తెలంగాణపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం తొలిసారి భేటి కానుంది. సోమవారం సాయంత్రం మంత్రులు సమావేశమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంతమంది మంత్రులు హాజరవుతారన్న విషయంపై స్పష్టత రాలేదు. ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యే అవకాశాలున్నాయి.
రాష్ట్రానికి చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి పల్లంరాజు హాజరయ్యేది లేనిది ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది.