ఘజియాబాద్‌లో హృదయ విదారక ఘటన | Ghaziabad: Six people, including 5 children, electrocuted to death | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఆరుగురు మృతి

Published Mon, Dec 30 2019 11:38 AM | Last Updated on Mon, Dec 30 2019 11:44 AM

Ghaziabad: Six people, including 5 children, electrocuted to death - Sakshi

సాక్షి, ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఓ చిన్నారి వయసు అయిదేళ్లు మాత్రమే. లోని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్‌లోని మౌలానా ఆజాద్‌ కాలనీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు వీరంతా ఒకే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. మృతులు పర్వీన్‌ (40), ఫాతిమా (12), సహిమా (10), రతియా (8), అబ్దుల్‌ అజీమ్‌ (8), అబ్దుల్‌ అహద్‌ (5) గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement