
తండ్రీ కూతుళ్లు ఒకే సినిమాలో...
సోనాక్షీ సిన్హా, తన తండ్రి శత్రుఘ్న సిన్హాతో కలిసి నటించనున్నారా...? ఔనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
సోనాక్షీ సిన్హా, తన తండ్రి శత్రుఘ్న సిన్హాతో కలిసి నటించనున్నారా...? ఔనంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో సోనాక్షి నాయిక. శత్రుఘ్నసిన్హా కీలక పాత్రలో నటించనున్నారట. తమిళంలో విజయం సాధించిన ‘మౌన గురు’ చిత్రానికిది రీమేక్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోషించనున్నారట.