అచ్ఛేదిన్‌ ఎప్పుడన్న శివసేన.. | Experiments continue three years on: Shiv Sena on cabinet rejig | Sakshi
Sakshi News home page

అచ్ఛేదిన్‌ ఎప్పుడన్న శివసేన..

Published Mon, Sep 4 2017 2:50 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

అచ్ఛేదిన్‌ ఎప్పుడన్న శివసేన..

అచ్ఛేదిన్‌ ఎప్పుడన్న శివసేన..

ముంబయిః కేం‍ద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ పట్ల అసంతృప్తిగా ఉన్న బీజేపీ మిత్రపక్షం శివసేన మరోసారి బీజేపీపై మండిపడింది. మోడీ సర్కార్‌ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటినా ప్రయోగాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రజలు మాత్రం మంచిరోజుల కోసం ఇంకా వేచిచూస్తూనే ఉన్నారని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన వ్యాఖ్యానించింది. మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ, శాఖల కేటాయింపు బీజేపీ అంతర్గత వ్యవహరమని, అయితే ఇది జాతీయ భద్రత, దేశ అభివృద్ధిపై ప్రభావం చూపితే తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించింది. మోడీ, అమిత్‌ షాలు తమకు నచ్చిన వారికి మంత్రులుగా పట్టం కట్టారని వ్యాఖ్యానించింది. 
 
కొందరిని వయోభారం పేరుతో కేబినెట్‌ నుంచి తప్పించారని, అయితే వారి యువ మంత్రులు సైతం కొందరు సరైన పనితీరు కనబరచలేదని పెదవివిరిచింది. ‘నోట్ల రద్దు పూర్తిగా విఫలమైంది... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రబలుతున్నాయి...ప్రజలకు మౌలిక వసతులూ అందుబాటులో లేకుండా పోయాయి' అని సంపాదకీయం మోడీ సర్కార్‌ను దుయ్యబట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement