ప్రత్యేక పూజలు చేయడంలేదు | Superstar Rajinikanth Visits Jammu For Spiritual Journey | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పూజలు చేయడంలేదు

Mar 13 2018 12:06 AM | Updated on Sep 12 2019 10:40 AM

Superstar Rajinikanth Visits Jammu For Spiritual Journey - Sakshi

ధర్మశాలలో రజనీకాంత్‌కి స్వాగతం పలుకుతున్న దృశ్యం

రజనీకాంత్‌ ఆధ్యాత్మిక యాత్ర శనివారం మొదలైంది. వారం పది రోజులపాటు సాగే ఈ ట్రిప్‌లో రజనీ పలు దేవాలయాలను సందర్శించి, ధ్యానం చేసి, ‘యోగాద సత్సంగ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ వందేళ్ల వేడుకల్లో పాల్గొని చెన్నై చేరుకుంటారు. ‘‘ఇటీవల పొలిటికల్‌ జర్నీ స్టార్ట్‌ చేశాను. ఆ ప్రయాణం కోసం ఈ ప్రయాణం (ఆధ్యాత్మిక యాత్ర)లో ప్రత్యేక పూజలు చేయాలనుకోవడంలేదు.

ఎప్పటిలానే ఇది కూడా ఓ స్పిరిచ్యువల్‌ జర్నీ అంతే’’ అని రజనీ పేర్కొన్నారు. ముందు ధర్మశాల వెళ్లిన రజనీకి ఘనస్వాగతం లభించింది. అక్కడి శివాలయాన్ని దర్శించారాయన. ఆ తర్వాత రిషికేష్‌ వెళ్లడానికి ప్లాన్‌ చేసుకున్నారు. అనంతరం హిమాచల్‌ ప్రదేశ్‌లో 1917లో పరమహంస యోగానంద ప్రారంభించిన ‘యోగాద సత్సంగ సొసైటీ’ (వైఎస్‌ఎస్‌) వందేళ్ల వేడుకల్లో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement