హైదరాబాద్లో ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
రాజేంద్రనగర్: హైదరాబాద్లో ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 170 వద్ద మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం రాజేంద్రనగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఫారూఖ్(30)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.