ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు త్వరలోనే పెరగనున్నాయి. ప్రస్తుతం రూ. 95 వేల వరకు ఉన్న జీతం దాదాపు రూ. 1.50 లక్షల వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హెచ్ఆర్ఏ రూ. 50 వేలకు, కారు రుణం రూ. 40 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.