
గాంధీనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం గాంధీనగర్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తన కుటుంబసమేతంగా కలిసి వచ్చి నామినేషన్ వేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అమిత్ షా తన మనవరాలికి కాషాయరంగుతో ఉన్న టోపీ పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం దానిని పెట్టుకోవడానికి నిరాకరించింది. తన హ్యాట్ మాత్రమే పెట్టుకుంటానని అమిత్ షా పెట్టిన బీజేపీ టోపిని తీసేసింది. ఈ వీడియో వైరల్గా మారింది. కాగా అమిత్ షా తొలిసారి లోక్సభ బరిలో నిలుస్తోన్న విషయం తెలిసింది. గాంధీనగర్ నుంచి ఆరుసార్లు విజయం సాధించిన అగ్రనేత ఎల్కే అద్వానీని పక్కన పెట్టి షాని బీజేపీ ఇక్కడ బరిలో నిలిపింది.