రానున్న ఎన్నికల్లో 3 ఎంపీ, 22 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆ జాబితాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అందజేసినట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన పొన్నాలతో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల,నారాయణల మధ్య ఎన్నిలలో పార్టీల పొత్తు, సీట్లు తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో పొత్తు పెట్టుకుని ఎన్నికలల్లోకి వెళ్లాలని కోరుకున్నామని తెలిపారు. అయితే పొత్తులపై టీఆర్ఎస్కు ప్రతిపాదన పంపామని, అయినా ఆ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.