హైదరాబాద్: ఇంటి ముందు పూలు కోస్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురం పరిధి, హైకోర్టు కాలనీలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన జయమ్మ ఇంటి ముందు పూలు కోస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైకోర్టు కాలనీలో చైన్ స్నాచింగ్
Published Sat, Oct 3 2015 9:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement