జంట అదృశ్యం.. యువకుడి తండ్రి హత్య | boy and girl alope, boy father murderd | Sakshi
Sakshi News home page

జంట అదృశ్యం.. యువకుడి తండ్రి హత్య

Published Wed, Jul 12 2017 6:39 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

జంట అదృశ్యం.. యువకుడి తండ్రి హత్య - Sakshi

జంట అదృశ్యం.. యువకుడి తండ్రి హత్య

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలిక అదృశ్యానికి కారణమయ్యాడంటూ ఓ యువకుడిపై ఆగ్రహంతో అతడి తండ్రిని దారుణంగా కొట్టి చంపారు.

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలిక అదృశ్యానికి కారణమయ్యాడంటూ ఓ యువకుడిపై ఆగ్రహంతో అతడి తండ్రిని దారుణంగా కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌నగర్‌ జిల్లా రసూల్‌ గ్రామంలో ఈ ఘోరం ఈ ఘటన చోటుచేసుకుంది. రసూల్‌ గ్రామానికి చెందిన షకీర్‌ కుమారుడు అబ్దుల్‌, రియాసత్‌ అనే వ్యక్తి కుమార్తె ఈ నెల 3న ఎవరికి చెప్పకుండా పారిపోయారు.

దీంతో రియాసత్‌ కుటుంబీకులు షకీర్‌పై ఆగ్రహంతో ఉన్నారు. వారం రోజులు గడిచినా జాడ తెలియకపోవటంతో ఈ నెల 11న షకీర్‌ను అపహరించారు. అనంతరం కొట్టి చంపారు. దీంతో మృతుని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రియాసత్‌తోపాటు ఆరుగురిపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో బందోబస్తు పటిష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement