సస్పెన్స్‌ థ్రిల్లర్‌ | pranam khareedu teaser launch | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

Mar 1 2019 1:12 AM | Updated on Mar 1 2019 1:12 AM

pranam khareedu teaser launch - Sakshi

ప్రశాంత్, ‘వందేమాతరం’ శ్రీనివాస్, అవంతిక

ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్‌.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్‌. ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం సాంగ్‌ టీజర్‌ని సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ చిత్రానికి నేనే సంగీతం అందించాను. ఇందులోని రెండు పాటల టీజర్స్‌ని నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను  టీజర్‌ చూశా.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని క్రియేట్‌ చేశారనిపించింది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు. ‘‘మా ‘ప్రాణం ఖరీదు’ చిత్రానికి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారి మ్యూజిక్‌ చాలా హెల్ప్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో విడుదల కానుంది’’ అన్నారు ప్రశాంత్‌. ‘‘మా సినిమాని అందరూ చూసి ఆశీర్వదించాలి’’ అని అవంతిక అన్నారు. షఫి, జెమినీ సురేష్, ‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement