పారిస్ ఉగ్రవాద దాడులను ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ కు అండగా ఉంటామని చెప్పారు. ఎవరేమన్నారంటే..
పారిస్ పై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పారిస్కు భారత్ అండగా ఉంటుంది: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ఉగ్రవాద దాడి ఘటన తీవ్రమనోవేదనకు గురిచేసింది. పేలుళ్లలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలి: భారత ప్రధాని నరేంద్రమోదీ
ఇది కేవలం పారిస్ పై జరిగిన దాడి మాత్రమే కాదు..మానవత్వం పై జరిగిన దాడి. ఫ్రాన్స్కు న్యాయం జరిగేవరకు ఫ్రాన్స్కు మేం అండగా ఉంటాం: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా: ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్
పారిస్ పై ఉగ్రదాడిని ఖండిస్తున్నా: రష్యా అధ్యక్షుడు పుతిన్
ప్రాన్స్లో కాల్పుల ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్