salary hike
-
ఈ ఏడాది సగటున వేతన పెంపు ఎంతంటే..
దేశంలో 2025 ఏడాదిలో ఉద్యోగుల జీతాలు సగటున 9.2 శాతం పెరగనున్నాయని ఏఓఎన్ తాజా నివేదికలో వెల్లడించింది. 2024లో కనిపించిన 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే 2025లో వేతనాల పెంపు స్వల్పంగా క్షీణిస్తుందని నివేదిక తెలిపింది. ఇందుకు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మందగమనం ప్రధాన కారణాలని విశ్లేషించింది.రంగాల వారీగా ఇంక్రిమెంట్లురంగాల వారీగా వేతనాల పెంపులో మార్పులు వస్తున్నాయి. నివేదిక ప్రకారం కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు అధిక వేతన పెంపు ఉంటుంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమోటివ్, వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో అత్యధికంగా 10.2 శాతం వేతన పెంపు ఉంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), రిటైల్ వంటి ఇతర రంగాల్లోనూ గణనీయమైన వేతన పెరుగుదలను చూడవచ్చని భావిస్తున్నారు.ఆర్థిక స్థిరత్వంఅంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థిక అవకాశాలు నిలకడగానే ఉన్నాయి. గ్రామీణ గిరాకీ మెరుగవుతోంది. ప్రైవేటు వినియోగం ఊపందుకుంటోంది. ఈ స్థిరత్వం ఉద్యోగులకు సానుకూల సంకేతంగా భావించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన వృద్ధి పథాన్ని సూచిస్తుంది. 2022లో గరిష్టంగా 21.4 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు(ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారడం) 2024 నాటికి 17.7 శాతానికి పడిపోయింది. టాలెంట్ పూల్ స్థిరపడడాన్ని ఇది సూచిస్తుంది.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’రంగాల వారీగా గతేడాదితో పోలిస్తే వేతనాల్లో వ్యత్యాసం ఇలా..(శాతాల్లో)రంగాలు 2024 2025ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్ 10.1 10.2ఆటోమోటివ్ 10.7 10.2ఎన్బీఎఫ్సీ 10.1 10రిటైల్ 9.6 9.8గ్లోబల్ కేపబులిటీ సెంటర్ 9.4 9.7ఇంజినీరింగ్/మ్యానుఫ్యాక్చరింగ్ 9.7 9.7ఫండ్స్/ అసెట్ మేనేజ్మెంట్ 10 9.7ఫ్రొఫెషనల్ సర్వీసెస్ 8.9 9.5లైప్ సైన్సెస్ 9.5 9.5టెక్నాలజీ ప్లాట్ఫామ్ 9.5 9.4 -
నాడు డబుల్.. నేడు సింగిల్! తేలికవుతున్న ఐటీ జీతాలు
కొవిడ్-19 మహమ్మారికి ముందు టాప్ ఐటీ సంస్థల్లో వేతన ఇంక్రిమెంట్లు రెండంకెలమేర వృద్ధి చెందేవి. కానీ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో వేతన పెరుగుదల శాతం సింగిల్ డిజిట్కు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా పేరున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరానికి వార్షిక వేతన పెంపును అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. నివేదికల ప్రకారం వేతన పెంపు 4% నుంచి 8% వరకు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగుల సవరించిన వేతనాన్ని ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. ఈ మేరకు త్వరలో వారికి లేఖలు అందుతాయని కొందరు అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులోగా ఉద్యోగులకు వేతన సవరణలకు సంబంధించిన లేఖలు జారీ చేయాలని మరో టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. పెరుగుదలను ప్రభావితం చేసే అంశాలుటీసీఎస్ జీతాల పెంపు, వేరియబుల్ చెల్లింపులను 2024 ప్రారంభంలో ప్రకటించిన రిటర్న్-టు-ఆఫీస్ (ఆర్టీఓ) ఆదేశానికి ఉద్యోగులు కట్టుబడి ఉండటానికి ముడిపెట్టింది. దానిప్రకారం ఆర్టీఓ పాలసీని పాటించిన ఉద్యోగులకు అధిక ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. టీసీఎస్ ఏకీకృత నికర లాభంలో 11.95% పెరుగుదలను నివేదించినప్పటికీ మొత్తంగా స్వల్ప వేతన పెంపు మాత్రమే ఉందనే వాదనలొస్తున్నాయి. కంపెనీ నికరలాభం డిసెంబర్ త్రైమాసికంలో రూ.12,380 కోట్లకు చేరుకుంది. నికర అమ్మకాలు రూ.60,583 కోట్ల నుంచి 5.59 శాతం వృద్ధితో రూ.63,973 కోట్లకు పెరిగాయి.ఇదీ చదవండి: లిక్విడిటీ అవసరాలకు ఆర్బీఐ రూ.43 లక్షల కోట్లుఉద్యోగులు ఏమంటున్నారంటే..వేతన పెంపు సానుకూల పరిణామమే అయినప్పటికీ కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు క్రమంగా తగ్గుముఖం పట్టడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతంగా ఉన్న సగటు వేతన పెరుగుదల 2024 ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతంగా ఉంది. ఏదేమైనా ఆర్టీఓ పాలసీని పాటించేవారికి అధిక ప్రోత్సాహకాలు ఉంటాయనే వాదనలుండడంపట్ల ఉద్యోగులకు కొంత ఊరట లభించినట్లయింది. -
జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన: ఈ సారి ఎంతంటే..
టెక్ పరిశ్రమలో కొంత కాలంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం మాత్రమే కాకుండా.. వేతనాల పెంపుకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేసింది.2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వేతనాల పెంపుకు సంబంధించిన లెటర్లను.. మార్చి చివరి నాటికి ఉద్యోగులకు అందించనుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన జీతాలతో.. చెల్లింపులు మొదలవుతాయి. అయితే వేతన పెంపు 4 శాతం నుంచి 8 శాతం వరకు ఉండే అవకాశం ఉందని అంచనా.వేతనాలు 2023-24 ఆర్ధిక సంవత్సరం 7.9 శాతం, 2022-23లో 10.5 శాతం పెరిగాయి. అయితే ఈ సారి మాత్రం ఎంత పెరుగుతుంది అనే విషయం అధికారికంగా వెల్లడి కాలేదు. అక్టోబర్ - డిసెంబర్ కాలానికి ఫిబ్రవరిలో కంపెనీ విడుదల చేసిన త్రైమాసిక వేరియబుల్ పే (QVP) తర్వాత.. దానికి అర్హతగల ఉద్యోగులకు వస్తుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులు 20 శాతం నుంచి 40 శాతం వరకు తక్కువ చెల్లింపులను పొందుతూనే ఉన్నారు.ఇదీ చదవండి: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!.. మళ్ళీ పెరిగిన ధరలుటీసీఎస్ కంపెనీలో గ్రేడ్స్ Y (ట్రైనీ, C1 (సిస్టమ్స్ ఇంజినీర్స్), C2, C3-A&B, C4,C5, CXO వరకు వివిధ కేటగిరీలలో ఉద్యోగులు ఉన్నారు. C3Bలో ఉన్న ఉద్యోగులు, ఆపైన బ్యాండ్లో ఉన్న వారిని సీనియర్ కేటగిరీగా పరిగణిస్తారు. ఇటీవల విడుదల చేసిన వేరియబుల్ పేలో 70 శాతం మంది ఉద్యోగులు 100 శాతం అందుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సీ3, కింది స్థాయిలో ఉన్న వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది. -
ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..
జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్ఫోసిస్ (Infosys) కీలక విషయం తెలిపింది. దేశీయ ఐటీ సేవల దిగ్గజం (IT Company) భారత్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు 6-8 శాతం వార్షిక జీతాల పెంపును ఈ ఏడాది జనవరి నుండి ప్రారంభించనుంది. ఇది దాని ప్రణాళికాబద్ధమైన వేతన సవరణలలో మొదటి దశ. రెండవది వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది."భారత్లో కాంప్ (వార్షిక వేతనాల పెంపు) 6-8% ఉంటుందని ఆశిస్తున్నాం. విదేశీ కాంప్లు మునుపటి కాంప్ సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి" అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల (Q3FY25) వెల్లడి సందర్భంగా మీడియాతో అన్నారు.బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో ప్రపంచవ్యప్తంగా 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చివరిసారిగా 2023 నవంబర్లో జీతాల పెంపును అమలు చేసింది. సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలో విస్తృత అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లు, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితి నుండి ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.కాగా వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై ఏ మాత్రం పడుతుందన్నది లెక్కించలేదని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం, 2026 మొదటి త్రైమాసికంలో "కొన్ని ఎదురుగాలులు" తప్పవని సంఘ్రాజ్కా పేర్కొన్నారు. మరోవైపు భారత్ వెలుపల ఉండే ఉద్యోగులకు కూడా జీతం పెంపు సింగిల్ డిజిట్లోనే మునుపటి వేతన సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి. ఇక అధిక పనితీరు కనబరిచేవారికి ఎలాగూ వేతన పెంపు కాస్త ఎక్కువగానే ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ క్యూ3 ఫలితాలను ప్రకటించిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడుతూ వెల్లడించారు.రూ.6,806 కోట్ల లాభంఏదేమైనా ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలను (Q3 Results) సాధించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’ టెకీ పోస్ట్ వైరల్ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
ఈ ఏడాది వారికే ఎక్కువ జీతాలు: సర్వేలో కీలక విషయాలు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ.. జీతాలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఉద్యోగులకు సగటున 9.4 శాతం పెంపు (హైక్) ఉండే అవకాశం ఉంటుందని, HR కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.2020లో ఉద్యోగుల వేతనాలు 8 శాతం పెరిగాయి. ఈ ఏడాది 9.4 శాతం పెరగనున్నట్లు అంచనా. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్స్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ వంటి విభిన్న పరిశ్రమలతో విస్తరించి ఉన్న భారతదేశంలోని 1,550 కంటే ఎక్కువ కంపెనీలను సర్వే చేసి.. జీతాల పెంపు గురించి మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే ప్రస్తావించింది.ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల, ప్రభుత్వం నేతృత్వంలోని 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కారణంగా ఆటోమోటివ్ రంగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ రంగంలో జీతాలు 8.8 శాతం నుంచి 10 శాతం వరకు పెరగవచ్చు. ఆ తరువాత స్థానంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగులకు జీతాలు జీతాలు 8 శాతం నుంచి 9.7 శాతం వరకు పెరగవచ్చు.జీతాలను మాత్రమే కాకుండా.. ఈ ఏడాది 37 శాతం సంస్థలు విభిన్న రంగాలలో.. ఉద్యోగులను కూడా పెంచుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం. వివిధ అంశాలలో నైపుణ్యం కలిగిన వారికే ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుమారు 11.9 శాతం ఉద్యోగులు స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి వైదొలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ సంవత్సరం కొన్ని సంస్థలు ప్రతిభను ఆకర్షించడానికి, టర్నోవర్ను తగ్గించడానికి.. శ్రామికశక్తి డిమాండ్లను పరిష్కరించేందుకు కావలసిన ప్రయత్నాలను చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సంస్థలు పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.కరోనా మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఆ తరువాత కొంతమంది ఉద్యాగాలను పొందినప్పటికీ.. ఇప్పుడు కూడా కొన్ని దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది చాలామంది ఫ్రెషర్స్ ఉద్యోగాలను పొందనున్నారు.టీసీఎస్లో 40వేల ఉద్యోగాలుటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) 'మిలింద్ లక్కడ్' తెలిపారు. టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. -
భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం 'యాపిల్' (Apple).. సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) జీతాన్ని ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 18 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.వార్షిక వేతనం 18 శాతం పెరగడంతో.. టిమ్ కుక్ వేతనం 74.6 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 643 కోట్లు)కు చేరింది. యాపిల్ సీఈఓ జీతంలో బేసిక్ పే 3 మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, సుమారు 13.5 మిలియన్ డాలర్లు అదనపు పరిహారం వంటివి ఉన్నాయి.కంపెనీ వార్షిక సమావేశం (ఫిబ్రవరి 25) జరగడానికి ముందే యాపిల్ టిమ్ కుక్ జీతం భారీగా పెంచినట్లు ప్రకటించింది. త్వరలో జరగనున్న సంస్థ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కుక్ వేతనం 2023 కంటే ఎక్కువే. అయినప్పటికీ ఈయన 2022లో (100 మిలియన్ డాలర్లు) అందుకున్న వేతనంతో పోలిస్తే చాలా తక్కువే అని సమాచారం.టిమ్ కుక్తో పాటు యాపిల్ రిటైల్ చీఫ్, మాజీ సీఎఫ్ఓ, సీఓఓ, జనరల్ కౌన్సిల్ సహా ఇతర యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ 2024లో 27 మిలియన్ డాలర్లకు పైగా వేతనాన్ని పొందనున్నారు. మొత్తం మీద యాపిల్ కంపెనీ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో హోంగార్డుల జీతాల పెంపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) లోగోని, సంబంధిత వాహనాలను, బోట్లను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం. హోమ్ గార్డుల రోజు వేతనాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్ అలవెన్స్ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదంలో మరణించినా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని అన్నారు. కాగా, హెంగార్డులకు పెంచిన జీతాలు, ఇతర సదుపాయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. -
ఐటీ కంపెనీల కంటే 20 శాతం అధిక వేతనం
దేశీయ సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పనిచేయాలనుకునే ప్రతిభ ఉన్న అభ్యర్థులకు భారీ వేతనాలు ఇస్తున్నట్లు టీమ్లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జీసీసీలు సంప్రదాయ ఐటీ, నాన్-టెక్ కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.టీమ్లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. దేశంలో 1,600 జీసీసీలున్నాయి. వీటిలో 16.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రధానంగా జనరేటివ్ ఏఐ, ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్.. వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల 2025 నాటికి జీసీసీల సంఖ్య 1,900కు చేరనుంది. దాంతో 20 లక్షల మంది ఈ విభాగంలో ఉపాధి పొందుతారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ, ఎంఎల్, బ్లాక్చెయిన్ టెక్నాలజీల్లో సుమారు రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా రూ.21 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్లుఈ సందర్భంగా టీమ్లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ మాట్లాడుతూ..‘సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సైబర్సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటా మేనేజ్మెంట్, అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. వంటి కీలకమైన ఫంక్షనల్ రంగాల్లో 15,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంది. బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలకు అధిక వేతనాలు అందిస్తున్నారు. జైపూర్, ఇందోర్, కోయంబత్తూర్ వంటి టైర్-2 నగరాలు రాబోయే రోజుల్లో జీసీసీలు, డేటా సెంటర్లకు హబ్లుగా మారబోతున్నాయి. ఈ కేంద్రాల్లోని ఉద్యోగులకు సంప్రదాయ ఐటీ జీతాల కంటే 12% నుంచి 20% వరకు ఎక్కువ వేతనం చెల్లిస్తారు’ అని తెలిపారు. -
అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!
ఫ్రెషర్లకు అతి తక్కువ జీతాల ప్యాకేజీలను అందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ వేతనాల పెంపులోనూ అలాంటి ధోరణినే అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపును అత్యల్పంగా కేవలం 1% మాత్రమే అందించినట్లు నివేదికలు వెల్లడించాయి.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ నాలుగు నెలల ఆలస్యంగా జీతాల పెంపును ప్రారంభించింది. జీతాల పెంపు 1% నుంచి 5% వరకు ఉంటుంది. "3 రేటింగ్ ఉన్నవారు 1-3%, 4 రేటింగ్ ఉన్న ఉద్యోగులు 4%, 5 రేటింగ్ పొందిన వారు 4.5% నుంచి 5% వేతన పెంపు అందుకున్నారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ అమెరికన్ ఐటీ కంపెనీ గత సంవత్సరం ఏప్రిల్లో ఉద్యోగులకు 7 శాతం నుంచి 11 శాతం వరకు వేతనాలు పెంచింది. భారత్లో ఈ కంపెనీకి సుమారుగా 254,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది దాని మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,100 క్షీణించింది. దీనితో ఉద్యోగుల సంఖ్య 336,300కి తగ్గింది. -
కోటీశ్వరుల్ని చేస్తున్న కంపెనీ!.. భారీగా పెరిగిన వేతనాలు
ఇండియా టొబాకో లిమిటెడ్ కంపెనీ (ITC) తన ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కోట్లలో వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో 62 మంది ఉద్యోగులు ఈ జాబితాలోకి చేరారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 24 శాతం ఎక్కువని తెలుస్తోంది.ప్రస్తుతం కంపెనీలో 350 కంటే ఎక్కువ మంది కోటి రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. 2022-23లో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారి సంఖ్య 282 మంది మాత్రమే. కంపెనీలో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారు నెలకు రూ.9 లక్షల కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నట్లు సమాచారం.ఐటీసీ కంపెనీలో చైర్మన్ అండ్ ఎండీ సంజీవ్ వేతనం 49.6 శాతం పెరిగింది. దీంతో ఈయన జీతము రూ. 28.62 కోట్లకు చేరింది. శాలరీ పెరుగుదలకు ముందు (గత ఏడాది) ఈయన వేతనం రూ. 19.12 కోట్లుగా ఉండేది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ వేతనం 52.4 శాతం పెరిగింది. దీంతో ఈయన వేతనం రూ. 13.6 కోట్లకు చేరింది. ఈడీలు సుప్రతిమ్ దత్తా, హేమంత్ మాలిక్ జీతాలు కూడా వరుసగా 59 శాతం, 30 శాతం పెరిగాయి. 2024 మార్చి 31 నాటికి కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 24,567గా ఉంది. -
ప్రముఖ కంపెనీలో మొదటిసారి కార్మికుల సమ్మె
ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ, దక్షిణ కొరియా ప్రధాన కేంద్రంగా ఉన్న శామ్సంగ్లో ఉద్యోగులు మునుపెన్నడూ లేనివిధంగా నిరసనకు దిగారు. కార్మికులు మొదటిసారి శుక్రవారం సమ్మె ప్రారంభించారు. సౌత్కొరియాలోని సియోల్లో ఉన్న శామ్సంగ్ ప్రధాన కార్యాలయం ముందు కంపెనీ చిప్ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు లౌడ్ స్పీకర్లలో నిరసన పాటలు ప్లే చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.శామ్సంగ్ కంపెనీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి సమ్మెలు సాగలేదు. ఇదే మొదటిసారి. వేతనాల పెంపు, బోనస్లపై పలుసార్లు కంపెనీ యాజమాన్యంతో చర్చించామని సమ్మె నిర్వాహకులు చెప్పారు. కార్మికుల డిమాండ్లపై కంపెనీ స్పందించకపోవడంతో ఆందోళన ప్రారంభించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా సౌత్కొరియా నేషన్వైడ్ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ లీ హ్యూన్ కుక్ మాట్లాడుతూ..‘కార్మికులు, కంపెనీకి మధ్య సంధానకర్తగా ఉన్న యూనియన్కు యాజమాన్యం విలువ ఇవ్వట్లేదు. కంపెనీలో ఉన్న ఐదు లేబర్ గ్రూపుల్లో యూనియన్ అతిపెద్దది. ఇందులో 28,000 మంది సభ్యులున్నారు. శామ్సంగ్ గ్లోబల్ వర్క్ఫోర్స్లో ఐదో వంతుకు యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులోని దాదాపు 75 శాతం మంది ఏప్రిల్లో సమ్మెకు అనుకూలంగా ఓటు వేశారు. వేతనాల పెంపు, బోనస్లపై కంపెనీ యాజమాన్యంతో పలుమార్లు చర్చించాం. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. యూనియన్ డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలి’ అన్నారు.ఇదీ చదవండి: డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటుయూనియన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి ఒకరు న్యూయార్క్ టైమ్స్తో తెలిపారు. చిప్ తయారీ మార్కెట్లో కంపెనీ ఏటా తన లక్ష్యాలను చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కంపెనీలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చిప్ విభాగం నుంచి కంపెనీకి సుమారు 1.4 బిలియన్ డాలర్ల(రూ.11వేలకోట్లు) లాభం చేకూరినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
ఆ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు, రూ.1.8 లక్షల బోనస్ కూడా
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఇటీవల పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేసి వివాదాస్పదంగా మారింది. ఎక్కువ సంఖ్య విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చెక్కబడింది. సంస్థ తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెంచడమే కాకుండా బోనస్ కూడా ప్రకటించింది.2024 మే 23న పైలెట్ల జీతాలు రూ. 15000 పెంచారు. దీంతో పాటు బోనస్ రూ.1.8 లక్షల వరకు ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్ నుంచి సీనియర్ కమాండర్ వరకు నెల జీతాలను రూ. 5000 నుంచి రూ. 15000 వరకు పెంచినట్లు వెల్లడించారు. అయితే జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతాల పెంపు లేదు. అయితే వీరికి బోనస్ కింద రూ. 42000 నుంచి రూ. 1.8 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ రూ. 60000 బోనస్ అందుకోగా, కమాండర్, సీనియర్ కమాండర్లు వరుసగా 1.32 లక్షలు & 1.80 లక్షల బోనస్లను పొందనున్నారు. అంతే కాకుండా గ్రౌండ్ అండ్ సిమ్యులేటర్ శిక్షణలో జరిగిన ఆలస్యానికి పరిహారం కూడా అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. సాలరీ హైక్, బోనస్ వంటివి జూన్ నెల జీతంతో కలిపి ఇచ్చే అవకాశం ఉంది. -
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
ఉద్యోగులకు భారీగా వేతనపెంపు.. ఎంతంటే..
కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగులకు 2024-25 ఏడాదికిగాను భారీగా వేతనాలు పెంపు ఉండనుందని మైఖేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్ 2024 నివేదిక ద్వారా తెలిసింది. సగటున దాదాపు 20 శాతం మేర వార్షిక వేతనాలు పెరుగుతాయని నివేదికలో తెలిపారు. ఫైనాన్స్-అకౌంటింగ్, ఆరోగ్య సంరక్షణ లైఫ్సైన్సెస్, బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్ తయారీ, మానవ వనరులు, లీగల్, టెక్నాలజీ తదితర రంగాల్లోని కంపెనీలు, ఉద్యోగులపై చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నివేదికలో ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. తయారీ రంగాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత డిమాండ్ పెరిగింది. టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత ఉద్యోగాలు అందుతున్నాయి. డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎం వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు మరింత డిమాండ్ ఉండనుంది. ఆర్బీఐతోపాటు ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు భారత వృద్ధిరేటుపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అందులో భాగంగా భారత జీడీపీ వృద్ధి స్థిరంగా 6 శాతంపైనే నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులను తట్టుకుని భారత్ వృద్ధిబాట పడుతుందని నివేదికలో తెలిపారు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల శాలరీ పెంపు విషయాన్ని సమీక్షిస్తున్నాయి. టెకీలకు సరాసరి 8-10 శాతం వేతనపెంపు ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఐటీ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం, వారిపై ఉద్యోగులకు 30-40 శాతం, మేనేజ్మెంట్ స్థాయిలోని సీనియర్లకు 20-30 శాతం వేతన పెంపు ఉండొచ్చని నివేదిక ద్వారా తెలిసింది. -
ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్?
-
ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్?
టెక్ కంపెనీలు కాస్ట్కటింగ్ పేరిట ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నా..నిబంధనల ప్రకారం ఉన్నవారికి మాత్రం వేతనాలు పెంచేపనిలో పడ్డాయి. మార్చితో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వేతనపెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచనున్నట్లు తెలిసింది. టీసీఎస్ తన ఆఫ్సైట్ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం.. ఆన్సైట్ ఉద్యోగులకు 2-4 శాతం పెంచే యోచనలో ఉందని మీడియా కథనాల ద్వారా తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం వరకు జీతం పెంచనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్ త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టీసీఎస్ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వేతన పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా, భారీ వేతనాలు తీసుకుంటున్న వారి ఖర్చులు, పదోన్నతుల అంశాన్ని ఇంకా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకున్న ఉద్యోగులకు గతేడాదే టీసీఎస్ 12-15 శాతం వరకు సగటు ఇంక్రిమెంట్ను ఇచ్చింది. దాంతోపాటు ప్రమోషన్లను అందించింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను మాత్రం తగ్గించుకుంది. -
ఉద్యోగులకు బంపరాఫర్, జీతం ఎంత పెరగనుందంటే?
ఆర్ధిక మాంద్యం భయాలు. ప్రాజెక్ట్ల కొరత, అవధుల్లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం, వరుస లేఆఫ్స్, వేతనాల కోతల వంటి సంస్థలు వరుస నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గుడ్న్యూస్ చెప్పింది. ‘డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్లుక్ 2024’ నివేదిక ప్రకారం..ఆయా కంపెనీల్లో పని చేస్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లకు 9 శాతం శాలరీ పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీ, బీపీఓలు మినహా అన్ని రంగాలలో కోవిడ్కు ముందు స్థాయిల కంటే మెరుగుగానే జీతాల పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, ఈ అంచనా 2023లో వేసిన 9.2శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. కంపెనీలు జూనియర్ మేనేజ్మెంట్కు గణనీయమైన ఇంక్రిమెంట్లను అందించే అవకాశం ఉండగా.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేతనాల చెల్లింపు ఉండనుంది. ఇంక్రిమెంట్లు డెలాయిట్ ఇండియా శాలరీ నివేదిక ప్రకారం.. టాప్ పెర్ఫార్మర్లు సగటు రేటెడ్ ఉద్యోగులకు చెల్లించే ఇంక్రిమెంట్ల కంటే 1.8 రెట్లు ఎక్కువ పొందే అవకాశం ఉంది. 2023లో 0.6 రెట్లుతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులు 0.4 రెట్లు పెరగనున్నారు. బోనస్లు 2024లో దాదాపు సగం కంపెనీలు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి అదనంగా బోనస్లు ఇవ్వనున్నట్లు డెలాయిట్ ఇండియా నివేదిక హైలెట్చేస్తోంది. ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు సంస్థలు 7.5శాతంతో ప్రమోషన్ల పెంపును కొనసాగించాలని కూడా భావిస్తున్నట్లు వెల్లడించింది. పదోన్నతులు నివేదిక ప్రకారం, పదోన్నతులు పొందగలరని అంచనా వేసిన ఉద్యోగుల శాతం 2023లో 12.3శాతం నుండి తగ్గింది. -
ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2022 నుంచి ప్రాథమిక వేతనాలను 16 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆమోదించింది. ఈ తాజా నిర్ణయంతో ఎల్ఐసీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఉన్న బకాయిలు పొందనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ప్రాథమిక వేతనం పెంపుతోపాటు అలవెన్సులతో కలిపి మొత్తం 22 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వేతన పెంపుతో 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇదీ చదవండి: 180 ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ విమానయాన సంస్థ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎల్ఐసీకి వార్షికంగా రూ.4,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనున్నట్లు అంచనా. పెంపు తర్వాత ఎల్ఐసీ వేతన బిల్లు రూ.29,000 కోట్లకు చేరుతుందని తెలిసింది. 2010 ఏప్రిల్ తర్వాత సంస్థలో చేరిన దాదాపు 24,000 మంది ఉద్యోగుల ఎన్పీఎస్ వాటాను 10% నుంచి 14 శాతానికి పెంచారు. -
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారానికి 5 రోజులే పని!
ఉద్యోగులకు శుభవార్త. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదురోజు పనిదినాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొత్త పనిదినాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం, బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు పని చేస్తాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే కేంద్రం నోటిఫికేషన్ విడుదలతో బ్యాంక్ ఉద్యోగులు త్వరలో వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసలు బాటు కలగనుంది. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు బ్యాంకులు పనిచేయగా.. శని, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ తరుణంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఓ పత్రికా ప్రకటనలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, జాయింట్ నోట్పై సంతకం చేయడంతో చర్చలు సఫలమైనట్లు పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ పెండింగ్లో ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమలులోకి రానున్నాయి. కొత్త బ్యాంక్ పనివేళలు ఎలా ఉండబోతున్నాయ్ ఐదురోజుల పనిదినాల్లో అమల్లోకి వచ్చిన వెంటనే బ్యాంక్ పనివేళలు ఎలా ఉండనున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. పలు నివేదికల ప్రకారం ఉద్యోగులు ఉదయం 9:45 బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగనున్నాయి. తద్వారా బ్యాంక్ ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయనున్నారు. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే...??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచింది విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
బ్యాంక్ ఉద్యోగులకు తొందరలోనే రెండు శుభవార్తలు!
బ్యాంక్ ఉద్యోగులకు 2024 సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం కావచ్చు. తొందరలోనే రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ తన సమ్మతిస్తే జూన్ నాటికి బ్యాంకు ఉద్యోగులకు 5 పని దినాల విధానం అమల్లోకి రావచ్చు. అలాగే జీతాల పెంపును కూడా పొందవచ్చు. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంకింగ్ రంగానికి వారానికి ఐదు రోజుల పనిని సిఫార్సు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసింది. ప్రస్తుతం ఆదివారాలు, షెడ్యూల్డ్ సెలవులు అదనంగా ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు. ఐదు రోజుల పని విధానం మొత్తం బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించదని, కస్టమర్లకు బ్యాంకింగ్ అవర్స్లోగానీ, ఉద్యోగులకు మొత్తం పని గంటలలో గానీ తగ్గింపు ఉండదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తన ప్రతిపాదనలో హామీ ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో కుదిరిన ఒప్పందం ద్వారా ఈ ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని సానుకూలంగా సమీక్షించాలని, తదనుగుణంగా ముందుకు సాగేలా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ను ఆదేశించాలని అసోసియేషన్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీలలో ఐదు రోజుల పని విధానం ఇప్పటికే ఆచరణలో ఉందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గుర్తు చేసింది. జీతాల పెంపు గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ఫలితంగా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 17 శాతం వేతనాల పెంపుదలకు రూ. 12,449 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ పథకానికి ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. -
ఈ ఏడాది శాలరీ హైక్.. వారికే ఎక్కువ!.. సర్వే
2024 ప్రారంభమైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవా సంస్థ 'ఎయాన్' (Aon) సర్వే మాత్రం ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ ఓ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారతీయ ఉద్యోగుల సగటు జీతం 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే ద్వారా ఎయాన్ వెల్లడించింది. ఇది 2023 కంపెనీలు అందించిన జీతాల పెంపు కంటే (2023 జీతాల పెంపు 9.7 శాతం) కొంత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ సర్వే కోసం ఎయాన్ సుమారు 45 రంగాలకు చెందిన 1414 కంపెనీల డేటా విశ్లేషించింది. ఇందులో తయారీ రంగం 10.1 శాతం జీతాల పెంపుతో ముందు వరుసలో ఉన్నట్లు, ఆర్థిక సంస్థలు, లైఫ్ సైన్సెస్ రంగాలు 9.9 శాతం జీతాల పెంపుతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అంచనా వేసింది. ఈ కామర్స్ సంస్థలు సగటున 9.2 శాతం పెంపును ఇచ్చే అవకాశం ఉంది. ఇక FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్లేయర్స్ జీతాలను 9.6 శాతం, రిటైల్ రంగంలో 8.4 శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ కెమికల్స్ రంగాల జీతాల పెంపు 9.7 శాతంగా అంచనా. టెక్నాలజీ ప్లాట్ఫామ్, ఉత్పత్తుల రంగం జీతాలను 9.5 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సమయంలో టెక్ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగుల వేతనాలు 8.2 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో మొత్తం అట్రిషన్ రేట్లు 2022లో 21.4 శాతం నుంచి 2023లో 18.7 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తెలిసింది. 2023లో కొన్ని సంస్థలు కొంత అనిశ్చితి వాతావరణం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్ర్రాభం నుంచి కంపెనీల పురోగతి కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల జీతాలు గత ఏడాది కంటే మెరుగ్గా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నేనింకా అప్డేట్ కాలేదేమో! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. జీతాల పెంపు విషయంలో భారత్ అగ్రగామిగా నిలువగా.. బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాల్లో జీతాలు పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనున్నట్లు సమాచారం. -
ఎస్బీఐ గుడ్న్యూస్: భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI ) తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. జీతాలు, పెన్షన్ల పెంపునకు సంబంధించి ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కీలక విషయం వెల్లడించారు. ఇందుకోసం నిధులను సైతం కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ పెంపుదల కోసం కేటాయింపులు పెరగడం బ్యాంక్ రెండవ త్రైమాసిక నికర లాభంపై ప్రభావం చూపిందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఉద్యోగుల జీతాలు 14 శాతం మేర పెంచాలని భావించిన ఎస్బీఐ అందుకు అనుగుణంగా నిధులను సైతం పక్కనపెట్టి ఉంచింది. 2022 నవంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్న వేతన సవరణ కోసం ఇప్పటివరకు రూ. 8,900 కోట్లను కేటాయించినట్లు ముంబైలో ఎస్బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో దినేష్ ఖారా వెల్లడించారు. "ఈ కేటాయింపుల వల్ల రెండో త్రైమాసికంలో ఎస్బీఐ లాభాలు కొంచెం తగ్గాయి. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఊపందుకుని 16 శాతం నుంచి 17 శాతం వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం. దేశీయ డిమాండ్ బలంగా ఉంది. పండుగ వ్యయాల నేపథ్యంలో ఇది మరింత పెరుగుతుంది" అని ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఎస్బీఐ నికర లాభం 8 శాతం పెరిగి రూ.14,330 కోట్లకు చేరుకుంది. 16 శాతంతో రిటైల్ రుణాల వృద్ధి.. 7 శాతంగా ఉన్న కార్పొరేట్ రుణ వృద్ధిని అధిగమించింది. అయితే కంపెనీలు నెమ్మదిగా రుణాలను పొందుతున్నాయని, రూ. 4.77 లక్షల కోట్ల రుణాలు వివిధ దశల్లో ఉన్నాయని దినేష్ ఖారా వివరించారు. "బ్యాంకుకు రూ. 3.20 లక్షల కోట్ల అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. వీటిలో 86 శాతం సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న కస్టమర్లకే ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో బ్యాంకులు ఎన్బీఎఫ్సీల అసురక్షిత రుణ వృద్ధి పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. -
వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..
2024లో భారతీయ ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్' (WTW Salary Budget Planning Report) వెల్లడించింది. వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికంగా జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతీయ సంస్థలు టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో, ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది, తద్వారా జీతాల పెరుగుదల జరుగుతుంది. 2024లో ఉద్యోగుల జీతం వియత్నాంలో 8%, చైనా 6%, ఫిలిప్పీన్స్ 5.7%, థాయిలాండ్ 5% వరకు పెరగనుంది. ఈ దేశాలతో పోల్చితే భారత్ (9.8%) ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (61%), ఇంజనీరింగ్ (59.8%), సేల్స్ (42.9%), టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్ (38.6%), ఫైనాన్స్ (11.8%) ), మార్కెటింగ్ (10.6%), హ్యూమన్ రీసోర్స్ (3.1%) విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో కూడా జీతాలు పెరుగుదల ఉంటుంది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త!
టెక్కీలకు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. సంస్థ గత ఆరు నెలలుగా జీతాల పెంపు ప్రకటనన వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, తాజాగా ఇన్ఫోసిస్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో నవంబర్ 1న ఉద్యోగుల వార్షిక వేతనాల్ని పెంచుతున్నట్లు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ తెలిపారు. ఇన్ఫోసిస్ సాధారణంగా శాలరీలను ఏప్రిల్ నెలలో సీనియర్ మేనేజ్మెంట్ కంటే తక్కువ ఉన్న ఉద్యోగులందరికీ వార్షిక పెంపును అమలు చేస్తుంది. మిగిలిన ఉద్యోగులకు జూలైలో అందిస్తుంది. అయితే ఐటీ విభాగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేతనాలు, ఇతర బెన్ఫిట్స్ను వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇదే అంశంపై క్లారిటీ ఇవ్వడంతో సంస్థ తీసుకున్న నిర్ణయంపై లక్షల మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ రంగంలో అనిశ్చితే కారణం ఇతర రంగాలతో పాటు టెక్నాలజీ రంగంలో నెలకొన్ని అనిశ్చితి కారణంగా వేతనాల పెంపును వాయిదా వేసినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.38,994 కోట్ల ఆదాయంపై రూ.6,215 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది -
ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!
Wipro salary hike: ప్రముఖ దేశీయ టెక్నాలజీ దిగ్గజం విప్రో (Wipro).. తమ ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్త చెప్పింది. జీతాల పెంపుదలను వచ్చే డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులకు వేతన పెంపు డిసెంబర్ 1 నుంచి అమలు చేయనుంది. ఉద్యోగులకు ఈ-మెయిల్ ఈ మేరకు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ నుంచి ఉద్యోగులకు ఈ-మెయిల్ అందినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది. "ప్రస్తుతం సవాళ్లతో కూడిన, అనిశ్చిత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మా మెరిట్ జీతాల పెంపుదల (MSI) 2023 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే వారాల్లో, ప్రస్తుత పరిహారం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా అర్హత ఉన్న ఉద్యోగులకు మెరిట్ జీతం పెంపును నిర్ణయిస్తాం" అని ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు. (మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్తో రూ.లక్ష మాయం..) స్థూల ఆర్థిక ఎదురుగాలి, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా జీతాల పెంపు ప్రకటనను విప్రో ఈ సంవత్సరం మూడు నెలలు వాయిదా వేసింది. దీంతోపాటు ఈ సంవత్సరం అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు జీతాల పెంపును జాప్యం చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ మందగమనం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. లాభదాయకతను పెంపొందించుకోడానికి, ఐటీ రంగంలో తన స్థితిని మెరుగుపరచడానికి విప్రో.. గత జులైలో వ్యూహాత్మక మార్పులను చేపట్టింది. కంపెనీ తన క్లయింట్ బేస్ను తగ్గించుకుని అధిక మార్జిన్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ఒప్పందాలపై దృష్టి పెట్టింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయంలో 2.8 శాతం సీక్వెన్షియల్ క్షీణతను నమోదు చేసిన కొన్నాళ్లకే ఈ వ్యూహం అమలు చేసింది. అదనంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో, సంస్థ ప్రారంభ ఆఫర్లతో పోలిస్తే కొత్త రిక్రూట్మెంట్ల పే ప్యాకేజీలను దాదాపు 50 శాతం తగ్గించింది. -
ఇండిగో ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి పండగే..!
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)ను నిర్వహిస్తున్న ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వేతనాలను పెంచినట్లు ఒక నివేదిక తెలిపింది. వేతనాల పెంపుదల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. గత ఏడాది ఇండిగో తమ సిబ్బందికి రెండు విడతల్లో 10 శాతానికిపైగా జీతాలను పెంచింది. ఈ విమానయాన సంస్థ పైలట్లకు నెలకు 70 గంటల చొప్పున స్థిరమైన వేతనాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఇండిగో రికార్డు స్థాయిలో రూ. 3,090 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా, దేశీయంగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉన్న పైలట్లు వెళ్లిపోకుండా చూసుకోవడంతోపాటు కొత్త పైలట్లను నియమించుకోవడానికి గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్లీజ్ తీసుకుంది. -
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు ఈనెల నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈనెల నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్–కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యాసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం.... పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
విప్రో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: జీతాల పెంపు ఇప్పుడే కాదు..
Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్లో వేతన పెంపును అమలు చేసిన విప్రో కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది. వేరియబుల్ పే 80 శాతం ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్ పే అవుట్ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు. విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లందరినీ ఇంకా ఆన్బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ ఆన్బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్సీఎల్ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది. ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్లో ఎంత మంది? -
గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్ - ఆనందంలో ఉద్యోగులు..
TCS Salary Hike: ఇప్పటికే చాలా కంపెనీలు శాలరీ హైక్స్ విషయంలో వెనుకడుగులు వేస్తుంటే 'టీసీఎస్' (TCS) మాత్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ఫోసిస్ కంపెనీ వేతన పెరుగుదలను వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురించి చేసింది. ఆపరేటింగ్ మార్జిన్ మీద 200 బేసిస్ పాయింట్స్ ప్రభావం చూపుతున్నప్పటికీ వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం, కంపెనీలో అత్యుత్తమ పనితీరుని కనపరచిన ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం జీతాలను పెంచినట్లు తెలిసింది. దీనితో పాటు ప్రమోషన్లను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని టీసీఎస్ సీఎఫ్ఓ సమీర్ సెక్సరియా వెల్లడించారు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోల్చి చూస్తే.. ఈ మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల క్షీణత తగ్గి 17.8 శాతానికి చేరినట్లు తెలిసింది. కాగా జూన్ 30 నాటికి కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,15,318 మంది. గత మూడు నెలల్లో ఉద్యోగులు 523 మంది పెరిగారు. కాగా ఈ వర్క్ ఫోర్స్లో మహిళలు 35.8 శాతం ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) కంపెనీ అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి వారిని గుర్తించి రివార్డులను సైతం అందిస్తోంది. గత కొన్ని రోజుల్లో ఉద్యోగాల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మూడు వారాలకు ఒకసారి 55 శాతం మంది వస్తున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. -
షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు!
దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు శాలరీ హైక్ చేస్తుంటే.. ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosis) మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరగాల్సిన వేతనాల పెంపు ఇప్పటికీ జారకగా పోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, ప్రాజెక్టుల రద్దు.. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు ఇవన్నీ దేశీయ ఐటీ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితుల కారణంగా ఇప్పటికే చాలా కంపెనీ లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించింది. కాగా ఇప్పుడు శాలరీ హైక్ విషయంలో కూడా వెనుకడుగు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఆర్ధిక పరిస్థితి కారణంగానే ఉద్యోగులకు శాలరీలు పెంచలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: అలా చేస్తేనే విజయం వరిస్తుంది.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా) ప్రతి సంవత్సరం అప్రైజర్స్ వుంటాయని... ఈ సారి మాత్రం ఆ విషయం మీద ఎటువంటి క్లారిటీ రాలేదని ఉద్యోగులు చెబుతున్నట్లు సమాచారం. సాధారణ ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఉన్నత స్థాయి ఉద్యోగులకు సైతం ఇంకా వేతన పెంపు జరగకపోవడం గమనార్హం. కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా శాలరీ హైక్ జరగక పోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
భారీగా పెరిగిన ఐటీసీ చైర్మన్ వేతనం - ఎన్ని కొట్లో తెలుసా..?
ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'సంజీవ్ పూరి' (Sanjiv Puri) 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న వేతనం ఏకంగా రూ. 16.31 కోట్లకు చేరింది. గతంలో ఆయన తీసుకున్న వేతనంతో పోలిస్తే ఇది 29.5 శాతం ఎక్కువ కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంజీవ్ పూరి గత ఏడాది తీసుకున్న వేతనం 12.59 కోట్లు. దీన్ని బట్టి చూస్తే గత సంవత్సరం కంటే ఈ ఏడాది నాలుగు కోట్ల కంటే ఎక్కువ పెరిగిందని స్పష్టమవుతోంది. ఈయన బేసిక్ శాలరీ రూ. 2.88 కోట్లు, పెర్ఫామెన్స్ బోనస్ అండ్ కమిషన్ రూపంలో రూ.12.86 కోట్లు అందుకున్నట్లు సమాచారం. వీటితో పాటు పెరిక్విసైట్స్, ఇతర ప్రయోజనాలు రూ. 57.38 లక్షల వరకు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. నిజానికి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ పదవి 2023 జులై 21 నాటికి ముగుస్తుంది. అయితే కంపెనీ బోర్డు పదవీ కాలాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగించింది. గత సంవత్సరం ఆర్థిక మాంద్యం, అమ్మకాలు తగ్గడం, ధరల పెరుగుదల సమయంలో చాలా కంపెనీల అధినేతలు తమ శాలరీలు తగ్గించుకున్నారు. అయితే సంజీవ్ పూరి మాత్రం తన జీతం భారీగా పెంచుకున్నాడు. (ఇదీ చదవండి: ఉద్యోగులకు మళ్ళీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. ఈ సారి ఎంతమందంటే?) నివేదికల ప్రకారం, నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ 2022 లో తన వేతనంలో 6 శాతం తగ్గించుకున్నారు. ఈ కారణంగా రూ. 18.8 కోట్లుగా ఉన్న ఆయన వేతనం రూ. 17.7 కోట్లకు చేరింది. -
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే?
స్టాక్ మార్కెట్ మాంత్రికుడు, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా స్థాపించిన ఆకాశ ఎయిర్..సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు భారీగా పెరిగాయి. మిగిలిన విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగోలు పోటీ పడుతూ వందల సంఖ్యలో కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశా ఎయిర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశా ఎయిర్లో పెంచిన 40 శాతం శాలరీలు జులై నుంచి అమల్లోకి రానున్నాయి. సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ (ఫ్లైట్ నడిపేవారు) ఉద్యోగుల జీతం నెలకు రూ.2.75లక్షల నుంచి రూ.3.40 లక్షలకు, సీనియర్ కెప్టెన్స్ల వేతనం రూ.5.75లక్షల నుంచి రూ.6.25లక్షలకు చేరింది. ఇక, పైలెట్ల జీతాలు అనుభవంతో పాటు ఎన్ని గంటల పాటు పైలెట్ విధులు నిర్వహించారనే ఆధారంగా శాలరీలు చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. కెప్టెన్లు నెలకు 60 గంటల ప్రయాణానికి గతంలో రూ.7.28లక్షలు ఉండగా.. తాజాగా నిర్ణయంతో రూ.7.75లక్షలు చేరింది. ప్రస్తుతం, ఉన్న పిక్స్డ్ పే అవర్స్ను 40 గంటల నుంచి 45 గంటలకు పెంచింది. వేతనాల సవరింపుతో ప్రతి అదనపు గంటకు కెప్టెన్ రూ. 7,500, ఫస్ట్ ఆఫీసర్ రూ. 3,045 పొందనున్నారు. అంచనా ప్రకారం.. ఆకాశ ఎయిర్ 19 విమానాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, పనిగంటల తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం ఉద్యోగుల నెలవారీ జీతాలపై పడుతుంది. దీంతో పైలట్లు ఆశించిన సమయాల్లో విమానాలను నడిపించలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ ఆకాశయిర్ వేతనాల్ని 40 శాతంతో జీతాలు భారీగా పెంచింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్కు పెట్టుబడుల వరద! -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఊరట..
వేతన పెంపు విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయం చెప్పారు ఆ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. జీతం పెరగకపోయినా ఆదాయం పెంచుకునే చిట్కా చెప్పారు. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది. సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఉద్యోగులకు సమాచారం అందించారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కంపెనీ సీఎంఓ సూచించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కాపోస్సేలా ఇటీవల సందేశాలు పంపినట్లు ఫార్చూన్ పత్రిక పేర్కొంది. కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఎందుకు పెంచలేదో ఆ లేఖలో ఆయన వివరించారు. అలాగే ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సూచించారు. కంపెనీ స్టాక్ ధర పెరిగితే.. ఉద్యోగులకు అందే పరిహారం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందని, ప్రతిఒక్కరూ స్టాక్ ధర పెరిగేలా పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది కంపెనీ షేరు విలువ ఇప్పటికే 33 శాతం పెరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీని అనుకూలంగా ఉంచే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, మానవ వనురుల పెంపు, డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉందని క్రిస్ కాపోస్సేలా పేర్కొన్నారు. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు సీఈవో సత్య నాదెళ్ల. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలకు కోత పెట్టిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు ఉద్యోగుల జీతాల పెంపునకు కోత పెట్టింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! ఓ వైపు లేఆఫ్స్ కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి త్రైమాసికాల్లో మైక్రోసాఫ్ట్ మంచి లాభాలనే నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జీతాల పెంపు కచ్చితంగా ఉంటుందని ఉద్యోగులు కొండంత ఆశతో ఉన్నారు. అయితే ఈ ఏడాది జీతాల పెంపు ఉండదని సీఈవో సత్య నాదెళ్ల తేల్చి చెప్పేశారు. కోవిడ్ సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ సంవత్సరం జీతాల పెంపు ఉండదని, ఈ అనిశ్చిత సమయాల్లో తమ వ్యాపారం, ఉద్యోగుల స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జీతాల పెంపు లేనప్పటికీ బోనస్లు, స్టాక్ అవార్డుల ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. తమ ఉద్యోగులకు వృద్ధి, ఎదుగుదలకు అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఆన్లైన్ విక్రయాలపై దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న నేపథ్యంలో రిటైల్ స్టోర్లలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. తొలగింపులు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులందరిపైనా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ జీతాల పెంపును స్తంభింపజేయడం టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లకు సంకేతం. ఇటీవలి కాలంలో లేఆఫ్స్, జీతాల పెంపు నిలిపివేత, వేతనాల తగ్గింపు వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు. జనవరిలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 3,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ కూడా నియామకాల వేగాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు -
టిమ్ కుక్ శాలరీ కట్ అయ్యింది..మరి నీ శాలరీ?
-
కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు
కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపును అందిస్తోంది. 18 నెలల్లో ఇది మూడవ వేతన పెంపు. పెరుగుతున్న అట్రిషన్ కంపెనీకి తలనొప్పిగా మారింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా కంపెనీ షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. (apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!) వేతన పెంపునకు సంబంధించిన లెటర్లను ఉద్యోగులు ఈ వారంలో అందుకుంటారని కంపెనీ వారికి పంపిన ఈ-మెయిల్స్లో పేర్కొంది. సంవత్సరాంతపు పనితీరు సమీక్షలను అనుసరించి ఆరు నెలల ముందుగానే ఈ మెరిట్ పెంపును అందిస్తున్నామని, 18 నెలల్లో ఇది మూడో మెరిట్ పెరుగుదల అని కంపెనీ సీఈవో రవికుమార్ వివరించారు. జనవరిలో డైరెక్టర్లు అంతకంటే పైస్థాయివారికి ఇచ్చిన పెంపుతో కలిపి 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు వేతన పెంపును అందుకుంటున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు నిరంతర శిక్షణ, నైపుణ్యం, వృత్తిపరమైన అభివృద్ధిలో కంపెనీ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే అమలు చేస్తున్న ఈ వేతన పెంపు కంపెనీ వన్-టైమ్ టూ-మెరిట్ సైకిల్ పెంపులో భాగం. ఈ వేతన పెంపును గత సంవత్సరమే ప్రకటించారు. 2022 అక్టోబర్లో, ఆపై 2023 ఏప్రిల్లో వేతన పెంపుదల ఉంటుందని కంపెనీ గతంలోనే పేర్కొంది. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!
ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగులు ప్రస్తుతం గడ్డు పరిస్థతిని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశా భావంతో ఉన్న ఉద్యోగులకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు. జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చే పదేళ్లు జీతాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంటోంది. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఆడిట్ అండ్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అధ్యయనం ప్రకారం.. భారతీయ కంపెనీలలో జీతాల సగటు పెంపుదల 2022లో ఉన్న 9.4 శాతం నుంచి 2023లో 9.1 శాతానికి తగ్గుతుందని అంచనా. క్లయింట్ల ఖర్చుల కోతలను ఎదుర్కొంటున్న ఐటీ రంగం దశాబ్దంలో ఎన్నడూ లేనంత దారుణమైన పెంపుదలని చూడనుందని ఈ అధ్యయనం చెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ప్రభావంతో ఐటీ పరిశ్రమలో అట్రీషన్ (ఉద్యోగుల తొలగింపు) రేటు గత ఏడాది 19.7 శాతం ఉండగా రానున్న రోజుల్లో మరింత పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు, డిజిటల్ ఇ-కామర్స్ కంపెనీల నేతృత్వంలో ఐటీ రంగం ఈ దశాబ్దంలో ఉద్యోగుల జీతాల్లో అత్యంత తక్కువ పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆనందోరుప్ ఘోస్ తెలిపారు. మొండి ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఐటీ కంపెనీలను మరింత పొదుపుగా ఉండేలా చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని 2023లో ఇంక్రిమెంట్లు, అట్రిషన్ పరిమాణాలు క్షీణిస్తాయని భావిస్తున్నామన్నారు. గత సంవత్సాల్లో విపరీతంగా నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం క్లయింట్ల దగ్గర నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు లేకపోవడంతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికితోడు ప్రస్తుతం తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం మరింత కుంగదీస్తోంది. ఇప్పటికే అనేక ఎంఎన్సీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రభావం భారతీయ టెక్ రంగంపై కూడా ఉంది. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) 25 రంగాల్లోని 300 కంపెనీల హెచ్ఆర్ హెడ్ల నుంచి డేటాను సేకరించి డెలాయిట్ ఈ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం.. లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు 2023లో అత్యధిక ఇంక్రిమెంట్లను చూస్తాయి. గత ఏడాది 9.7 శాతం ఉన్న వాస్తవిక పెంపుతో పోలిస్తే రెండు రంగల్లోనూ 9.5 శాతం పెంపుదల ఉంటుందని అంచనా. -
ఉద్యోగులకు బంపరాఫర్!
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో సగటున ఉద్యోగుల జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ- కామర్స్, ప్రొఫెషనల్ సర్వీస్, ఐటీ విభాగాల్లో ఈ వేతనాల పెంపు ఉండనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ‘ఫ్యూచర్ ఆఫ్ పే 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలిపింది. గత ఏడాది పెరిగిన సగటు ఉద్యోగుల శాలరీలు 10.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2022లో కంటే.. 2023లో జీత భత్యాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాలైన మైనింగ్, ఎలక్ట్రసిటీ జనరేషన్, పవర్ పాంట్ల్ ఆపరేషన్స్, ఆయిల్ ఫీల్డ్ వర్క్, రీసైక్లింగ్, డ్రైవింగ్ వంటి ఉద్యోగుల జీతాలు తగ్గే అవకాశం ఉన్నట్లు నివేదించింది. జీతాలు పెరిగే రంగాలు ఇవే దేశంలో మొత్తం మూడు రంగాల్లో ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఫ్యూచర్ ఆఫ్ పే 2023 రిపోర్ట్ హైలెట్ చేసింది. వాటిలో ఈ-కామర్స్ విభాగంలో 12.5శాతం, ప్రొఫెషనల్ సర్వీసులైన అకౌంటెంట్స్, డాక్టర్స్, న్యాయవాదులుగా పనిచేసే వారికి 11.9శాతం పెరగ్గా.. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు 10.8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. -
WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్లో భారత్ టాప్!
ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ల ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగులకు ఊరట కలిగించే ఓ సర్వే విడుదైంది. భారత్లో ఈ ఏడాది జీతాలు 10 శాతం మేర పెరగనున్నట్లు తాజాగా ఓ సర్వే పేర్కొంది. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్ రీజియన్లో జీతాల పెరుగుదల భారత్లోనే అత్యధికం. ఇదే 2022లో మన దేశంలో జీతాల పెరుగుదల 9.8 శాతం నమోదైంది. గ్లోబల్ అడ్వయిజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ సంస్థ డబ్ల్యూటీడబ్ల్యూ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం.. ఈ ఏడాదిలో చైనాలో 6 శాతం, వియత్నాంలో 8 శాతం, ఇండోనేషియాలో 7 శాతం, హాంకాంగ్లో 4 శాతం, సింగపూర్లో 4 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జీతాల పెరుగుదల క్షీణించింది. తర్వాత క్రమంగా పుంజకుంది. 2019లో 9.9 శాతం ఉన్న వేతనాలు 2020లో 7.5 శాతం, 2021లో 8.5 శాతం పెరిగాయి. 2022లో 9.8 శాతం పెరిగాయి. ఏయే రంగాల్లో ఎంతెంత? ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మీడియా, గేమింగ్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, కెమికల్స్, రిటైల్ రంగాలలో అత్యధికంగా 10 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా. ఇక తయారీ రంగం, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ రంగాలలో జీతాల పెంపు అంతంత మాత్రమే. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! వ్యాపార అవకాశాలు, ఉద్యోగుల నిలుపుదల ప్రస్తుతం భారతదేశంలో జీతాల పెంపునకు ప్రధాన చోదకాలని డబ్ల్యూటీడబ్ల్యూ ఇండియా వద్ద వర్క్ అండ్ రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్గా ఉన్న రజుల్ మాథుర్ పేర్కొన్నారు. దాదాపు 80 శాతం భారతీయ కంపెనీలు రాబోయే ఈ ఏడాది వ్యాపార ఆదాయాన్ని మరింత పెంచుకునే ఆలోచనతో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో... -
హైదరాబాద్: మెరుపు సమ్మెపై మెట్రో యాజమాన్యం స్పందన
సాక్షి, హైదరాబాద్: జీతాల పెంపు పేరుతో మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. ఐదేళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ.. అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే.. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని.. కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటింగ్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీనగర్) మధ్య టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూ లో టికెట్ల కోసం ప్రయాణికులు అవస్తలు పడుతున్నారు. -
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. దీని ద్వారా దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు రూ.2500-4000 వరకు జీతాలు పెరుగుతాయని చెప్పారు. ఈ నిర్ణయంతో రైల్వే శాఖపై అదనపు భారమేమీ పడదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా రైల్వే శాఖ ఖర్చులు ఆదా చేస్తున్నట్లు వివరించారు. ఈ వేతనాల పెంపుతో ఉద్యోగ స్తబ్ధత ఎదుర్కొంటున్న వేల మంది రైల్వే సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమానంగా వేతనాలు పొందుతారని త్రిపాఠి వివరించారు. 80వేల మంది సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులు హై పే గ్రేడ్కు అర్హులు అవుతారని చెప్పారు. సూపర్వైజరీ క్యాడర్ అప్గ్రేడేషన్కు సంబంధించిన డిమాండ్ 16 ఏళ్లుగా పెండింగ్లో ఉందని త్రిపాఠి వెల్లడించారు. తాజాగా నిర్ణయంతో 50 శాతం మంది లెవెల్7 ఉద్యోగులు లెవెల్ 8కు చేరుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. వేతనాల పెంపుతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వంటి 40వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని త్రిపాఠి వివరించారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
స్పైస్జెట్ సంచలనం: పైలట్లకు 20 శాతం జీతం పెంపు!
సాక్షి, ముంబై: కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్జెట్ పైలట్ల జీతాల విషయంలో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ క్యారియర్ స్పైస్జెట్ అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపును ప్రకటించిందని సీఎన్బీసీ గురువారం నివేదించింది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో కెప్టెన్లు , సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని కెప్టెన్ గుర్చరణ్ అరోరా తెలిపారు. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తాత్కాలిక చర్యగా జీతాలివ్వకుండానే సెప్టెంబరు 21 నుండి మూడు నెలల పాటు లీవ్ వితౌట్ పే కింద 80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. స్పైస్జెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) చెల్లింపులో మొదటి విడతగా సుమారు రూ. 125 కోట్లను గత వారం అందుకుంది. అయితే తాజా పెంపులో ఈ 80 మంది ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు మరోవైపు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్జెట్కు బుధవారం మరో షాక్ ఇచ్చింది. గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలన్న ఆంక్షలను మరో నెలపాటు పాడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి షెడ్యూల్ ముగిసే వరకు (అక్టోబర్ 29, 2022) ఈ ఆంక్షలు కొనసాగుతాయని తన ఆర్డర్లో పేర్కొంది. విమానాలకు సంబంధించిన వరుస సంఘటనల కారణంగా ఈ ఏడాది జూలై 27న స్పైస్జెట్కు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. కాగా గురువారం నాటి మార్కెట్లోస్పైస్జెట్ షేరు 4 శాతం కుప్పకూలింది. ఈ ఏడాది ఏకంగా 40శాతం నష్టపోయింది. -
AP: వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలు పెంపు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో వైద్య విధాన పరిషత్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలను పెంచారు. ప్రస్తుతం ఉన్న రూ.53,000 నుంచి 85,000కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్!) -
శాలరీ ఇంక్రిమెంట్లు.. 2022లో మంచిరోజులు!
కరోనా టైంలో పూర్తిగా మునిగిన మార్కెట్, వ్యాపారాలు.. కాస్తో కూస్తో కొంతకాలంగా కుదుట పడుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా కోలుకోవడానికి ఈ ఏడాది సహకరించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తద్వారా కరోనా ముందు కంటే ఉన్న జీతాల పెంపును ఉద్యోగులు ఆశిస్తుండగా.. 2022లో అది జరగవచ్చనే చెప్తున్నాయి సర్వేలు. కోర్న్ ఫెర్రీ ఇండియా ఆనువల్ రివార్డ్స్ సర్వే ప్రకారం.. కరోనా టైం కంటే ముందున్న స్థితికి ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్ చేరవచ్చనే తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు చిన్నాచితకా, బడా కంపెనీల(ఎంఎన్సీలతో సహా)లో నిర్వహించిన సర్వేల ద్వారా ఈ వివరాల్ని సేకరించారు. గతంలో.. 2019లో యావరేజ్ పే హైక్ భారత్లో 9.25 శాతం ఉండగా.. 2021 ఏడాదికి అది 8.4కి పడిపోయింది కొవిడ్-19 ఎఫెక్ట్తో. అయితే కంపెనీల ఫీడ్బ్యాక్ అనంతరం 2022లో ఇది 9.4 శాతానికి చేరుకోవచ్చని ఈ సర్వే వెల్లడించింది. 2022 ఏడాదిలో వ్యాపారాలపై కరోనా ఎఫెక్ట్ అంతగా ఉండబోదని, పైగా కరోనాతో నష్టపోయిన పరిస్థితుల నుంచి ఈ ఏడాది కచ్చితంగా గట్టెక్కి తీరుతుందని వ్యాపార రంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడడానికి తోడ్పడడంతో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను అందుకుంటుందన్న కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. దాదాపు 40 శాతం ఉద్యోగులు తరలిపోతారనే నివేదికల నేపథ్యంలోనే పలు కంపెనీలు ఈ ఏడాది హైకుల విషయంలో కచ్చితత్వం పాటించాలని నిర్ణయించుకున్నాయట. పారిశ్రామిక నిపుణుల ప్రకారం.. ఇంక్రిమెంట్ల కోసం కేటాయించే బడ్జెట్ సాధారణంగా వ్యాపార తీరు, పారిశ్రామిక గణాంకాలు, బెంచ్మార్క్ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఏడాది సానుకూల ఫలితాల్ని ఆశిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ఏడాది మంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, నైపుణ్యంగల ఉద్యోగుల ఎంపిక దిశగా అన్ని రంగాలు ముందుకెళ్లవచ్చని చెప్తున్నారు. అన్ని రంగాలు కోలుకోవడంతో పాటు గరిష్ఠంగా హైక్ శాతం.. టెక్ కంపెనీలు 10.5 శాతం ఇవ్వాలని అనుకుంటున్నాయని, లైఫ్ సైన్స్ 9.5 శాతం, సేవా, ఆటో, కెమికల్స్ రంగం 9.5 శాతం అంచనా వేస్తున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. మిగతా రంగాల నుంచి 4 శాతానికి తక్కువ కాకుండా శాలరీ హైక్ల ఆలోచనలో ఉన్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. అదే సమయంలో 786 కంపెనీలకుగానూ 60 శాతం కంపెనీలు.. మంత్లీ వైఫై అలవెన్స్లు, యుటిలిటీ బిల్లులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 46 శాతం కంపెనీలు ఉద్యోగుల వెల్నెస్ బెనిఫిట్లు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇక మరో 10 శాతం కంపెనీలు ట్రావెల్ అలవెన్స్ను తగ్గించడమో లేదంటే పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఉన్నాయని సీఎన్బీసీ ఒక కథనం ప్రచురించింది. -
పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనం పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాన్ని పెంచుతూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం మెమో జారీ చేశారు. వీరికి సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టు అధ్యాపకులు రూ.35,120 పొందుతుండగా తాజా ఆదేశాల ప్రకారం అది రూ.40,270కి పెరగనుంది. ఈ వేతనాలు ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి అమలులోకి వస్తాయని మెమోలో పొందుపరిచారు. దీనివల్ల 316 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు జరగనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు పెంచినందుకు పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన ఎంటీఎస్ను అమలు చేసినందుకు మంత్రి గౌతమ్రెడ్డి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధననాయుడు, బి.కృష్ణ పేర్కొన్నారు. -
మూడు నెలలుగా వేతనాల్లేవ్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీలు మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. పెంచిన జీతం సంగతేమోకానీ, ఉన్న జీతమైనా నెలనెలా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఐదో తేదీలోగా జీతాలు చేతికి అందేవి. దీంతో గత మూడు నెలలుగా ప్రతినెలా ఐదోతేదీ ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూడటం, ఆ తర్వాత ఉస్సూరమనడం అంగన్వాడీల వంతైంది. పెంచిన జీతాలకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద అపరిష్కృతంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. వరుసగా మూడు నెలలు నిలిచిపోవడంతో గృహావసరాలు తీర్చుకోలేక తాము ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీలు చెబుతున్నారు. కాస్త ఆలస్యమైనా వేతనాలను నెలవారీగా ఇవ్వాలని టీచర్లు, హెల్పర్ల సంఘాలు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3.989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉండగా, మినీకేంద్రాల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఖాళీలు మినహాయిస్తే రాష్ట్రంలో 58 వేలమంది టీచర్లు, హెల్పర్లు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తవేతనాల అమలుతో లింకు... ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలను ప్రభుత్వం పెంచింది. అంగన్వాడీ టీచర్కు రూ.10,500 నుంచి రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్కు రూ.6,000 నుంచి రూ.7,800కు పెంచగా, వీటిని జూలై నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఆగస్టులో జారీ చేసినప్పటికీ, ఇంకా అమల్లోకి రాలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందలేదని తెలుస్తోంది. కొత్త వేతనాల అమలుకు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, అందువల్లే వేతనాల విడుదలలో జాప్యమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక సమస్యను అధిగమించి బకాయిలతోపాటు ప్రస్తుత వేతనాలను వచ్చే నెలలో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు
దేశంలో ఆర్ధిక వృద్ది తిరిగి పెరగడంతో ప్రతిభ గల ఉద్యోగుల కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనికోసం కంపెనీలు బయట నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడం కోసం తమ ఉద్యోగులకు భారీగా వేతనాన్ని పెంచడానికి సిద్ద పడుతున్నాయి. వేతన పెంపు విషయమై అయాన్ అనే సంస్థ 39 పరిశ్రమల్లో 1,300 సంస్థలతో 26వ వార్షిక వేతన పెంపు సర్వేను నిర్వహించిది. ఈ సర్వే ప్రకారం.. ఇండియా ఇంక్ 2022లో సగటున వేతనాన్ని 9.4 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సూచిక బలమైన ఆర్ధిక రికవరీని సూచిస్తుంది. గత సంవత్సరం వేతన పెంపు కంటే 8.8 శాతం ఎక్కువ. (చదవండి: కరోనా చికిత్సకు ‘హెటెరో’ బూస్ట్) అయాన్ నివేదిక ప్రకారం.. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా తిరిగి పుంజుకుంటున్నాయి. 2022లో టెక్నాలజీ, ఈ-కామర్స్, ఐటీ ఆధారిత రంగాలలో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ సేవలు, శక్తి, ఆతిథ్యం వంటి రంగాలలో అతి తక్కువ పెంపు అనేది ఉండనుంది. ఇంకా, 98.9 శాతం కంపెనీలు ఏడాది క్రితం 97.5 శాతంతో పోలిస్తే 2022లో ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇది ఇలా ఉంటే ఎటువంటి వేతన పెంపు అమలు చేయని కంపెనీల సంఖ్య 2.5 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. చాలా మంది ఉద్యోగులు ఎక్కువ వేతనాన్ని ఆఫర్ చేసే సంస్థలో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. కరోనా మహమ్మరి తర్వాత డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా కంపెనీలు అత్యుత్తమ మానవ వనరులకు ఎక్కువ జీతాన్ని అందించడానికి సిద్దపడుతున్నాయి. ఉత్తమ ప్రతిభ గల ఉద్యోగుల కోసం సంస్థలు తమ వ్యూహాలను రచిస్తున్నాయని సర్వేలో తేలింది. "అత్యధిక అట్రిషన్ రేటు గల రంగాలలో ఐటీ టెక్నాలజీ, ఈ-కామర్స్, ఆర్థిక సంస్థలు" ముందు వరుసలో ఉన్నాయని ఇటీవల రూపంక్ చౌదరి చెప్పారు. అలాగే ఆడిట్, పన్ను, చట్టపరమైన సేవలకు భారీ డిమాండ్ ఉన్నందున వృత్తిపరమైన సేవ రంగాలలో కూడా అధిక అట్రిషన్ రేటు ఉన్నట్లు ఆయన అన్నారు. -
తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. అలాగే మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.6 వేల నుంచి రూ.7800కు పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. (చదవండి: కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే..) -
మెరుగుపడింది జీతాలే... జీవితాలు కాదా!?
పోలీసు శాఖనుండి మొదలుకొని గిడ్డంగుల్లో, జెన్కో, ఫైర్, ఆర్టీవో, ట్రాఫిక్, జైళ్ళు ఇలా ప్రతీశాఖలో విస్తరించి పనిచేస్తున్న ఏకైక సంస్థ హోంగార్డ్స్. 1946 డిసెంబర్ ఆరున బొంబాయి ప్రావెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ శాఖల్లో అదనపు సహయార్థం స్వచ్చంద సంస్థగా దీన్ని స్థాపించారు. తర్వాత 1962లో భారత్–చైనా యుద్ధ సమయంలో వీరిని పునర్వ్యవస్థీకరించారు. ఈ పరంపరలోనే వీరి సేవలు గమనించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాలం టరీ ప్రక్రియ కింద నియామకాలు చేపట్టాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరి జీతాల్లో మార్పులు వచ్చాయి గానీ జీవితాలు మరింత చీకట్లోకి నెట్టివేయబడ్డాయనే చెప్పుకొని తీరాలి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్లో రోజువారీ హోంగార్డుల జీతం రూ. 600 నుండి 710 రూపాయలకు పెంచగా తెలంగాణలో నెలకు 12 వేల నుండి 20 వేల రూపాయలకు పెంచడమే కాకుండా ప్రతీ ఏడాదీ రూ. 1,000 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదెంతో ఆహ్వానించదగిన విషయం. కానీ, ఈ నిర్ణయంతోపాటు అంతకుముందున్న కారుణ్య నియామకాలను తొలగించడం పిడుగులాంటి వార్తనే. ఉద్యోగి సర్వీస్ కాలంలో మరణిస్తే, వైద్య కారణాలవలన ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉద్యోగికి ఏర్పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియమకాలను అమలు పరిచే అవకాశాన్ని హోంగార్డులకు తొలగించారు. దీనితో తెలంగాణలో పనిచేస్తున్న సుమారు 17,490 మంది హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అయితే ఈ కారుణ్య నియామకాలను ఆంధ్రప్రదేశ్లో హోం గార్డ్స్కు అమలు పర్చడమనేది హర్షించదగిన విషయం. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి 2019 తర్వాత హోంగార్డ్స్ జీతాలు పెంపుదల సందర్భంలో డబుల్ బెడ్రూం ఇంటి కలను సాకారం చేస్తానని చెప్పిన వాగ్దానం నేటికీ అలాగే ఉండిపోయింది. పోలీసులకు వర్తించే ఎటువంటి అలవెన్స్ వీరికి వర్తించవు. అనారోగ్యంతో బాధపడే క్షణాల్లో కూడ ఆరోగ్య భద్రత స్కీం వీరికి వర్తించకపోవడం, విధినిర్వహణలో చనిపోయినపుడు పోలీసులకు వర్తించే ఎక్స్గ్రేషియా హోంగార్డ్స్కు లేకపోవడం, పోలీసు శాఖలో కానిస్టేబుల్ వంటి ఉద్యోగులతో పోటీపడి విధినిర్వహణ చేస్తున్నప్పటికీ వీరికి అదనపు అలవెన్స్ లేకపోవడం, పైగా ఏధైనా పండుగ పబ్బానికి సెలవులు పెట్టుకునే సీఎల్(క్యాజువల్ లివ్) వెసులుబాటు లేకపోవడం, రోగమొస్తే మెడికల్ లీవ్ అవకాశం లేకపోవడం, హోంగార్డ్స్ ఏరోజు పనిచేస్తే ఆరోజుకే కూలీ చెల్లించే ధోరణిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుశాఖ అంటేనే డిసిప్లిన్ పేరుమీదుగా దర్జాగా సాగే వెట్టిచాకిరికి ప్రతిరూపంగా ఉంటుంది. హోంగార్డ్స్ ఉద్యోగ భద్రత లేని బానిసల్లాగే కుక్కిన పేనులాగా అధికారుల చేతిలో హింసపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఉన్నతాధికారుల ఆఫీసుల్లో, క్యాంపు కార్యాలయాల్లో, చివరికి వీరి ఇళ్ళలో పాకీ పనులకు, చివరకు సొంతపనులకు కూడ హోంగార్డులను వినియోగించే అధికారులు ఉండటం విచారకరం. ఇకపోతే మహిళ హోంగార్డ్స్ పరిస్థితి మరింత దారుణం. మహిళా హోంగార్డుల పట్ల మాతృత్వ విషయంలో కూడ వివక్ష చూపుతున్నారు. ప్రసూతి సెలవులు మహిళా పోలీసులకు జీతంతో కూడిన ఆరుమాసాల సెలవులైతే మహిళా హోంగార్డులకు మాత్రం మూడునెలల బాలింతగానే విధులకు హజరు కావాల్సిన దుస్థితి ఉన్నది. పైగా డెలివరీ సమయంలో ఎటువంటి భృతీ లభించే పరిస్థితి కూడ లేదు. ఇదికాక లైంగిక వేధింపులు షరామాములుగానే ఉంటాయనేది కాదనలేని విషయం!? ఇటీవల ఎస్ఐ స్థాయి మహిళా అధికారి ఉదంతమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక హోంగార్డులకు మెరుగుపడింది జీతాలే తప్ప జీవితాలు కావనేది చాలా స్పష్టంగా కన్పిస్తున్న యధార్థం. ముఖ్యంగా కారుణ్య నియమకాల విషయంలో కాఠిన్యంతో కాకుండా కరుణతో, మానవీయ కోణంలో తెలంగాణ ప్రభుత్వం యోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. అలాగే హోంగార్డుల వెట్టిచాకిరీని తొలగించి, ఇతర ఉద్యోగులకు మల్లే వీరికీ కనీస హక్కులను కల్పించడంపై మన ప్రభుత్వాలు యోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. వరకుమార్ గుండెపంగు వ్యాసకర్త కథా రచయిత ‘ మొబైల్ : 99485 41711 -
ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు
కరోనా కారణంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఊపందుకుంది. ఐటీ రంగానికి చెందిన ఆరు విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల అవసరం ఉందని సిబ్బంది సేవల సంస్థ ఎక్స్ఫెనో తెలిపింది. ఎక్స్ఫెనో తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ సెక్టార్లో ప్రాడక్ట్, సర్వీస్ విభాగాల్లో వేలల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఇండియన్ ఐటీ సర్వీసులు, స్టార్ట్ అప్లతో పాటు ఇతర ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉద్యోగుల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది. ఆరు విభాగాల్లో ముఖ్యంగా ఫుల్ స్టాక్ డెవలపర్స్, డేటా ఇంజనీర్లు, రియాక్ట్ నెగిటీవ్ డెవలపర్స్, డెవలపర్స్, బ్యాకెండ్ ఇంజినీర్స్, మెషిన్ లెర్నింగ్లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయని చెప్పింది. ఈ ఆరు విభాగాల్లో మొత్తం 70 వేలు, అంతేకంటే ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉందన్న ఎక్స్ఫెనో.. ఎవరైతో ఈ ఉద్యోగాల్లో రాణిస్తారో వారికి అనుభవాన్ని బట్ట 50నుంచి 60శాతం హైక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. గతేడాది ఇదే విభానికి చెందిన 3నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు 20-25 శాతం శాలరీల్ని హైక్ ఇచ్చాయి. కరోనా కారణంగా ప్రాడక్ట్, సర్వీస్ బేస్డ్ రంగాల్లో వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల, శాలరీల విషయంలో ఐటీ కంపెనీలు వెనకడుగు వేయడం లేదని ఎక్స్ఫెనోమ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు గతేడాది ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ 3వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఉద్యోగుల అవసరం పెరిగి 18వేల నుంచి 32వేల మంది ఉద్యోగుల ఎంపిక చేసినట్లు యాక్సెంచర్ సీఈఓ జూలీస్వీట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాబట్టి నిరుద్యోగులు ఈ ఆరురంగాల్లో నిష్ణాతులై ఉండాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. -
ఆందోళన బాటలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు
-
జీతాలు పెంచకపోతే సమ్మె: జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే.. నిమ్స్లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. చదవండి: వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్! -
టీఆర్ఎస్ ఎదురుదాడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతన సవరణ (పీఆర్సీ) వంటి అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్.. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రతి విమర్శలకు సిద్ధమవుతోంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరున్నరేళ్లలో యువత, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ, వేతనాల పెంపు వంటి అంశాలపై రోజుకో నివేదిక విడుదల చేయడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపు వంటి అంశాలు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానుండటంతో ఆయా అంశాలకు సంబంధించిన గణాంకాలను ఎన్నికల ప్రచార ఎజెండాగా మార్చుకోవాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేశామని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు రెండు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రతిస్పందన రావడంతో 1.32 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వ విభాగాలవారీగా విడుదల చేసిన కేటీఆర్... సందేహాలుంటే సంబంధిత విభాగాల్లో సరిచూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా మంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహించలేమనే ప్రధాని ప్రకటనలు తదితరాలపై టీఆర్ఎస్ అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తోంది. ప్రచారాస్త్రంగా వేతనాల పెంపు... వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులపై విమర్శలతోపాటు వేతన సవరణపై ప్రభుత్వ ప్రకటనలో జాప్యంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి పట్టభద్రుల ఎన్నికలపై ప్రభావం చూపకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో తమకున్న అనుబంధాన్ని మరోమారు తెరమీదకు తెచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అత్యధికంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయడంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులకు వేతనాలు సవరించిన తీరుపై తాజాగా గణాంకాలు విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, హోంగార్డులు, జీహెచ్ఎంసీ కార్మికులు తదితరులతో సీఎం స్వయంగా భేటీ కావడంతోపాటు వేతనాలు పెంచిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తుచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిరుద్యోగుల జీతాలను రెట్టింపు చేయడంతోపాటు ప్రతి నెలా వేతనాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఓట్లను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాలు రెట్టింపు చేసిన విషయాన్ని ఎన్నికల ప్రచారాంశాల్లో చేర్చాలని పార్టీ నిర్ణయించింది. హోంగార్డుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల దాకా... రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనం ప్రస్తుతం రూ. 23,250కి చేరగా, 108 సిబ్బందికి రూ. 4 వేలు చొప్పున పెరిగింది. వీఆర్ఏలకు రూ. 10,500, వీఏఓలకు రూ. 5 వేలు, కాంట్రాక్టు లెక్చరర్లకు రూ. 37,100 వేతనాలు ఇస్తున్న విషయాన్ని తాజా నివేదికలో టీఆర్ఎస్ పేర్కొంది. వీరితోపాటు ప్రధానంగా అటెండర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ప్, ఆశా వర్కర్లు, అర్చకులు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు తదితరులకు ఆరున్నరేళ్లలో వేతనాలు పెంచిన తీరును గణాంకాలతో సహా ప్రసంగాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు వివరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాలపైనా గణాంకాలను విడుదల చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని.. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనలు రూపొందించడం, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం వంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ప్రకటించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య కమిటీని సీఎం నియమించారు. ‘కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందనున్న నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం కేబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది’అని సీఎంఓ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం) ఎవరెవరికి పెరుగుతాయంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జుడ్, డెయిలీ వేజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైమ్ కాంటింజెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సెర్ప్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, విద్యావలంటీర్లు, గౌరవ వేతనాలు అందుకుంటున్నవారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. తెలంగాణలో అన్నిరకాల ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపుతో ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం ప్రకటించారు. పరిమితులకు లోబడి.. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల మేర సర్కారుకు సేవలందించే అన్నిరకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే 42 శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది’అని సీఎం పేర్కొన్నారు. చదవండి: (ఆరు నెలల్లో ‘సింగరేణి’ ఖాళీల భర్తీ: ఎన్.శ్రీధర్) రెండు నెలల్లో మొత్తం పూర్తికావాలి.. ‘సమైక్య రాష్ట్రంలో ఉద్యోగుల ప్రతి అంశం చిక్కుముడిగా ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా విధులు నిర్వర్తించే సౌలభ్యం కల్పించడానికి మార్గం సుగమమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. మార్చి నుంచి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వెంటనే పదోన్నతులు ఇవ్వాలి.. ‘ఏపీతో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ గొడవలన్నీ పరిష్కారమయ్యాయి. అందువల్ల వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి. అన్ని శాఖల్లో వెంటనే డీపీసీలు నియమించాలి. పదోన్నతులు ఇవ్వగా ఖాళీ అయిన పోస్టులను త్వరగా భర్తీ చేయాలి. శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి’అని సీఎం సూచించారు. ‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని కచ్చితంగా పట్టించుకోవాలి’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రిటైరైన రోజే అన్ని బెనిఫిట్స్... ‘ఉద్యోగులు దాదాపు 35 ఏళ్లు ప్రభుత్వం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారు. అలాంటి ఉద్యోగులకు చాలా గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగి నుంచి శాఖాధిపతి వరకు ఎవరైనా సరే ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆ కార్యాలయంలోనే ఘనంగా సన్మానం జరపాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలకాలి. ఉద్యోగ విరమణ చేసిన రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణలో ఉండవద్దు’అని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. సత్వరమే కారుణ్య నియామకాలు ‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరం. దుఃఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి’అని కేసీఆర్ ఆదేశించారు. -
విప్రో ఉద్యోగులకు గుడ్న్యూస్!
బెంగళూరు, సాక్షి: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో.. 2021 జనవరి 1 నుంచి అర్హతగల ఉద్యోగులకు వేతన పెంపును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జూనియర్ విభాగం(బీ3 కంటే తక్కువ)లో జీతాలను పెంచనున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అంతేకాకుండా మధ్యస్థాయి విభాగం(సీ1 కంటే పైన)లోనూ వేతన పెంపును పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. అర్హతగల జూనియర్ ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే సీ1 కేటగిరీలో 2021 జూన్ 1 నుంచి పెంపును అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. విప్రోలో బీ3 బ్యాండ్లోనే అధిక శాతం ఉద్యోగులున్నట్లు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కంపెనీకున్న 1.8 లక్షల మంది ఉద్యోగులలో బీ3 వాటా 80 శాతంగా పేర్కొంటున్నారు. ఇతర వివరాలు ఇలా.. బీ3కి ప్రమోషన్లు సంబంధిత వర్గాల అంచనాల ప్రకారం విప్రోలో అర్హతగల ఆఫ్షోర్ ఉద్యోగులకు 6-8 శాతం స్థాయిలో వేతన పెంపు ఉండవచ్చు. ఆన్సైట్ సిబ్బందికి 3-4 శాతం స్థాయిలో జీతాలు పెరిగే వీలుంది. కాగా.. ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 నేపథ్యంలో ఐటీ కంపెనీలు అప్రైజల్ సైకిల్కు సంబంధించి పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా విప్రో జూన్ నుంచి ఇంక్రిమెంట్లను అమలు చేస్తుందని, అయితే సీ1 బ్యాండ్ ఉద్యోగులు ఒక పెంపును మిస్ అయినట్లు తెలియజేశారు. అయితే సంక్షోభ కాలంలోనూ తమ ఉద్యోగులు ప్రస్తావించదగ్గ పనితీరును చూపినట్లు విప్రో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్- డిసెంబర్), క్యూ4(జనవరి-మార్చి)లలో బిజినెస్ మెట్రిక్స్ ఆధారంగా ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే అమలు చేయనున్నట్లు విప్రో తెలియజేసింది. ఇప్పటికే జులై- సెప్టెంబర్ కాలానికి చెల్లింపులు పూర్తయినట్లు పేర్కొంది. బీ3 బ్యాండ్ వరకూ అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు డిసెంబర్ 1 నుంచి ప్రమోషన్లు ఇచ్చినట్లు విప్రో తెలియజేసింది. తద్వారా దాదాపు 7,000 మంది ఉద్యోగులు లబ్ది పొందినట్లు పేర్కొంది. ఇది గత మూడేళ్లలోనే అత్యధికమని తెలియజేసింది. కొత్త సీఐవో కంపెనీకి 25 ఏళ్లపాటు సర్వీసులు అందించిన రోహిత్ అడ్లఖా సీఐవో పదవి నుంచి తప్పుకున్నట్లు విప్రో వెల్లడించింది. దీంతో కొత్త సీఐవోను ఎంపిక చేసేటంతవరకూ ప్రెసిడెంట్, సీవోవో బీఎం భానుమూర్తి ఆ బాధ్యతలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. రోహిత్ ఇప్పటివరకూ చీఫ్ డిజిటల్ ఆఫీసర్, ఏఐ ప్లాట్ఫామ్స్కు హెడ్గా సైతం బాధ్యతలు నిర్వహించినట్లు తెలియజేసింది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్నిస్థాయిలలో జీతాల పెంపు, పదోన్నతులు కల్పిస్తున్నట్టు తెలిపింది. అలాగే జూనియర్లకు ఇన్సెంటివ్ లను అందజేయనున్నట్టు ప్రకటించింది. బుధవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజా నిర్ణయంతో 2.40 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. (ఫలితాల్లో అదరగొట్టిన ఇన్ఫీ) రెండవ త్రైమాసికంలో ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు 100 శాతం వేరియబుల్ పే కూడా అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. జూనియర్ ఉద్యోగులకు క్యూ 3 లో ఒకసారి ప్రత్యేక ప్రోత్సాహాన్ని చెల్లిస్తామని ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ వర్చువల్ బ్రీఫింగ్ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నిబద్ధత అద్వితీయం అంటూ ప్రశంసలు కురిపించారు. జీతాల పెంపు ప్రక్రియ, 2021 జనవరి 1నుండి అమలులోకి వస్తుందన్నారు. గత త్రైమాసికంలో ప్రమోషన్లను నిలిపివేసామని, కానీ ఇపుడు అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు కల్పిస్తామన్నారు. జీతాల పెంపు మునుపటి సంవత్సరాల మాదిరిగానే ఉంటుందని ఇన్ఫీ సీఓఓ ప్రవీణరావు తెలిపారు. గత ఏడాది, భారతదేశంలో ఇన్ఫోసిస్ సగటు వేతనాల పెంపు 6 శాతంగా ఉంది. 2020 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 2,40,208 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా కరోనా సంక్షోభం, వ్యాపారంలో మందగమనం నేపథ్యంలో ప్రమోషన్లు, జీతాల పెంపును నిలిపివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ గతంలో ప్రకటించింది. -
జీతం పెంచలేదన్న పగతో..
చంఢీఘడ్ : జీతం పెంచలేదని, నలుగురి ముందు అవమానించాడన్న కోపంతో దొంగతనం నాటకం ఆడి యజమానిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. అయితే నాటకం రక్తికట్టక చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదాబాద్కు చెందిన దీక్షిత్ అనే వ్యక్తి అక్కడి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అయితే అతడి యజమాని జీతం పెంచకపోగా కొన్నిరోజుల క్రితం దీక్షిత్ను నలుగురి ముందు అవమానించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు యజమానిపై పగతో రగిలిపోయాడు. ఎలాగైనా అతడ్ని దెబ్బతీయాలని నిర్ణయించకున్నాడు. ( ఆన్లైన్లో శృంగారం పేరుతో..) ఓ రోజు యజమాని కంపెనీకి చెందిన 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకువచ్చే పనిని దీక్షిత్కు అప్పజెప్పాడు. ఇదే సరైన సమయం అని భావించిన అతడు దొంగతనం నాటకానికి తెర తీశాడు. డబ్బులు తీసుకువస్తూ ఉండగా ఇద్దరు దొంగలు తనను దోచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ సందర్భంగా దీక్షిత్ గడియకో మాట మాట్లాడుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా విచారించటంతో దీక్షిత్ నేరం ఒప్పుకున్నాడు. -
గాంధీ నర్సులకు వేతనాల పెంపు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు త్వరలో వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారికి ప్రతి నెలా రూ. 17,500 చొప్పున జీతం ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.25వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 212 మంది ఔట్సోర్సింగ్ నర్సులు పనిచేస్తున్నారు. జీవో 14 ప్రకారం ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ అయిన వీరందరికీ రూ.17,500 జీతం ఇస్తున్నా రు. అయితే ఇటీవల కోవిడ్–19 చికిత్స కోసం ని యమితులైన నర్సులకు రూ.25 వేలు చెల్లిస్తున్నా రు. తాము ఎప్పట్నుంచో పనిచేస్తున్నా తక్కువ జీతమివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్ నర్సులు వరుసగా 3 రోజులు ధర్నా చేశారు. దీంతో డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి వారి జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జీతాలు పెంచాలని ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన జీతాలు ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చే అవకాశాలు న్నాయి. జీవో 14 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులయ్యారు. వారంతా కూడా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసే అవకాశం ఉండటంతో పెంచిన వేతనాల ను ఇన్సెంటివ్ రూపంలో ఇస్తే ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇన్సెంటివ్గా వేతనంతో పాటు ఇన్ పేషెంట్ వద్ద సేవలందించే స్టాఫ్ నర్సులకు రోజుకు రూ.300–500 మధ్యలో ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా సమాచారం రాలేదు. కరోనా విధుల్లో ఉన్నవారికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తున్నారు. వరుసగా 5 రోజులు పనిచేస్తే మరో 5 రోజులు సెలవిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ భయంతో కొంతమంది నర్సులు విధులకు హాజరుకావడం లేదు. కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా కూడా చేశారు. బయట నర్సులకు 12 గంటల డ్యూటీలకే రూ.3–4 వేల వరకు ఇస్తున్నారు. అందుకే కోవిడ్ సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలోని ఔట్సోర్సింగ్ నర్సులకు ఈ మేరకు వేతనాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
పంచాయతీ కార్మికుల కష్టానికి ఫలితం
సాక్షి, బాల్కొండ: పెంచిన వేతనాల అమలుకు జీవో జారీ కావడంతో గ్రామ పంచాయతీల్లోని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వాటర్మెన్, ఎలక్ట్రీషియన్లకు ప్రతి నెలా రూ.8,500 వేతనం చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులను జారీ చేసింది. మన ఊరు మన ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీ కార్మికుల వేతనాలను పెంచుతూ రెండు నెలల కిందనే నిర్ణయం తీసుకున్నా ఉత్తర్వులను మాత్రం నిన్న జారీ అయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,057 పంచాయతీల్లో పని చేస్తున్న సుమారు 4,500 మంది కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. పంచాయతీల్లో పని చేసే కార్మికులకు గతంలో అతి తక్కువగా వేతనాలను చెల్లించారు. పంచాయతీల్లో ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్మికులకు వేతనాలను నిర్ణయించారు. అలా ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అం దాయి. రూ.2వేల నుంచి రూ.4వేల లోపు వేతనం అందడంతో కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వం కార్మికులకు పలుమార్లు హామీ ఇచ్చినా వేతనాలను మాత్రం పెంచలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్మికులకు వేతనాలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. అయితే కార్మికులకు వేతనాల చెల్లింపు భారాన్ని మాత్రం పంచాయతీలపైనే ప్రభుత్వం మోపింది. పంచాయతీల్లో ఆదాయం తక్కువగా ఉంటే కార్మికుల వేతనాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధుల నుంచి వినియోగించుకునే వీలు ఉంది. కాగా కార్మికులకు పెంచిన వేతనాలను ఏ విధంగా చెల్లించాలని అనే విషయంపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు జారీ అయితేనే వేతనాల చెల్లింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమకు ఏ విధంగానైనా పెంచిన వేతనాలను చెల్లిస్తే అదే పదివేలు అని కార్మికులు చెబుతున్నారు. కాగా పెంచిన వేతనాన్ని వెంటనే అమలులోకి తీసుకువచ్చి చెల్లింపులు జరుపాలని పలువురు కోరుతున్నారు. సుదీర్ఘ కాలంగా జరిపిన పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచిందని కార్మిక నేతలు పేర్కొన్నారు. కార్మికుల సంబురాలు ఫోరాట ఫలితమే గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు జీవో విడుదల అయ్యిందని మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం ఎదుట సంబురాలు చేశారు. కార్మికులు బాణ సంచా కాల్చారు. స్వీట్లు పంచారు. ఈ సం దర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధానకార్యద ర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు వేతనా లు పెంచాలని ఆందోళనలు చేశారని అన్నా రు. సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు కొక్కండ, అశోక్, నందు, సూరం రవి పాల్గొన్నారు. వేతనం ప్రతినెలా చెల్లించాలి రెండు నెలల కిందనే ప్రభుత్వం మాకు వేతనాలను పెంచింది. అయితే ఇప్పుడు జీవో జారీ అయ్యింది. మాకు రెండు నెలల నుంచి పెంచిన వేతనం అమలు చేయాలి. వేతనంను ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – గజ్జెల మధు, పారిశుద్ధ్య కార్మికుడు, ధర్మోరా -
హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం
-
హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : సుదీర్ఘ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకం, ఆశా వర్కర్ల జీతాల పెంపు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే బడుగు జీవులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం జగన్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాన్ని పెంచారంటూ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. -
ఆశావర్కర్లకు జీతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు జీతం రూ. 10 వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెంచిన జీతం ఈ నెల నుంచే ఇవ్వాలని అందులో ఉంది. గతంలో వారికి మూడువేల రూపాయలే ఉండేది. ఇన్సెంటివ్గా రూ. 5600 వరకు చెల్లించే అవకాశం ఉన్నాచంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం రూ.3వేలే ఇన్సెంటివ్గా చెల్లించేలా సీలింగ్ విధించారు. దీని వల్ల గరిష్టంగా నెలకు రూ. 6వేలు మాత్రమే ఆశ వర్కర్లు పొందారు. దీంతో పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా విని వారికి న్యాయం చేస్తానని వై.ఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే తమకిచ్చిన హామీని నెరవేర్చడం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జీతాల పెంపు.. వారానికి మూడు రోజులు సెలవు
లండన్ : ఉద్యోగం అంటే వారానికి ఆరు రోజులు పని చేస్తే.. ఒక్క రోజు సెలవు దొరుకుతుంది. ఆ రోజు మిగతా పనులతో గడిచిపోతుంది. ఇక కుటుంబంతో తీరిగ్గా గడిపే సమయం ఎక్కడ. ఐటీ ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థల్లో పని చేసే వారికి మాత్రమే వారానికి రెండు రోజుల సెలవు దొరుకుతోంది. మిగతా వారంతా 6 రోజులు పని చేయాల్సిందే. అయితే ఈ విషయంలో బ్రిటన్ ఉద్యోగులు అత్యంత అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నెలకు ఒక్క రోజు సెలవు కోసమే కష్టపడుతుంటే.. అక్కడ ఓ కంపెనీ ఏకంగా వారానికి మూడు రోజులు సెలవు ఇస్తోంది. ఇంగ్లండ్లోని ప్లైమౌత్లో ఉన్న పోర్ట్కలిస్ అనే లీగల్ కంపెనీ ఈ కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఇక మీదట తన ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పని చేస్తే చాలంటుంది. ఇందుకు గాను జీతంలో ఎలాంటి కోతలు ఉండవని చెప్తుంది. ఈ విషయం గురించి కంపెనీ డైరెక్టర్ ట్రేవర్ వర్త్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు నాలుగు రోజుల పని దినాలు కల్పించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుంది. అలసట కూడా తగ్గిపోతుంద’ని తెలిపారు. ప్రాథమిక ఫలితాలను పరిశీలిస్తే తన ఉద్యోగులు గతంతో పోల్చితే చాలా ఆనందంగా ఉంటున్నారని, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నారని వెల్లడించారు. పనిదినాల కుదింపు ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ఉద్యోగుల్లో ఒత్తిడి కనిపించడం లేదని ట్రేవర్ తెలిపారు. మరో న్యూజిలాండ్ కంపెనీ ఈ పద్ధతి అనుసరించి 20 శాతం అదనపు ఉత్పాదకతను సాధించిందట. లాభాలు రావడమే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్యం కూడా బాగా ఉంటోందట. దాంతో తాము కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రేవర్ తెలిపారు. -
కేంద్రం కానుక
గద్వాల న్యూటౌన్/ గద్వాల అర్బన్: ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో వారు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రైమ్ మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద రూ.నాలుగు లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1న ఆశా కార్యకర్తల వేతనం రూ.7,500కు పెంచింది. ఇందుకు సం బంధించిన జీఓ 509 సైతం జారీ చేసింది. దీనికితోడు తాజాగా కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం మరో రూ.1,500 పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, గ్రామీణస్థాయిలో అమలు చేసే ఆరోగ్య సేవలకు ఆశా కార్యకర్తలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఆరోగ్య కార్యక్రమం వీరి ద్వారానే ఆరంభమవుతుంది. జిల్లాలో ప్రతి వేయి జనాభాకు ఒకరు చొప్పున నియమితులయ్యారు. ప్రధానంగా మూడు రకాల సేవలు అందిస్తున్నారు. ఇందులో మొదటిది మాతా, శిశు సంరక్షణ సేవలు. అర్హులైన దంపతులను గుర్తించడం, వారి వివరాలు సేకరించడం.. కుటుంబ నియంత్రణ (తాత్కాలిక) పద్ధతులను తెలియజేయడం.. గర్భిణులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించడం.. వారికి సేవలందించడం.. వైద్యులతో పరీక్షింపజేయడం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిపించుకునేలా చేయడం.. శిశువులకు ఇమ్యునైజేషన్ ఇప్పించడం.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇక రెండో సేవల్లో భాగంగా సంక్రమిక వ్యాధులైన టీబీ, కుష్ఠు, మలేరియా తదితర వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్సీ) నికి తీసుకెళ్లి చికిత్సలు చేయించడం, వారు క్రమంతప్పకుండా మందులు వాడేలా చూస్తారు. దీంతోపాటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తారు. మూడో విధుల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో వీరి పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఇన్ని పనులు చేస్తున్నా ఏడాదిన్నర క్రితం వరకు కేవలం రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలు మాత్రమే పొందేవారు. దీంతో గౌరవ వేతనాలు పెంచాలంటూ అనేక రూపాల్లో ఉద్యమించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ఏడాది మే నుంచి రూ.ఆరు వేలకు పెంచింది. ఇది ఏమాత్రం సరిపోదని అప్పట్లో ఆశా కార్యకర్తలు విన్నవించారు. చివరకు ఈనెల 1న రూ.7,500కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ వేతనాన్ని ఆశా కార్యకర్తలు అక్టోబర్ నుంచి తీసుకోనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వమూ రూ.1,500 పెంచడంతో నవంబర్ నుంచి రూ.తొమ్మిది వేలు అందుకోనున్నారు. 3 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో.. ఇక జిల్లాలో గద్వాల అర్బన్, మల్దకల్, మానవపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 708 కేంద్రాలకుగాను 696మంది అంగన్వాడీ టీచర్లు, 691మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 వేతనం చెల్లిస్తుండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.మూడు వేలు, రాష్ట్రం రూ.7,500 చెల్లిస్తున్నాయి. ఆయాలకు ఇస్తున్న రూ.ఆరు వేలలో కేంద్రం వాటా రూ.1,500, రాష్ట్రం రూ.4,500 చెల్లిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం వచ్చే నెల నుంచి టీచర్లకు రూ.1,500, ఆయాలకు రూ.750 పెంచడంతో నవంబర్ 1న టీచర్లు రూ.12వేలు, ఆయాలు రూ.7,500 తీసుకోనున్నారు. నిరాశలో అంగన్వాడీలు.. మరోవైపు పనికి తగ్గ వేతనం రావడం లేదని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాల అమలు, పెన్షన్, రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, కేంద్రాల నిర్వహణను ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించొద్దని, జీఓ నం.19 రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే విషయమై ఈనెల 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్దకు తరలివెళ్లి తమ వాణిని వినిపించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ, రికార్డుల నిర్వహణ, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, బీఎల్ఓలుగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది మా వేతనాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,500 పెంచు తూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న మమ్మల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం హర్షదాయకం. – సునీత, జిల్లా ఉపాధ్యక్షురాలు, ఆశా కార్యకర్తల సంఘం కనీస వేతనాలు అమలు చేయాలి ఏ ప్రభుత్వ పథకం వచ్చినా లబ్ధిదారులకు చేరాలంటే మేమే ప్రచారం నిర్వహిం చాలి. ఎన్నికల విధుల్లోనూ మమ్మల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కానీ కనీస వేతనం దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం రూ.750 నుంచి రూ.1,500 వరకు పెంచడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటిౖMðనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. – ఎమేలమ్మ, జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ -
ఆశా, అంగన్వాడీలకు కానుక
న్యూఢిల్లీ: లక్షలాది మంది ఆశా, అంగన్వాడి కార్యకర్తలకు ప్రధాని మోదీ తీపి కబురు అందించారు. అక్టోబర్ నుంచి వారి నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆశా కార్యకర్తలను పలు సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకొస్తామని, ప్రధాన్మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రైమ్మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద ఉచిత బీమా కల్పిస్తామని, ఏదైనా ప్రమాదానికి గురైతే వారికి రూ.4 లక్షల వరకు బీమా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. రూ.3 వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 లభిస్తుంది. అలాగే, రూ.2200గా ఉన్నవారి వేతనం రూ.3,500కు పెరగనుంది. అంగన్వాడీ సహాయకుల గౌరవ వేతనాన్ని రూ.1500 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ పెంపు అక్టోబర్ నుంచే అమల్లోకి రాబోతున్నా, నవంబర్ వేతనాల్లో ప్రతిబింబిస్తుందని, ఇది వారికి దీపావళి కానుక అని మోదీ అభివర్ణించారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్(ఐసీడీఎస్–సీఏఎస్) ఉపయోగిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు అదనంగా రూ.250–రూ.500 మధ్య ప్రోత్సాహకాలిస్తామని చెప్పారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించడం సాధారణమే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరుగా ప్రోత్సాహకాలిస్తాయి. దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆరేళ్లలోపున్న చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు సుమారు 10 లక్షల మంది దాకా ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 12,83,707 అంగన్వాడి కార్యకర్తలు, 10,50,564 సహాయకులు వారికి సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ తొలి లబ్ధిదారు కరిష్మ.. నవజాత శిశువుల ఆరోగ్యం, పోషణ ప్రమాణాల పరిరక్షణలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ నెల 23న జార్ఖండ్లో ప్రారంభించబోతున్న ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులను గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు. రక్తహీనత సంబంధిత వ్యాధులను మూడు రెట్లు తగ్గించేందుకు రెట్టింపు ప్రయత్నాలు అవసరమని పిలుపునిచ్చారు. ‘పోషన్ అభియాన్’ లక్ష్యసాధన దిశగా సాంకేతికత సాయంతో వినూత్న పద్ధతుల్లో సేవలందిస్తున్న కార్యకర్తలను మోదీ ప్రశంసించారు. సెప్టెంబర్ మాసాన్ని పోషణకే అంకితం చేస్తున్నామని, గరిష్ట పోషణ ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేపట్టాలని సూచించారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల వేతన పెంపుపై మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పని సంస్కృతిని మార్చేశాం న్యూఢిల్లీ: యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పని సంస్కృతిని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. అణగారిన వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయం, ఆర్థికం, సాంకేతికత సహా అన్ని రంగాల్లో దేశం పురోగమిస్తోందని చెప్పారు. షికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ మఠం మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో ద్వారా మాట్లాడారు. ‘యువత ఆకాంక్షలు, ఆశయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సంస్కృతిలో మార్పులు చేసింది. ఈ సంగతిని గుర్తించి నైపుణ్యాభివృద్ధికే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాం. వినూత్న ఆలోచనలు, అంకుర పరిశ్రమలకు స్టార్టప్ ఇండియా చక్కని వేదికైంది’ అని అన్నారు. -
రెండో రోజూ స్తంభించిన బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: స్వల్ప వేతనాల పెంపును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన రెండు రోజుల సమ్మె గురువారంతో ముగిసింది. దాదాపు 10 లక్షల మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో రెండో రోజున కూడా బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, ప్రభుత్వ ట్రెజరీ.. మనీ మార్కెట్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె ముగియడంతో శుక్రవారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి రానున్నాయి. సమ్మె కాలంలో చెక్కుల క్లియరింగ్ మినహా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగాయి. బ్యాంకుల యాజమాన్యాల అసోసియేషన్ ఐబీఏ ఈసారి రెండు శాతమే వేతనాల పెంపును ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు యూనియన్లు బుధ, గురువారాల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి మొదలైన ప్రాంతాలన్ని చోట్లా ఉద్యోగులు పాల్గొనడంతో సమ్మె ’విజయవంతం’ అయిందని సమ్మెకు పిలుపునిచ్చిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి 80 లక్షల పైచిలుకు చెక్కుల క్లియరింగ్ నిల్చిపోయిందని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని శాఖలూ మూతబడ్డాయని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ హర్వీందర్ సింగ్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా కొన్ని చోట్ల తమ యూనియన్లలో సభ్యత్వం గల ఉద్యోగులు ఉన్నారని, వారు సైతం సమ్మెలో పాల్గొన్నారని సింగ్ వివరించారు. దాదాపు 9 బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు.. యూఎఫ్బీయూలో భాగంగా ఉన్నాయి. మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దేశవ్యాప్తంగా 85,000 పైచిలుకు శాఖలు ఉన్నాయి. -
వర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్లకు భారీగా వేతనాలు
సాక్షి, హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్టైమ్ లెక్చరర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం స్థిరీకరించింది. వేతన స్థిరీకరణ, ఉద్యోగ భద్రత అంశంపై కాంట్రాక్టు, పార్ట్టైమ్ లెక్చరర్లు కొన్నేళ్లుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సమ్మె సైతం చేపట్టారు. దీంతో స్పందించిన ఉన్నత విద్యాశాఖ.. గతేడాది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. విస్తృతంగా అధ్యయనం చేసిన ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. తాజాగా వేతన స్థిరీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1,562 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. వీరితోపాటు పలువురు పార్ట్టైమ్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ సీనియారిటీ ప్రాతిపదికన వేర్వేరుగా గౌరవ వేతనాలను నిర్ణయించారు. కాంట్రాక్టు లెక్చరర్లకు గౌరవమిది: యూటీఏసీటీఎస్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్టైమ్ అధ్యాపకుల వేతన పెంపుపై యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్–తెలంగాణ స్టేట్ (యూటీఏసీటీఎస్) హర్షం ప్రకటించింది. వేతనాల పెంపుతో కాంట్రాక్టు, పార్ట్టైమ్ అధ్యాపకుల గౌరవం పెరిగిందని పేర్కొంటూ.. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పరశురామ్, బి.నిరంజన్ ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలను స్థిరీకరించినందుకు సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులకు.. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా(ఇంజనీరింగ్ స్ట్రీమ్) లేని అధ్యాపకులకు నెలకు రూ.21,600 ఇస్తుండగా.. ఈ వేతనాలను 75శాతం పెంచాలని ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. దీంతో వేతనం రూ.37,800కు పెరగనుంది. నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా (ఇంజనీరింగ్ స్ట్రీమ్) అర్హత ఉన్న అధ్యాపకులకు ప్రస్తుతం నెలకు రూ.24,840 చొప్పున ఇస్తుండగా.. 75 శాతం పెంపుతో రూ.43,470 చొప్పున చెల్లిస్తారు. ఈ అర్హతలు ఉన్న/లేని లెక్చరర్లందరికీ కూడా అదనంగా సర్వీసు, సీనియారిటీ ఆధారంగా ఏడాదికి 3 శాతం చొప్పున పెంపు ఉంటుంది. అంటే అర్హతలు లేని వారికి ఏడాది సర్వీసుతో రూ.38,930 వేతనం అందుతుంది. అర్హతలున్న వారికి ఏడాది సర్వీసుతో రూ.44,700 వేతనం వస్తుంది. ఇలా ఏటా సీనియారిటీ పెరిగిన కొద్దీ వేతనం పెరుగుతుంది. ఇక అదనపు అర్హతలున్న అధ్యాపకులకు ఏటా ఒకసారి రూ.3 వేలు చొప్పున అందజేస్తారు. పార్ట్టైమ్ అధ్యాపకులకు.. ఇక ఉస్మానియా వర్సిటీలో పనిచేస్తున్న పార్ట్టైమ్ అధ్యాపకుల్లో నెట్, సెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మా లేనివారికి ప్రస్తుతం థియరీ క్లాసుకు రూ.475 చొప్పున, గంట పాటు ప్రాక్టికల్ క్లాసుకు రూ.220 చొప్పున గౌరవ వేతనంగా ఇస్తున్నారు. కమిటీ ప్రతిపాదనల మేరకు.. థియరీ క్లాసుకు రూ.600 చొప్పున, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.300 చొప్పున ఇవ్వనున్నారు. అదే అర్హతలున్న పార్ట్టైమ్ అధ్యాపకులకు థియరీ క్లాసుకు రూ.700, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.350 చొప్పున అందజేస్తారు. -
కాగ్నిజెంట్ ‘కీ’ ఎగ్జిక్యూటివ్ల వేతన పెంపు కేవలం...
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కీలక ఎగ్జిక్యూటివ్లకు వేతన పెంపును కేవలం సింగిల్-డిజిట్లోనే చేపట్టింది. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో డి సౌజాతో పాటు మిగతా ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లు - అధ్యక్షుడు రాజీవ్ మెహతా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కరేన్ మెక్లౌగ్లిన్ వేతనాలను 2017లో కేవలం 3 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే పెంచినట్టు వెల్లడైంది. మార్కెట్ ట్రెండ్లను పరిగణలోకి తీసుకున్న కాగ్నిజెంట్ ఈ మేరకు మాత్రమే వేతన పెంపును చేపట్టింది. ప్రత్యక్ష పరిహారాల్లో డి సౌజా పరిహారాలు మొత్తంగా 3 శాతం పెరిగాయి. 2017లో ఈయన పరిహారాలు 12.23 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 3 శాతం మాత్రమే పెరిగాయి. ఇక మెహతా పరంగా చూసుకుంటే, ఆయన 2016 సెప్టెంబర్లో అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందినప్పుడు 14 శాతం పెంపు చేపట్టారు. అనంతరం 2017లో మొత్తంగా ప్రత్యక్ష పరిహారాల్లో కేవలం 3 శాతం పెంపును మాత్రమే ఆయన పొందినట్టు తెలిసింది. ఆయన వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 2016 నుంచి 3 శాతం, 4 శాతం చొప్పున పెరిగాయి. మెక్లౌగ్లిన్ కూడా మొత్తంగా 2017లో తన ప్రత్యక్ష పరిహారాల్లో 8 శాతం పెంపును పొందారు. అయితే 2016లో ఆమెకు బేస్ శాలరీ, వార్షిక నగదు ప్రోత్సహాకాల్లో 17 శాతం పెంపు ఉంది. ఆమె పీఎస్యూ, ఆర్ఎస్యూ గ్రాంట్లు 5 శాతం, 6 శాతం చొప్పున ఉన్నాయి. 2017, 2016లలో కంపెనీ పనితీరు పరంగా ఎగ్జిక్యూటివ్ల పరిహారాల పెంపును చేపట్టామని కంపెనీ చెప్పింది. పరిశ్రమ అంచనాలు, కంపెనీ లక్ష్యాలు, ఎగ్జిక్యూటివ్ల పనితీరు, బాధ్యత, ఎగ్జిక్యూటివ్ టాలెంట్ మార్కెట్ వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు పేర్కొంది. -
భారత క్రికెటర్ల జీతాలు భారీగా పెంపు!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ల పంట పండనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే ఆటగాళ్లకు శుభవార్త తెలపనుంది. బీసీసీఐ బోర్డు పరిధిలో ఆడుతున్న వారందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళి, అండర్-19 క్రికెటర్ల జీతాలు పెరగనున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ చానెల్కు తెలిపారు. దీనికి సంబందించిన ప్రక్రియ దాదాపు పూర్తైందని.. సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆ అధికారి వెల్లడించారు. ఇక భారత పురుషుల జట్టు శ్రీలంక పర్యటనకు ముందే సుమారు 25 మంది క్రికెటర్లను ఏ,బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక కాంట్రాక్టులు అమలు చేయనున్నారు. జీతాల పెంపునకు ఆర్థిక కమిటీ ఆమోదం తెలుపడమే తరువాయి ఐపీఎల్ కన్నా ముందే ఆటగాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఏడాదికి గ్రేడ్-ఏ క్రికెటర్లకు దాదాపుగా రూ.12కోట్లు, బి-గ్రేడ్ రూ.8 కోట్లు, సీ-గ్రేడ్ నాలుగు కోట్లు ఇవ్వనున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఏ స్థాయి గ్రేడ్ ఇవ్వాలనేదాన్ని నిర్ణయిస్తుంది. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రిలు బీసీసీఐ,పాలకుల కమిటీతో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రేడ్ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్ బీ రూ.1 కోటి, గ్రేడ్ సీ ఆటగాళ్లకు రూ.50 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు. -
చాకిరి పోస్టు
‘‘అందరికీ నువ్వు ఆప్త బంధువు. అందరికీ నువ్వు వార్తనందిస్తావు. నీ కథనం మాత్రం నీటిలోనే మథనం. ఇన్ని ఇళ్లు తిరిగినా నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపా లేదు.’’ అంటూ అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలో పోస్టుమన్ దీనస్థితిని తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన అర శతాబ్దం కిందటే కవిత రూపంలో వివరించారు. అయితే.. ఇప్పటికీ తపాలా ఉద్యోగుల జీవితాల్లో వెలుగు లేదు. చాలీచాలని వేతనాలతో అవస్థ పడుతున్నారు. కర్నూలు (ఓల్డ్సిటీ): గ్రామీణ తపాలా ఉద్యోగులను గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్లు) అని కూడా పిలుస్తారు. వీరు ఏళ్ల తరబడి అనేక అవస్థలు పడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరాలు, పార్శిళ్ల బట్వాడా, పొదుపు సభ్యులను చేర్పించడం, డిపాజిట్ల పెంపు, బీమా పాలసీలు చేయించడం వంటి పనులు చేస్తున్నారు. అయినా వీరికి వేతన భరోసా లేదు. పోస్టుమాస్టర్ స్థాయి ఉద్యోగికి కూడా నెలకు రూ.10 వేల వేతనం మించడం లేదు. జీడీఎస్లు రోజుకు మూడు నుంచి ఐదు గంటలు మాత్రమే సేవలు అందిస్తారని భావించిన ప్రభుత్వం.. గతంలో ఆ పని గంటలకు మాత్రమే వేతనం నిర్ణయించింది. నెలకు రూ. 2,265 వేతనంతో పాటు డీఏ రూ.6,000 అందజేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత పింఛన్ ఇవ్వడం లేదు. పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు వర్తించడం లేదు. ఈ ఉద్యోగుల విధి విధానాలు, వేతనాలు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో నియమించిన ఓ కమిటీ ప్రతి ఐదేళ్లకొకసారి అధ్యయనం చేసి.. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అయితే..అందులోని అంశాలు అమలు కావడం లేదు. జిల్లాలో 902 మంది ఉద్యోగులు.. జిల్లాలో జీడీఎస్ పరిధిలో బ్రాంచ్ పోస్టుమాస్టర్లు 442 మంది ఉన్నారు. అలాగే మెయిల్ కొరియర్లు 170, మెయిల్ డెలివర్స్ 268, ఇతర విభాగాల్లో 22 మంది పనిచేస్తున్నారు. మొత్తం 902 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అదనపు పనికి అదనపు వేతనం వంటి నిబంధనలు అమలవుతున్నా.. తపాలా శాఖలో మాత్రం లేదు. పేమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా జీడీఎస్ల పాత్ర ఉంటుందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నా.. గ్రామీణ డాక్ సేవక్లను మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కంటే పనిగంటలు పెరిగాయి. అందుకు తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. అమలు కాని కమలేశ్ చంద్ర కమిటీ సిఫారసులు దేశంలోని 2.70 లక్షల మంది జీడీఎస్ల వేతనాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేశ్ చంద్ర కమిటీ సిఫారసులు అమలుకావడం లేదు. కమిటీ నివేదిక వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం: గ్రామీణ డాక్ సేవక్ల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కమిటీలు చేసే సిఫారసులను కూడా అమలు చేయడంలేదు. 25 ఏళ్లుగా కటారుకొండలో ఉద్యోగం చేస్తున్నా. పని ఎక్కువైంది. ఎనిమిది గంటలు పనిచేస్తున్నప్పటికీ రూ.12 వేల వేతనం కూడా రావడం లేదు. కుటుంబ పోషణకు అవస్థ పడుతున్నా. -కాంతారెడ్డి, బ్రాంచ్ పోస్టుమాస్టర్ కనికరించని పాలకులు: కమిటీలు చేసిన సిఫారసులను పాలకులు పట్టించుకోవడం లేదు. తపాలా వ్యవస్థ, ప్రభుత్వ పథకాల అమలు గ్రామీణ డాక్ సేవక్లపై ఆధారపడి ఉన్నాయి. నన్నూరు బీపీఎంగా ఉండి..శాఖా ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా. కనీసం మా జీవన స్థితిగతులను పాలకులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. - రాధ, గ్రామీణ డాక్ సేవక్ పేరుకే ఉద్యోగులం: ముప్ఫై ఏళ్లుగా గ్రామీణ డాక్ సేవక్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం నెలకు రూ.8 వేల వేతనం వస్తోంది. షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. ఇటీవలే పక్షవాతానికి గురయ్యా. ఇంగ్లిష్ వైద్యానికి డబ్బుల్లేక నంద్యాల సమీపంలో పసరు వైద్యం చేయించుకున్నా. మాకు వైద్యం కూడా ఉచితంగా అందని దుస్థితి. - ఎ.ఆల్ఫ్రెడ్, జీడీఎస్ ప్యాకర్ పేరుకే ఉద్యోగులం: ముప్ఫై ఏళ్లుగా గ్రామీణ డాక్ సేవక్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం నెలకు రూ.8 వేల వేతనం వస్తోంది. షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. ఇటీవలే పక్షవాతానికి గురయ్యా. ఇంగ్లిష్ వైద్యానికి డబ్బుల్లేక నంద్యాల సమీపంలో పసరు వైద్యం చేయించుకున్నా. మాకు వైద్యం కూడా ఉచితంగా అందని దుస్థితి. - ఎ.ఆల్ఫ్రెడ్, జీడీఎస్ ప్యాకర్ -
ఎమ్మెల్యేల వేతనాలు పెంపు, జనం ఫైర్
చెన్నై: తమిళనాడు ఎమ్మెల్యేల వేతనాలు భారీగా పెరిగాయి. శాసనసభ్యుల నెలవారీ వేతనం రూ.55 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. శాసనసభ్యుల స్థానిక సంస్థల అభివృద్ధి నిధులను రూ. 2 కోట్ల నుంచి రెండున్నర కోట్లకు పెంచినట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస మద్దతు ధర కోసం రైతులు రోడ్డక్కినా ప్రభుత్వం పట్టించుకోదు గానీ.. ఎమ్మెల్యేల వేతనాలు మాత్రం పెంచిందని జనం మండిపడుతున్నారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు రైతుల ఆందోళనలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ పాల్గొన్నారు. అన్నదాతలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు పెంపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త. ఇన్నాళ్లు జీతాల పెంపుకోసం వారు చేసిన పోరాటాలకు ప్రతిఫలం లభించింది. వారి జీతాలు రూ.10వేల వరకూ పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు రూ. 27 వేల నుంచి రూ. 37,100కు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వంపై ప్రతీ ఏటా రూ. 37 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. వేతనాల పెంపుపై శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి స్పందిస్తూ.. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల జీతాలను 2015 పీఆర్సీ స్కేల్కు అనుగుణంగా పెంచడం చాలాగొప్ప విషయం. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథం వల్లే ఇది సాధ్యమైందన్నారు. -
కష్టకాలంలో విప్రో ఉద్యోగులకు తీపికబురు
ఓ వైపు ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వ్యయాలు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోతను చేపడుతూ, వేతనాల ఇంక్రిమెంట్లను కంపెనీలు వాయిదావేస్తుంటాయి. కానీ టెక్ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెంచిన వేతనాలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.'' సగటున, ఆఫ్ షోర్ ఉద్యోగులకు మిడ్-సింగిల్ అంకెలలో ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా ఆన్ సైట్ ఉద్యోగులకు వారి వారి భౌగోళిక ప్రాంతాల బట్టి తక్కువ స్థాయి నుంచి మిడ్-సింగిల్ అంకెలలో ఇంక్రిమెంట్ ఉంటుందని పేర్కొంది. మంచి ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు వారి పరిహారాలను భారీగా పెంచుతూ రివార్డు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతేడాది విప్రో ఆఫ్ షోర్ ఉద్యోగులకు సగటున 9.5 శాతం వేతనాన్ని పెంచింది. ఆన్ సైట్ ఉద్యోగులకు 2 శాతం పెంపు చేపట్టింది. కానీ 2016-17 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన విప్రో వార్షికంగా ఈ కంపెనీ 4.7 శాతం మేర పడిపోయిందని తెలిపింది. నాలుగో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల రెవెన్యూలూ కూడా స్వల్పంగా పడిపోయాయి. సోమవారం తెలిసిన వివరాల్లో కంపెనీ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ వేతనం కూడా భారీగా తగ్గినట్టు తెలిసింది. ఎలాంటి కమిషన్లను 2016-17లో అజిమ్ ప్రేమ్ అందుకోలేదు. మొత్తంగా ప్రేమ్ జీ వేతనం ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 63 శాతం తగ్గి, రూ.79 లక్షలను మాత్రమే పొందారు. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు వేతనాల ఇంక్రిమెంట్లను జూలై 1వరకు వాయిదావేస్తున్నట్టు అంతకముందే పేర్కొంది. -
వేతన పెంపు జూలై నుంచి..: ఇన్ఫీ
న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తాజాగా ఉద్యోగుల వేతన పెంపును జూలైకి వాయిదా వేసింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ విషయంలో జీతాల పెంపు మరింత ఆలస్యం కావొచ్చని తెలిపింది. కంపెనీ అమెరికా వంటి కీలక మార్కెట్లలో వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం సహా పలు ప్రతికూల పరిస్థితులతో సతమతమౌతుండటం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సాధారణంగా ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్లను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ ఏడాది మాత్రం వేతన పెంపును తర్వాతి త్రైమాసికం అంటే జూలైకి వాయిదా వేసింది. ఇన్ఫోసిస్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. జాబ్ లెవెల్ 5, దీని కన్నా దిగువ స్థాయి ఉద్యోగులకు వేతన సమీక్ష జులై నుంచి ఉంటుందని ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు ఉద్యోగులకు రాసిన ఈ–మెయిల్లో తెలిపారు. ఇతర స్థాయిల్లోని ఉద్యోగులకు వేతన సమీక్ష తర్వాతి త్రైమాసికాల నుంచి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత అంశాన్ని ప్రస్తావిస్తూ.. పనితీరు ఆధారంగా తొలగింపు ఉంటుందని తెలిపారు. భారీ ఉద్వాసనలు ఉండవు..: నాస్కామ్ నాస్కామ్ ఉద్యోగాల తొలగింపు భయాలను తగ్గించడానికి ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రయత్నిస్తోంది. పరిశ్రమలో భారీ ఉద్యోగాల కోత ఉండదని పేర్కొంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ అనేది సర్వసాధారణమని, ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందని తెలిపింది. అధిక సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు వార్తలు తప్పని పేర్కొంది. పనితీరు మదింపు ప్రక్రియలు కంపెనీల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని తెలిపింది. -
ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు
-
ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లతో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ఆశా వర్కర్ల జీతం నెలకు రూ.6వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే మరోసారి కూడా జీతం పెంచనున్నామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న 1200 ఏఎన్ఎమ్ పోస్టుల భర్తీలో ఆశా వర్కర్లకు తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడి వర్కర్లతో సమానంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల ప్రసవాలు జరిగితే, అందులో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఆస్పత్రిలో జరుగుతున్నాయన్నారు. గ్రామ ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ఆశా వర్కర్లదేనని, వారి పని ఏంటనేది త్వరలోనే కార్యచరణ రూపొందిస్తామన్నారు. ప్రజలు కూడా ఆశా వర్కర్లను వెటకారం చేసే పరిస్థితి మారాలని సీఎం సూచించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం జీతాలు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పెంచిన జీతాలు అమల్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖలు రెన్యువల్ చేస్తాయన్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి భవిష్యత్లో ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని వారు తెలిపారు. -
ఇన్ఫీలో మళ్లీ జీతాల రగడ!
⇒ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్లకు భారీగా వేతనాల పెంపు ఘోరం ⇒ కింది స్థాయి ఉద్యోగులు త్యాగాలు చేయాలా...? ⇒ ఇలా అయితే వారిలో విశ్వాసం సన్నగిల్లుతుంది ⇒ ఇన్ఫోసిస్ విధానాలను తప్పుబట్టిన నారాయణమూర్తి, బాలకృష్ణన్ ⇒ మరోసారి వ్యవస్థాపకులకు, యాజమన్యానికి మధ్య రాజుకున్న వివాదం బెంగళూరు: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, కంపెనీ యాజమాన్యానికి మధ్య మరోసారి వివాదం రగులుకుంది. సీవోవో ప్రవీణ్రావు పారితోషికాన్ని భారీగా పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కంపెనీ వాటాదారులు తాజాగా ఆమోదం తెలిపారు. దీంతో మరోసారి ఈ అంశంపై మాటల యుద్ధం మొదలైంది. వేతనాల విషయంలో కింది స్థాయి ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో ఉన్నత ఉద్యోగులకు పారితోషికాలు భారీగా పెంచడం ఏవిధంగా సమంజసమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. చాలా వరకు కింది స్థాయి ఉద్యోగులకు 6 నుంచి 8 శాతం మేర వేతనాలు పెంచుతూ టాప్ ఎగ్జిక్యూటివ్లకు 60 నుంచి 70 శాతం పెంచడం అనైతికమన్నారు. దీనివల్ల కంపెనీ నాయకత్వం, బోర్డుపై కింది స్థాయి ఉద్యోగుల్లో నమ్మకం పోతుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఎఫ్వో వి.బాలకృష్ణన్ కూడా నారాయణమూర్తికి మద్దతుగా స్వరం కలిపారు. కింది స్థాయి ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో పై స్థాయి ఉద్యోగుల వేతనాలను 40–50 శాతం పెంచడం అన్నది ఏ యాజమాన్యానికైనా ఘోరమైన విషయమని విమర్శించారు. ఇన్ఫోసిస్లో పాలనాపరంగా అత్యున్నత ప్రమాణాలు, విలువలతో ఏర్పాటు చేసిన వ్యవస్థను ప్రస్తుత నాయకత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఇన్ఫోసిస్ చైర్మన్ ఆర్.శేషసాయి తన బాధ్యతల నుంచి వైదొలగాలని, ప్రమాణాల పరిరక్షణకు గాను బోర్డును తిరిగి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రవీణ్రావుకు వార్షికంగా అన్ని రకాల పరిహారాలు కలిపి రూ.8.5 కోట్లు చెల్లించాలని ఇన్ఫోసిస్ బోర్డు గతంలో నిర్ణయం తీసుకుంది. కాగా, కంపెనీ బోర్డుకు, వ్యవస్థాపకుల మధ్య మాటల వివాదం ఇదే మొదటి సారి కాదు. రెండు నెలల క్రితం కంపెనీ సీఈవో విశాల్ సిక్కాతోపాటు నాడు ఉద్యోగులుగా ఉన్న రాజీవ్ బన్సాల్, డేవిడ్ కెన్నడీలకు భారీగా వేతనాలను పెంచడంతో అప్పుడు కూడా కంపెనీ వ్యవస్థాపకులు తప్పుబట్టారు. కంపెనీలో ప్రమోటర్లకు 13 శాతం వాటా ఉంది. నిజమే.. సహేతుకంగా లేదు నారాయణమూర్తి అభ్యంతరాలను ఇన్ఫోసిస్ బోర్డు మాజీ డైరెక్టర్ టీవీ మోహన్దాస్ పాయ్ కూడా సమర్థించారు. సీవోవో యూబీ ప్రవీణ్రావు వేతన పెంపు సహేతుకంగా లేదన్నారు. వేతన పెంపు అద్భుతంగా ఉందని, కానీ ఆయన పనితీరు మాత్రం అలా లేదన్నారు. ఇన్ఫోసిస్ బోర్డు తప్పుదోవ పట్టిందని, గతంలో సీఈవో విశాల్ సిక్కాకు అసమంజసంగా పారితోషికం పెంచారని, దీనివల్ల ఇతర ఎగ్జిక్యూటివ్లు సైతం అధిక వేతనాన్ని ఆశించారని పేర్కొన్నారు. మూర్తితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, పారితోషికాలకు సంబంధించి మనకంటూ విధానాలు ఉన్నాయని, అమెరికా విధానాలను అనుసరించరాదని, ఇన్ఫోసిస్ అమెరికా కంపెనీ కాదన్నారు. ఐటీ పరిశ్రమలో ప్రారంభ స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనాలు గత ఏడేళ్లుగా పెరగలేదని, ఈ దృష్ట్యా ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ల వేతనాలను పెంచుకోవడం పూర్తిగా తప్పుడు చర్యగా పేర్కొన్నారు. పెంపు సరైనదే: ఇన్ఫోసిస్ కంపెనీ సీవోవో ప్రవీణ్రావుకు పారితోషికాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ సమర్థించుకుంది. వాస్తవిక పెంపు 1.4 శాతమేనని పేర్కొంది. ‘‘నగదు విధానంలో చెల్లించే మొత్తం రూ.5.2 కోట్ల నుంచి 4.6 కోట్లకు తగ్గింది. అదే సమయంలో పనితీరు ఆధారితంగా చెల్లించే మొత్తం 45 శాతం నుంచి 63 శాతానికి పెరిగింది. రావుకు కేటాయించిన స్టాక్స్ (ఈఎస్వో)ను పొందేందుకు వేచి ఉండే నాలుగేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంపు కేవలం 1.4 శాతంగానే ఉంటుంది’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలను ఫీడ్బ్యాక్గా తీసుకుంటామని, కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భాగస్వాములతో కలసి పనిచేస్తామని తెలిపింది. -
వీఆర్ఏల వేతనం పెంపు
- రూ.10,500కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం - ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి - స్వగ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు - రెగ్యులర్ నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్ - రాష్ట్రంలోని 19,345 మంది వీఆర్ఏలకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: వారసత్వంగా పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరాలు కురిపించారు. వీఆర్ఏల వేతనాలను 64.61 శాతం పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ.6,500గా ఉన్న వీఆర్ఏల వేతనం రూ.10,500కు పెరగనుంది. అదనంగా రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ను కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కో వీఆర్ఏ వేతనం రూ.4,200 చొప్పున పెరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయి. గ్రామాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నందున ప్రతీ వారసత్వ వీఆర్ఏకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తమ స్వగ్రామంలో ఇల్లు కట్టివ్వాలని, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీఆర్వో, అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 30 శాతం ఉద్యోగాలు వీరికి రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. వెట్టి తదితర పేర్లతో పిలుస్తున్న వారందరినీ ఇకపై గౌరవంగా వీఆర్ఏలు అని సంబోధించాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో వారసత్వంగా పనిచేస్తున్న 19,345 మంది వీఆర్ఏలకు ప్రయోజనం చేకూరుతుంది. వీఆర్ఏ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, చందూలాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వీఆర్ఏ(డైరెక్ట్ రిక్రూటీస్) సంఘం అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు బాలామణి, వీఆర్ఏ(డిపెండెంట్స్) సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లన్న, రాజయ్య, కార్మిక సంఘం నాయకులు జి.రాంబాబుయాదవ్, పి.నారాయణ తదితరులు సీఎంతో చర్చలు జరిపారు. ఒకటో తారీఖున వేతనం.. ‘ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి వీఆర్ఏలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జీతాలను పెంచుతాం. ప్రతి నెలా ఒకటో తారీఖున మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికీ వేతనం అందాలి. వీఆర్ఏలకు గౌరవం కూడా పెరగాలి. వెట్టి, మస్కూరి, కావల్ కార్, కాన్ దార్ తదితర పేర్లతో వీరిని పిలుస్తున్నారు. ఇకపై అలా పిలవవద్దు. ఏ పని చేసే వారైనా సరే వీఆర్ఏ అని మాత్రమే పిలవాలి. పెరిగిన జీతం, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, పిలిచే పిలుపుతో వీఆర్ఏల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూటీల రెగ్యులరైజ్.. పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వీఆర్ఏలుగా పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ‘కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా పోస్టులు అవసరమవుతాయి. ఇంకా ప్రభుత్వంలో ఖాళీలను కూడా గుర్తించాలి. వీరందరినీ రెగ్యులర్ చేయాలి’అని సీఎం అన్నారు. వెంటనే విధివిధానాలు తయారు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ.. తక్కువ వేతనంతో పని చేస్తున్న 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలకు లబ్ధి చేకూరుతుంది.