మహిళా ఎస్‌ఐ ఆత్మహత్య | Women's inspector commits suicide | Sakshi
Sakshi News home page

మహిళా ఎస్‌ఐ ఆత్మహత్య

Published Wed, Mar 1 2017 2:21 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

పుణే ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహించే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వాతి చౌహాన్‌ (24) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌: పుణే ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహించే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వాతి చౌహాన్‌ (24) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని నేషనల్‌ ఇండస్ట్రీరియల్‌ సెక్యూరిటీ అకాడమీ (నిసా) క్వార్టర్స్‌లో ఈ సంఘటన చోటుచేసు కుంది. ఎస్‌ఐ వెంకన్న ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మురదాబాద్‌ జిల్లాకు చెందిన స్వాతి చౌహాన్‌ పుణే ఎయిర్‌పోర్టులో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. స్వాతి చౌహాన్‌ బంధువు నీలం సింగ్‌ నిసాలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ.. క్వార్టర్‌ నం.59లో కుటుంబ సభ్యులతో కలసి నివాసముంటున్నారు.

ఈ నెల 24న నీలం సింగ్‌ క్వార్టర్‌కు స్వాతి వచ్చింది. ఎప్పుడూ ఏదో బాధపడుతున్నట్లు కనిపించేది. దీనిపై నీలం అడిగినా వివరాలు వెల్లడించకపోగా.. జీవితమంటేనే విరక్తి కలుగుతోందని పలుమార్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం క్వార్టర్స్‌లో ఎవరులేని సమయంలో స్వాతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిసా అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎంఎన్‌ మూర్తి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement