కళాశాలకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం | Polytechnic student missing | Sakshi
Sakshi News home page

కళాశాలకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం

Published Thu, Jul 14 2016 6:34 PM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

Polytechnic student missing

యాకుత్‌పురా (హైదరాబాద్) : కళాశాలకని బయటకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మీర్‌చౌక్ పోలీసుల వివరాల  ప్రకారం.. మీరాలంమండి ఇచిబేగ్ కమాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షాహజూర్ కుమారుడు మహ్మద్ ఫారూఖ్ అలియాస్ షోహేబ్ (17) సంజయ్‌ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ నెల 13న ఫారూఖ్ కళాశాలకని ద్విచక్ర వాహనంపై ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement