జేఎన్టీయూ వీసీ చాంబర్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జేఎన్టీయూలో ఉద్రిక్తత
Published Mon, Jan 23 2017 12:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
హైదరాబాద్: జేఎన్టీయూ వీసీ చాంబర్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2010 తర్వాత ఎంటెక్ పూర్తి చేసిన వారు టీచింగ్కు అనర్హులంటూ జెఎన్టీయూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆగ్రహించిన ప్రేవేట్ కళాశాల లెక్చరర్లు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ప్రైవేటు కళాశాలల లెక్చరర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో వీసీ చాంబర్ ముట్టడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా పోలీసులు మోహరించారు.
Advertisement
Advertisement