బీజేపీ ఆదాయం రూ.111 కోట్లు
Published Tue, Apr 26 2016 8:11 PM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
న్యూఢిల్లీ: దేశంలోని 19 రాజకీయ పార్టీలకు గతేడాది చందాల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. 2014-15 సంవత్సరంలో 19 రాజకీయ పార్టీలకు రూ.177.40 కోట్ల ఆదాయం డొనేషన్ల ద్వారా చేకూరింది. ఈ మేరకు వివరాలను ఎలక్ట్రోరల్ ట్రస్ట్ కమిటీ ప్రకటించింది. మొత్తం ఆదాయం కార్పొరేట్ సంస్థలు, పౌరులు వ్యక్తిగతంగా చందాలు ఇచ్చారు. ఇందులో బీజేపీకి అధిక మొత్తంలో రూ.111.35 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ.35 కోట్లు, సీపీఎంకు రూ.2.35 కోట్లు ఆదాయం వచ్చింది. రాజకీయాల్లో పారదర్శతను పెంపొందించడం కోసం రాజకీయ పార్టీలు తమ ఆదాయాన్ని ప్రకటించాలని ప్రభుత్వం గతంలో నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement