టుడే న్యూస్ అప్ డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్ డేట్స్

Published Wed, Dec 23 2015 7:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

today news updates

మొదటిసారి రష్యాకు: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రష్యాకు బయలుదేరి వెళ్లనున్నారు. మోదీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఈ పర్యటనలో భారత్- రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు రక్షణ, అణుఇంధన, ఆర్థిక అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి.

నేటితో 'శీతాకాలం' సరి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొదటి మూడురోజులు రాజ్యాంగం చర్చ తర్వాత పలు వివాదాస్పద అంశాలతో సభ సజావుగా జరగని సంగతి తెలిసిందే. చివరిరోజైన బుధవారమైనా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

స్పీకర్ పై అవిశ్వాసం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేడు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్నది. ఉదయం 10:30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేయనున్నారు.

కేసీఆర్ మెగా యాగం: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తలపెట్టిన ఆయుత మహాచండీ యాగం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 8:10 గంటలకు క్రతువు మొదలవుతుంది. ఈ నెల 27 వరకు జరగనున్న ఈ యాగానికి పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. తొలిరోజు గవర్నర్ నరసింహన్ తోపాటు హైకోర్టు చీఫ్ జస్టీస్ బొసాలే రానున్నారు.

పీవీ వర్ధంతి: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి జ్ఙానభూమి(నెక్లెస్ రోడ్డు) వద్ద ఉదయం 9 గంటల నుంచి అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

లక్ష ఉద్యోగాల సంకల్ప దీక్ష: టీఆర్ఎస్ ప్రభుత్వ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ విస్మరణకు గురైందని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నేటి నుంచి లక్ష ఉద్యోగాల సంకల్ప దీక్షను ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement