
నక్సల్బరీయే పీడిత జనవిముక్తి మార్గం
వరవరరావు మాట్లాడుతూ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఇప్పటి వరకు పార్టీ ఎన్ని చీలికలైందో అంత ఐక్యతను సాధించిందని అన్నారు. గుజరాత్ నుంచి విషపు పడమటి గాలి తెలంగాణకు వీస్తున్నదన్నారు. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నల్లగొండలో రజాకార్లు దాడులు చేసిన ప్రాంతాల్ని సందర్శిస్తున్నారని విమర్శించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ని నిషేధించారే కానీ తన గొంతును నిషేధించలేదనీ, అందుకే మావోయుస్టు పార్టీ కేంద్ర కమిటీ పంపిన ప్రకటనను చదివి వినిపిస్తున్నానంటూ పేర్కొన్నారు. విరసం మరో నేత కల్యాణరావు మాట్లాడుతూ ఆకలి, అంటరానితనం, అసమానతలు న్నంతకాలం సాయుధ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ నక్సల్బరీ విప్లవోద్యమం తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిందన్నారు. వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు నారాయణరావు, నలమాస కృష్ణ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.