కార్పొరేట్‌ల కోసమే అడవుల స్వాధీనం | tamminini veerabhadram commented on kcr | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ల కోసమే అడవుల స్వాధీనం

Published Mon, Jan 9 2017 3:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

కార్పొరేట్‌ల కోసమే అడవుల స్వాధీనం - Sakshi

కార్పొరేట్‌ల కోసమే అడవుల స్వాధీనం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
దేవరుప్పుల: భూసేకరణకు నూతన చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ కార్పొరేట్‌ సంస్థల కోసం అడవులను స్వాధీనం చేసుకునేందుకు గిరిజనులపై పంజా విసురుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీసీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలో ఆదివారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు జాటోతు ఠాణూనాయక్‌ స్మారక స్థూపం వద్దకు చేరుకుంది. స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం వీరభద్రం మాట్లాడుతూ హరితహారం పేరిట అడవిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఆదివాసులైన చెంచులు, గోండులు, లంబాడీలు సాగుచేసుకున్న పోడు భూములను హరించడం శోచనీయమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement