బొగోటా: కొలంబియాలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. కొలంబియా ఈశాన్య రాష్ట్రమైన బుకారమంగ నుంచి విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ పౌర విమానయాన భద్రత కార్యదర్శి వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు మగవారు ఉన్నారని చెప్పారు.
విమాన శకలాలను పర్వత ప్రాంతంలో కనుగొన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పౌర విమానయాన భద్రత కార్యదర్శి తెలిపారు.