ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంపీపీల ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టలేకపోయింది. కాంగ్రెస్ ఒక్క ఎంపీపీని కూడా గెల్చుకోలేకపోయింది. కాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని జైసమైక్యాంధ్ర పార్టీ మాత్రం రెండు ఎంపీపీలను సొంతం చేసుకున్నారు. ఇక అధికార తెలుగుదేశం పార్టీ జోరు సాగింది. కొన్ని జిల్లాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడంద. ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల టీడీపీ కార్యాకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. జిల్లాల వారీగా ఫలితాలు..
అనంతపురం: మొత్తం ఎంపీపీలు 63
టీడీపీ-53,
వైఎస్ఆర్ సీపీ -10
కర్నూలు: 52
వైఎస్ఆర్ సీపీ-24,
టీడీపీ-27,
స్వతంత్ర-1
కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా
శ్రీకాకుళం: 38
వైఎస్ఆర్సీపీ-12,
టీడీపీ-26!
విజయనగరం: 34
టీడీపీ-27,
వైఎస్ఆర్సీపీ-6
గంటాడ ఎంపీపీ ఎన్నిక వాయిదా
చిత్తూరు: 65
వైఎస్ఆర్ సీపీ-23,
టీడీపీ-36,
జేఎస్పీ -2,
స్వతంత్ర-3
ఎర్రవారిపాళ్యం ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా
నెల్లూరు: 46
వైఎస్ఆర్ సీపీ-29,
టీడీపీ-15
కొండాపురం, సూళ్లూరుపేట ఎన్నిక రేపటికి వాయిదా