
ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కులేదు: ఈసీ
జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. అలాగే మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా వారికి ఓటు హక్కు లేదన్నారు. బుధవారం రమాకాంత్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడుతూ... ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలంటే ఆయా సమావేశాలలో పాల్గొనవచ్చని తెలిపారు. జడ్పీ, మండలపరిషత్త్ అధ్యక్ష ఎన్నికల్లో కేవలం ఎంపీటీసీ, జడ్పీటీసీలే పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.