కుప్ప కూలిన వైమానిక విమానం | | Sakshi
Sakshi News home page

కుప్ప కూలిన వైమానిక విమానం

Published Sat, Sep 10 2016 1:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

కుప్ప కూలిన వైమానిక విమానం

న్యూఢిల్లీ : భారత వైమానిక దళ విమానం మిగ్-21 కూలిపోయింది. రాజస్తాన్లోని బార్మర్ ప్రాంత సమీపంలో ఈ ఎయిర్క్రాప్ట్ కూలిపోయినట్టు డిఫెన్ అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయట పడ్డట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.బార్మర్ సమీపంలోని ఉత్తర్లాయ్ ఎయిర్బేస్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న ఈ ఎయిర్క్రాప్ట్ బార్మర్ సమీపంలోనే కూలిపోయింది. టీ-69 ట్రైనర్ ఈ ఎయిర్క్రాప్ట్ను టేక్ ఆఫ్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సివిల్ లేదా సర్వీసు ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీకి ఆదేశించినట్టు డిఫెన్స్ అధికారి వెల్లడించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement