Sonakshi Sinha
-
న్యాయం కోసం...
జ్యోతిక, సోనాక్షీ సిన్హా ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కానున్నారు. కానీ ఇది రియల్ కేసు కాదు... రీల్ కేసు. ఇంతకీ విషయం ఏంటంటే... బాలీవుడ్ దర్శకురాలు అశ్వనీ అయ్యర్ తివారి ఓ కోర్టు రూమ్ డ్రామాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ముంబైలో ప్రారంభించాలనుకుంటున్నారు.ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్లో నటించనున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్లో లాయర్గా నటించేది ఎవరు? న్యాయం కోసం పోరాడేది ఎవరు? అనే అంశాలపై మాత్రం ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు ముందుగా కరీనా కపూర్, కియారా అద్వానీలను అనుకున్నారని, ఫైనల్గా జ్యోతిక, సోనాక్షిలు ఫైనల్ అయ్యారని బాలీవుడ్ టాక్. -
భారీ లాభానికి లగ్జరీ అపార్ట్మెంట్ను అమ్మేసిన సోనాక్షి, ఫోటోలు
-
Sonakshi Sinha: పులిని నిద్రపుచ్చుతూ.. సింహం పక్కనే సేదతీరుతూ.. (ఫోటోలు)
-
ఆస్ట్రేలియాలో భర్తతో విన్యాసాలు.. భయపడిపోయిన సోనాక్షి సిన్హ (ఫోటోలు)
-
షూటింగ్లో సేద తీరుతున్న బ్యూటీ.. భయపడిపోయిన సోనాక్షి
భర్తతో బంగీ జంప్.. కేకలు పెట్టిన సోనాక్షిహంపిలో బిగ్బాస్ బ్యూటీ దివిరెడ్ డ్రెస్లో రాయ్ లక్ష్మిపింక్ చీరలో శ్రీలీలపిల్లలతో మన్నారా చోప్రా క్రిస్మస్ సెలబ్రేషన్స్డిసెంబర్ సంగతుల్ని ఫోటోల రూపంలో షేర్ చేసిన పరిణతీ చోప్రా View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు. -
పెళ్లి తర్వాత మరింత గ్లామరస్గా సోనాక్షి (ఫొటోలు)
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
భర్త క్షేమం కోసం...
డిజైనర్ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్కి బాలీవుడ్లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్ ఇక్బాల్పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్ ఇక్బాల్తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్లో జరిగింది. తొలి కర్వా చౌత్ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో రకుల్ ప్రీత్సింగ్ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కాగా ఇటీవల వర్కౌట్ చేస్తుండగా రకుల్కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్ రెస్ట్లో ఉన్నారు. అయితే కర్వా చౌత్ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్ రెస్ట్వాలా ఫస్ట్ కర్వా చౌత్’ అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు రకుల్. అలాగే అదితీ రావ్ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్కిత్ సామ్రాట్తో ఆమె పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.రెండో కర్వా చౌత్కి భర్త పేరులోని ‘ఎస్ఎమ్’ అక్షరాలను మెహిందీ డిజైన్గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్. గత ఏడాది సెప్టెంబర్లో రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్ సింబల్స్తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్ కపూర్ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్ల వివాహం జరిగింది.అయితే ఫాస్టింగ్ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్. కాగా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది. -
చుక్కల డ్రస్లో సోనాక్షి గ్లామర్ ట్రీట్.. తగ్గేదే లే (ఫొటోలు)
-
‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ఈవెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఎన్నేసి మాటలన్నారు.. ఒక్క వీడియోతో ఆన్సరిచ్చిన హీరోయిన్
ప్రేమకు కులమత బేధాలు లేవు. ఈ విషయాన్ని నిరూపించిన ఎంతోమందిలో సోనాక్షి సిన్హ- జహీర్ ఇక్బాల్ జంట ఒకటి. వీరిద్దరూ ఈ ఏడాది జూన్లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పినవారి కంటే విమర్శలతో బురద చల్లినవారే ఎక్కువ!వినాయక చవితి సెలబ్రేషన్స్తిట్లను సైతం కొత్త జంట ఆశీర్వాదంగా తీసుకుంది. తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటినుంచి ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా వీరు వినాయక చవితి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. సోనాక్షి సాంప్రదాయాలను ఇక్బాల్ గౌరవిస్తూ అతడి ఇంట్లోనే వినాయకుడిని ప్రతిష్టించారు. ఇద్దరూ కలిసి పండగను కన్నుల వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వీళ్లిద్దరూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.ఫ్యాన్స్ సంబరంఅందమైన డెకరేషన్ మధ్యలో బొజ్జ గణపయ్యను పూజించిన వీడియోను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇరు వర్గాల సాంప్రదాయాలను గౌరవించుకుంటూ, అన్ని పండగలను కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ మీరు అందరికీ ఆదర్శంగా నిలవండి అని పలువురూ సూచిస్తున్నారు. ఇకపోతే సోనాక్షి చివరగా హీరామండి అనే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో కనిపించింది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Sonakshi Sinha: అమెరికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాక్షి (ఫొటోలు)
-
పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్
హీరోయిన్ సోనాక్షి సిన్హా మొన్నీ మధ్యే జూన్ 23న పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వేడుకంతా ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగాయి. ఇప్పుడు ఆ ఇంటినే అమ్మకానికి పెట్టేసింది. ఈ విషయం ఆమె చెప్పలేదు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పోస్ట్ చేసిన వీడియో వల్ల ఇది బయటపడింది.(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ)ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. దక్షిణాదిలోనూ రజినీకాంత్ 'లింగా' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆడపదడపా సినిమాలు చేస్తోన్న ఈమె.. గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్తో చాన్నాళ్ల క్రితమే ప్రేమలో పడింది. ఈ ఏడాది జూన్లో పెళ్లికి కొన్నిరోజుల ముందు ఈ విషయం బయటపడింది.ఇక 2020లో బాంద్రాలో ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సోనాక్షి.. అదే బిల్డింగ్లో మరో అపార్ట్మెంట్ని గతేడాది మే నెలలో సొంతం చేసుకుంది. తాజాగా అందులోనే తన పెళ్లిని గ్రాండ్గా జరుపుకొంది. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ దీన్ని రూ.25 కోట్ల రేటుకి అమ్మకానికి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి జరిగిన ఇంటిని మరి సోనాక్షి ఎందుకు అమ్మాలనుకుందనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: వెయిట్ చేయండి.. సర్ప్రైజ్ ఇస్తా: హీరోయిన్ సమంత) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
సోనాక్షి బ్యాచిలరేట్ పార్టీ.. ఆ డ్రెస్సును గుర్తు పట్టారా? (ఫొటోలు)
-
గత నెలలో పెళ్లి.. భర్తతో విదేశాలకు చెక్కేసిన హీరోయిన్ (ఫోటోలు)
-
అప్పగింతల్లో ఏడ్చేసిన తల్లి.. ఓదార్చిన హీరోయిన్.. కానీ ఇప్పుడు..
పెళ్లి అంటే ఓ పక్క సంతోషం, మరోపక్క బాధ ఏ అమ్మాయికైనా ఉండేదే! జీవితాంతం తోడుండే అర్ధాంగి దొరికినందుకు సంతోషిస్తూనే.. పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు కన్నీళ్లు రాలుస్తుంటారు. హీరోయిన్ సోనాక్షి సిన్హ కూడా అంతే! ప్రేమించినవాడినే పెళ్లి చేసుకున్నందుకు సంతోషించింది. అంతలోనే పుట్టింటికి దూరమైనందుకు బాధపడుతోంది.ఈ మేరకు తన పెళ్లిలో జరిగిన అప్పగింతల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఇక మీదట ఇంట్లో కనిపించను, వెళ్లిపోతున్నానన్న బాధతో అమ్మ(పూనం సిన్హ) పెళ్లిలో ఏడ్చేసింది. అప్పుడు నేను.. ఏం కాదమ్మా.. బాధపడకు, నేను ఎంతోదూరం వెళ్లట్లేదు. జుహు నుంచి బాంద్రా కేవలం 25 నిమిషాలు మాత్రమే అని చెప్పాను. కానీ ఎందుకో ఈ రోజు వాళ్లను ఇంకా ఎక్కువ మిస్ అవుతున్నాను. అప్పుడు అమ్మను ఓదార్చినట్లే నన్ను నేను ఓదార్చుకుంటున్నాను. ఈ రోజు ఇంట్లో సింధి కూర చేశారనుకుంటున్నాను. త్వరలోనే వాళ్లను కలుస్తాను అని రాసుకొచ్చింది. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే ఆ తల్లి మనసు ఎంత అల్లాడిపోతుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) చదవండి: పేరెంట్స్కు హెచ్చరిక జారీ చేసిన సాయిధరమ్ తేజ్ -
Sanam Ratansi: 'సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్'గా పాపులర్..
సోనాక్షీ సిన్హా తన పెళ్లితో టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయింది. అంతకుముందు నుంచే సనమ్ రతన్సీ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయింది సోనాక్షీ సిన్హా వెన్నంటే ఉంటూ! ఎందుకంటే సనమ్.. సోనాక్షీ పర్సనల్ స్టయిలిస్ట్! అంతేకాదు ఆమెకు సోనాక్షీతో మరో పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆమె.. సోనాక్షీ సిన్హా ఆడపడచు! ఇక్కడ మాత్రం సనమ్ పరిచయం స్టార్ స్టయిలిస్ట్గానే!ఎడిటోరియల్ స్టయిలింగ్, సెలబ్రిటీ స్టయిలింగ్ రెండూ వేటికవే ప్రత్యేకం. అయితే ఎడిటోరియల్ స్టయిలింగ్ కొంచెం కూల్. సెలబ్రిటీ స్టయిలింగ్ కాస్త స్ట్రెస్ఫుల్! కానీ చాలెంజింగ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో నాకు అదితీ రావ్ హైదరీ అంటే ఇష్టం. నా పని మీద ఆమెకు నమ్మకం ఎక్కువ.నేనేది చెప్పినా ఆమె లుక్స్ని ఎన్హాన్స్ చేయడానికే చెబుతానని ఆమెకు తెలుసు. అందుకే నేను ఏ కాస్ట్యూమ్ తెచ్చినా ట్రై చేస్తుంది. స్టయిలింగ్ రంగంలోకి రావాలనుకునే వారికి ఒకటే సలహా.. కొత్త కొత్త ట్రెండ్స్ని గమనిస్తూండాలి. మంచి స్టయిలిస్ట్ల దగ్గర ట్రైన్ అవ్వాలి. వాళ్ల వర్క్తో ఇన్స్పైర్ అవ్వాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ప్రయోగాలకు వెనుకాడకూడదు! – సనమ్ రతన్సీసనమ్.. క్రియేటివ్ జీన్తో సంపన్న కుంటుంబంలో పుట్టిపెరిగింది. ఆమె తండ్రి.. ఇక్బాల్ రతన్సీ స్వర్ణకారుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రియేటివ్ జీన్ని తండ్రి నుంచే పొంది ఉంటుంది సనమ్. ఆమెకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజైన్స్లో పనిచేసింది.ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్గా పాపులర్ అయిన అనాయితా ష్రాఫ్ని కలసింది. ఆమెతో సంభాషణ సనమ్లో స్టయిలింగ్ పట్ల ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. అప్పుడు అనాయితా ఒక బ్రాండ్ అడ్వర్టయిజ్మెంట్ కోసం దీపికా పదుకోణ్కి స్టయిలింగ్ చేస్తోంది. ఆ షూటింగ్ విరామంలోనే అనాయితాను సనమ్ కలసింది. స్టయిలింగ్ పట్ల సనమ్ చూపిస్తున్న ఉత్సుకతను గుర్తించిన అనాయితా ఆ షూటింగ్లో తన పనిని గమనించమని సనమ్కి చెప్పింది.షూటింగ్ పూర్తయ్యాక అడిగింది ‘స్టిల్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టయిలింగ్?’ అని! ‘ఎస్.. వెరీమచ్!’ అని బదులిచ్చింది సనమ్. ‘అయితే నా దగ్గర జాయినై పో.. రేపటి నుంచే వచ్చేసెయ్’ అంటూ తన కంపెనీ ‘స్టయిల్ సెల్’లో సనమ్కి జాబ్ కన్ఫర్మ్ చేసింది అనాయితా. తెల్లవారి నుంచే ‘రా–వన్’ షూటింగ్కి బయలుదేరింది సనమ్.. అనాయితాకు అసిస్టెంట్గా! ఆ సినిమా హీరో షారుఖ్ ఖాన్కి అనాయితా స్టయిలింగ్ చేస్తోందప్పుడు.ఆ ప్రాజెక్ట్ తర్వాత అవకాశాల కోసం వెదుక్కోవలసిన అవసరం లేకపోయింది సనమ్కి. ఇంకెవరి రికమండేషన్ పనీ పడలేదు. సెలబ్రిటీ ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె వర్క్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్కి నచ్చింది. సైఫ్ అలీ ఖాన్, అదితీ రావ్ హైదరీ, హుమా ఖురేషీ, రాజ్కుమార్ రావు, మనీషా కోయిరాలా, జహీర్ ఇక్బాల్, అలయా ఎఫ్, రియా చక్రవర్తి, కత్రినా కైఫ్లాంటి వాళ్లెందరో కోరి మరీ సనమ్ను తమ పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకున్నారు. ఫితూర్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, మలాల్ వంటి సినిమాలకూ పనిచేసింది. తన కీర్తిని పెంచుకుంది. -
హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్లో మృణాల్!
సన్నాఫ్ సర్దార్గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్లోనూ నటించనున్నారని, హీరోయిన్గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ని స్కాట్లాండ్లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్రియుడితో పెళ్లి.. హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్!
బాలీవుడ్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్కు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పాక్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తీసుకొచ్చారు. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్స్ నటించారు.సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవల హీరామండి భామ సోనాక్షి సిన్హా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ సినీతారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.తాజాాగా ఈ జంట హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్లో చిల్ అవుతూ హనీమూన్ ఆస్వాదిస్తున్నారు. కాగా.. జూన్ 23న ముంబయిలో జరిగిన వివాహ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, కాజోల్, రిచా చద్దా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. View this post on Instagram A post shared by HT City (@htcity) -
హీరోయిన్ చెప్పులు మోసిన భర్త.. ఇలాగే ఉంటుంది మరి!
ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్ను, నన్నే చూపిస్తానంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హ. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ సుందరి భర్త గురించే ఈ పాట పాడుతోంది. ప్రియుడు జహీర్ ఇక్బాల్ భర్తగా మారినా తనపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదంటోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సోనాక్షి హీల్స్ (చెప్పులు)ను ఇక్బాల్ తన చేతులతో పట్టుకుని ముందు నడుస్తున్నాడు. పెళ్లిపై ట్రోలింగ్భార్యపై చిరాకు పడకుండా నవ్వుతూనే చెప్పులు మోశాడు. కరెక్ట్ పర్సన్ను పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని హీరోయిన్ రాసుకొచ్చింది. ఇకపోతే సోనాక్షి- ఇక్బాల్ పెళ్లిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇద్దరూ విభిన్న వర్గానికి చెందినవారు కావడంతో ఈ జంటపై నెటిజన్లు విషం చిమ్మారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి అనరాని మాటలు అన్నారు.సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హఆస్పత్రిలో తండ్రిమరోవైపు హీరోయిన్ పెళ్లి జరిగిన రెండు రోజులకే తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిపాలయ్యాడు. సర్జరీ చేయించుకోబోతున్నాడని రూమర్లు రాగా వాటిని ఆయన కుమారుడు లవ్ సిన్హ కొట్టిపారేశాడు. తీవ్ర జ్వరం కారణంగానే ఆస్పత్రిలో చేరాడని, సర్జరీ వంటిదేమీ లేదని స్పష్టం చేశాడు.చదవండి: ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే -
ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్కు కౌంటరిచ్చిన హీరోయిన్!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. సోనాక్షి, జహీర్ వేర్వేరు వర్గానికి చెందినవారు కావడంతో నెటిజన్లు ఈ జంటను దుమ్మెత్తిపోస్తున్నారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి పెళ్లైన మరుక్షణం నుంచే విమర్శల బాణాలు ఎక్కుపెట్టి సూటిపోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. ఈ వ్యతిరేకత తారా స్థాయిలో ఉండటంతో సోనాక్షి, ఇక్బాల్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కామెంట్ సెక్షన్ను సైతం ఆఫ్ చేశారు. కరెక్ట్గా చెప్పావ్అయినప్పటికీ సోషల్ మీడియాలో కొత్త జంటపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రసాద్ భట్ అనే ఆర్టిస్టు సోనాక్షి- ఇక్బాల్ దంపతుల గ్రాఫిక్ పిక్ను డిజైన్ చేసి ఇన్స్టాగ్రామ్లో వదిలాడు. అన్నింటికంటే ప్రేమ అనే మతమే గొప్పది అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన సోనాక్షి.. చాలా కరెక్ట్గా చెప్పావు అని రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్తో ఆమె ట్రోలర్స్కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.నా కూతురు ఏ తప్పూ చేయలేదుమరోవైపు తన కూతురిని ట్రోల్ చేస్తున్నవారిపై సోనాక్షి తండ్రి, నటుడు శతృఘ్న సిగ్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఉద్యోగం సద్యోగం ఏదీ లేకుండా ఉన్నవాళ్లందరూ ఇలా అవతలివారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నా కూతురు ఏ తప్పూ చేయలేదు. పెళ్లి అనేది ఇద్దరు మనుషుల ఇష్టం. అందులో తలదూర్చే హక్కు ఎవరికీ లేదు. విమర్శించేవాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ముందు వెళ్లి మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. ఏదైనా పనికొచ్చే పని చేయండి' అని మండిపడ్డాడు. View this post on Instagram A post shared by Prasad Bhat (Graphicurry) (@prasadbhatart)చదవండి: హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే? -
నేరుగా ఓటీటీకి హారర్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో హారర్, కామెడీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా అలాంటి చిత్రం ద్వారా అలరించేందుకు వస్తోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. కకుడా అనే మూవీతో అభిమానులను పలకరించునుంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్, సాక్విబ్ సలీమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్ కామెడీ కథాంశంతో మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్దర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. జూలై 12వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. తాజా పోస్టర్ చూస్తే దెయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది సోనాక్షి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ తారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. Purushon Ke Hit Mein Jaari ⚠️- #Kakuda aa raha hai ‘12 July’ ko, toh ghar pe rahein aur theek 7:15 baje, darwaza khula rakhna naa bhoolein. 👻Kyunki #AbMardKhatreMeinHai, #Kakuda only on #ZEE5#KakudaOnZEE5 pic.twitter.com/wzHOVtE4j8— ZEE5 (@ZEE5India) June 21, 2024 -
ఏడేళ్ల సావాసం.. ప్రియుడితో పెళ్లి.. అంతలోనే మొదటిదెబ్బ! (ఫోటోలు)
-
బాలీవుడ్ బ్యూటీ పెళ్లి.. సొంత అన్నయ్యలే గైర్హాజరు.. ఇష్టం లేదనే!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ పెళ్లికూతురిగా ముస్తాబయింది. చేతికి ఎర్రగా పండిన గోరింటాకు, ఎర్రటి పట్టుచీర, చీరకు తగ్గట్లుగా రెడ్ బ్యాంగిల్స్.. సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఎంతో అందంగా రెడీ అయింది. ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్న జహీర్ ఇక్బాల్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే తన పెళ్లికి సోనాక్షి అన్నలిద్దరూ హాజరవలేదు. లవ్ సిన్హా, ఖుష్ సిన్హా ఎక్కడని అంతా ఆరా తీశారు. కానీ సమాధానం దొరకలేదు. చెల్లి పెళ్లిని ముందుండి జరిపించాల్సిన వారు కనిపించకుండా పోవడమేంటని అతిథులు సైతం ఆశ్చర్యపోయారు.పెళ్లికి డుమ్మాసోనాక్షి పెళ్లికి తన పేరెంట్స్ హాజరయ్యారు కానీ ఆమె సోదరులిద్దరూ అటు వివాహానికి, ఇటు రిసెప్షన్కు దేనికీ హాజరవలేదని తెలుస్తోంది. వ్యాపారి ఇక్బాల్ రతాన్సీ కుమారుడు జహీర్ను సోనాక్షి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమె అన్నలిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి లవ్ సిన్హాకు ప్రశ్నలు ఎదురవగా అతడు ఇలా స్పందించాడు. ఒక రెండు రోజులు సమయం ఇవ్వండి. నాకు బదులివ్వాలని అనిపిస్తే అప్పుడు మీరడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని దాటవేశాడు.మీ అన్నయ్యలెక్కడ?కాగా పెళ్లికూతురి సోదరుడు చేయాల్సిన కొన్న పనులను సోనాక్షి స్నేహితుడు, నటుడు సఖీబ్ సలీమ్ తన భుజాన వేసుకున్నాడు. ఆమెను మండపానికి తీసుకొచ్చేటప్పుడు పూల చద్దర్ను సఖీబ్ పట్టుకుని నడిచాడు. ఈ వీడియో వైరల్గా మారగా.. అదేంటి నీకు ఇద్దరన్నలు ఉన్నారు.. వాళ్లు ఎక్కడా కనిపించడం లేదేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. Most Beautiful And Happiest Moments For Sonakshi Sinha And Zaheer Iqbal Congratulations 🎉👏 शादी मुबारक" ❤️💫#SonakshiSinha_Weds_ZaheerIqbal #SaiKetanRao#SonakshiSinha #ZaheerIqbal pic.twitter.com/UA2ou5WxHn— 𝐊𝐡𝐚𝐧 𓅋 (@Itsmesany_) June 23, 2024 చదవండి: కల్కి 2898 ఏడీ.. కారులో కూర్చొని సినిమా చూసేయొచ్చు! -
బనారస్ చీరలో బాలీవుడ్ బ్యూటీ రిసెప్షన్.. ధరెంతంటే?
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. మనసారా ప్రేమించిన జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. ఇరుకుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం(జూన్ 23న) ఈ రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి సింపుల్గా చేసినా రిసెప్షన్ గ్రాండ్గా నిర్వహించారు.సోనాక్షి హంగూఆర్భాటాలకు వెళ్లకుండా తల్లి పెళ్లినాటి చికంకారీ చీరను, నగలను తన వివాహానికి ధరించింది. అమ్మ పెళ్లి చీరలో మెరిసిన ఈ బ్యూటీ రిసెప్షన్కు మాత్రం సింధూరం రంగులో ఉన్న బనారస్ పట్టు చీరను ఎంచుకుంది.చాంద్ బుట్టా, జరీ బార్డర్ చీరకే ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఈ ఎర్ర చీర ఖరీదు రూ.79,800 అని తెలుస్తోంది. ఈ చీరకు మ్యాచింగ్గా మామూలు రెడ్ జాకెట్ ధరించింది. జడ కొప్పు వేసుకుని మల్లెపూలు పెట్టుకుంది. నుదుటన సింధూరంతో సోనాక్షి ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. రిసెప్షన్లో భర్తతో కలిసి డ్యాన్స్ చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Star Style Story 🦋 (@starstylestory) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona)చదవండి: పవన్తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. అది అసలు విషయం -
నటి సోనాక్షి సిన్హా వివాహం.. ఫొటోలు వైరల్
-
ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ముంబయిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోనాక్షి తన అభిమానులతో పంచుకున్నారు. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సోనాక్షిని చేతిని ఇక్బాల్ ముద్దాడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు, సినీతారలు సోనాక్షికి అభినందనలు చెబుతున్నారు.సోనాక్షి తన ఇన్స్టాలో రాస్తూ.. " సరిగ్గా ఏడేళ్ల క్రితం (23.06.2017) ఇదే రోజున మేము ప్రేమలో పడ్డాం. ఈ రోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లను దాటి విజయం సాధించాం. ఇది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఈ క్షణం. మా ఇద్దరి కుటుంబాలు, దేవుళ్ల ఆశీర్వాదంతో మేము ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాం. ఇక్కడ నుంచి ఎప్పటికీ ఒకరికొకరు ప్రేమతో పాటు అన్ని విషయాలు కలిసికట్టుగా ఉంటాం.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. వీరిద్దరు 2022లో విడుదలైన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలైన హీరామండి వెబ్ సిరీస్లో మెప్పించింది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
హీరోయిన్ సోనాక్షిపెళ్లికి రెడీ,మెహెందీ ఫోటోలు వైరల్
-
పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ.. మెహందీ ఫోటో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ను ప్రేమ వివాహం చేసుకోబోతుంది. రేపే(జూన్ 23) వీరి పెళ్లి జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రహస్యంగానే పెళ్లి పనులు షూరు చేశారు. తాజాగా ముంబైలోని సోనాక్షి ఇంట మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలా ప్రేమలో పడి.. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో సోనాక్షి, ఇక్బాల్ జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించాలేదు. బాలీవుడ్లో వార్తలు వచ్చిన స్పందించకపోవడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికి తెలిసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇటీవల తరచు వినిపించాయి. కానీ సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా మాత్రం...తన కూతురు ప్రేమ, పెళ్లి గురించి తెలియదని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఈ పెళ్లి అతనికి ఇష్టంలేదనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల కాబోయే అల్లుడుని హత్తుకొని ఫోటో దిగి.. తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని చెప్పకనే చెప్పారు. అంతేకాదు తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లినే తానే దగ్గరుండి ఘనంగా చేస్తానని ప్రకటించాడు. View this post on Instagram A post shared by Prachi Mishra Raghavendra (@mishraprachi) -
నా ఏకైక కుమార్తె పెళ్లి.. మీకు అనవసరం: హీరోయిన్ తండ్రి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవల హీరామండి వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లికి రెడీ అయిపోయింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడనుంది. ఈనెల 23 ముంబయిలోని బాస్టియన్లో ఈ జంట ఒక్కటి కానుంది. చాలా ఏళ్లుగా వీరిద్దరు సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారు. అయితే గతంలోనే సోనాక్షి పెళ్లి గురించి తమకేలాంటి సమాచారం లేదని ఆమె తండ్రి శతృఘ్న సిన్హా అన్నారు. దీంతో ఆయన కూతురి పెళ్లికి వెళ్లడం లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆయన తనపై వచ్చిన వార్తలను ఖండించారు. తన కూతురి వివాహానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఇది మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..' సోనాక్షి నా ఏకైక కుమార్తె. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. నేనే తన బలం అని చాలాసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తాను' అని అన్నారు. అయతే మరోవైపు ఆమె తల్లి పూనమ్ సిన్హా, ఆమె సోదరుడు లవ్ సిన్హా ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్స్టాలోను సోనాక్షి సన్హాను అన్ ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ప్రస్తుతం సోనాక్షి.. తన కాబోయే భర్త కుటుంబంతోనే ఉంది. -
మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టింది. ఇంతకాలంగా కెరీర్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం పర్సనల్ లైఫ్పై శ్రద్ధ పెట్టింది. సింగిల్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టి మ్యారీడ్ లైఫ్కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది.వారం రోజుల్లో పెళ్లిఈ నెల 23న ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లి చేసుకోనున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు ఓ వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట వైరలయింది. ఇప్పటివరకు రూమర్డ్ లవ్ బర్డ్స్లా ఉన్నాం. ఇకమీద భార్యాభర్తలుగా మారబోతున్నాం. జూన్ 23న రోజు మీకు ఏ పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి మా పెళ్లి వేడుకకు వచ్చేయండి అని ఇన్విటేషన్ కార్డులో రాసుకొచ్చారు.ఫాదర్స్డే.. ప్రియుడి ఇంట్లోఆదివారం (జూన్ 16) ఫాదర్స్ డే సందర్భంగా జహీర్ ఇక్బాల్ సోదరి, సెలబ్రిటీ స్టైలిస్ట్ సనం రతంసి ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో జహీర్ తన కుటుంబంతో కలిసి ఫోటోకు పోజిచ్చాడు. ఆ ఫోటోలో సోనాక్షి సిన్హ కూడా ఉండటం విశేషం. ఈ ఒక్క పిక్తో వీళ్ల పెళ్లి నిజమేనని ఖరారైపోయింది.చదవండి: నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు -
నా కూతురి పెళ్లి గురించి తెలియదు: సోనాక్షి తండ్రి కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, నటుడైన జహీర్ ఇక్బాల్తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబయిలో జరిగనున్న వీరి వివాహానికి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. సోనాక్షి పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కూతురు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొన్నారు. సోనాక్షి, జహీర్ల వివాహం గురించి తనకు తెలియదని.. అయితే వారి బంధానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. పెళ్లి విషయం నాకు తెలిసినప్పుడు ఆ జంటను ఆశీర్వదిస్తానని శత్రుఘ్న సిన్హా అన్నారు.శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.."నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా. నా కుమార్తె పెళ్లి గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. తన పెళ్లి గురించి నాతో ఏం చెప్పలేదు. నేను కూడా మీడియాలో చదివి మాత్రమే తెలుసుకున్నా. ఒకవేళ తాను మాకు చెబితే నేను, నా భార్య ఆశీస్సులు అందిస్తాం. మేము కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. తనకు స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం లేదు.' అని చెప్పారు.కాగా.. సోనాక్షి, జహీర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు తమ రిలేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పుటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. కాగా.. సోనాక్షి ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి, జహీర్ 2022లో వచ్చిన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో కలిసి నటించారు. -
పెళ్లి చేసుకోబోతున్న హీరామండి నటి.. వరుడు ఎవరంటే?
బాలీవుడ్ భామ, హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. నటుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ముంబయిలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా..కొన్నేళ్లుగా సోనాక్షి, జహీర్ డేటింగ్లో ఉన్నారు. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.ఇటీవల సోనాక్షి సిన్హా బర్త్ డే సందర్భంగా ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషెస్ తెలిపారు. ఇన్స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. వీరితో పాటు హీరామాండి నటీనటులను కూడా వివాహానికి ఆహ్వానించారు. కాగా.. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భాన్సాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మధ్య కాలంలో లాహోర్లో రెడ్లైట్ ప్రాంతంగా పేరున్న హీరామండిలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు భన్సాలీ. (చదవండి: హీరామండి రివ్యూ)మనీషా కోయిరాలా , అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా , ఫర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్ పాత్ర వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్ సీన్స్, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్ చేసిందని చెప్పుకొచ్చింది. ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్తో కలిసి సోనాక్షి ఇంటిమేట్ సీన్స్లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్ చెప్పాడు. -
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
ఐస్లా కూల్ లుక్తో హాట్ బ్యూటీ అషూరెడ్డిటైట్ ఫిట్ డ్రస్సులో మెంటలెక్కిస్తున్న రితికఓరకంట చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన తృప్తి దిమ్రితెగ కష్టపడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్వంగి మరీ అందాల విందు చేస్తున్న అనన్య పాండేబుక్ చదువుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న మాళవిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Sonakshi Sinha Photos: వెల్వెట్ డ్రెస్లో అందంగా.. సోనాక్షి (ఫొటోలు)
-
అజంతా శిల్పంలా మెరిసిపోతున్న సోనాక్షి సిన్హా (ఫొటోలు)
-
అభిమానులతో గైటీ గెలాక్సీలో సందడి చేసిన సోనాక్షి సిన్హా (ఫోటోలు)
-
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
'స్కంద' బ్యూటీ వయ్యారాలు.. లుక్ మార్చిన సోనాక్షి
క్యూట్ పోజుల్లో 'అమిగోస్' బ్యూటీ ఆషిక ఒంపుసొంపులతో కవ్విస్తున్న 'స్కంద' హీరోయిన్ జైలర్ పాటకు స్టెప్పులేసిన అషూరెడ్డి రోజురోజుకీ మరింత అందంగా మీనాక్షి చౌదరి డ్రస్తో మెరిసిపోతున్న హీరోయిన్ అమీ జాక్సన్ కలర్ఫుల్ చిలకలా జిగేలుమంటున్న సోనాక్షి సిన్హా View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
దబాంగ్ సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దహాద్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించింది. సోనాక్షికి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా ఈ దబాంగ్ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బీటౌన్లో వినిపిస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!) సోనాక్షి సిన్హా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది. బాంద్రా ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం సముద్ర పక్కనే ఉండడంతో సినీ ప్రముఖులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సోనాక్షి అపార్ట్మెంట్ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ సౌకర్యాలు అపార్ట్మెంట్లో నాలుగు కార్లకు పార్కింగ్ సౌకర్యం, లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా ఉంది. 2020లో కూడా రూ. 14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోనాక్షి రాబోయే సినిమాలు సోనాక్షి చివరిసారిగా విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన వెబ్ సిరీస్ దహాద్లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో నటించనుంది. దీనికి ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో సోనాక్షి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
అదిరిపోయే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సోనాక్షి సిన్హా (ఫొటోలు)
-
వేశ్యల జీవిత కథ ఆధారంగా హీరామండిలో..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. మనీషా కొయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ను శనివారం విడుదల చేశారు. లాహోర్ బ్యాక్డ్రాప్లో ఒకప్పటి వేశ్యల జీవితాల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించారు. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్లలో రాయల్ లుక్లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
అందాలు ఆరబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (ఫొటోలు)
-
హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన శిఖర్ ధవన్
దక్షిణాఫ్రికాతో జరగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తున్న శిఖర్ ధవన్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్ ఎక్సెల్ సినిమాతో గబ్బర్ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) చిత్ర కధానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ.. గబ్బర్తో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేస్తున్న సీన్ను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్... ఫైనల్లీ అంటూ శిఖర్ ధవన్ను ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ క్రికెట్ అభిమానులతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటుంది. When Rajshri from Meerut and Saira from Delhi found each other, it was time for double trouble. Be prepared for double the fun. Double the excitement. Double the entertainment. 😍#Double XL in cinemas near you on 4th November 2022. #baatmeinWAZANhai pic.twitter.com/8SRbfxo6wI — Huma Qureshi (@humasqureshi) October 10, 2022 సినిమా విషయానికొస్తే.. సత్రమ్ రమణి దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న డబుల్ ఎక్సెల్ చిత్రం అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు కాగా.. గబ్బర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి భారీగా బరువు పెరిగారు. డబుల్ ఎక్సెల్ తెలుగులో ఆనుష్క నటించిన సైజ్ జీరోకు దగ్గరగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. -
ముద్దు వద్దు.. ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: స్టార్ హీరోయిన్ల డిమాండ్
క్రియేటివ్ ఫీల్డ్లోని క్రేజీనెస్ ఎంత హైలో ఉంటుందో.. ఆ రంగాన్ని ఏలుతున్న సెలెబ్రిటీల డిమాండ్స్ కూడా అంతే హెచ్చుగా ఉంటాయి. స్క్రీన్ మీద స్క్రిప్ట్ను.. సెట్స్లో ప్రొడ్యూసర్స్నూ అంతే బ్యాలెన్స్డ్గా డిమాండ్ చేస్తూంటారు. ఆ జాబితాలో సోనాక్షీ సిన్హా, కరీనా కపూర్ ఉన్నారు.. దబాంగ్ నాయిక సోనాక్షీ సిన్హా.. వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తాను సినిమాల్లోకి వచ్చేముందే ఓ నిర్ణయం తీసుకుందట.. ఎంత అద్భుతమైన సినిమా అవనీ.. ఎంతలా స్క్రిప్ట్ డిమాండ్ చేయనీ.. ముద్దు సన్నివేశంలో నటించకూడదని. తన దగ్గరకు సినిమా ఆఫర్లతో వచ్చిన నిర్మాత, దర్శకులు అందరికీ ఆ నిర్ణయాన్ని చెప్పి.. ముద్దు సన్నివేశాలు లేకుండా ముందే జాగ్రత్తపడుతుందట. ఇప్పటి వరకైతే ఇలా సాగుతోంది.. మున్ముందు ముద్దు డిమాండ్ చేస్తే సినిమా వద్దనుకుంటుందో.. తన నిర్ణయాన్ని మూట కడుతుందో తెలీదు అంటారు బాలీవుడ్ వర్గీయులు. రాజ్కపూర్ మనవరాలు అనే ప్రివిలేజ్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టినా.. తన నటనాకౌశలాన్ని నిరూపించుకుంటూ కొనసాగుతున్న నటి కరీనా కపూర్. తమ సినిమాల్లో కథానాయికగా కరీనాయే కావాలి అని హీరోలు పట్టుబట్టే స్థాయికి రాగానే తానూ ఓ డిమాండ్ లిస్ట్ను ప్రొడ్యూసర్స్కు పంపడం మొదలుపెట్టింది కరీనా. ‘ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ల సరసనే నటిస్తా.. బి గ్రేడ్ ఆర్టిస్ట్ల సరసన నటించను. సో నన్ను తమ సినిమాల్లో హీరోయిన్గా కావాలి అనుకుంటున్న హీరోల రేంజ్ చూసుకున్నాకే నాకు చెప్పండి’ అంటూ. దాంతో మంచి మంచి సినిమాలెన్నింటిలోనో నటించే చాన్స్ను కోల్పోయిందట కరీనా. అయినా నో రిగ్రెట్స్.. గ్రేడ్ ఓన్లీ మ్యాటర్స్ అంటూ ముందుకెళ్లిపోతోంది ఇప్పటికీ! చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ -
Sonakshi Sinha: నా బ్యూటీ సీక్రెట్ అదే! ఇలా చేస్తే మచ్చలు, మొటిమలు మాయం!
కాస్ట్యూమ్ డిజైనర్గా కెరీర్ ఆరంభించింది సోనాక్షి సిన్హా. మేరా దిల్ లేకే దేఖోతో సినిమాకు డిజైనర్గా పనిచేసింది. ఇక ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ కిడ్. అందం, అభినయంతో ఆకట్టుకుని తొలి సినిమాకే ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. ఇక సెలక్టెడ్గా సినిమాలు చేస్తున్న 35 ఏళ్ల సొనాక్షి తన సౌందర్యానికి అమ్మ చెప్పిన సహజమైన చిట్కాలే కారణం అంటోంది. నా బ్యూటీ సీక్రెట్ అదే! ‘‘నా చిన్నప్పుడు చూసేదాన్ని అమ్మ తన మొహానికి అలోవెరా రాసుకోవడం. ఆ ఆకు జిగురును అలా ఎందుకు రాసుకుంటుందో అప్పుడు అర్థం కాలేదు కానీ సినిమాల్లోకి వచ్చాక అర్థమైంది. ప్లస్ ఆమ్మ గ్లోయింగ్ స్కిన్ రహస్యమేంటో కూడా తెలిసింది. నా బ్యూటీ సీక్రెట్ కూడా అదే. షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా రోజుకు రెండు సార్లు మొహానికి అలోవెరా రాసుకుంటాను. అప్లయ్ చేసుకున్నాక ఇరవై నిమిషాలకు చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవాలి. ఈ అలవాటును దినచర్యలో భాగం చేసుకుంటే మొటిమలు, మచ్చలు, ట్యాన్, పిగ్మెంటేషన్ ఎట్సెట్రా జీవితంలో దరిచేరవు’’ అని చెప్పింది సోనాక్షి సిన్హా. చదవండి: Actress Poorna: ‘పర్ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే! Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే.. -
సోదరుడి దర్శకత్వంలో సోనాక్షీ సిన్హా కొత్త చిత్రం
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కీలక పాత్రలు షోషించనున్నారు. ఈ సినిమాకు సోనాక్షీ సిన్హా సోదరుడు ఖుష్ సిన్హా దర్శకత్వం వహించనున్నారు. ఖుష్ సిన్హాకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘సోనాక్షీ సిన్హా మంచి ప్రతిభావంతురాలు. నటిగా ఆమె ఎదుగుదలను చూస్తూ పెరిగాను. ఇప్పుడు సోనాక్షీ కెరీర్లో నా వంతు భాగస్వామ్యం ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఖుష్ సిన్హా. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
నా పెళ్లి గురించి మీకెందుకు అంత తొందర?: సోనాక్షి
అమ్మాయిలకు తరచూ ఎదురయ్యే ప్రశ్న పెళ్లెప్పుడు?. అందులోనూ సెలబ్రిటీలు ఎవరితోనైనా క్లోజ్గా కనిపించారంటే చాలు త్వరలోనే సదరు హీరోయిన్ పెళ్లి అంటూ కథనాలు రాసేస్తుంటారు. అంతేకాదు కథానాయికను సైతం పదేపదే ఇదే ప్రశ్న అడుగుతూ విసిగిస్తుంటారు. ఇదే విషయంలో దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ చిర్రెత్తిపోయింది. అసలూ లేదు, కొసరూ లేదు.. అప్పుడే పెళ్లంటున్నారేంటని విరుచుకుపడింది. ఇంట్లో వాళ్ల కన్నా జనాలకే తన పెళ్లి మీద ఎక్కువ ఆసక్తి ఉందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి తన జీవితాన్ని ప్రపంచానితో పంచుకునేందుకు రెడీగా లేనని తెలిపింది. తానెప్పుడూ సినిమాల గురించే మాట్లాడినా, ఎదుటివారు మాత్రం వ్యక్తిగత విషయాలనే ఆరా తీస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పైగా అక్కడితో ఆగకుండా ఎవరికి వారే ఏదేదో ఊహించుకుని ఇష్టమొచ్చిన రూమర్లు వ్యాప్తి చేస్తారని చెప్పుకొచ్చింది. కాగా సోనాక్షి ప్రస్తుతం కాకుడ, దహడ్(ఓటీటీ డెబ్యూ) సినిమాలతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sushant Divgikr/ Rani KoHEnur (@sushantdivgikr) చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి! ఆ వేటను లైఫ్లో మరచిపోలేనంటున్న హీరోయిన్ -
తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించిన లవ్బర్డ్స్
గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్తో డేటింగ్లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసింది ఈ జంట. అయినా వీరిద్దరి రిలేషన్పై రూమార్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడమే. అంతేకాదు ఇద్దరు క్లోజ్గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఫిక్సయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోనాక్షి బర్త్డే సందర్భంగా తమ సీక్రెట్ రిలేషన్ను అఫిషీయల్ చేసింది ఈ జంట. చదవండి: ‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఈ సందర్భంగా సోనాక్షితో కలిసి విమానంలో పయనిస్తున్న ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసిన ఇక్బాల్ ఆమెకు పబ్లిక్గా లవ్యూ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై సోనాక్షి సైతం స్పందించింది. ‘ఐ లవ్యూ. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నా’ అని అతడి పోస్ట్పై కామెంట్ చేసింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని స్పష్టమైంది. ఇది చూసిన వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్బాల్ పోస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పదించారు. కాగా ఇటీవల సోనాక్షి చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ తన డ్రీమ్ నిజమైందంటూ క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ని: బాలీవుడ్ డైరెక్టర్ అంతేకాదు ఈ ఫొటో పక్కనే ఉన్న వ్యక్తి కనిపించకుండ జాగ్రత్త పడింది. దీంతో ఇక్బాల్కు తనకు నిశ్చితార్థమైందని ఒక్కసారిగా వార్తలు గుప్పమనగా.. మిమ్మల్ని ఫూల్ చేశానంటూ మరో పోస్ట్ చేసింది సోనాక్షి. అది రింగ్ కాదని, తన కొత్త బ్రాండ్ నెయిల్ పాలిష్ను ప్రమోట్ చేశానంటూ నెటిజన్లకు షాకిచ్చింది. దబాంగ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షికి పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఏడాది ఒక సినిమా చేస్తూ వస్తోంది. ఇక జహీర్ ఇక్బాల్ 2019లో నోట్బుక్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ వెంటనే డబుల్ ఎక్సెల్ మూవీ చేశాడు. ఇందులో సోనాక్షితో జతకట్టాడు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోలు షేర్ చేస్తూ తన వేలికి ఉన్న డైమండ్ రింగ్ హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలకు ‘ఇది నాకు బిగ్ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: బాలీవుడ్పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ అంతేకాదు ఈ ఫొటోలో ఓ వ్యక్తి పక్కనే నిలుచుని అతడు కనపబడకుండా జాగ్రత్త పడింది. దీంతో సోనాక్షి సింగిల్ లైప్ ఫుల్స్టాప్ పెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబతోందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అదే నిజమనుకున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా తన ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సోనాక్షి. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతూ.. మిమ్మల్ని బాగా ఆటపిట్టించానని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేసింది. చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్ ‘ఒకే ఒకే.. నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించానని అనుకుంటున్నా. నేను ఒక్క అబద్దం కూడా చెప్పకుండ మీకు ఎన్నో క్లూలు ఇచ్చాను. అవును నేను చెప్పినట్లుగా ఆ రోజు నాకు బిగ్డే.. ఎందుకంటే నా సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ సోయిజీని ప్రారంభించే రోజు నాకు గొప్ప రోజే. అందమైన నెయిల్స్ కోసం ప్రతి అమ్మాయికి ఇదే చివరి గమ్మం అవుతుంది. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నా బిగ్గేస్ట్ డ్రీమ్ను నిజం చేసుకున్న. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. సోయిజీ నెయిల్ పాలిష్ వేసుకున్న పిక్స్తో చివరిగా నా ప్రేమను పంచుకున్న. మీరు ఏమనుకున్నారు? హాహ్హాహ్హా.. లవ్ యూ గాయ్స్! మీరు ఇచ్చిన సపోర్ట్కు థ్యాంక్స్’ అని రాసుకొచ్చింది. ఇక సోనాక్షి తీరుకు కొంతమంది నెటిజన్లు మండిపడుతుండగా మరికొందరు కొత్తగా బిజినెస్లోకి అడుగుపెట్టిన తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
బాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం!? ఫొటోలు వైరల్
'దబాంగ్' బ్యూటీ సోనాక్షి సిన్హా సింగిల్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. సోనాక్షి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె వేలికి ఉన్న డైమండ్ రింగ్ను చూపిస్తూ మురిసిపోయింది. అంతేకాదు ఓ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. 'ఇది నాకు బిగ్ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ కచ్చితంగా ఆమె తన పెళ్లివార్తను చెప్పబోతుందంటూ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వేలికి రింగ్తో పాటు తన పక్కనున్న వ్యక్తిని క్రాప్ చేసిందంటే అతడు కచ్చితంగా సోనాక్షికి కాబోయేవాడని కామెంట్లు చేస్తున్నారు. కానీ కొద్దిమంది మాత్రం ఇదేదో ప్రమోషనల్ స్టంట్ అయ్యుంటుందిలే అని తేలికగా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్, సోనాక్షి డేటింగ్ చేసుకుంటున్నారంటూ గతకొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! దీనిపై రెండురోజుల క్రితమే జహీర్ స్పందిస్తూ.. మీరేమనుకున్నా నేను పట్టించుకోను. నేను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తే ఆనందించండి, లేదంటే దానికోసం ఆలోచించడమే మానేయండి, కానీ నేను మాత్రం ఈ విషయాన్నసలు పట్టించుకోను అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే అషూకి హ్యాండ్ ఇచ్చిన బాబా! ఫస్ట్ ఫైనలిస్ట్ ఇతడేనా? -
సోనాక్షి సిన్హాతో డేటింగ్పై స్పందించిన హీరో..
Jaheer Iqbal Reacts To Dating Rumours With Sonakshi Sinha: గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై జహీర్ స్పందించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ పుకార్లను పట్టించుకోనని పేర్కొన్నాడు. 'ఇదంతా జరిగి చాలా కాలం అయింది. నేను అదంతా పట్టించుకోను. మీరు ఏది అనుకుంటే అది అనుకోండి. అలాగే ఆలోచించండి. అదే మీకు మంచిది అయితే అలాగే చేయండి. నేను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తుందా ? నన్ను క్షమించండి. దాని గురించి ఆలోచించడం మానేయండి.' అని జహీర్ తెలిపాడు. ఇంకా ఈ విషయంపై జహీర్ మాట్లాడుతూ 'ఇదంతా సినీ పరిశ్రమలో ఒక భాగం. నేను పరిశ్రమకు రాకముందే తను తెలుసు. ఈ పరిశ్రమలో నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఇలా జరిగినప్పుడు ఎక్కువగా రాస్తారు, దానిపై పెద్దగ శ్రద్ధ పెట్టవద్దని సల్మాన్ ఖాన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కాబట్టి నేను నిజంగా ఈ విషయాన్ని పట్టించుకోను.' అనిపేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2010లో 'దబాంగ్' సినిమాతో సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేయగా జహీర్ ఇక్బాల్ 'నోట్బుక్' మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఇది చదవండి: ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్తో వెబ్సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్లో దుల్కర్తోపాటు రాజ్కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్సిరీస్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్లో సోనాక్షి పోలీసాఫీసర్గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్తోనే కెరీర్ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు
Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show: సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి అశేష అభిమానులన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా తన అభిమాని నుంచి వింత అనుభవాన్ని చవిచూసింది సోనాక్షి. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్లో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్ రూమ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు. చదవండి: నాలుగో తరగతిలో లైంగిక వేధింపులు.. ఆ దెబ్బతో మళ్లీ చూడలేదు తర్వాత సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అంటాడు. తర్వాత అక్కడ పరిస్థితులు అంతాగా బాగాలేనట్లు కనిపించింది. అద్దంపై లిపిస్ట్క్తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అదేం వద్దూ అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లైనైనా ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది. చదవండి: జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ? అయితే ఈ వీడియో అంతా 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్తో కలిసి డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో నటించనుంది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) చదవండి: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్ -
సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్, స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించిన సోనాక్షి వాటిని ఖండించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చదవండి: రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే దీనిపై నా స్టెంట్మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి అన్ని మీడియా హౌజ్లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. చదవండి: కండోమ్ టెస్టర్గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ సోనాక్షి తెలిపింది. కాగా ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్ నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు. దీంతో సోనాక్షిపై కేసు నమోదైంది. -
చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న దబాంగ్ నటి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. ఈ విషయంపై సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
సల్మాన్తో సీక్రెట్ పెళ్లిపై స్పందించిన హీరోయిన్
దబాంగ్ జంట సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే! కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ టెక్నిక్తో సల్మాన్.. సోనాక్షి వేలికి ఉంగరం తొడుగుతున్నట్లు సృష్టించారు. ఇది నిజమని భ్రమపడిన చాలామంది దాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్లు చేశారు. తాజాగా ఈ సీక్రెట్ పెళ్లి వార్తలపై స్పందించింది సోనాక్షి. సల్మాన్, తనకు ఉంగరం తొడుగుతున్నట్లుగా ఉన్న వైరల్ ఫొటో కింద దాన్ని నిజమని నమ్మినవాళ్లని మూర్ఖులుగా అభివర్ణించింది. చదవండి: సల్మాన్ ఖాన్ సీక్రెట్ పెళ్లి, వైరల్గా మారిన ఫొటోలో నిజమెంత? 'రియల్ ఫొటోకు, మార్ఫింగ్ ఫొటోకు తేడా తెలియలేనంత మూర్ఖంగా తయారయ్యారా?' అంటూనే మూడు లాఫింగ్ ఎమోజీలను తన కామెంట్కు జత చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతూ సోనాక్షి స్పందించకుండా ఉంటే సరిపోయేది, ఈ అటెన్షన్ కోసమే వాళ్లిదంతా చేసింది, చివరకు వాళ్లు అనుకున్నదే జరిగింది అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఫైనల్గా సోనాక్షి క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా ఈ రూమర్ వ్యాపించదు అని అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Bollywood Tashan (@bollywood_tashan) -
హీరోయిన్తో సల్మాన్ ఖాన్ రహస్య వివాహం, ఫొటో వైరల్!
బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్, బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారంటూ ఓ ఫొటో నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఈ ఫొటో చూసిన సల్మాన్ అభిమానులు చడీచప్పుడు లేకుండా మా హీరో పెళ్లి చేసుకోవడమేంటి? అది కూడా రహస్యంగానా? ఏదో తేడా కొడుతోందంటూ చర్చలు మొదలుపెట్టారు. అంత పెద్ద హీరో సడన్గా, ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా పెళ్లిపీటలెక్కేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. నిజమేంటంటే సల్మాన్ ఓ ఇంటివాడయ్యాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అతడింకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గానే ఉన్నాడు. సోనాక్షితో వివాహం అంటూ వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. ఇక ఆ ఫొటో సంగతంటారా? అది కేవలం మార్ఫింగ్ ఫొటో లేదా ఏదైనా సినిమా స్టిల్ అయ్యుంటుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. కాగా సల్మాన్, సోనాక్షి దబాంగ్ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'కబీ ఈద్ కబీ దివాళి' సినిమా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్పైకి వెళ్లనుంది. -
పెళ్లెప్పుడు చేసుకుంటారు? అన్న ప్రశ్నకు హీరోయిన్ ఆన్సరిదే
కరోనాకు ముందు సెలబ్రిటీలు క్షణం తీరిక లేకుండా షూటింగ్ల వెంట తిరిగేవారు. పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా పట్టించుకునే వారే కాదు. కానీ కరోనా వచ్చాక విధించిన లాక్డౌన్ల వల్ల వారికి బోలెడంత టైం దొరికింది. ఇంకే.. ఇదే అదను అనుకున్న ఎంతోమంది తారలు బ్యాచ్లర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టేసి పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ పెళ్లి ఊసెత్తట్లేదు. ఈ క్రమంలో ఓ నెటిజన్ బాలీవుడ్ తార సోనాక్షి సిన్హాకు పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇవ్వగా ఆమె దానికి వ్యంగ్యంగా బదులిచ్చింది. సోనాక్షి తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అందులో ఓ నెటిజన్ 'సోనాక్షి మేడమ్.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీవంతు ఎప్పుడొస్తుందో?' అని ప్రశ్నించాడు. దీనికి హీరోయిన్ తనదైన స్టైల్లో ఆన్సరిచ్చింది. 'అందరికీ కోవిడ్ వస్తోంది. నాక్కూడా రావాలా? ఏంటి?' అని కౌంటరిచ్చింది. -
సల్మాన్ ఖాన్ కోడలిగా హీరోయిన్ సోనాక్షి సిన్హా!
Sonakshi Sinha Wedding: ఎప్పుడూ సినిమా సినిమా అంటూ కెరీర్పై ఫోకస్ పెట్టే బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మధ్య వ్యక్తిగత విషయాల మీద కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ జంటలు పెళ్లికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ తారలు రాజ్కుమార్ రావు-పత్రలేఖలు, అనుష్క రంజన్- ఆదిత్య సీల్ పెళ్లిపీటలెక్కగా తర్వలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. రణ్బీర్ కపూర్, అలియాభట్ కూడా త్వరలోనే షాదీ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ సోనాక్షి సిన్హ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా సెలబ్రిటీల మేనేజర్ బంటి సచ్దేవ్తో సోనాక్షి డేటింగ్ చేస్తోందట. మూడు, నాలుగేళ్లుగా వీరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారట! తాజాగా వీరు తమ బంధాన్ని మరోమెట్టు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక బంటి సచ్దేవ్ సల్మాన్కు ఎలా సన్నిహితుడంటే.. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్.. అతడి భార్య సీమాఖాన్ సోదరుడే బంటి సచ్దేవ్. కాగా సోనాక్షి.. సల్మాన్ నటించిన 'దబాంగ్' చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఆ జాకెట్ వేసుకున్నా వేసుకోనట్లే ఉంది, అంత అవసరమా? -
ఓర చూపుతో మతి పొగొడుత్ను ‘బంగారు బొమ్మ’ సోనాక్షి సిన్హా
-
స్కూల్ల్లోనే ప్రేమలో పడ్డాను! అతడితో 5 ఏళ్లు రిలేషన్ షిప్: హీరోయిన్
Sonakshi Sinha About Her Relationship In Schooling and College: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా స్కూల్ టైంలోనే ప్రేమలో పడ్డానని, ఆ వ్యక్తితో రిలేషన్ షిప్లో ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా ముద్దుల తనయ అయినా సోనాక్షి ‘దబాంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పలు సనిమాల్లో నటించిన ఆమె నటిగా నిరూపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా రిలేషన్ షిప్లో ఉన్నారా? అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరంగా బదులు ఇచ్చింది. చదవండి: భయపడుతూనే నటుడి బనియన్ వేసుకున్నా: ఊర్మిళ ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో రిలేషన్ షిప్లో ఉన్నాను. అయితే అది కొద్ది రోజులకే ఎండ్ అయ్యింది. ఇక నేను 21, 22 వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్ను కొనసాగించాను. ఆ వ్యక్తితో అయిదేళ్లకు పైగా రిలేషన్ షిప్లో ఉన్నాను. ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయి. మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: ‘జేమ్స్ బాండ్’ కోసం లండన్ థియేటర్ మొత్తం బుక్ చేసిన బాలీవుడ్ నిర్మాత -
అర్జున్కపూర్-షాహిద్తో సోనాక్షి బ్రేకప్ స్టోరీ
థప్పడ్ సే డర్ నహీ లగ్తా సాబ్.. ప్యార్ సే లగ్తా హై! (చెంప దెబ్బంటే భయం లేదు సర్.. ప్రేమంటేనే భయం!) డైలాగ్తో పాపులర్ అయిన కథానాయిక.. అర్థమైపోయి ఉంటుంది ఎవరో?! అవును.. సోనాక్షీ సిన్హా. ఈ వారం ‘మొహబ్బతే’కి నాయిక కూడా! ఆమె ప్రేమ జీవితం.. అందులో వైఫల్యం.. సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. హిందీ, ఇంగ్లిష్ పత్రికలు, వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు.. వంటి రూమర్స్ని కూర్చి ఇస్తున్న కథనం ఇది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్. రాజ్కుమార్’ సినిమా గుర్తుందా? అందులో సోనాక్షీ సిన్హా, షాహిద్ కపూర్ హీరోహీరోయిన్లు. ఆ సెట్స్లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పుకారు. ‘నా జీవితంలో ఇద్దరే ఇద్దరిని ప్రాణప్రదంగా ప్రేమించాను’ అని షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా.. ఇంకొకరు సోనాక్షీ అనే నిర్ధారణకొచ్చారు షాహీద్, సోనాక్షీ జంటను అభిమానించే కొంతమంది. ఇందుకు కారణం లేకపోలేదు. ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి షాహిద్ కపూర్ ఆ సమయంలో తను ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడో ఆ సహచరితో వచ్చేవాడని.. అలా సెకండ్ సీజన్లో కరీనా కపూర్, థర్డ్ సీజన్లో ప్రియాంక చోప్రా, ఫోర్త్ సీజన్లో సోనాక్షీ సిన్హా, చివరకు భార్య మీరా రాజ్పుత్తో వచ్చాడని కామెంట్ చేశాడు షో హోస్ట్ కరణ్ జోహార్. ఇదే విషయమై షాహిద్ను అడిగాడు కూడా.. ‘నువ్వు కరీనా, ప్రియాంకతో డేట్ చేశావ్ కదా.. సోనాక్షీతో కూడా డేటింగ్లో ఉన్నావని రూమర్స్ వినిపిస్తున్నాయి’ అని. కాదని తోసిపుచ్చలేదు షాహిద్ కపూర్. అంతేకాదు ‘ఆర్. రాజ్కుమార్’ సెట్స్లో షూటింగ్ తర్వాత సోనాక్షీ, షాహిద్ సరదాగా షికారుకెళ్లేవారని, పార్టీలూ చేసుకున్నారనీ బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీనికి ఉదాహరణగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ‘షాహిద్ను ముద్దు పెట్టుకుంటున్న సోనాక్షీ సిన్హా’ ఫొటోను చూపిస్తారు. ఇదంతా నిజమే అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు ఎందుకు రాలేదో.. వాళ్లెందకు విడిపోయారో తెలియదు. కానీ వాళ్లిద్దరు మాత్రం విడివిడిగా ‘మేం మంచి స్నేహితులం.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ’ అని చెప్తారు మీడియా ఎప్పుడు ప్రశ్నించినా! ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్ సోనాక్షీ సిన్హా, అర్జున్ కపూర్ జంట కలసి నటించిన ‘తేవర్’ సినిమా షూటింగ్ అప్పుడే వాళ్లు ప్రేమలో పడ్డారని బాలీవుడ్ సినిమా పత్రికల కథనం. షూటింగ్ ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్, ముంబై శివారులోని థియేటర్లలో సినిమాలకూ వెళ్లేవారట. ఆ టైమ్లో పాపరాజీ కెమెరాలకూ చిక్కారనీ మీడియా కవరేజ్. అయితే ‘తేవర్’ సినిమా పూర్తవడంతోనే వీళ్ల ప్రేమా ముగిసిపోయిందనీ బాలీవుడ్ మాట. ఈ ఇరువురి మనస్తత్వాల్లోని వైరుధ్యమే ఆ బ్రేకప్కి రీజన్ అని ఇద్దరి సన్నిహితులు చెప్తారు. సోనాక్షీది అలాంటి తత్వమే.. ‘సోనాక్షీ చాలా ఎమోషనల్. ఏ ఫీలింగ్స్నూ దాచుకోలేదు. బేషరతుగా ప్రేమిస్తుంది. అర్జున్ కపూర్ ఇందుకు కాస్త భిన్నం. అతను గుంభనంగా ఉంటాడు. సోనాక్షీ స్ట్రాంగ్ ఎమోషన్స్ను సంభాళించలేకపోయాడు’ అని ఒక సోర్స్ కామెంట్. ‘ప్రేమ విషయంలో సోనాక్షీది సాధారణ అమ్మాయిల తత్వమే. అర్జున్ చుట్టే తన ప్రపంచాన్ని అల్లుకుంది. ఇది అర్జున్ను ఊపిరాడనివ్వకుండా చేసింది. ఏమైనా వాళ్ల బ్రేకప్కు ఆ ఇద్దరిలో ఎవరినీ బ్లేమ్ చేయలేం.. అదలా జరిగిపోయింది అంతే!’ అంటూ ఇంకో సోర్స్ విశ్లేషణ. సోనాక్షీ మాత్రం.. ‘సినిమా రంగంలోని అబ్బాయిని కాకుండా కాస్త మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని చూసుకోమని మా పేరెంట్స్ చెప్తుంటారు. చూద్దాం.. అలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా నా ప్రేమ విషయాన్ని ముందు మీకే షేర్ చేస్తాను’ అంటూ మీడియా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటూ ఉంటుందెప్పుడూ! ∙ఎస్సార్ -
భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: మేమున్నాం!!
డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం..బాంబుల భయంతో వణుకుతున్న ఊరు. బాంబులు కురిసినా సరే దేశం కోసం చనిపోయినా పరవాలేదనే సాహసోపేత నిర్ణయం. ‘మేమున్నాం’ అంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది వీర నారీమణుల తెగువ. 72 గంటల వ్యవధిలో ఎయిర్ఫోర్స్ బేస్ పునరుద్ధరణ. ప్రాణాలకు తెగించి మరీ దేశభక్తిని చాటుకున్న వైనం! అంతేనా.. ప్రభుత్వ అవార్డు సొమ్మును దానం చేసిన దాతృత్వం.. జయహో.. వీరమహిళలు!! చలి పులిలా విజృంభిస్తుంది. కాని ఆ ఊరు చలితో కాదు ‘బాంబుల భయం’తో వణికిపోతుంది. అందరూ ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. పాకిస్థాన్ జెట్స్ భుజ్ (కచ్ జిల్లా, గుజరాత్)లోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ బేస్పై బాంబులు వేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్బేస్ను పునరుద్ధరించడానికి భారత వైమానిక దళం బీఎస్ఎఫ్ జవాన్ల సహాయం కోరింది. పునరుద్ధరణ తక్కువ సమయంలో జరగాలంటే ఎక్కువమంది శ్రామికులు కావాలి. వారిని వెదికిపట్టి తీసుకురావడానికి సమయం లేదు. దగ్గరి గ్రామాల్లోని వారి సహాయం కోరాలి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న ఆ సమయంలో ఎవరు బయటకు వస్తారు? వచ్చినా సహాయపడతారా?రకరకాల సందేహాలను పటాపంచలుచేస్తూ... ఒక్కరు కాదు ఇద్దరు కాదు మాదపూర్ గ్రామానికి చెందిన 300 మంది స్త్రీలు ‘మేమున్నాం’ అంటూ ముందుకువచ్చారు. పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం నాటి దృశ్యం ఇది. ఆనాటి భుజ్ ఎయిర్ బేస్ను పునర్నిర్మించిన 300 మంది మహిళలను సగౌరవంగా గుర్తు తెచ్చుకుంటుంది ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రం. (అజయ్ దేవ్గణ్, సంజయ్దత్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వోటీటీలో విడుదలైంది) ఈ నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు ఆసక్తికరంగా మారాయి. ‘చనిపోయినా సరే, దేశం కోసం చనిపోయాను అనే తృప్తి మిగులుతుంది...అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని పనిలోకి దిగాము’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది సెఘాని అనే మహిళా యోధురాలు. ఆ 300 మంది మహిళలలో ఒకరైన హిరూ బుదియాలో మొదట ఒక సందేహం...‘వెళుతున్నాను సరే, కూలిపని తప్ప నాకు ఏది తెలియదు. నేను చేయగలనా?’ఆ తరువాత భయం... ‘పనిలో ఉండగా పై నుంచి బాంబులు పడితే... ఇంకేమైనా ఉందా!’తనలోని ధైర్యానికి, సందేహాలతో కూడిన భయానికి మధ్య ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాని చివరికి ధైర్యమే గెలిచింది. దేశభక్తి గొప్పతనం అదే కదా! (చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్ఫిట్, ట్వీట్ వైరల్) ‘చిన్నచిన్న విషయాలకే భయపడే నాకు అంతధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది’ అని ఆరోజును గుర్తు తెచ్చుకుంటుంది వీరు లఖాని. 72 గంటల వ్యవధిలో ఎయిర్ఫోర్స్ బేస్ను పునరుద్ధరించే పని పూర్తయింది.యుద్ధం పూర్తయిన తరువాత గ్రూప్ అవార్డ్గారూ. 50,000 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వీరమహిళలు. -
భుజ్ ట్రైలర్: నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను
Bhuj: The Pride Of India Trailer: 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ దుధయ్యా దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 'మరాఠాలకు చావడం లేదా చంపడం.. ఈ రెండే తెలుసు', 'చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటాం', 'నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను' వంటి డైలాగులు ట్రైలర్లో తూటాల్లా పేలాయి. చంటిపాపను ఎత్తుకున్న సోనాక్షి ఒంటిచేత్తో చిరుతపులిని హతమార్చడం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. కాగా యుద్ధం సమయంలో గుజరాత్లోని భుజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమవగా అప్పటి ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్పోర్ట్ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి సిన్హా నటించింది. ఈ సినిమా ఆగస్టు 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో భుజ్ విడుదల కానుంది. ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందోనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. -
ఏడేళ్ల తర్వాత సోనాక్షి, తొలిసారి నవాజుద్దీన్
దాదాపు ఏడేళ్ల తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా సౌత్లో ఓ సినిమా ఒప్పుకున్నారు. అది కూడా తెలుగు సినిమా కావడం విశేషం. చిరంజీవి సరసన జోడీ కట్టనున్నారామె. 2014లో రజనీకాంత్ సరసన చేసిన ‘లింగా’ తర్వాత దక్షాణాదిన సోనాక్షి చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో చిరంజీవికి విలన్గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్నారు. రజనీ ‘పేట’ తర్వాత దక్షిణాదిన నవాజుద్దీన్ చేయనున్న సినిమా ఇదే. చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ సినిమా తెరకెక్కించనుంది. ఈ సినిమాతో సోనాక్షీ కథానాయికగా, నవాజుద్దీన్ ప్రతినాయకుడిగా తెలుగులోకి మెగా ఎంట్రీ ఖరారైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. మలయాళ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్, మెహర్ రమేశ్ సినిమాలు కూడా లైనప్లో ఉన్నాయి గనక చిరంజీవి–బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్తంత సమయం పట్టేలా ఉంది. చదవండి: అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య -
మెగాస్టార్తో బాలీవుడ్ భామ రొమాన్స్!
డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్, యాక్షన్ బ్యాక్డ్రాప్తో బాబీ, చిరు కోసం ప్రత్యేకంగా రేడి చేసిన ఈ స్క్రిప్ట్ చిరుకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడు. అంతేగాక బాబీతో ఓ మూవీ చేయబోతున్న అంటూ మెగాస్టార్ స్వయంగా ప్రకటించడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అసక్తికర అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో చిరుకు జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ టీం సోనాక్షిని సంప్రదించి కథ వివరించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కబోయే లూసిఫర్ రీమేక్లో నటించనున్నాడు. అనంతరం బాబీతో సినిమాను చిరు ప్రారంభించనున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
ఆ హీరోయిన్ని ప్రేమిస్తున్నా : వైష్ణవ్ తేజ్
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తమ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ వైష్ణవ్ ముందు ఉంచారు నెటిజన్లు. వాటన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చాడు వైష్ణవ్. ఈ క్రమంలో ‘సోనాక్షి సిన్హా అంటే మీకు ఎందుకు ఇష్టం’అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె అంటే ఇష్టం కాదు ప్రేమని చెప్పాడు. ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని వైష్ణవ్ అన్నాడు. ఇక అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. రజనీ కాంత్ అని, ఆయన నటించిన శివాజీ మూవీని చాలా సార్లు చూశానని చెప్పాడు. సమంత గురించి ఏమైనా చెప్పండని ఓ నెటిజన్ అడగ్గా.. ఫ్యామిలీ మేన్-2లో సమంత నాకెంతో నచ్చేసిందన్నాడు. కృతిశెట్టిలో నటన కాకుండా దాగి ఉన్న మరో టాలెంట్ ఏంటని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్ అని చెప్పాడు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, ఆ తర్వాత గిరీశయ్య దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుందని తెలిపాడు. చదవండి: బన్నీ అస్సలు తగ్గట్లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులతో దండయాత్రకు రెడీ ఆ హీరోయిన్ను కాపీ కొడతాను: సమంత -
చిరు, బాలయ్యలతో బాలీవుడ్ భామ రొమాన్స్!
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా చిత్రాలవైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం తమ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లను పెట్టుకుంటున్నారు. పేరున్న హీరోయిన్ అయితే బాలీవుడ్లో పబ్లిసిటీకి ఈజీ అవుతుందని భావిస్తున్నారు. దీంతో బీ టౌన్లో ఫేమస్ అయిన హీరోయిన్స్పై తెలుగు దర్శకనిర్మాతలు కన్నేశారు. తమ సినిమాల్లో వారిని నటింపజేసేందుకు భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు టాలీవుడ్లో రాణిస్తుండగా, తాజాగా మరో యంగ్ హీరోయిన సోనాక్షి సిన్హా కూడా ఇక్కడ సత్తాచాటేందుకు రెడీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ఇద్దరు బడా హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అందులో చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కాగా, మరొకటి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న బాలకృష్ణ సినిమా. ఒకేసారి అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణతో ఈ భామ రొమాన్స్ చేయబోతుంది. ఈ రెండు ఆఫర్స్ సోనాక్షి వరకు చేరాయని, డేట్స్ విషయంలో ఆమె ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి బిబీ3లో నటిస్తున్నాడు. చదవండి: తలైవి ట్రైలర్ చూస్తే గూస్బంప్సే.. తూటాల్లా డైలాగులు ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్ -
సోషల్ హల్చల్: హీటెక్కిస్తున్న నియా, చెట్టెక్కిన హెబ్బా
♦ గాగ్రాలో బొంగరాలు తిరుగుతున్న అదితి బుద్దకోటి ♦ మరో రోజు, మరో అడ్వెంచర్తో అంటూ ఎయిర్పోర్టులో నికిత శర్మ ♦ అనవసరమైనవి పట్టించుకోవడం మానేస్తే లైఫ్ ఎంత బాగుంటుందో అంటున్న అమలాపాల్ ♦ బ్లూటిఫుల్ డే అంటోన్న శిల్పా శెట్టి ♦ అమ్మ తీసిన ఫొటోను పంచుకున్న శ్రద్దా కపూర్ ♦ ఇది శుక్రవారమా? కాదా? అని అడుగుతోన్న సోనాక్షి సిన్హా ♦ గుడ్ మార్నింగ్ అంటూ వీడియో షేర్ చేసిన అమీషా పటేల్ ♦ ఎక్కడైనా కాఫీ తాగొచ్చంటూ చెట్టెక్కిన హెబ్బా పటేల్ ♦ హీటెక్కించే పోజులో నియా శర్మ View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
సోషల్ హల్చల్: పిల్లందం కేక.. కేక..
► ఎర్రటి డ్రెస్సులో రచ్చరంబోలా చేస్తున్న జాన్వీ కపూర్ ► టాప్లెస్ ఫొటోతో హీటెక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ► మ్యాచింగ్ మ్యాచింగ్ అంటున్న తమిళ హీరోయిన్ అతుల్య రవి ► ఎర్రటి చీరలో ఆసమ్ లుక్లో దీప్తి సునయన ► చూపు తిప్పుకోనివ్వని ఊర్వశి రౌతేలా ► వైట్ డ్రెస్లో టాప్ లేపుతున్న మలైకా అరోరా ► జస్ట్ చిల్లింగ్ అంటోన్న రాశీ ఖన్నా ► నవ్వులతోనే బాణం వేస్తోన్న మేఘాఆకాశ్ ► సెల్ఫీతో మత్తెక్కిస్తున్న సోనాక్షి సిన్హా ► రేపటి కోసం నడుస్తున్నానంటున్న బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ► హాట్ ఫొటోను షేర్ చేసిన లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
రాజకీయాల్లోకి యువత రావాలి
‘‘మీ అమ్మా, నాన్నా (శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా,) ఇటీవలే సొదరుడు (లవ్ సిన్హా) కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీక్కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?’’ అనే ప్రశ్నను సోనాక్షీ సిన్హా ముందుంచింతే –‘‘నాకలాంటి ఆలోచనలు ఏమీ లేవు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్లడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే తనకు రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ఫలితం మేం అనుకున్న విధంగా రాలేదు. అయినా తన ప్రయత్నం తను చేశాడు. అలానే రాజకీయాల్లోకి యువత ఇంకా ఎక్కువ మంది రావాలి’’ అన్నారు సోనాక్షి. కొత్త సంవత్సరం వేడుకల గురించి చెబుతూ – ‘‘కొత్త సంవత్సరాన్ని విదేశాలకు వెళ్లి చేసుకోవడం నాకు అలవాటు. కానీ ఈసారి న్యూ ఇయర్కి హాలిడే లేదు. కోవిడ్ వల్ల చాలా రోజులు షూటింగ్స్ ఆగిపోయాయి. నా డిజిటల్ షో చిత్రీకరణతో బిజీగా ఉంటాను. న్యూ ఇయర్ రోజు మాత్రం దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లి వెంటనే వచ్చేయాలనుకుంటున్నాను’’ అన్నారామె. -
సామాజిక కార్యకర్త
1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. యుద్ధం సమయంలో గుజరాత్లోని భూజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. అప్పటి ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్పోర్ట్ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. ఈ స్థానిక మహిళలకు నేతృత్వం వహించారు సుందర్బెన్ జెతా మదర్పార్య. ఈ సుందర్బెన్ పాత్రలోనే నటించారు సోనాక్షీ సిన్హా. సినిమాలోని ఆమె లుక్ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి నటించారు. చరిత్రలోని ఓ అద్భుత సంఘటన వెండితెరపై ఆవిష్కృతం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అభిషేక్ దు«ధయ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
ట్విటర్ నుంచి వైదొలగిన హీరోయిన్!
ముంబై: సోనాక్షి సిన్హా ట్విటర్ అకౌంట్ ఇకపై కనిపించదు. ఎందుకంటే దబాంగ్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ఈ ముద్దు గుమ్మ నెగిటివిటికి దూరంగా ఉండాలి అనుకుంటుందంట. మనఃశాంతిని కాపాడు కోవడానికి, నెగిటివిటికి దూరంగా ఉండటానికి ట్విటర్ అకౌంట్ను డియాక్టివేట్ చేశానని సోనాక్షి తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా శనివారం వెల్లడించింది. (సల్మాన్ఖాన్తో సాన్నిహిత్యం పెరిగింది) ‘మీ మనఃశాంతిని కాపాడుకుకోవడానికి మొదట చేయవలసింది నెగిటివిటికీ దూరంగా ఉండటం. ఇది ట్విటర్ కంటే ఎక్కువ ఇంకెక్కడ ఉండదు. ఛలో, నేను నా అకౌంట్ను డీయాక్టివేట్ చేస్తున్నాను’ అని సోనాక్షి పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ పోస్ట్కు కామెంట్ సెక్షన్ను కూడా సోనాక్షి డిసేబుల్ చేసింది. ఇప్పటి వరకు సోనాక్షి 1320 పోస్టులను చేశారు. ఆమెకు 18.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో స్టార్ కిడ్స్ని అన్ ఫాలో చేస్తూ, ట్రోల్ చేస్తున్న ఈ తరుణంలో సోనాక్షి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. (ఐ వాన్న అన్ఫాలో యు) -
ఆర్ట్ బై సోనాక్షీ
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో హీరోహీరోయిన్లందరూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కుకింగ్, రీడింగ్, క్లీనింగ్... ఇలా ఏదో ఒకటి చేస్తు టైమ్పాస్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా రోజుకో బొమ్మ గీస్తున్నారు. ‘‘కొన్నేళ్ల క్రితమే బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు నాకు మెడిటేషన్లా అనిపిస్తోంది. నాకు సరైన స్ట్రెస్ బస్టర్ పెయింటింగ్. నేను చాలా పెయింటింగ్స్ వేశాను’’ అని పేర్కొన్నారు సోనాక్షీ. ఇటీవల ఆమె వేసిన డ్రాయింగ్స్ను ‘ఆర్ట్ బై సోనాక్షీ’గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు సోనాక్షీ గీసినవే.