 నుంచి 30 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1100 హోటళ్లు ఉన్నాయి. చాలా మంది యజమానులు అధిక మొత్తంలో మాంసాహారం కొనుగోలు చేస్తే ధర తగ్గుతుందనే ఉద్దేశంతో భారీగా కొనుగోలు చేస్తున్నారు. విక్రయాల్లో ఆలస్యమైతే మాంసాహారాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. వారాల తరబడి ఫ్రీజర్లలో నిల్వ ఉండటంతో అప్పటికే మాంసం మురిగిపోతోంది. నగరంతో పాటు కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, తదితర పట్టణాల్లో నిర్వహించిన వరుస దాడుల్లో ఫ్రీజర్లలో మురుగుతున్న కిలోల కొద్దీ మాంసాన్ని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో కళ్లిపోయి.. దుర్వాసన వస్తున్న మాంసాన్ని కూడా కనుగొన్నారు. హోటళ్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానాలు విధించారు. ఇలా చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు గుర్తించిన మాంసాన్ని వెంటనే ధ్వంసం చేయించారు. కలెక్టర్ ఆదేశాలతో దాడులు ఈ నెల 25న కలెక్టర్ శేషగిరిరావు కార్పొరేషన్, ఫుడ్ కంట్రోల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరులో ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్పొరేషన్ హెల్త్, ఫుడ్ కంట్రోల్ శాఖలు సంయుక్తంగా దాడులు చేపట్టాలని ఆదేశించారు. నిల్వ చేసిన ఆహారాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ముందుగా జరిమానాలు విధించి హెచ్చరికలు జారీ చేయాలన్నారు. హోటళ్ల యజమానుల్లో మార్పు రాకపోతే సీజ్ చేసేందుకు కూడా వెనుకాడొద్దని హెచ్చరించారు. నాణ్యత పెరిగేంత వరకూ దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించాలని ట్రెయినీ కలెక్టర్లను ఆదేశించారు. రూ.ఐదు లక్షలకు పైగా జరిమానా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ నెల 26న పది హోటళ్లపై దాడులు చేశారు. మద్రాస్ బస్టాండ్ వద్ద ఓ హోటల్లో చెడిపోయిన మాంసాన్ని భారీగా గుర్తించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని హోటళ్ల యజమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే రూ.1.7 లక్షల జరిమానాలు విధించారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లకు జరిమానాలు వేశారు. సోమవారం మూడు బార్ అండ్ రెస్టారెంట్లు, ఆరు హోటళ్లపై దాడులు చేసి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మునిసిపాలిటీల్లోనూ హోటళ్లపై దాడులు ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దశలవారీగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ల దుకాణాలు, ఇతర తినుబండారాల విక్రయాలు జరిపే హోటళ్లపై కూడా దాడులు జరపాలన్నారు. హోటళ్లపై నిరంతర తనిఖీలు నెల్లూరు(పొగతోట): జిల్లాలోని హోటళ్లు, దుకాణాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు, వస్తువులను అందించాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి మునిసిపల్ అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. నగరంలోని అనేక హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో వంటశాలలు, ఆహారపదార్థాలు తనిఖీల్లో బయటపడ్డాయన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, దుకాణాలపై అపరాధ రుసుమును విధించాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరా అవసరమైన ప్రాంతాలకు సంబంధించి ప్రతిపాదనలను పంపించాలని సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. అధికారులపై ఆగ్రహం సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలో ట్రయినీ కలెక్టర్ కల్పనాకుమారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై చివాట్లు పెట్టారు. తొలుత ఆలె చేపల మార్కెట్లో అక్కడే కోయడం, అక్కడే చెత్తా చెదారం వేయడంతో వస్తున్న దుర్వాసన దారుణంగా ఉన్న విషయం మీకు కనిపించలేదా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికోన్నత పాఠశాలలోకి వెళ్లి సమస్యలేమైనా వున్నాయా అని విద్యార్థులను అడగడంతో స్కూల్ ముందే పెద్ద మురుగునీటి కాలువ వుంది. అక్కడే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం బాపూజీ వీధిలోని గోమతి స్వీట్స్టాల్లో తినుబండారాలను పరిశీలించి అక్కడ ప్లాస్టిక్ కవర్లు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న భవనానికి అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. లేదని చెప్పడంతో అనుమతి తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారు.. నోటీలు ఇవ్వలేదా అని అధికారులను నిలదీశారు. పట్టణంలో అనుమతి లేని భవనాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని ఆదేశించారు. అనంతరం రాజధాన్ని హోటల్లోకి వెళ్లి అక్కడ మురిగిపోయిన చికెన్, రొయ్యలను గుర్తించి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. రహదారికి పక్కనే చెత్తడంపింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పట్టణంలోని పరిస్థితిపై నివేదికను కలెక్టర్ శేషగిరిబాబుకు అందజేస్తానని చెప్పారు. ఆమెతో పాటు కమిషనర్ నరేంద్ర, ఇతర సిబ్బంది వున్నారు. హోటళ్లలో కొనసాగుతున్న తనిఖీలు నెల్లూరు(సెంట్రల్): నగరంలోని హోటళ్లు, సినిమా థియేటర్లలో ఫుడ్ కంట్రోల్ అధికారులు, కార్పొరేషన్ హెల్త్ అధికారులు మంగళవారం దాడులు కొనసాగించారు. నగరంలోని సిరి మల్టీప్లెక్స్, అమరావతి బార్ అండ్ రెస్టారెంట్, ఎస్ – 2 సినిమా హాల్లో ఆహారం తయారు చేసే ప్రాంతాలు, రామలింగాపురం వద్ద ఉన్న పంజాబీ దాబాను పరిశీలించారు. అమరావతి బార్ అండ్ రెస్టారెంట్లో కొంత మేర లోపాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్ – 2లో అన్ని లైసెన్స్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోల్ గెజిటెడ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడారు. కొన్ని రోజులుగా ఆహార తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నామని, ప్రస్తుతం కొంత మార్పు కనిపిస్తోందని చెప్పారు. ఎక్కడైనా ఫుడ్ లైసెన్స్లు లేకుండా, నిల్వ చేసిన ఆహారాన్ని ఉంచితే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ మాట్లాడారు. హోటళ్లలో అపరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్ను వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని, అప్పటికీ తీరులో మార్పు రాకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స
-
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం : బొత్స
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలనకు నడుం బిగించారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని.. అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకుపోవాలన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల వర్క్షాప్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ప్రభుత్వం తొలి రోజు నుంచే దృష్టి సారించిందని గుర్తుచేశారు. త్వరలో వార్డు సేవకులను ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో వార్డు సేవకులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చించడమే ఈ వర్క్షాప్ ఉద్దేశమని పేర్కొన్నారు. అదేవిధంగా సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. మంచి నీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేయాలని.. ఇబ్బందులను దాచిపెట్టకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. -
నేర చరితులు ఏజెంట్లుగా అనర్హులు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: నేరచరిత్ర గల వ్యక్తులను ఏజెంట్లుగా నియమించవద్దని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో, మున్సిపల్ కమిషనర్ వి.విజయరామరాజు తెలిపారు. స్థానిక తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం బరిలో వున్న అభ్యర్థులు, జనరల్ ఏజెంట్లతో కౌంటింగ్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీ బరిలో వున్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను అందించి పాసులు పొందాలన్నారు. అదేవిధంగా ఎంపికైన ఏజెంట్లు రెండు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు, ఐడీ కార్డుతో ఈ నెల 23న ఉదయం 6గంటలకు చిత్తూరులోని ఆర్వీఎస్ నగర్, ఎస్వీసెట్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎటువంటి నేరచరిత్ర లేనివారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించాలని సూచించారు. అభ్యర్థులు అందించిన ఏజెంట్ల వివరాలను ఎస్పీ పరిశీలించనున్నట్లు తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో 261 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ కోసం 20టేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం మరో 2 టేబుల్స్ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద సమస్యలు వుంటే ఆర్వోకు తెలపాలని సూచించారు. క్రమశిక్షణ పాటించాలని లేనిపక్షంలో కౌంటింగ్ కేంద్రాలనుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజున ఉదయం 7గంటలకు అబ్జర్వర్, ఆర్వో, బరిలో వున్న అభ్యర్థుల సమక్ష్యంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను తెరవడం జరుగుతుందన్నారు. అనంతరం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, 8.30గంటల నుంచి కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూరైన తర్వాత అబ్జర్వర్ రాండమైజేషన్తో 5వీవీ ప్యాట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో వీవీ ప్యాట్ లెక్కింపునకు 45 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఏఆర్వో, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, బరిలో వున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విధుల్లో నోడల్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి అసెంబ్లీ ఆర్వో, నగర పాలక కమిషనర్ వి విజయరామరాజు సూచించారు. గురువారం స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో కౌంటింగ్ ప్రక్రియపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నోడల్ అధికారులే కీలకమని తెలిపారు. ఈ నెల 22న ఎస్కార్ట్తో పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం విధులు కేటాయించిన సిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకోవాలన్నారు. దీంతో 23న ఉదయమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ పరిధిలోని పార్లమెంట్ ఓట్ల లెక్కింపు స్థల ప్రభావంతో 14టేబుల్స్పై జరుగుతుందన్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఎక్సెల్ షీట్ నోడల్ అధికారులు టేబుల్ వారీగా వచ్చిన ఫలితాలను నమోదు చేస్తారని తెలిపారు. ఎక్సెల్ ఫార్ములా కీలకం అని అప్రమత్తంగా వుండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ అధికారులు, రో ఆఫీసర్లు, ఈవీఎమ్ల నోడల్ అధికారులు తమ విధుల నిర్వహణలో జాగ్రత్త వహించాలన్నారు. త్వరలో జరిగే శిక్షణా తరగతులకు అందరూ తప్పక హాజరుకావాలని సూచించారు. ఈ సమావేశంలో నగరపాలక అసిస్టెంట్ కమిషనర్ హరిత, ఏఆర్వో శ్రీనివాసులు, కౌంటింగ్ విధులకు హాజరయ్యే నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు
-
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కమిషనర్ సహా నలుగురి దుర్మరణం
రాయదుర్గంటౌన్/రూరల్: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి–వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ షేక్ ఇబ్రహీం సాహెబ్ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం తన సొంత కారులో అనంతపురం వెళ్లారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్వో అమీర్బాషా, ఆర్ఐ దాదా ఖలందర్ తదితరులు ఉన్నారు. విధులు ముగించుకుని రాత్రి 9,30 గంటల ప్రాంతంలో రాయదుర్గం తిరిగి వస్తుండగా అటువైపు నుంచి ఎదురుగా వస్తున్న చెన్నైకి చెందిన కారు వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్సిపల్ కమిషనర్తో పాటు ఆర్వో అమీర్బాషా, ఆర్ఐ దాదా ఖలందర్, డ్రైవర్ ఎర్రిస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్ఐ సత్యనారాయణతో పాటు మరో కారులోని ప్రభు, మురుగన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్కు తరలించారు. శోకసముద్రంలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాయదుర్గం చేరుకుంటారనగా మృత్యువు వీరిని కబళించింది. నలుగురు ఉద్యోగులు దుర్మరణం చెందడంతో రాయదుర్గం మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులు రాయదుర్గం ఆస్పత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. -
అవినీతి శంకరం
బుధవారం ఉదయం 6.30 గంటలు.. నర్సీపట్నంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావు బస చేసిన ప్రైవేట్ లాడ్జి.. ఏసీబీ అధికారులు తలుపు కొట్టారు.. నిద్ర కళ్లతో తలుపు తీసిన కమిషనర్ అవాక్కయ్యారు.. ఆయనను మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇలా.. విశాఖ ఎంవీపీ కాలనీలోని శంకరరావు ఇల్లు, మధురవాడలోని ఆస్తులు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అతని బంధువుల ఇళ్లు, ఆస్తులను.. మొత్తం 14 చోట్ల తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.20కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పారు. సీతమ్మధార (విశాఖ ఉత్తరం)/నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఐదు రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. ఎన్నికల నిబంధనల మేరకు బొబ్బిలి నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఈ నెల 15న విధుల్లో చేరారు. అంతలోనే ఏసీబీ దాడులు జరగడం నర్సీపట్నంలో కలకలం సృష్టించింది. విశాఖలోని ఆయన ఇల్లు, ఆస్తులు.. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అతని తండ్రి, పలాస మండలం బ్రాహ్మణతర్లాలో అతని మామగారిళ్లలోనూ సోదాలు జరిగాయి. బొబ్బిలిలో ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఉదయాన్నే నర్సీపట్నం చేరుకున్నారు. శంకరరావును మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లి... అక్కడ కమిషనర్కు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పాస్ పుస్తకాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 1988లో పురపాలికశాఖలో హెల్త్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన శంకరరావు తదనంతరం పదోన్నతిపై శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. 2008లో గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్గా నెల్లిమర్ల, బొబ్బిలిలో విధులు నిర్వహించారు. నర్సీపట్నంలో ఐదు రోజుల క్రితమే విధుల్లో చేరారు. ఆయన నివసిస్తున్న లాడ్జిలో ఎప్పటి నుంచి ఉంటున్నది, అడ్వాన్స్గా ఎంత చెల్లించారని లాడ్జి మేనేజర్ను ప్రశ్నించారు. ఈ మేరకు మేనేజర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అదే సమయంలో కమిషనర్కు టిఫిన్ తీçసుకొచ్చిన మధును కూడా ప్రశ్నించారు. అనంతరం ఏసీబీ సీఐ గణేష్ విలేకరులతో మాట్లాడుతూ కమిషనర్ శంకరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినల్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. నర్సీపట్నంలో జరిపిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు ఇతర రికార్డులు లభించాయన్నారు. కమిషనర్ శంకరరావును కస్టడీలోకి తీసుకుని విశాఖపట్నం తరలించారు. అతడిని అరెస్ట్ చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఎంవీపీ కాలనీలోని హనుమంతు శంకరరావు సొంత ఇల్లు వుడా కాలనీలో సోదాలు పీఎం పాలెం(భీమిలి): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఆస్తులపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మిథిలాపురి ఉడా కాలనీలో గల మూడంతుస్తుల భవనం మొదటి ఫ్లోర్లో శంకరరావు బంధువు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆ ఇంటిలో సుమారు 5గంటలపాటు సోదాలు జరిపారు. పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ పుల్లారావు, సిబ్బంది పాల్గొన్నారు. బొబ్బిలిలో.. బొబ్బిలి: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకరరావు ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈనెల 14న బొబ్బిలి నుంచి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ హెచ్.శంకరరావు జిల్లా కేంద్రంలోని పూల్బాగ్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో నివశిస్తున్నారు. ఆయన కుటుంబం జిల్లా కేంద్రంలోనే ఉండడంతో ఏసీబీ డీఎస్పీ డీవీఎస్ నాగేశ్వరరావు నేృతృత్వంలోని సిబ్బంది బుధవారం ఉదయం 8 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. అయితే తనిఖీలకు కమిషనర్ భార్య ముందు ఒప్పుకోకపోగా.. డీఎస్పీ నాగేశ్వరరావు నచ్చజెప్పారు. తనిఖీల్లో కీలకమైన పత్రాలు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐలు సతీష్, జి. అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... ♦ విశాఖపట్నం ఎంవీపీ కాలనీ, సెక్టార్ – 4లో 207 గజాల విస్తీర్ణంలోని ఇల్లు భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరున 2017లో కొనుగోలు చేశారు. ♦ మధురువాడ వాంబేకాలనీలో 236 గజాల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవనం తండ్రి పేరున కొనుగోలు. ♦ భీమిలి, సంగివలస, నేరెళ్లవలసలో 60 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. ♦ భీమిలి సమీప కుమ్మరిపాలెంలో భార్య హనుమంతు ఈశ్వరీబాయి పేరు మీద 266.6 గజాల స్థలం 2002లో కొనుగోలు చేశారు. ♦ 100 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు గుర్తించారు. ♦ స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా చిట్టివలస, భీమిలి బ్రాంచిల్లోని లాకర్లలో రూ.5.20 లక్షల నగదు గుర్తించారు. ♦ బొబ్బిలిలోని కరూర్ వైశ్య బ్యాంకులో రూ.2.50లక్షల విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు. ♦ ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కలకలం టెక్కలి/కాశీబుగ్గ: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావుపై ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. టెక్కలి గోపినాథపురంలో శంకరరావు తండ్రి నర్సింగరావు పేరుతో ఉన్న ఇంటికి ఉదయం 8 గంటలకే ఏసీబీ అధికారులు చేరుకున్నా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసి పక్కనే అద్దెకు ఉంటున్న వారి నుంచి వివరాలు తీసుకున్నారు. కమిషనర్ శంకరరావు అత్తామామలు కణితి సావిత్రి, సూర్యనారాయణలు పలాస మండలం బ్రాహ్మణతర్లాలో నివాసముంటున్నారు. సూర్యనారాయణ డ్రిల్మాస్టర్గా పనిచేసి రిటైరయ్యారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో విశాఖ ఏసీబీ సీఐ మహేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యనారాయణ ఇంట్లో అణువణువూ శోధించారు. ఉదయం ఏడు గంటల నుంచి బీరువాలు, పెట్టెలు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్పుస్తకాలు, పలు వస్తువులు క్షుణ్నంగా పరిశీలించారు. శంకరరావు పెద్ద బావమరిది చక్రధర్ విశాఖపట్నంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, చిన్న బావమరిది భువనేశ్వర్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల నేపథ్యంలో చక్రధర్ విశాఖ నుంచి బ్రాహ్మణతర్లా చేరుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ఏసీబీ సిబ్బంది రాము, మాధవరావు, కాశీబుగ్గ షీటీం పోలీసులు మాధవి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ దాడులు
-
ఉద్యోగినిని లోబరుచుకునేందుకు విందు..!
సాక్షి, కరీంనగర్ : చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ వింతప్రవర్తన వివాదాస్పదంగా మారింది. మహిళా ఉద్యోగిని లోబరుచుకునేందుకు విందు ఏర్పాటు చేశారని స్థానికంగా విమర్శలున్నాయి. తొలుత ఫోన్లో ఆమెను లోబర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో విందు భోజనం పేరుతో ఉద్యోగులందరినీ ఆయన ఇంటికి పిలిచారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులను విందుకు ఆహ్వానించారని సమాచారం. ఈ తతంగం నచ్చని ఓ మహిళా ఉద్యోగి మీడియాకు సమాచారం ఇచ్చారు. అక్కడికి మీడియా వెళ్ళడంతో కమిషనర్ పరార్ అయ్యారు. ఇటీవలనే మున్సిపాలిటిగా ఏర్పడిన చొప్పదండికి కమిషనర్గా 15రోజుల క్రితం హైదరాబాద్ నుంచి నిత్యానంద్ బదిలీపై వచ్చారు. అప్పటి నుంచే మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ క్రింద పనిచేసే మహిళా ఉద్యోగులపై కన్నేశాడని సమాచారం. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగినిలకు గిఫ్ట్లు ఇచ్చేవారని తెలుస్తోంది. ఆ గిఫ్ట్లను నిరాకరిస్తే పలు రకాలుగా వేధించేవారని విమర్శలున్నాయి. నిత్యానంద్ మహిళలను టార్గెట్ గా చేసుకొని వింతగా ప్రవర్తిస్తున్నారని విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వివాదాస్పదంగా చొప్పదండి మునిసిపల్ కమిషన్ తీరు
-
తెలుగు అమలుపై నిర్లక్ష్యమేల?
చిత్తూరు కలెక్టరేట్ : నగరాల్లోని దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండేలా అమలుచేయాలని మాతృభాషా దినోత్సవం రోజున ఆదేశిస్తే ఇప్పటివరకు ఎందుకు ఆచరించలేదని మునిసిపల్ కమిషనర్లపై కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో మునిసిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ నగరాల్లో తెలుగులో దుకాణాల బోర్డులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మునిసిపాలిటీ పోస్టర్ ఫ్రీ (పోస్టర్లు ఉండని) సిటీగా తయారయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వీధి విక్రయదారులను గుర్తించి వారికి గుర్తింపుకార్డులను అందజేసి సంఘాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 20న వీధి విక్రయదారులకు రుణమేళా నిర్వహించి రూ.5కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. స్వైన్ఫ్లూ నివారణకు రెండు రోజుల్లోగా ఇంటింటికీ హోమియో మం దులు పంపి ణీ చేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించండి నగరాల్లో మాఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించేలా కమిషనర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఖాళీ స్థలాల్లో కూరగాయల తోటలు పెంచుకునే విధంగా నగర ప్రజల ను ప్రోత్సహించాలన్నారు. ఇంటికూరగాయల్లో 70 శాతం పోషకాలుంటాయనే విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మలనాడు గిద్దలు సంప్రదాయ ఆవులని, అవి కర్ణాటక లోని షిమోగా ప్రాంతానివని చెప్పారు. ఆవు ధర రూ.18 వేలని, పాలు రోజుకు 2 నుంచి 3 లీటర్లు ఇస్తాయని తెలిపారు. ఈ పాలు చాలా ఆరోగ్యవంతమైనవని, రోగనిరోధకమని చె ప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతిలో పేదల కోసం నిర్మించిన గృహాలకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపికచేయాలన్నా రు. జిల్లాలో రాత్రి బస గృహాలు మదనపల్లెలో ఈ నెల 20కి, శ్రీకాళహస్తిలో ఈ నెల 12న, నగరి, చిత్తూరులో ఈనెలాఖరుకు పనులు పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. జేసీ–2 చంద్రమౌళి, చిత్తూ రు నగర కమిషనర్ ఓబులేసు, తిరుపతి నగర పాల క డెప్యూటీ కమిషనర్ పణిరామ్, శ్రీకాళహస్తి, పుంగనూరు మునిపల్ కమిషనర్లు రమేష్బాబు, వర్మ, మెప్మా పీడీ జ్యోతి, మెప్మా సిటీ మిషన్ మేనేజర్లు గోపి, మధుసూదన్రెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు. -
మున్సిపల్లో కౌన్సిలర్ వీరంగం
సాక్షి, నిర్మల్: సమాచారం ఇవ్వకుండా ఓ దుకాణాన్ని తొలగించారంటూ నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ అలీమ్ సోమవారం వీరంగం సృష్టించారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని మౌసిన్ అనే వ్యక్తికి సంబంధించిన దుకాణాన్ని సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ అలీమ్ టీపీఎస్ ఉదయ్కుమార్తో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఆయన టేబు ల్పైన ఉన్న కంప్యూటర్ను కింద పడేశారు. అనంతరం బయట గదిలో సిబ్బంది ఉపయోగిస్తున్న కంప్యూటర్నూ కింద పడేశారు. దీంతో రెండు కంప్యూటర్లూ దెబ్బతిన్నట్లు సిబ్బంది తెలిపారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా.. ఇటీవల జిల్లాకేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈక్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. బైల్బజార్ నుంచి కంచెరోని చెరువు వరకు ఉన్న ఫుట్పాత్ దుకాణాలను, తోపుడు బండ్లను తీయించేస్తున్నారు. ఎన్టీఆర్ మినీస్టేడియం వద్ద ఉన్న ఆక్రమణలను ఇటీవల తొలగించి, రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. దీనిపై స్థానిక వ్యాపారులు హైకోర్టుకు వెళ్లారు. సదరు స్థలంలో ఎలాంటి పనులు చేపట్టకుండా యథాస్థితిని కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధం లేకుండా శనివారం రాత్రి వ్యాపారులు మళ్లీ తమ దుకాణాలను అదే స్థలంలో వేసుకున్నారు. కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినా మళ్లీ దుకాణాలను పెట్టుకోవడంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం ఆక్రమణలను తొలగించి, చెట్లను నాటారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా బస్టాండ్ ఇన్గేట్ పక్కనే ఖాళీగా ఉన్న టేలాను మున్సిపల్ సిబ్బంది తీసేశారు. తనకు సంబంధించిన వ్యక్తి టేలాను తొలగించడంతో కౌన్సిలర్ అలీమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంప్యూటర్లను ధ్వంసం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు. జరిగిన ఘటనపై టీపీఎస్ ఉదయ్కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి కౌన్సిలర్ అలీమ్ను తీసుకెళ్లారు. అనంతరం ఇన్చార్జి కమిషనర్ సంతోష్ ధ్వంసమైన కంప్యూటర్లను పరిశీలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
అన్న క్యాంటీన్లో ఉద్రిక్తత
-
అన్న క్యాంటీన్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, ఎమ్మిగనూరు : అన్నక్యాంటీన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సామాన్య ప్రజలపై మున్సిపల్ కమిషనర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం రావడంతో సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయ్యారు. దీంతో కమిషనర్ వచ్చిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. భోజనం చేయడానికి వచ్చిన వారిపై మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి చేయి చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరును జనం తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అన్న క్యాంటీన్లను ప్రారంభించి విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నక్యాంటీన్ వద్ద మున్సిపల్ కమిషనర్ దౌర్జన్యం
-
నేను తలచుకుంటే.. నువ్వు, నీ అమ్మ ఉండరు: జేసీ
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుత్తిలో హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో పర్యటించిన ఆయన గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ దుర్భాషలాడుతూ శీనుని జేసీ బెదిరించారు. అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారేమోనని గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆస్తులకూ ఆధార్
సాక్షి,ఆదిలాబాద్: ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చిన దానికి లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ప్రతీ దానికి ఆధార్ను అనుసంధానం చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ఆస్తులకూ ఆధార్ తప్పనిసరి చేసింది. గతంలోనే ఈ ప్రక్రియ ప్రారంభించినా మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో రెండు రోజుల క్రితం దీనిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీడీఎంఏ శ్రీదేవి పన్ను చెల్లించే ప్రతీ ఆస్తికి ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ఆదేశించారు. బల్దియాలో ఆస్తులకు ఆధార్ అనుసంధానం చేయాలని ఏడాది కిందటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గతేడాది జూన్లో ఈ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యలోనే ఈ కార్యక్రమం ఆగిపోయింది. మొదట్లో ఇంటింటి సర్వే నిర్వహించిన అధికారులు ఇతర పన్నుల వసూళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ లక్ష్యం నెరవేరలేదు. బల్దియాలో 9 వేలు పూర్తి.. జిల్లాలో ఆదిలాబాద్ ఒక్కటే మున్సిపాలిటీ ఉంది. ఆదిలాబాద్ బల్దియాలో 36 వార్డులు ఉన్నాయి. 2011 జనాభాల లెక్కల ప్రకారం 1.17 లక్షల జనాభా ఉంది. 20.65 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మొత్తం 26 వేల ఆస్తులు ఉన్నాయి. గతేడాది ప్రారంభించిన ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియలో ఇప్పటి వరకు 9 వేల ఆస్తులకు ఆధార్ పూర్తి చేశారు. సీడీఎంఏ ఆదేశాలతో ఈ ఆధార్ నమోదు కసరత్తు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపాదికన క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా 8 బృందాలతో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. ఆస్తి పన్నుకు ఆధార్తో పాటు సెల్ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు. దీని ద్వారా బల్దియా అధికారులకు పన్నుకు సంబంధించిన ఏదైనా సమాచారం అవసరం ఉంటే నేరుగా వారికే ఫోన్ చేసి తెలుసుకునే వెసులు బాటు ఉంటుంది. అక్రమాలకు అడ్డుకట్ట.. బల్దియాలో ఆస్తిపన్నును ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సెల్ఫోన్ నెంబర్లు సైతం తీసుకుంటుండడంతో ఏదైనా సమాచారాన్ని వెంటనే యజమానికి చేరవేసేలా వీలు కలుగుతుంది. పన్నుల మదింపు సమయంలో వ్యత్యాసాలను గుర్తించేందుకు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టవచ్చు. సదరు యజమానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఎవరి పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీని ద్వారా అక్రమంగా సంపాధించిన ఆస్తులు బయట పడే అవకాశం ఉంటుంది. అనుంధానం కొనసాగుతోంది.. ఆదిలాబాద్లో ఆస్తులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 వేలు పూర్తిచేయడం జరిగింది. ఈ నెలాఖరులో మొత్తం ఆస్తులకు అనుసంధానం చేస్తాం. ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఆధార్తోపాటు సెల్ఫోన్ నెంబర్లు అనుసంధానించాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఇది పారదర్శకంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ -
అంతఃకరణ శుద్ధితో పనిచేయండి
తిరుపతి తుడా: నా తిరుపతి.. నా పని.. అని ఇష్టం తో కష్టం లేకుండా ప్రతి ఉద్యోగి అంతఃకరణశుద్ధితో పనిచేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్ వీ. విజయరామరాజు సూచించారు. కార్పొరేషన్ కమిషనర్గా, తుడా వీసీగా శనివారం ఆయన ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ కే.మాధవీలత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన వివిధ శాఖల విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన కమిషనర్ మాట్లాడుతూ తన పాలనలో పనిచేసేవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉద్యోగులకు కొలమానం చిత్తశుద్ధితో పనిచేయడమేనన్నారు. అవినీతి, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఉద్యోగులకు అంతర్గతంగా టెలిగ్రామ్ యాప్ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులుంటే తనను నేరుగా కలిసి చెప్పుకోవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి, శానిటేషన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సీనియర్ సిటీజన్లను సమన్వయపరుచుకుని స్మార్ట్సిటీ అభివృద్ధిని వేగవంతం చేస్తానని చెప్పారు. తుడా మాస్టర్ ప్లాన్పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. తుడా సెక్రటరీ మాధవీలత, ఈఈ ప్రభాకర్రెడ్డి, పీఓ కృష్ణారెడ్డి, ఏఓ హరినాథరెడ్డి, వీసీ పీఎస్ వెంకట్æరెడ్డి పాల్గొన్నారు. -
సాగనంపేందుకేనా..!
ప్రొద్దుటూరు టౌన్: అధికారులు అవినీతికి పాల్పడితే నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించవచ్చు. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇదీ సాధారణ పద్ధతి. అయితే ఇందుకు భిన్నంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను ఇక్కడి నుంచి సాగనంపాలనే ఉద్దేశంతో కరపత్రాలు వేసి కొత్త సంస్కృతికి అధికారపార్టీ వారు తెరతీశారు. కొద్దిరోజుల కిందట ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను బదిలీపై వెళ్లాలని అధికారపార్టీ నేతలు హెచ్చరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, మీకు ఇష్టం లేకపోతే బదిలీ చేయించుకోమని కమిషనర్ ఆ నేతలకు చెప్పినట్లు తెలిసింది. తాను మాత్రం బదిలీపై వెళ్లనని, సెలవుపెట్టనని చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం అధికారపార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పైస్థాయిలో కమిషనర్కు పట్టు ఉండటంతో అధికారపార్టీ నేతల మాటలు చెల్లుబాటు కాలేదు. ఈ కారణంగానే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డికి ముఖ్య అనుచరుడైన మాజీ కౌన్సిలర్ ఎర్రన్న మున్సిపల్ కమిషనర్ అవినీతికి పాల్పడ్డారని కరపత్రాలు వేసి పంచిపెట్టారు. ఒక దళిత అధికారిపై మరో దళిత నాయకుడు కరపత్రాలు వేయడం గమనార్హం. ఎలాగైనా మున్సిపల్ కమిషనర్ను సాగనంపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పడటం విడ్డూరంగా ఉందని పట్టణంలో చర్చ నడుస్తోంది. పింఛన్లే ముఖ్య కారణమా! మార్చి నెలకు సంబంధించి మిగతా మున్సి పాలిటీల్లోలాగే ప్రొద్దుటూరుకు 1000 పింఛన్లు మంజూరయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని 40వార్డులకుగానూ 18 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నిక కాగా కొందరు పార్టీ మారడంతో ప్రస్తుతం 9మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. ఈ లెక్కన పూర్తి అర్హులైన 130 మందికి పింఛన్లు ఇవ్వాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం వీరికి పింఛన్ ఇవ్వాల్సిందేనని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమిషనర్ టీడీపీకి చెందిన 870తోపాటు, వైఎస్సార్సీపీకి చెందిన 130మందితో పింఛన్ల నివేదిక పంపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పలుమార్లు జిల్లా అధికారులతో చర్చించారు. ఇది అధికారపార్టీ నేతలకు నచ్చలేదు. కమిషనర్ వాస్తవ పరిస్థితిని ఎంత వివరించినా ఆయన మాట వినకుండా ఆయనను బదిలీ చేయించాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ సూచించిన వారి పేర్లను పింఛన్ల జాబితాలో చేర్చారని అధికారపార్టీ నేతలు జిల్లా స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయగా, ప్రొద్దుటూరులో మాత్రం పెండింగ్లో పడ్డాయి. ఈ కథ ఎప్పుడు కంచికి చేరుతుందో చెప్పలేం. ముగ్గురు కమిషనర్లు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో నాలుగేళ్లకు ముగ్గురు కమిషనర్లు మారారు. çకమిషనర్లు సంక్రాంతి వెంకటకృష్ణ, ప్రమోద్కుమార్, వెంకటశివారెడ్డి బదిలీపై వెళ్లగా ఎంఈ సురేంద్రబాబును కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం నాలుగో కమిషనర్గా బండి శేషన్న పనిచేస్తున్నారు. ఈ బదిలీల ప్రభావంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ విధంగా టీడీపీ నేత తన మాట వినని అధికారులను పరోక్షంగా వేధించడాన్ని అధికారపార్టీలోని మరో వర్గం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. -
ఇన్చార్జిగానే మున్సిపల్ కమిషనర్!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ : గతంలో పని చేసిన మున్సిపల్ కమిషనర్ భూక్యా దేవ్సింగ్ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన అనంతరం ఆ స్థానంలో నియమించిన ఫారెస్టు సెటిల్మెంట్ డిప్యూటీ కలెక్టర్ బి.రాంచందర్ ఇన్చార్జిగా మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ముఖ్యమైన వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రజల పెండింగ్ ఫిర్యాదులు, వినతి పత్రాలపై సరై న నిర్ణయం తీసుకోవడం, వివిధ పద్దుల కింద బిల్లులు, ఇతర చెల్లింపులు చేసే అధికారం ఇన్చార్జి కమిషనర్కు లేకపోవడంతో పలుఇబ్బందులు ఏర్ప డుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో జనవరి వేతనాలు అందక పారిశు ద్ధ్య సిబ్బంది, కాంట్రాక్టు వర్కర్లు ఇబ్బందిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలురావడం తగ్గింది.కౌన్సిలర్లు సైతం రావడానికి నిరాసక్తిగా ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు రావడంలేదని పలువురు కాంట్రాక్టర్లు ఆం దోళన చెందుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే మున్సి పల్ కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తున్నది. ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడని అధికారులు ఎప్పుడూ వివాదాలకు నెలవుగా ఉంటుందన్న భావనతో మహబూబ్నగర్ మున్సిపాలిటీకి కమిషనర్గా రావడానికి అధికారులు ఇష్టపడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ లేదా మున్సిపల్ ఇంజనీర్లకు కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇన్చార్జి కమిషనర్ను నియమించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. -
నగరాభివృద్ధికి ‘నుడా’
వినాయక్నగర్(నిజామాబాద్అర్బన్): నిజామాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ నగరాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నుడా పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు చుట్టుపక్కల ఉన్న మొత్తం 61 గ్రామాలు ఉంటాయి. నుడా ఏర్పాటుకు మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు (జీఓనెం.271) జారీ అయ్యాయి. నుడాకు పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నగరంతో పాటు నగర పరిసర గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో నగర మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్ను ‘సాక్షి’ ఇంటర్వూ్య చేసింది. నుడా ఏర్పాటుతో అభివృద్ధి ఎలా ఉండబోతోంది? కమిషనర్ : నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో నగరంతో పాటు నిజామాబాద్ చుట్టు పక్కల ఉన్న 61 గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అందాల్సి ఉంది. నుడా ఏర్పాటుతో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధితో పాటు ఆయా గ్రామాల్లో భూముల ధరలు పెరిగుతాయి. నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటాయి. నగరాభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టబోయే పనులు ఎలా పూర్తి చేస్తారు? కమిషనర్ : నగరాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ప్రాధాన్యత క్రమంలో వినియోగిస్తాం. తొలుత రోడ్లు, అంతర్గత రోడ్ల పనులు చేపడతాం. తర్వాత డ్రెయిన్ల పనులు, అహ్మదీ బజార్ మాంస విక్రయ భవన సముదాయాల పనులు చేపడతాం. నిర్ణీత సమయంలో పనులు చేపట్టేందుకు అధికారులను సమన్వయ పరుస్తాం. పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు? కమిషనర్ : పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చడానికి సిబ్బంది గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందికి పూర్తి స్థాయిలో సేఫ్టీ మెటీరియల్ అందుబాటులో లేదు. పారిశుధ్య పరికరాలు, యూనిఫాం, షూస్, సేఫ్టీ మెటీరియల్ అందించడంపై దృష్టి సారిస్తున్నాం. సిబ్బంది సహకారంతో శానిటేషన్ మెరుగుపరుస్తాం. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉందా? కమిషనర్ : నగర పాలక సంస్థలో సిబ్బంది కొరత లేదు. మున్సిపాలిటీలో మొత్తం 720 మంది సిబ్బంది ఉన్నారు. వీరితో ప్రస్తుతం సేవలను కొనసాగిస్తున్నాం. అవసరమనుకుంటే సిబ్బందిని నియమిస్తాం. చెత్త సేకరణ వాహనాల కొరత ఉందా? కమిషనర్ : చెత్త సేకరణ వాహనాల కొనుగోలుకు రూ.8కోట్లు మంజూరయ్యాయి. చెత్త సేకరణకు అవసరమైన వాహనాల జాబితాను ప్రభుత్వానికి పంపించి కొనుగోలు చేస్తాం. పబ్లిక్ హెల్త్ శాఖకు బాధ్యతలు అప్పగించాం. శానిటరీ సిబ్బందిపై కొరడా ఝులిపిస్తున్నారు.. వేరే శాఖల అధికారులు బయోమెట్రిక్ చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి? కమిషనర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు క్రమశిక్షణ అతిక్రమించినా చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారైనా సక్రమంగా విధులు నిర్వర్తించాల్సిందే. బయోమెట్రిక్ చేసి విధుల్లో నుంచి వెళ్తే ఉపేక్షించం. అలాంటి వారిపై పకడ్బందీ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తాం. యూజీడీ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? కమిషనర్ : యూజీడీ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. పనుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు నగరాభివృద్ధికి సహకరించాలి. -
మిగులు సొమ్ము మింగేశారు
♦ పింఛన్ల డబ్బులు కాజేసిన మున్సిపల్ కమిషనర్ ♦ నిలదీసిన కౌన్సిలర్లకు సమాధానం చెప్పలేక పరుగులు ♦ మున్సిపల్ సమావేశ మందిరంలో గందరగోళం కాశీబుగ్గ: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందించే పింఛన్ల సొమ్ములో అవినీతి జరిగింది. మున్సిపల్ కమిషనరే పింఛన్ల సొమ్మును కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయట పడడంతో లెక్కలు చెప్పాల్సిన కమిషనర్ పరుగులు పెట్టారు. నిండు సమావేశంలో లెక్కలు చెప్పాల్సి రావడంతో చెప్పలేక అక్కడ నుంచి జారుకున్నారు. ఉద్యోగులు, కౌన్సిలర్లు ఉండమంటున్న ఉండకుండా కమిషనర్ సమావేశ మందిరం నుంచి తలుపుతీసి పరుగున వెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అధ్యక్షతన ఉద్యోగుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పింఛన్ల పంపిణీపై జరిగిన చర్చలో మున్సిపల్ కమిషనర్ పిల్ల జగన్మోహన్రావు అవినీతి భాగోతం బయటపడింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పలాస మున్సిపాలిటీ పరిధిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 2701 మందికి జూన్లో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే సుమారు 450 మందికి పింఛన్లు పంపిణీ చేయలేదు. ఇందులో 262 మందికి వేలుముద్రలు పడలేదు. ఈ తరుణంలో రూ. 46.39 లక్షలకు, రూ. 1.39 లక్షలు విత్డ్రా చేయలేదు. మిగిలిన నిధులు డ్రాచేశారు. దీంతో పాటుగా ఈ ఏడాది ఏప్రిల్లో వీఆర్ఏ శారద పింఛన్లు పంపిణీ చేసి రూ. 15 వేలు మిగులు పింఛన్ డబ్బులను కమిషనర్ సమక్షంలో జగ్గం శ్రీనుకు అప్పగించగా, మహేష్కు రూ. 5 వేలు ఇవ్వమని కమిషనర్ తెలిపారు. ఇంకో పింఛన్ పంపిణీదారురాలు మోనీస నుంచి రూ. 5 వేలు కమిషనర్ తీసుకున్నారు. అలాగే మెప్మా విభాగం కో–ఆర్డినేటర్ స్వప్న రూ. 30 వేలు మిగులు పింఛన్ సొమ్మును కమిషనర్కు అందజేశారు. ఇలా మొత్తం రూ. 50 వేలు మిగులు పింఛన్ డబ్బులు బ్యాంకులో వేసినట్టు చెప్పి, రూ. 25 వేలకు సంబంధించిన రశీదు మాత్రమే చూపిస్తున్నారు. మిగిలిన రూ. 25 వేలు ఏమయ్యాయని ఉద్యోగులు, కౌన్సిలర్లు సమావేశంలో కమిషనర్ను నిలదీయగా రెవెన్యూ సిబ్బంది జగ్గం శ్రీనుకు అందజేశానని తెలిపారు. జగ్గం శ్రీను వెంటనే లేచి నాకు ఇవ్వలేదని, ఇది పచ్చి అబద్ధమని తెలపడంతో కమిషనర్ మాటమార్చి మెప్మా సీవో స్వప్నకు అందజేశానన్నారు. మెప్మా సీవో స్వప్న వెంటనే లేచి నాకు ఇవ్వలేదని, నా పేరు అనవసరంగా చెబుతున్నారని, మిగులు పింఛన్ డబ్బులు నేనెప్పుడో చెల్లించానని ఆమె తెలిపింది. దీంతో చేసేది లేక, రూ. 25 వేలుకు లెక్కలు చెప్పలేక అక్కడున్న డైరీలు, పుస్తకాలు పట్టుకొని కమిషనర్ సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, కౌన్సిలర్ పాతాళ ముకుందరావు, కౌన్సిలర్ ప్రతినిధులు బడగల బాలచంద్రుడు, బళ్ల శ్రీనివాసరావు, బుల్లు ప్రధాన్, కోఆప్సన్ సభ్యులు భానుమూర్తి, కౌన్సిలర్ చంద్రవతి వెళ్లవద్దని కమిషనర్ను కోరుతున్నప్పటికీ సభ మధ్యలో సభ్యులను తిరస్కరించి తలుపు తీసి పరుగులు తీశారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 2.40 లక్షలు మిగులు పింఛన్ డబ్బులు తిరిగి జమ కాలేదని, పింఛన్లు అందక 25వ వార్డు నుంచి 26 మంది వితంతు, వికలాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు సభలో ప్రస్తావించారు. -
మున్సిపల్ కమిషనర్పై టీడీపీ నాయకుల దాడి!
► చొక్కా చించి.. ముఖం వాచేలా కొట్టారంటూ కమిషనర్ ఆవేదన ► చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లపై పోలీసులకు ఫిర్యాదు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ పి.జగన్మోహనరావుపై చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. చొక్కా చించి, ముఖం వాచేలా పిడిగుద్దులు గుద్దారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ జగన్మోహనరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొన్ని పనులకు సంబంధించి బిల్లుల ఫైళ్లపై సంతకాలు చేయాలని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, 18వ వార్డు కౌన్సిలర్ పాతాళ ముకుంద, 12వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి బల్లా శ్రీనివాస్లు కమిషనర్పై ఒత్తిడి చేశారు. అయితే, ఆ పనులకు సంబంధించి బిల్లులు సక్రమంగా లేకపోవడంతో కమిషనర్ నిరాకరించారు. బుధవారం రాత్రి కమిషనర్.. మున్సిపల్ కార్యాలయంలోని డీఈ చిరంజీవులు గదిలో ఉండగా చైర్మన్తోపాటు, ముకుంద, శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. సంతకాలు చేయాలని బలవంతం చేస్తూ, కమిషనర్పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో తన షర్టు చింపి, ముఖంపై పిడుగుద్దులు గుద్దారని కమిషనర్ జగన్మోహనరావు వాపోయారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స పొందారు. తనపై దాడి జరిగిందంటూ సీఐ అశోక్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే శివాజీ చేయించారేమో.. : చైర్మన్ ఇదే విషయమై మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావును వివరణ కోరగా.. ఎమ్మెల్యే టికెట్ తనకిచ్చేస్తారని ఆందోళనతో స్థానిక ఎమ్మెల్యే శివాజీ ఇదంతా చేయించారని ఆరోపించారు. తనకేమీ తెలియదని చెప్పారు. -
టీడీపీ కౌన్సిలర్లపై ఫిర్యాదు
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా శనివారం కౌన్సిల్ హాల్లో జరిగిన విధ్వంసంపై మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్కు వచ్చిన 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, 31వ వార్డు కౌన్సిలర్ గణేష్బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జబీవుల్లా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్లోకి వచ్చి వీరు టేబుళ్లను, కుర్చీలను పగులగొట్టారని వివరించారు. తలారి పుల్లయ్య కౌన్సిల్ మినిట్స్ పుస్తకాన్ని ఎన్నికల అధికారి టేబుల్ పైనుంచి తీసుకుని దానిని చించే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకుని మున్సిపల్ కమిషనర్కు అప్పగించారని తెలిపారు. ఇందులో కొన్ని పేజీలు చినిగిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి, జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. వీరి వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని తెలిపారు. ఆదివారం జరిగే చైర్మన్ ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదును డీఎంఏ, ఆర్డీ, ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారులకు పంపారు. -
పన్నులు చెల్లిస్తారా? జప్తు చేయమంటారా?
స్కిట్ కళాశాల బకాయిలపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాళహస్తి: స్కిట్ కళాశాల యజమాన్యం 2011 నుంచి రూ.60లక్షల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని..నోటీసులిచ్చినా పట్టించుకోవడంలేదని మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డికి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డితో పన్నుల బకాయిలపై చర్చించారు. పన్ను చెల్లించకపోతే కళాశాలను సైతం జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్ 2013 నుంచి మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉందని, అది కూడా రూ.26లక్షల లోపే ఉందని సమాధానమిచ్చారు. ఏప్రిల్ 1వతేదీలోపు బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు. మరో తలపోటుగా పన్నుల భారం స్కిట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు. మొన్నటి వరకు స్కిట్ను అనంతపురం జేఎన్టీయూకి, కర్ణాటకలోని మఠాలకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో లీజుపై స్కిట్ యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఈనేపథ్యంలో మున్సిపాలిటి పన్నుల భారం కళాశాల యాజమాన్యానికి మరో తలపోటుగా పరిణమించింది. -
పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు
నలుగురిని హైదరాబాద్కు తరలింపు తాండూరు టౌన్: తాండూరులో ఆదివారం పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 22 మందిపై దాడి చేసి గాయపర్చాయి. స్థానికులు కుక్కలను తరిమేందుకు యత్నించగా వారినీ వదలలేదు. ఒక మహిళ వేసుకున్న స్వెట్టర్ను పట్టుకుని రోడ్డుపై లాక్కుంటూ కొద్దిదూరం వరకు తీసుకెళ్లాయి. గాయపడిన వారిని తాండూరు ఆస్పత్రిలో చేర్పించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సంతోష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. అయితే, తాండూరులోని వంతెన సమీపంలో కొందరు వేస్తున్న జంతు కళేబరాలను తిన్న కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
ఇదే చివరి అవకాశం...
- అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగిస్తాం - మునిసిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ హెచ్చరిక - శిథిల భవనాలు కూలితే కమిషనర్లదే బాధ్యత సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కమిషనర్ల పనితీరుపై పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పినా కొంత మంది విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వారిపై వారంలోగా చర్యలుంటాయన్నారు. ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగించడం ఖాయమన్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న వారి జాబితాను తయారు చేసి తనకు పంపించాలని పురపాలక శాఖ డెరైక్టర్ దానకిశోర్ను మంత్రి ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల మునిసిపల్ కమిషనర్లతో సోమవారం సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో శిథిల భవనాలను వెంటనే గుర్తించి, కూల్చేయాలని గతంలో పలు మార్లు ఆదేశించినా మునిసిపల్ కమిషనర్లు దాన్ని అమలు చేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. శిథిల భవనాలను తక్షణమే కూల్చేయాలని, వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ భవనాలు పడిపోయి ప్రాణనష్టం జరిగితే కమిషనర్లనే బాధ్యులను చేస్తామని హెచ్చ రించారు. కమిషనర్లందరూ ఉదయాన్నే విధుల్లో ఉండాలన్నారు. ఇకపై నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తానన్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, డెరైక్టర్ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేయండి... ‘నగరాలు, పట్టణాల్లో వరదలకు దారితీస్తున్న కారణాలను గుర్తించాలి. ప్రతి మునిసిపాలిటీ పరిధిలో జల వనరులు, చెరువుల వివరాలను డిజిటలైజ్ చేయాలి. అన్ని చెరువులు, నాలాల మ్యాపులను సిద్ధం చేసుకోండి. వీటిపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేయండి. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు’ అని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కూల్చివేతల్లో పేదవారినే టార్గెట్ చేయకుండా ముందుగా కమర్షియల్ అవసరాల కోసం కట్టిన కట్టడాలను కూల్చేయాలన్నారు. ఇరుకుగా మారిన నాలాలను వెడల్పు చేయాలన్నారు. ఈ పనుల కోసం రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జారుుంట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల అనంతరం ఆరోగ్య సమస్యలు రాకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాడైన రోడ్లకు మరమ్మతులు, ఇతర మౌలిక వసతులు వెంటనే కల్పించాలన్నారు. ఒకటి నుంచి నీటి మీటర్ లేకుంటే రెట్టింపు బిల్లు గ్రేటర్లోని గృహ, వాణిజ్య నల్లా కనెక్షన్లకు నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోని పక్షంలో అక్టోబర్ ఒకటి నుంచి రెట్టింపు బిల్లులు వసూలు చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ జలమండలిని ఆదేశించారు. మహానగరంలో మొత్తం 8.75 లక్షల నల్లా కనెక్షన్లకు గాను సుమారు 5 లక్షల నల్లాలకు మీటర్లు లేనందున బోర్డు ఆదాయానికి భారీగా గండి పడుతుండడంతో ఈ నిర్ణయం అమలు చేయాలని సూచిం చారు. సోమవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన సందర్భంగా జలమండలి పథకాలను ఆయన సమీక్షించారు. నగరంలో దెబ్బతిన్న, పురాతన పైపులైన్ల నాణ్యత, మన్నికపై నిపుణుల కమిటీతో తక్షణం అధ్యయనం చేయాలన్నారు. పదేళ్లకు పైబడిన పైపులైన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు కెమెరా ఆధారిత సెన్సర్లను ఏర్పాటు చేయాలన్నారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడం ద్వారా బోర్డు ఆదాయం నెలకు వంద కోట్ల మేర సాధించాలని ఆదేశించారు. నగరంలోని 4 లక్షల మ్యాన్హోళ్లను జియోట్యాగింగ్ చేయాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.