తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం దొరబాబు అస్వస్థతకు గురయ్యారు.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం దొరబాబు అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేస్తూ దొరబాబు సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే కాకినాడ సేఫ్ ఆస్పత్రికి తరలించారు.