safe
-
PAN 2.0: కొత్త పాన్ కార్డ్ ఎంత వరకూ సేఫ్?
ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ అప్గ్రేడ్ వెర్షన్ 'పాన్ 2.0'ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది యాక్సెసిబిలిటీ.. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రెండవది డేటా స్టోరేజ్.. ఇదీ సురక్షితం. ఇక మూడవది సులభతరమైన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ. కొత్త పాన్ కార్డ్లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటుంది కాబట్టి డిజిటల్ వర్క్లో దాని ఉపయోగం మునుపటి కంటే సులభతరం అవుతుంది.ఎలా సురక్షితం?'పాన్ 2.0'లో ఈ-పాన్ కార్డ్ ఎటువంటి ఛార్జీ లేకుండా దరఖాస్తుదారు ఈ-మెయిల్కు వెంటనే డెలివరీ అవుతుంది. నామమాత్రపు రుసుముతో భౌతిక కార్డ్ కూడా పొందవచ్చు. కొత్త టెక్నికల్ సదుపాయాలు చేరిన తర్వాత కూడా పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి కొత్త పాన్ కార్డు రక్షణ పొందుతుందా లేదా అనే ప్రశ్న సహజమే. సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడంలో కొత్త కార్డ్ ఎంతవరకు సమర్థంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..తాజా సమాచారంకొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ తాజా ఫార్మాట్కి అప్గ్రేడ్ అవుతుంది. దానితో మీరు మీ కొత్త డేటాను అప్డేట్ చేయవచ్చు.దుర్వినియోగానికి కళ్లెంకొత్త పాన్ కార్డ్లోని క్యూఆర్ కోడ్ కారణంగా, సైబర్ దుండగులు దానిని సులభంగా నకిలీ చేయలేరు. తద్వారా సైబర్ మోసాలను కట్టడి చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది.మరింత సురక్షితంకొత్త పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్లోని వ్యక్తిగత డేటా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా అధీకృత సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేసేందుకు వీలవుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే సంఘటనలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా పాన్ ధ్రువీకరించడంలో ఆర్థిక సంస్థలకు సహాయపడుతుంది.వేగవంతమైన ధ్రువీకరణక్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా పాన్ని సులభంగా ధ్రువీకరించవచ్చు. తద్వారా సమాచార దొంగతనం, టాంపరింగ్కు పాల్పడటం సులభం కాదు. ఇక కొత్త ఫీచర్లు ఎంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయో చూస్తే.. ఒక వేళ అన్నింటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తే.. రియల్ టైమ్ వ్యాలిడేషన్, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు కొత్త సిస్టమ్కు జత కలుస్తాయి. దీంతో సైబర్ భద్రతకు బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీ ముప్పులు నేడు కొత్త రూపాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా ఉంటుందో అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. -
బాల్యం ఇక్కడ సేఫ్
సమస్యలు చూసి ‘అయ్యో!’ అనుకునే వాళ్లు కొందరు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు ఆలోచించేవారు కొందరు. సూరేపల్లి సుజాత రెండో కోవకు చెందిన యాక్టివిస్ట్. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ‘శాతవాహన యూనివర్సిటీ’లో సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్. ప్రాఫెసర్గా క్లాసు నాలుగు గోడలకే పరిమితం కాలేదు. పర్యావరణ సమస్యల నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో ఉద్యమాలలో భాగం అయింది. తన గళాన్ని గట్టిగా వినిపించింది. ‘సేఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మురికివాడల్లోని పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది...హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో 2021లో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసన తెలియజేసేందుకు సుజాత అక్కడి మురికివాడకు వెళ్లింది. ఆ బస్తీలో కనీస సదుపాయాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పేదలను చూసి చలించిపోయింది. సాయంత్రమైతే ఆ బస్తీలో గంజాయి, మద్యం, మత్తుపదార్థాల వరద పారుతుంది. ‘ఇలా ఎందుకు?’ అని తెలుసుకోవడానికి ఆరునెలలపాటు అక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. తల్లిదండ్రులు వారి పిల్లలను బాల కార్మికులుగా చేస్తున్న తీరును గమనించి స్కూల్ పిల్లల్ని డ్రాపౌట్స్గా మారకుండా చూడడంపై దృష్టి పెట్టింది.మత్తు పదార్థాల ప్రభావం చిన్నారులపై పడకుండా, వారి భవిష్యత్ను కాపాడడం కోసం రంగంలోకి దిగిన సుజాత మొదటి అడుగుగా చిన్న స్థలాన్ని చూసి స్టడీ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనికి ‘సావిత్రి బాయి పూలే స్టడీ సెంటర్’గా నామకరణం చేసింది. ఒకటితో మొదలైన స్టడీ సెంటర్ల సంఖ్య పదిహేనుకు పెరిగింది.మూడు అంగన్ వాడీ కేంద్రాలు, మూడు ప్రభుత్వ పాఠశాలలో చదివే మూడువందల మందికి పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో సాయంత్రం చదువుకోవడానికి వస్తారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పార్ట్టైం టీచర్లుగా పనిచేస్తున్నారు. డ్రాపౌట్లను తగ్గించడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడం లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పిల్లల మానసిక వికాస అభివృద్ధి, పౌష్టికాహార లోపం అధిగమించడంపై ఈ విద్యాకేంద్రాలు దృష్టి పెట్టాయి.సింగరేణి కాలనీలో అంతా చెత్త ఏరుకుని బతికే పేదలే. వారి పిల్లలు అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్తారు. నాలుగో తరగతి వరకు చదివించి ఆపై ఆపేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, పిల్లలు పై చదువులు చదవడానికి ‘సావిత్రిబాయి పూలే సెంటర్’ల ద్వారా విశేష కృషి చేస్తోంది సుజాత.పదవ తరగతి చదివే పిల్లలకోసం బ్రేక్ఫాస్ట్ (డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు) అందించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చి ఆ ఏడాది ఉత్తీర్ణతా శాతాన్ని పెంచింది. ఏటా పిల్లల కోసం సమ్మర్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటల నుంచి ఆత్మరక్షణ విద్య, సైన్స్ ప్రాజెక్ట్ల వరకు ఈ క్యాంప్లో ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. మత్తు పదార్థాల దుష్ప్రభావంపై అవగాహన కలిగించడం మరో కీలక అంశం.తొలిసారిగా తాను ఆ మురికివాడలో అడుగు పెట్టినప్పటితో పోల్చితే విద్యార్థుల చదువుకు సంబంధించి ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. అది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో శ్రమిస్తే వచ్చిన మార్పు. ‘తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు తీసుకు వస్తే పిల్లల భవిష్యత్కు బంగారుబాట వేయవచ్చు’ అని నిరూపించిన మార్పు. – భాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్సమాజంలోని అవలక్షణాలను వదిలించి, మనిషి సన్మార్గంలో నడిచేలా పనిచేయడమే మా లక్ష్యం. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత -
బంగారమంటే అంత నమ్మకం!
ధగధగమంటూ కాంతులీనే బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు?.. ప్రతిఒక్కరికీ పసిడిపైన మక్కువే. మరి ఆ బంగారాన్ని ఎవరు, ఎలా చూస్తున్నారన్నదే ఆసక్తికరం. ఇదే అంశంపైనే ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ విశేషాలను ఈ కథనంలో మీకందిస్తున్నాం..మనీవ్యూ సర్వే ప్రకారం, 3,000 మంది ప్రతివాదులలో 85 శాతం మంది బంగారాన్ని సంపద పరిరక్షణకు విలువైన ఆస్తిగా పరిగణిస్తున్నారు. అద్భుతంగా పెరుగుతన్న దాని విలువ, చారిత్రికంగా ఉన్న విశిష్టత వినియోగదారుల్లో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాయి.ముఖ్యంగా 25-40 ఏళ్ల వయస్సున్నవారు పదవీ విరమణ, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సంపదను నిర్మించడానికి వారి సాధారణ ఆర్థిక వ్యూహంలో భాగంగా భౌతిక, డిజిటల్ మార్గాల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారని సర్వే పేర్కొంది.70 శాతం మంది భారతీయులు అంటే 10 మందిలో ఏడుగురు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వారి పొదుపు అలవాట్లను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ యుగంలో బంగారంపై ఉన్న ఆసక్తి డిజిటల్ గోల్డ్ వైపు ఎక్కువగా నడిపిస్తోంది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలే ఎక్కువ..సర్వే డేటా ప్రకారం.. 35 ఏళ్లలోపు వారిలో 75 శాతం మంది భౌతిక బంగారం కంటే కూడా డిజిటల్ బంగారాన్ని ఇష్టపడుతున్నారు. దానికి లిక్విడిటీ, సౌలభ్యం ప్రధాన కారకాలుగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 50 శాతానికి పైగా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పాక్షిక మొత్తాలలో బంగారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యం తమ పెట్టుబడి అలవాట్లను మార్చుకునే దిశగా అత్యంత లాభదాయకమైన లక్షణాలలో ఒకటి అని నమ్ముతున్నారు. -
ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు. The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT— India Meteorological Department (@Indiametdept) October 25, 2024'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే -
గుడ్ న్యూస్: హెచ్ఐవీ రోగుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమే!
తీవ్రమైన కిడ్నీసమస్యలతో బాధపడుతున్న హెచ్ఐవీ (HIV) రోగులకు భారీ ఊరట లభించనుంది. హెచ్ఐవీ ఉన్న వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి సురక్షితమని కొత్త అధ్యయనంద్వారా వెల్లడైంది. హెచ్ఐవీఉన్న వ్యక్తులు, ఎయిడ్స్ వైరస్తో జీవిస్తున్న వ్యక్తుల నుంచి కిడ్నీలను సురక్షితంగా స్వీకరించవచ్చని ఈ స్టడీ తేల్చింది. జీవించి ఉన్నపుడు ఇచ్చినా, లేదా మరణం తరువాత కిడ్నీలను దానం చేసినా రెండింటినీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చని తెలిపింది.న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో బుధవారం ప్రచురించబడిన ఈ కొత్త అధ్యయనాన్ని అమెరికాలో నిర్వహించారు. 198 కిడ్నీ మార్పిడికేసులను పరిశీలించి, దానం చేసిన అవయవం ఎయిడ్స్ వైరస్ ఉన్న వ్యక్తి నుండి వచ్చినా లేదా లేని వ్యక్తి నుండి వచ్చినా ఇదే ఫలితాలను పరిశోధకులు గుర్తించారు. గత నెలలో, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిశోధనా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన మూత్రపిండాలు , కాలేయ మార్పిడిని అనుమతించే నియమ మార్పును ప్రతిపాదించింది. దీనికి ఆమోదం లభిస్తే ఇది రాబోయే సంవత్సరంలో అమల్లోకి వస్తుందని రావచ్చు.హెచ్ఐవీ పాజిటివ్, కిడ్నీ ఫెయిల్ అయిన రోగులపై ఈ అధ్యయనం జరిగింది. HIV-పాజిటివ్తో మరణించిన దాత లేదా HIV-నెగటివ్ మరణించిన దాత నుండి అవయవాన్ని స్వీకరించి,నాలుగేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించారు. అలాగే హెచ్ఐవీ పాజిటివ్ దాతల నుంచి కిడ్నీలు పొందిన సగం మందిని హెచ్ఐవీ లేని దాతల నుంచి వచ్చిన వారితో పోల్చారు. వీరిలో 13మంది రోగులకు,ఇతర సమూహంలోని నలుగురికి వైరస్ స్థాయిలు పెరిగాయి. దీనికి హెచ్ఐవీ మందులను సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని NYU లాంగోన్ హెల్త్కు చెందిన అధ్యయన సహ-రచయిత డాక్టర్ డోరీ సెగెవ్ చెప్పారు. తమ పరిశోధన అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. -
‘డిజీ’ లాకర్తో సర్టీఫికెట్లు భద్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్వ్యూకి వెళ్లే విద్యార్థి చేతిలో ఫైల్...అందులో విద్యాభ్యాసానికి చెందిన అన్ని సర్టిఫికెట్లు... అవన్నీ ఆర్డర్లో ఉన్నాయా లేదా? అని ముఖంలో కంగారు... అయితే.. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఏఐ సాంకేతికతతో మారబోతోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చెబుతోంది. మౌస్ క్లిక్తో క్లౌడ్కు కనెక్ట్ అవ్వడం... టెన్త్ దగ్గర్నుంచీ పీహెచ్డీ దాకా డిజిటల్గా చూసే విధానానికి నాంది పలుకుతోంది.ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘డీజీ’లాకర్ను అందుబాటులోకి తేవాలని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టులను మొదలు పెట్టాయి. ఇందులోని సవాళ్లను పరిశీలించిన తర్వాత మరికొన్ని నెలల్లో పూర్తిస్థాయిలో డిజీ లాకర్స్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాయి. ఎందుకీ లాకర్స్? దీనిద్వారా విద్యార్థి సర్టీఫికెట్లన్నీ డిజిటల్గా పొందే వీలుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తేలికగా క్లౌడ్ ద్వారా సర్టీఫికెట్ల ధ్రువీకరణ చేయొచ్చు. నకిలీ సర్టిఫికెట్లు ఉండే అవకాశమే ఉండదు. విద్యారి్థకి టెన్త్ క్లాస్ నుంచే ఒక యూనిక్ ఐడీ కోడ్ ఇస్తారు. దీనిద్వారా క్లౌడ్కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో పూర్తి సమాచారం అందిస్తారు. అక్కడినుంచి టెన్త్, ఇంటర్ బోర్డ్లు, యూనివర్సిటీలు సంబంధిత ఐడీకీ సర్టీఫికెట్లను అప్లోడ్ చేస్తాయి. డీజీ లాకర్ వ్యవస్థ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆధీనంలో, పూర్తి సురక్షితంగా ఉంటుంది.దీంతో సర్టిఫికెట్లు దెబ్బతిన్నాయని, పోయాయని ఆందోళన పడాల్సిన అవసరమే ఉండదు. విదేశీలకు వెళ్లినా కేవలం యూఆర్ఎల్ లింక్ ద్వారా సర్టీఫికెట్లను పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం 2024 పాస్ అవుట్ విద్యార్థుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పదేళ్లలోపు చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు కూడా యూజీసీ భరిస్తుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రాక్టికల్గా ఎన్నో సవాళ్లు.. డిజీ లాకర్ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ప్రాక్టికల్గా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థుల ఆధార్ నంబర్ను దీనికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే, ఆధార్కు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో... దాన్నే లాకర్కు ఇవ్వాలి. కానీ విద్యార్థుల్లో చాలామంది తరచూ ఫోన్ నెంబర్లు మారుస్తున్నారు. దీనివల్ల సమస్యలు వస్తున్నాయని జేఎన్టీయూహెచ్ పరీక్షల విభాగం అధికారి సాహూ తెలిపారు. మరోవైపు టెన్త్, ఇంటర్ బోర్డ్లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేక యంత్రాంగం ఇప్పటివరకూ లేదని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో జరిగే దోస్త్ డేటాను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజీ లాకర్ ఎలా పనిచేస్తుంది? విద్యార్థి అన్ని సర్టీఫికెట్లు ఒక క్లౌడ్ ద్వారా నిక్షిప్తం చేస్తారు. విద్యార్థి డీజీ లాకర్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటాడు. డీజీ లాకర్ విభాగం ఇచ్చే లాగిన్ పాస్వర్డ్ను మార్చుకుని భద్రపర్చుకుంటాడు. అవసరమైన సర్టీఫికెట్లను తను ఇంటర్వ్యూ లేదా అడ్మిషన్ పొందే సంస్థలకు మౌస్క్లిక్ లింక్ ద్వారా పంపుకోవచ్చు. యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఆయా సంస్థలు సర్టీఫికెట్లన్నీ ఆన్లైన్లోనే తనిఖీలు నిర్వహిస్తాయి. ఒక విభాగాన్ని పరిశీలిస్తున్నాం డిజీ లాకర్కు విద్యార్థుల డేటాను డిసెంబర్ నాటికి అప్లోడ్ చేయమని యూజీసీ తెలిపింది. ఇందులో భాగంగా పరీక్షల విభాగం సమన్వయంతో పైలెట్ ప్రాజెక్టు మొదలు పెట్టాం. ఎదురయ్యే సవాళ్లను పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు ఇది ఉపయుక్తమైన ప్రాజెక్టు. అయితే, తొలి దశలో అనేక సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. – డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి (రెక్టార్, జేఎన్టీయూహెచ్) తొలుత పీజీ విద్యార్థుల సమాచారండిజీ లాకర్ పరిధిలో తొలి విడతగా పీజీ విద్యార్థుల సమాచారం తెచ్చేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించి తర్వాత దశకు వెళ్తాం. విద్యార్థుల సర్టీఫికెట్లు సురక్షితంగా, తేలికగా పొందేందుకు డీజీ లాకర్ తోడ్పడుతుంది. – ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ (ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్) -
స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
కేప్కనవెరాల్: బోయింగ్ అంతరిక్ష నౌక ‘స్టార్ లైనర్’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తెలిపారు. స్టార్ లైనర్ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్ 5న సునీత, విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్లో సమస్యల వల్ల ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్ఎస్ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్ఎస్లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్ విలేకరులతో అన్నారు. -
పిచ్చుకను కాపాడిన బుడతలు..! ఇంతకీ ఏం జరిగిందంటే?
మారుతున్న కాలక్రమేనా పిచ్చుకల జాతే కాదు.. మిగతా మూగ ప్రాణులన్నీ కూడా జాడ లేకుండా పోతున్నాయి. ఈ ఎండలో దాహానికి అలమటిస్తున్నాయి. అలాంటి ఘటనే ఓ పిచ్చుకకి జరగడంతో.. ఈ చిన్నారులు చేసిన గొప్పపనేంటో చూద్దామా!రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం ఓ పిచ్చుకను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆడుకునేందుకు మండెపల్లికి చెందిన గదగోని నిహాంత్, హర్షిత్, త్రినయ్ సిరిసిల్లలోని బతుకమ్మఘాట్ వద్దకు బుధవారం వెళ్లారు.ఆ సమయంలో నీరు దొరక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పిచ్చుకను గమనించి.. వెంటనే దాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వెంట తెచ్చుకున్న వాటర్బాటిల్ మూతలో నీరు పోసి తాగించారు. కొద్దిసేపు సపర్యాలు చేయడంతో తేరుకుంది. వెంటనే తుర్రన ఎగిరిపోయింది. పిచ్చుక ప్రాణాన్ని కాపాడిన చిన్నారుల సంతోషానికి అవధులు లేవు.ఇవి చదవండి: World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి! -
గని ప్రమాదం.. 14 మంది అధికారులు సేఫ్.. ఒకరు మృతి
రాజస్థాన్లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు చెందిన గనిలో మంగళవారం రాత్రి చిక్కుకున్న 15 మంది అధికారులలో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఒక అధికారి మరణించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. నాలుగు దశల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. వారిని జైపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గనిలో 1,875 అడుగుల లోతులో లిఫ్ట్ చైన్ తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది. #WATCH झुंझुनू, राजस्थान: कोलिहान खदान में लिफ्ट गिरने से 14 लोगों के फंसे होने की आशंका है, बचाव अभियान जारी है।वीडियो आज सुबह की है। pic.twitter.com/gIuVYnRsbd— ANI_HindiNews (@AHindinews) May 15, 2024ఈ ప్రమాదంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే మరణించారు. అతని మృతదేహాన్ని కేసీసీ ఆస్పత్రికి తరలించారు. కాగా గనిలోని లిఫ్ట్లో ఏదో లోపం ఉందని, మరమ్మతులు చేయించాలని ఎనిమిది రోజుల క్రితం కెసిసి యాజమాన్యానికి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ స్వయంగా దృష్టి సారించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?
బిజీ లైఫ్లో ఏ రోజు కారోజు తాజాగా ఉండే కూరగాయాలు తెచ్చుకోవడం అందరికీ కుదరదు. అందులోనూ కొన్ని కాయగూరలు తొందరగా మెత్తగా లేదా మొలకెత్తడం, కలర్ మారిపోవడం జరుగుతుంది. అన్ని డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసొప్పక ఏదో రకంగా వండేస్తాం. కొందరైతే పాడైన భాగాన్ని తొలగించి మిగతా భాగం నుంచి వండేస్తారు.ఇలా చెయ్యొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా..? కొన్ని కూరగాయాలు కొద్ది రోజులే నిల్వ ఉంటాయి. మరికొన్ని పాడైపోయినా ఆ విషయం తెలియదు. మెత్తబడటం లేదా మొలకెత్తుతుంటాయి ఇంకొన్ని కూరగాయాలు. మనం పడేయబుద్ధికాక వండేస్తుంటాం. అయితే ఇలా ఉంటే కొన్ని రకాల కూరగాయాలు అస్సలు వాడకూడదట. అవేంటో సవివరంగా చూద్దామా..! బంగాళదుంపం: బంగాళ దుంపపై మొలకలు వస్తే కొందరూ వెంటనే పడేస్తారు. మరొకందరూ వాటిని తొలగించి వండేస్తారు. మరీ వాడొచ్చా అంటే..నిజానికి బంగాళదుంపలో సహజంగా సోలనిన్ , చకోనిన్ అనే రెండు రకాల టాక్సిన్లు ఉంటాయి. అయితే బంగాళదుంపపై మొలకలు వచ్చి, ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయ్యడం మంచిది. జస్ట్ అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపించనట్లయితే వినయోగించొచ్చు. కానీ మొలకలు, ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినయోగించొద్దిన నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఉల్లిపాయలు వద్దకు వస్తే బయటి తొక్కలు పొడిగా ఉంటాయి. కానీ లోపాల చాలా వాటికి నల్లటి రంగు ఉంటుంది. మనం వాటిన కడిగేసి వాడేస్తుంటా. అయితే ఇదేం అంత ప్రమాద కాదని చెబుతున్నారు నిపుణులు. మట్టిలో ఉండటం వల్ల వచ్చే కొద్దిపాటి ఫంగస్ అని, దీన్ని చక్కగా కడగడం లేదా ఆ భాగాన్ని తీసేయండి చాలు అని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి బయటపోరలు తీస్తుండగా మెత్తగా కుళ్లినట్టు ఉండి లోపల భాగం బాగుంటే అస్సలు వంటకు వినయోగించొద్దుని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆకుకూరలు వద్దకు వస్తే.. ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వడలిపోయి, కలర్ మారిపోతే వాడొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఆకులు పసుపురంగులో ఉంటే ఆయా ఆకులను తీసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఆకుకూర కాళ్లుభాగం లేదా, ఆకులు కుళ్లినట్లు ఉంటే అస్సలు వినయోగించొద్దని చెబతున్నారు. మొత్తని టొమాటాలు.. దెబ్బతగిలిన టొమాటాలు, కొన్ని లేత మచ్చలు ఉన్నా..ఆ ప్రాంతం వరకు కట్ చేసి తీసేసి వాడుకోవచ్చు. అదే టమాట బూజు పట్టి ఉండి మొత్తం మొత్తగా ఉంటే వెంటనే పారేయండి. కొన్ని టమాటాలు మెత్తగా అయిపోతాయి. అవి వాడుకోవచ్చని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. వెల్లుల్లి.. భారతీయ వంటశాలల్లో ప్రధానమైనది. ఇవి గోధుమ రంగులోకి మారిన, దానిపై గోధుమ కలర్ మచ్చలు ఉన్నా.. వెల్లుల్లి పాడైందని అర్థం. కొన్నింటికి ఆకుపచ్చగా మొలకలు వస్తాయి. అలాంటి వెల్లుల్లిలోని ఆకుపచ్చ భాగాన్ని తొలగించి హాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే..? వెల్లుల్లిలోని మొలకెత్తిన ఆకుపచ్చ భాగం చేదుగా ఉంటుంది. కూరల్లో వినయోగిస్తే టేస్ట్ మారుతుంది కాబట్టి వాటిని తొలగించాలి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ముడతలు పడినట్టు ఉండి జిగటగా ఉండి పాడైపోయినట్లు సంకేతం. అలాగే వాటిపై నల్ల మచ్చలు చెడిపోవటాన్ని సూచిస్తాయి. ఇలాంటివి వినియోగించకపోవటమే మేలు. దోసకాయలు.. దోసకాయ సాధారణంగా ఫ్రిజ్లో ఒక వారం పాటు తాజగా ఉంటుంది. దోసకాయ మెత్తబడితే అది పాడైపోయిందని అర్థం. మొత్తంగా కాకుండా కేవలం దోసకాయ చివరి భాగం మాత్రమే మెత్తగా ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా బైటపడటం నిజంగా చల్లటి కబురు. టెక్సాస్లోని తన ఇంటినుంచి సోమవారం రాత్రి అదృశ్యమైన 17 ఏళ్ల ఇషికా ఠాకోర్ను ఫ్రిస్కో పోలీసులు సురక్షితంగా గుర్తించారు. అయితే ఎపుడు, ఎక్కడ, ఎలా కనుగొన్నారు అనే వివరాలను మాత్రం ఫియాస్కో పోలీసులు వెల్లడించలేదు. టెక్సాస్లోని ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఏప్రిల్ 8, సోమవారం తప్పిపోయింది. ఫ్రిస్కోలోని బ్రౌన్వుడ్ డ్రైవ్లోని తన ఇంటి నుండి ఇషికా అదృశ్యమైందంటూ క్రిటికల్ మిస్సింగ్ హెచ్చరికను జారీ చేశారు. ఈమేరకు ట్విటర్లో ఒకపోస్ట్ పెట్టారు. ఇటీవల తప్పి పోయిన పలువురు భారతీయ విద్యార్థులు ఆ తర్వాత శవమై కనిపించడంతో ఇషికా అదృశ్యం ఆందోళన రేపింది. అయితే ఆమె ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. CRITICAL MISSING-Frisco PD is seeking assistance in locating 17-year-old Ishika Thakore, last seen Monday, Apr 8 at 11:30p in the 11900-block of Brownwood Dr. in Frisco. She is approx 5’4” and 175 lbs, last seen wearing a black, long-sleeve t-shirt and red/green pajama pants. pic.twitter.com/L7fDV7HuEH — Frisco Police (@FriscoPD) April 9, 2024 కాగా గత కొన్ని నెలల్లో అమెరికాలో 11 మంది భారతీయ, భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు చనిపోయారు. ముఖ్యంగా గత నెల నుంచి తప్పిపోయిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి మంగళవారం ఓహియోలోని క్లీవ్ల్యాండ్లో శవమై కనిపించాడు. అలాగే ఓహియోలోని క్లీవ్ల్యాండ్లో మరో భారతీయ సంతతి విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించచాడు. -
ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త!
మొన్నమొన్నటి దాకా చల్లగా సాగిన ప్రయాణం ఇప్పుడు వేసవి కొలిమికి సిద్ధమైంది. సమ్మర్ వార్తలు కొంతకాలంగా డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ఓ వైపు వాతావరణంలో మొదలైన మార్పులు, మరోవైపు నిపుణుల హెచ్చరికలు తెలియకుండానే గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక నుంచి ఏం తిన్నా, ఏం తాగినా ఆపసోపాలే! ఎటు వెళ్లినా, ఎక్కడాగినా నీరసాలు, నిట్టూర్పులే! మరి ఈ ఎండాకాలాన్ని ఎలా దాటెయ్యాలి? ఈ వేసవి తాపానికి డీహైడ్రేషన్, వడదెబ్బ, కళ్లు తిరగడం, నీరసం, వాంతులు, జీర్ణసమస్యలు ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతర కాలాల్లో అనారోగ్యం వస్తే.. ఏదో ఒకటి తిని, ఓ టాబ్లెట్ వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రైనాపోవచ్చు. కానీ ఈ ఎండాకాలంలో నిద్ర కూడా పట్టదు. పరచుకున్న పరుపులోంచి, మూసి ఉన్న తలుపుల్లోంచి వేడి తన్నుకొచ్చి.. కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి వడగాల్పులను తట్టుకోవాలంటే.. చలువ చేసే ఆహారాలు, చల్లబరచే పానీయాలను పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తినేవాటిలో ఆయిల్ లెస్, తాగేవాటిలో సుగర్ లెస్ తప్పదంటున్నారు. జంక్ ఫుడ్కి, సాఫ్ట్ డ్రింక్స్కి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు. నిజానికి వేసవిలో ఎక్కువగా తినాలనిపించదు. ఆరారగా పానీయాలు తాగాలనిపిస్తుంది. అసలు తినడానికైనా, తాగడానికైనా ఏవేవి మంచివో చూద్దాం. ఎండాకాలం ఆహారాలు దోసకాయ, పుచ్చకాయ, మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, అనాసకాయ ఇలా ప్రతి పండూ వేసవిలో ఆస్వాదించతగ్గదే! వాటిలోని వాటర్ కంటెంట్ బాడీలోని ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గిస్తాయి. అలాగే అరుగుదల సజావుగా చేసి.. జీర్ణకోశాన్ని తేలికపరుస్తాయి. ఆయా పండ్లతో చిక్కగా జ్యూసులు చేసుకుని తాగొచ్చు. భోజనం విషయానికి వస్తే ఆకుకూరలు, కూరగాయలకే పోపు పెట్టడం మంచిది. సమ్మర్లో మాంసం, చేపలు వంటివి తినడం వల్ల అరుగుదల ఆలస్యం అవుతుంది. కడుపు బరువుగా మారుతుంది. నాన్వెజ్ వంటకాల్లో నూనె, మసాలా వంటివి ఎక్కువగా వాడాల్సి రావడంతో అవన్నీ వేసవి కాలంలో జీర్ణక్రియ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తినేటప్పుడు తేలికగా అరిగేవి ఎంచుకోవాలి. వేపుళ్లు తినడం వల్ల వడదెబ్బను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి, ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీరు, జావలు, జ్యూసులు, ద్రవాహారాలను తీసుకోవాలి. డబ్ల్యూఎంఓ హెచ్చరిక ఈ వేసవి మూడునెలలు మండుతున్న కుంపటే అని మన వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్నే ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) కూడా వెల్లడించింది. ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. గత ఏడాది జూన్లో ‘ఎల్ నినో’ ఏర్పడిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉండబోతున్నాయని వెల్లడించింది. ఇవి అస్సలు తినొద్దు... కెఫీన్, ఆల్కహాల్: ఈ రెండూ బాడీని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అందుకే వేసవిలో కాఫీ, టీలతో పాటు మద్యానికీ దూరంగా ఉండటం ఉత్తమం. స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ చెమటలు పుట్టిస్తాయి. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఉక్కబోతల వాతావరణంలో మరింత వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు బాడీని ఎక్కువగా డీహైడ్రేషన్కి గురిచేస్తాయి. ఇలాంటివి తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని వల్ల నీరసంగా, అలసటగా ఉంటుంది. అరుగుదల లోపంతో తెలియకుండానే ఆపసోపాలు మొదలవుతాయి. వేసవి పానీయాలు సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ‘ఉత్త నీళ్లు ఎన్నని తాగుతాం‘ అనుకునేవారు ’ఇలా చిటికెలో అయ్యే చలవ పానీయాలను తయారుచేసుకుని తాగండి’ అంటున్నారు నిపుణులు. అయితే పంచదారకు బదులుగా తేనె వాడుకోవడం మంచిది. తేనె లేని సమయంలో తక్కువ మోతాదులో బెల్లం పాకం వాడుకోవచ్చు. సబ్జా నీళ్లు.. ఈ సమ్మర్ సీజన్ లో సబ్జా నీళ్లు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే పెక్టిన్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సీజన్లో సబ్జా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి సమస్యలు దరిచేరవు. అందుకే నీళ్లలో సబ్జా వేసుకుని తాగడం మంచిది. తేనె– నిమ్మరసం నీళ్లు ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మచెక్కను పిండుకుని, ఒకటిన్నర లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి తాగొచ్చు. ఇది తక్షణశక్తిని అందిస్తుంది. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. సోంపు నీళ్లు సోంపులో ఈస్ట్రాగోల్, అనెథాల్, ఫెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచి, జీర్ణ సమస్యలను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తేనె లేదా బెల్లం పాకం కలిపి తీసుకుంటే మంచిది. కొబ్బరి బోండం.. కొబ్బరి నీళ్లు ఎల్లప్పుడూ బాడీని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉండే ఈ సహజపానీయం వేసవిలో వేడిని తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది. జీలకర్ర నీళ్లు.. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలానే ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ వాటర్ వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. సమ్మర్లో రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఏలకుల నీళ్లు ఏలకుల్లోని ఔషధ గుణాలు.. బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. కడుపులో వేడి, మంట, వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. ఒక గ్లాసుడు వేడి నీళ్లల్లో ఏలకుల్ని దంచి వేసుకుని, బాగా కలుపుకుని, వడకట్టి తాగాలి. అభిరుచిని బట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ నీళ్లు శరీరంలో వేడిని వేగంగా తగ్గిస్తాయి. మెంతుల నీళ్లు మెంతుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్ , పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని మెంతుల్ని గ్లాసు నీళ్లల్లో నానబెట్టి, వడకట్టుకుని తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి, చల్లబడుతుంది. దనియాల నీళ్లు ఒక టీస్పూన్ దనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి, వడగట్టుకుని పది నిమిషాల పాటు మరిగించి, చల్లార్చుకుని తాగితే మంచిది. దనియాల్లోని పైబర్ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే ఈ వాటర్.. బాడీలోని టాక్సిన్స్ను తొలగించి.. చల్లదనాన్ని అందిస్తుంది. మజ్జిగ.. వేసవికి అసలు సిసలు చల్లదనం మజ్జిగతోనే వస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని, గిలక్కొట్టి అందులో ఓ గ్లాసుడు నీళ్లు కలిపితే చాలు, మజ్జిగ రెడీ. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే కడుపులో చల్లగా ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటిని పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయట పడొచ్చు. అలాగే ఫ్రిజ్లో వాటర్ కంటే మట్టికుండను ఇంట్లో పెట్టుకోవడం మంచిది. చర్మసంరక్షణ అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోయి దెబ్బతింటుంది. మొటిమలు రావడం, ముఖం కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం, సాయంత్రం తప్పకుండా చల్లటి నీళ్లతో స్నానం చెయ్యాలి. ముఖాన్ని నీళ్లతో కొట్టినట్లుగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు అయినా నేచురల్ స్క్రబ్తో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన తగ్గుతుంది. క్రీమ్స్ అండ్ లోషన్స్ సాధారణంగా మాయిశ్చరైజర్ శీతాకాలంలో మాత్రమే అవసరం అనుకుంటాం. కానీ వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూడా మాయిశ్చరైజర్ అవసరం అంటారు నిపుణులు. చర్మసంరక్షణలో భాగంగా సమ్మర్ క్రీమ్స్ వాడితే మంచిది. బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరచిపోవద్దు. అది సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మంలోని తేమను కాపాడుతుంది. హెయిర్ కేర్ ఎవరికైనా కురులే ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. కానీ వేసవి వచ్చేసరికి చెమటకు, ఉక్కపోతలకు ఆ కురులే విసుగుపుట్టిస్తుంటాయి. అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వేసవిలోనూ జుట్టు ఆరోగాన్ని కాపాడుకోవచ్చు. పొడవాటి జుట్టున్నవారు పైకి ముడిపెట్టుకునేటప్పుడు జాగ్రత్తపడాలి. చిక్కులు పడకుండా అనువైన క్లిప్స్ వాడుకోవాలి. స్విమ్మింగ్ పూల్లో కాని, బీచ్లో కాని తల తడిసినప్పుడు ఇంటికి వచ్చి మంచి నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారిపోయి బలహీనంగా,పెళుసుగా మారతాయి. కెమికల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. తల స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత కురులను బలంగా రుద్దకూడదు. బాగా ఆరిన తర్వాతే జుట్టుని అల్లుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు జుట్టుకి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. తల స్నానం తర్వాత వెంట్రుకలకు కండిషనర్ వాడటం మంచిది. గొడుగైనా.. హ్యాట్ అయినా.. ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోవడంతో బయటకి వెళ్లేప్పుడు తగుజాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయితే వేసవికి మరిన్ని జాగ్రత్తలు అసవరం అంటున్నారు నిపుణులు. వేసవిలో ప్రయాణాలు అంత మంచివి కావు. తప్పనిసరి అయితే మాత్రం వెంట తీసుకుని వెళ్లాల్సిన లిస్ట్ ఇదే. ఒక వాటర్ బాటిల్, ఒక గొడుగు లేదా హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్కార్ఫ్ లేదా హెడ్ బ్యాండ్ మాస్క్.. ఇవన్నీ వెంట తీసుకుని వెళ్లాల్సినవే. మొత్తానికీ ఈ వేసవి చల్లగా ఉండాలంటే ‘లైట్ ఫుడ్, లాట్ ఆఫ్ లిక్విడ్స్’ అనే పాలసీని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉంటే కుండలో నీళ్లనే తాగాలి. బయటికి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టాలి. మన సంగతి సరే! పాపం మనతో పాటు జీవించే జంతువులు, పక్షులకూ ఈ వేసవి ప్రాణసంకటమే! కాస్త వాటి దాహాన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి. ఇంటి ముందు చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెడదాం. నాలుగు ధాన్యపు గింజలు ప్లేటులో వేసి, గోడ మీద పెడదాం. ఇవి చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు! -
కరోనా ఇలా కూడా ఎటాక్ చేస్తుందా? నటుడు విజయ్కాంత్ కూడా..
కోలివుడ్కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి. అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. జ్వరం అలసట దగ్గు, గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవడం కండరాలు, శరీర నొప్పులు తలనొప్పి చలి రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
14 వేల అడుగుల ఎత్తునుంచి జారిపడిన స్కైడైవర్.. కాపాడిన అగ్ని చీమలు!
స్కైడైవింగ్కు ప్రయత్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఈ ఫీట్ చేసేందుకు కొందరు సిద్ధమైనా.. మధ్యలో పారాచూట్ విఫలమైతే ఏమైపోతామోనని భయపడిపోతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్ల కోసం తయారైన పారాచూట్లు వంద శాతం మేరకు తెరుచుకుంటాయి. అయితే దీనికి విరుద్ధమైన పరిస్థితి జోన్ ముర్రే అనే మహిళకు ఎదురయ్యింది. అత్యంత విచిత్ర పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. అది 1999, సెప్టెంబర్ 25.. జోన్ ముర్రే(40) అనే మహిళ స్కైడైవింగ్కు దిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమైంది. ఫలితంగా ముర్రే గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తూ అగ్ని చీమల దండుపై పడింది. అయితే ఈ అగ్ని చీమలే ఆమెను కాపాడాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెపై ఆ అగ్ని చీమలు దాడి చేశాయి. ఈ దాడి కారణంగానే ఆమె బతికి బట్టకట్టిందంటే ఎవరూ నమ్మలేరు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అగ్ని చీమల దాడికి ముర్రే శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయి. ఆమె గుండె కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయి. ఆసుపత్రిలో ముర్రే రెండు వారాల పాటు కోమాలో ఉంది. వైద్యులు ఆమె ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు పలు ఆపరేషన్ల చేయవలసి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమె ప్రాణాలను అగ్ని చీమలే కాపాడాయని చెప్పకతప్పదు. ఇది కూడా చదవండి: అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక.. The story of Joan Murray, who survived a 4,500 meter fall when her main parachute failed while skydiving. She landed in a fire ant mound where numerous venomous stings caused an adrenaline rush to keep her heart beating long enough for doctors to assist https://t.co/YUMFGJCXX6 pic.twitter.com/GOPpFwKjqB — Massimo (@Rainmaker1973) May 13, 2020 -
సొరంగం నుంచి బయటపడ్డ కొడుకును చూడకుండానే తండ్రి మృతి
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా దుమారియా బ్లాక్కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు. భక్తు ముర్ము 17 రోజుల అనంతరం సొరంగం నుండి బయటకు వచ్చి, తన తండ్రి మరణవార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. ఈ సందర్భంగా బర్సా ముర్ము కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ‘మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలిసి, ఇంటిలోని మంచం మీద కూర్చున్నాడని, ఇంతలోనే అకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడని’ తెలిపారు. బర్సా ముర్ము అల్లుడు మాట్లాడుతూ.. ‘భక్తు ముర్ము సొరంగంలో చిక్కుకున్నాడనే సమాచారం అందిన తర్వాత అతని తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భక్తు ముర్ము సోదరుడు రాంరాయ్ ముర్ము చెన్నైలో ఉంటాడని, మరో సోదరుడు మంగళ్ ముర్ము కూలి పనులు చేస్తుంటాడని’ తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్ -
టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీనిలో హైదరాబాద్కు చెందిన బోరోలెక్స్ ఇండ్రస్ట్రీస్ కీలకపాత్ర పోషించింది. ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు నవంబర్ 25న హైదరాబాద్లోని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని సంప్రదించారు. టన్నెల్లో చిక్కుకున్న అగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని కట్ చేసే విషయమై సలహా అందించాలని వారు డాక్టర్ సతీష్ రెడ్డిని కోరారు. ఈ నేపధ్యంలో ఆయన ఇందుకు ఉపయోగపడే పరికరాల కోసం స్థానిక పరిశ్రమలను సంప్రదించారు. ఈ తరుణంలో బెరోలెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇందుకు ప్లాస్మా ఆధారిత కట్టింగ్ను సూచించారు. తరువాత 800 ఎం.ఎం. పైపులైన్ వ్యాసం కంటే తక్కువ వ్యాసం కలిగిన యంత్రాల కోసం పలువురిని సంప్రదించాడు. ఒక పరిశ్రమలో అలాంటి రెండు యంత్రాలు ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ యంత్రాలను, ఇద్దరు కట్టింగ్ నిపుణులను ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సంఘటనా స్థలానికి తరలించింది. వారు నవంబరు 25న బేగంపేట విమానాశ్రయం నుండి డెహ్రాడూన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి వెళ్లారు. కొద్ది గంటల సమయంలోనే టన్నెల్లో అడ్డుపడిన అగర్ యంత్రం బ్లేడ్లను కట్ చేసే పని మొదలు పెట్టారు. తద్వారా ఇతర యంత్రాల ద్వారా డ్రిల్లింగ్కు అనువైన పరిస్థితులు కల్పించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు భాస్కర్ కుల్బే తదితరులు టన్నెల్ సహాయక చర్యల్లో చేయూతనందించిన బెరోలెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది సురక్షితం -
బయటివారితో మాట్లాడుతున్న సొరంగంలోని బాధితులు
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దానిలో వారంతా సురక్షితంగా ఉన్నట్లు కనిపించారు. సొరంగంలోని కార్మికులతో బయట ఉన్న వారి బంధువులు మాట్లాడుతున్నారు. బుధవారం ఆ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిలో ఒక కార్మికుడు మొబైల్ ఛార్జర్ను లోపలికి పంపించాలని కోరాడు. సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులలో పుష్కర్ సింగ్ యేరీ ఒకరు. అతని సోదరుడు విక్రమ్ సింగ్ యేరీ తాను పుష్కర్తో మాట్లాడినట్లు మీడియాకు తెలిపారు. తన సోదరుడు.. తాను బాగున్నానని, మమ్మల్ని ఇంటికి వెళ్లాలని చెప్పాడని తెలిపారు. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారపదార్థాలను, ఇతర వస్తువులను అందించడానికి ఆరు అంగుళాల వెడల్పు గల పైపును లోపలికి పంపారు. ఈ ఆరు అంగుళాల ‘లైఫ్లైన్’ అందించకముందు కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఆక్సిజన్ను నాలుగు అంగుళాల పైపు ద్వారా సరఫరా చేశారు. కాగా తాజాగా లోనికి పంపిన విశాలమైన పైప్లైన్తో మెరుగైన కమ్యూనికేషన్ అందడంతో పాటు ఆహార పదార్థాలను కూడా పెద్ద మొత్తంలో పంపేందుకు అవకాశం కలిగింది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుడు ప్రదీప్ కిస్కు క్షేమ సమాచారాన్ని అతని బంధువు సునీతా హెంబ్రామ్ తెలుసుకున్నారు. అతను బాగున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. కాగా కొత్త పైపు సొరంగంలోకి పంపడం వలన కార్మికులతో కమ్యూనికేట్ చేయడం సులభతరం అయ్యింది. ఇప్పుడు వారి గొంతు స్పష్టంగా వినిపిస్తున్నదని సొరంగం బయట ఉన్నవారు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించిన సమాచారం తెలుసుకున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగంలోని ఒక భాగం నవంబర్ 12న కూలిపోయింది. ఈ సమయంలో 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు VIDEO | "He said -'I am good. You people go home. I will come.' Fruits and other food items were sent through the pipe. He has asked for a mobile charger," says Vikram Singh Yeri, brother of Pushkar Singh Yeri, one of the workers who is stuck inside the collapsed Silkyara… pic.twitter.com/LKS66h5FCy — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి!
దేశరాజధాని ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఒక చిన్నారి సహా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మంటలు చెలరేగినప్పుడు భవనంలో 60 మంది ఉన్నారని, వీరిలో కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, 26 మందిని ప్రమాదం బారి నుంచి కాపాడారు. అలాగే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో తొక్కిసలాట జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని కిటికీ పక్కన నిచ్చెనను ఏర్పాటు చేసి, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిగా రక్షించారు. ప్రమాదం జరిగిన షకర్పూర్ ప్రాంతంలో వీధులు చాలా ఇరుకుగా ఉండడంతో మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా? -
నేరం చేస్తే మూడు తరాలకు శిక్ష? ఎందుకలా?
ఏ దేశంలోనైనా నేరానికి తగిన శిక్ష విధిస్తారు. నేరం చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకోలేడు. అయితే ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలు శిక్షను అనుభవించాల్సి వస్తే.. అది మన ఊహకు అందదు. ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలవారు శిక్ష అనుభవించే చట్టం ఆ దేశంలో అమలులో ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పేరు ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ఈ దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతుంటాయి. ఇక్కడ చట్టం అమలయ్యే తీరు తెలుసుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి తల్లిదండ్రులు, పిల్లలు కూడా శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ నేరానికి ఇంతటి శిక్ష విధిస్తారనే ప్రశ్న ఇప్పుడు మన మదిలో మెదులుతుంది. దేశంలోని ఏ ఖైదీ కూడా జైలు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని రూపొందించారని సమాచారం. ఇక ఉత్తర కొరియాలోని ప్రత్యేక చట్టాల విషయానికొస్తే జుట్టు కటింగ్కు సంబంధించి కూడా చట్టాలు రూపొందించారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం 28 హెయిర్ కటింగ్ స్టైల్స్కు మాత్రమే అనుమతినిచ్చింది. వీటిలో మహిళలకు 18, పురుషులకు 10 హెయిర్ కటింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ కాకుండా, ఎవరైనా వేరే విధంగా జుట్టు కత్తిరించుకున్నట్లయితే దానిని నేరంగా పరిగణిస్తారు. అందుకు తగిన శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇటువంటి చట్టాలు కనిపించవు. 21వ శతాబ్దంలో కూడా ఉత్తరకొరియా ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
గురుద్వారలో ఇద్దరు యువతుల వివాహం
చండీఘడ్లోని జలంధర్కు చెందిన ఇద్దరు యువతులు ఖరార్ (మొహాలీ)లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఇద్దరికీ జీవిత భద్రత, స్వేచ్ఛను అందంచాలని జలంధర్ ఎస్ఎస్పీని ఆదేశించింది. ఈ పిటిషన్ను దాఖలు చేసిన ఆ ఇద్దరు యువతులు తాము ఒకరినొకరు ఇష్టపడ్డామని, అక్టోబరు 18న ఖరార్లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులు సంతోషంగా లేరని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వారు కోర్టుకు అందించిన లేఖలో పేర్కొన్నారు. దీనికి ముందు ఆ యువతులు జలంధర్ ఎస్ఎస్పీకి లేఖ ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని జలంధర్ ఎస్ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? -
ఈ పోలీస్ మాములోడు కాదు.. పాముకు సీపీఆర్
మధ్యప్రదేశ్లోని నర్మదాపురంనకు చెందిన ఒక వీడియో వైరల్గా మారింది. ఒక పోలీసు కానిస్టేబుల్ తన నోటి ద్వారా పాముకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నిం చేశారు. ఈ విధంగా పాముకి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. సెమ్రీ హర్చంద్లోని తవా కాలనీలో పాము ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్ అతుల్ శర్మకు సమాచారం అందింది. అతుల్ 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించారు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. తాజా ఘటనలో నీటి పైపులైన్లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానిని బయటకు తెచ్చేందుకు పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్లో వేయగా, ఆ పాము అపస్మారక స్థితికి చేరుకుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఒక పాము అపస్మారక స్థితిలో ఉండటం, దానికి పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? #MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr — NDTV India (@ndtvindia) October 26, 2023 -
గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్: ప్రపంచంలోనే తొలిసారి!
ICMR Male Contraceptive: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక పురోగతిని సాధించింది. పురుషులకోసం గర్భనిరోధక ఇంజెక్షన్ను అభివృద్ది చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను ఇంజెక్షన్ను డెవలప్ చేసింది. దీనికి సంబందించిన క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు ఏడేళ్ల పరిశీలిన తర్వాత RISUG (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పిలిచే నాన్-హార్మోనల్ ఇంజెక్షన్నపై సానుకూల ఫలితాలు వెలువడ్డాయి. అంతేకాదు ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి తీవ్ర దుష్ప్రభావాలు లేవనీ, చాలా సురక్షితం ప్రభావవంతమైనదని కూడా తేలడం విశేషం. ఫేజ్ 3 ట్రయల్స్ సక్సెస్ 25-40 ఏళ్ల వయసుస్సున్న 303 మంది ఆరోగ్యవంతులైన, వివాహిత పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు గత నెలలో రిలీజ్ అయ్యాయి. ICMR, న్యూఢిల్లీ సమన్వయంతో ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ ఆసుపత్రుల్లో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు. ఈ వాలంటీర్లకు 60 మి.గ్రా. RISUG ఇంజెక్షన్ను అందించారు. ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం సమర్థతతో ఈ ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా హార్మోన్లను ఇంజెక్ట్ చేసే ఇతర గర్భ నిరోధకాల మాదిరిగా గాకుండా, లోకల్ ఇంజెక్షన్తోనే దీన్ని సాధించడం కీలకమని కూడా పేర్కొంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఇండియా (DCGI)సహా, ఇతర సంబంధిత కమిటీలచే అనుమతి మేరకు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలను అంతర్జాతీయ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్లో ప్రచురించారు. కాగా గర్భనిరోధం అంటే కేవలం అది స్త్రీల పనే అని అభిప్రాయం సమాజంలో బాగా వేళ్లూనుకుంది. పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేసెక్టమీపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వేసెక్టమీ అంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలో పురుషుల్లో సంతానం నిరోధం కోసం ఒక ఇంజెక్షన్ను తీసుకు రావడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. -
ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? వారిని ఎలా కాపాడుతుంది?
ఇజ్రాయెల్ జెండాలో మనకు కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని అంటారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుండి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు. భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్ పట్టుకున్న డాలు అని చెబుతారు. ఇది కూడా చదవండి: భారత రైతులు ఇజ్రాయెల్పై ఎందుకు ఆధారపడుతున్నారు? -
ఆ రోజే రాఖీ పండుగ ఎందుకు? భద్రకాలం అంటే..?
ప్రతి ఏడాది రాఖీ పండుగ చక్కగా జరుపుకునేవాళ్లం. కానీ ఈసారి మాత్రం ఎప్పుడు జరుపుకోవాలనే కన్ఫ్యూజన్ తలెత్తింది. అసలు ఏ రోజు ఈ పండుగ జరుపుకోవాలనేది ఒకటే గందరగోళం. కొందరూ ఆ రోజుని మరొకరు వేరొకటి ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకి గందరగోళం వచ్చిందో, ఎప్పుడూ రాఖీ కట్టాలో తదితర విషయాలు చూద్దాం!. ఈ నెల 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా.. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 31 తేదీల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే 30న పౌర్ణమి ఘడియలు ఉన్నా రాత్రి 9.10 నిమిషాల వరకు భద్ర కాలం ఉందని ఈ సమయంలో రాఖీ కడితే తోబుట్టువులకు దోషమని పండితులు చెబుతున్నారు. అందుకే 31న ఉదయం 6.30 నుంచి 9.45 లోపు రాఖీ కట్టుకోవాలి. అలాగే 10.50 నుంచి 11.50 లోపు మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6 గంటల వరకు కట్టుకోవచ్చని ఇవి పండుగను జరుపుకునే శుభ ఘడియలని పండితులు వెల్లడించారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని మీ సోదరులకు మేలు జరగాలని కోరుకుంటూ పండగను సంతోషంగా జరుపుకోండి. ఇంతకీ భద్రకాలం అంటే..?? భద్రకాలం గురించి తెలియాలంటే పురాణాల్లోకి వెళ్లాలి. లంకాధిపతి రావణాసురుడు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోదరి భద్ర(శూర్పణఖ). ఈమె తన అన్నగారైన రావణుడికి పౌర్ణమి అనుకుని రక్షాబంధనాన్ని తప్పు సమయంలో కట్టింది. పౌర్ణమి రాకముందే చతుర్థశి రోజే ఈమె రక్షాబంధనం కట్టిన కారణంగానే రావణుడికి రాముడి చేతిలో మరణం సంభవించిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలం అని అభివర్ణిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటున కూడా తమ అన్నదమ్ముళ్ళకు రాఖీ కట్టకూడదు. ఇక పోతే మనం సౌరమానం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం. సూర్యోదయం మొదలైన తర్వాత ఉన్న తిథినే ప్రధానంగా తీసుకుంటాం. బుధవారం ఉదయం చతుర్ధశి తిథి ఉంది. ఉదయం 10.30 నిమిషాల నుంచి పౌర్ణమి తిథి వస్తుంది. అందువల్ల బుధవారం చేసుకోము. గురువారం ఉదయం 9.45 నిమిషాల వరకు ఉండటంతో ఇక ఆరోజునే రాఖీపండుగ పరిగణించి జరుపుకుంటున్నాం. రక్ష కోసం కడుతున్నాం కాబట్టి అన్నా చెల్లెళ్ల ఇరువురికి మంచి జరిగేలా మంచి టైంలోనే కట్టుకుందా. మంచి సత్సంబంధాలనే కొనసాగిద్దాం. (చదవండి: రాఖీ పౌర్ణమి ఎప్పుడు ? బుధవారమా? గురువారమా?) -
ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం!
ఆధునిక యుగంలో గ్రామాలు సైతం నగరాలుగా మారిపోతున్నాయి. అయితే నేటికీ దేశంలోని కొన్నిగ్రామాలు మూఢనమ్మకాల ముసుగులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్లో కొలియారి గ్రామ ప్రజలు నేటికీ ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగివున్నారు. వీరు తమ ఇళ్లకు ఆవు పేడతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది పిడుగుపాట్ల నుంచి తమను రక్షిస్తుందని చెబుతారు. గ్రామస్తులందరూ ఈ నమ్మకానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఈ గ్రామంలో పిడుగుపాటుకు గురైన వారికి ఆవు పేడ పూస్తారు. ఆవు పేడ నిల్వ ఉన్న ప్రదేశాలలో పిడుగు పడదని వీరు చెబుతుంటారు. ఈ గ్రామంలో ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ నేటికీ ఏ శుభకార్యం జరిగినా ఆ ప్రాంగణాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. గ్రామంలోని ప్రతి ఇంటి వెలుపల పేడతో కూడిన భద్రతా వలయం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల తమ ఇల్లు సురక్షితంగా ఉంటుందని గ్రామస్తులు అంటారు. ఇంటికి ఆవు పేడను పూస్తే పిడుగుల నుండి ఉపశమనం కలగడమే కాకుండా, పాములు, తేళ్ల నుండి కూడా రక్షణ దొరుకుతుందంటారు. అలాగే కీటకాలు కూడా ఇంటిలోనికి ప్రవేశించవని చెబుతారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత లోతైన 5 సింక్హోల్స్.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం.. -
ఎన్ని ఉద్యోగాలు ఊడినా.. ఈ ఐటీ జాబ్లు మాత్రం సేఫ్!
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో లేఆఫ్ల కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా టెక్ రంగానికి 2022 సంవత్సరం చాలా కఠినమైనదిగా నిలిచింది. సామూహిక తొలగింపులు లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చాయి. ఈ రంగంలో పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదు. పలు నివేదికల ప్రకారం, 2023లో ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఆర్థిక మందగమనంతో పాటు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విజృంభణ టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న వారి కష్టాలను మరింతగా పెంచింది. దీంతో ఫ్రెషర్లు తమ కెరీర్ ఎంపికలపై పునరాలోచనలో పడి ఇతర రంగాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షల జీతాల కంటే కూడా ఉద్యోగ భద్రతనే ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. మరోవైపు కంపెనీలు సైతం మారుతున్న టెక్నాలజీ డిమాండ్కు అనుగుణంగానే నియామకాలు చేపడుతున్నాయి. డిమాండ్, భద్రత ఉన్న ఐటీ జాబ్లు ఇవే.. బ్లూమ్బెర్గ్ వార్తా సంస్థ ప్రకారం.. ఐటీ మేనేజర్లు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్లు, వెబ్ డెవలపర్లు, డేటా అడ్మినిస్ట్రేటర్ వంటి జాబ్లు 2023లో సాంకేతిక రంగంలో అత్యధిక ఉద్యోగ భద్రతను అందించగలవు. వీటికి డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. లేఆఫ్ లేని ఉద్యోగాలు బిజినెస్ పబ్లికేషన్ మింట్ నివేదిక ప్రకారం.. లీగల్, స్ట్రాటజీ సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు లేఆఫ్ల వల్ల ప్రభావితం కాలేదు. అందువల్ల ఐటీలో కెరీర్ని ప్లాన్ చేసుకునేవారు వీటిని కూడా నమ్మకమైన ఎంపికలుగా పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేఆఫ్ల ప్రమాదం ఉన్నవి పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లేఆఫ్ల ప్రమాదం ఎక్కువగా ఉన్న జాబ్లు కొన్ని ఉన్నాయి. కస్టమర్ స్పెషలిస్ట్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, బేసిక్ కోడర్లు, డేటా సైంటిస్టులు, రిక్రూటర్లకు డిమాండ్ వేగంగా పడిపోతున్నట్లు ఇటీవలి కొన్ని నివేదికలు, మార్కెట్ ట్రెండ్లు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. -
మెడిసిన్ నకిలీదా.. కాదా? సింపుల్గా తెలుసుకోండిలా!
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. ఆరోగ్యం కూడా అంతే వేగంగా క్షిణిస్తోంది. కావున మెడిసిన్స్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కొంతమందికి అవి నకిలీ ముందుకు అయుండొచ్చని సందేహం వస్తుంది. అలాంటి అనుమానాలకు చెక్ పెట్టటానికి క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్.. నివేదికల ప్రకారం.. సుమారు 300 మందుపైన క్యూఆర్ కోడ్ వేయాలని 'డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా' (DCJI) ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కావున నిర్దేశిత మందులపైన క్యూఆర్ లేదా బార్ కోడ్ తప్పనిసరి అయింది. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఆ మెడిసిన్ గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. క్యూఆర్ లేదా బార్ కోడ్ కలిగిన మందుల జాబితాలో యాంటీ బయాటిక్స్, కార్డియాక్ పిల్స్, పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్లు, యాంటీ డయాబెటిక్స్, యాంటీ డయాబెటిక్స్ మిక్స్టార్డ్, గ్లైకోమెట్-జిపి, యాంటీబయాటిక్స్ ఆగ్మెంటిన్, మోనోసెఫ్, గ్యాస్ట్రో మెడిసిన్ వంటివి ఉన్నాయి. ఫార్మా రిటైల్ మార్కెట్లో దాదాపు రూ. 50,000 కోట్ల విలువైన అధికంగా అమ్ముడవుతున్న 300 కంటే ఎక్కువ మందులపై క్యూఆర్ కోడ్ రానుంది. ఈ క్యూఆర్ కోడ్ అమలు చేయడంలో ఏదైనా అవకతవకలు జరిగితే భారీ జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని డసీజేఐ ఆదేశించింది. ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ కొత్త ఇయర్బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు! మెడిసిన్ డీటెయిల్స్.. నిజానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనం తీసుకున్న మెడిసిన్ వివరాలను తెలుసుకోవచ్చు. అంటే దాని జనరల్ నేమ్, బ్రాండ్ నేమ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ పేరు, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, తయారీదారు లైసెన్స్ నెంబర్ వంటివి ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి ప్రభుత్వం నకిలీ మందులను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ విధానం మీద కృషి చేయగా ఈ రోజు (2023 ఆగష్టు 01) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాన్ని సవరించింది. -
అద్భుతం జరిగింది.. సజీవంగా 40 రోజులకు దొరికిన చిన్నారులు
నమ్మకం వమ్ము కాలేదు. అడవితల్లే కరుణించిందా అన్నట్లుగా అద్భుతం జరిగింది. వన్య మృగాలు.. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంటపడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఆ నలుగురు చిన్నారులు. విమాన ప్రమాదంలో తల్లిని పొగొట్టుకున్నప్పటికీ.. తామైనా సజీవంగా బయటపడాలన్న వాళ్ల సంకల్పం ఫలించింది. దట్టమైన అమెజాన్ అడవుల్లో తప్పిపోవడంతో రంగంలోకి దిగిన కొలంబియా సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 40 రోజుల తర్వాత వాళ్ల జాడను కనిపెట్టింది. చివరకు.. అమెజాన్ అడవుల్లో పాపం పసివాళ్ల కథ సుఖాంతంమైంది. ఆ నలుగురి వయసు 13, 9, 4, 11 నెలలు. అయితేనేం దట్టమైన అమెజాన్ అడవుల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు. దాదాపు నెలకు పైనే పెద్దలెవరూ లేకుండా అడవుల్లో గడిపారు. 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను దగ్గరుండి కాపాడుకుంటూ వచ్చింది. సూర్యుడి వెలుతురు కూడా నేల మీద పడనంత చీకట్లు అలుముకునే అడవుల్లో.. ముందుకు సాగింది. దొరికింది తింటూ.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ముందుకు సాగింది. మే 1న వాళ్లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికాగా.. శుక్రవారం(జూన్ 9న) సాయంత్రం ఆ నలుగురు చిన్నారుల జాడను కొలంబియా సైన్యంలోని ఓ బృందం గుర్తించింది. 👉 కొలంబియా అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన రీజియన్ అది. విషపూరితమైన కీటకాలు, వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటూ దొరికింది తింటూ ఇన్నాళ్లూ గడిపారు ఆ చిన్నారులు. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అడవుల్లో దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ.. మధ్యలో సైన్యం ఆకాశం నుంచి జారవిడిచిన ఆహార పొట్లాలను సైతం అందుకున్నారాట. పౌష్టికాహర లోపం తప్పించి.. వాళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకపోవడం గమనార్హం. అంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే.. 11 నెలల ఆ పసికందు సైతం ఆరోగ్యంగానే ఉందని ఆర్మీ డాక్టర్లు ప్రకటించారు. పైగా ఆ చిన్నారి తన ఏడాది పుట్టినరోజును అమెజాన్లోనే చేసుకుందట(గడపడం). నలభై రోజుల క్రితం 👉 మే 1 ఉదయం, సెస్నా 206 అనే ఓ తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ, ఆ ఎయిర్ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్కు అందకుండా పోయింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 👉 దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అది ప్రమాదానికి గురైంది. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) కూడా మరణించింది. పైలట్తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. దీంతో వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారేమో అని సైన్యం భావించింది. అవాంతరాలు ఏర్పడ్డా.. 👉 వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. భీకరమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 👉 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తూ వచ్చారు. వాళ్ల ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొలంబియా మొత్తం వాళ్లు ప్రాణాలతో బయటపడాలంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. వాళ్లకు అలవాటేనా? 👉 అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) తెగకు చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. పైగా లెస్లీకి వాళ్ల బామ్మ అన్ని విధాల శిక్షణ ఇచ్చిందట. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేసిందామె. వాళ్లు ఊహించినట్లే లెస్లీ రక్షణ బాధ్యతలు తీసుకుంది. అమ్మలా వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. -
రైలు ప్రమాదం నుంచి బయటపడిన నేపాల్ యువకుడు
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అనంతరం చాలామంది ప్రయాణికులు తమ కుటుంబాలకు దూరమయ్యారు. రైలు ప్రమాదంలో గాయపడిన నేపాల్కు చెందిన ఒక యువకుడు ఎట్టకేలకు తన తల్లిదండ్రులకు చేరవయ్యాడు. ఆ బాలుడిని రామానంద్ పాశ్వాన్గా గుర్తించారు. ఈ యువకుడు కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్సపొందుతున్నాడు. రామానంద్ తన ముగ్గురు బంధువులతోపాటు కోరమండల్లో ప్రయాణించాడు. మీడియాతో రామానంద్ తండ్రి మాట్లాడుతూ రామానంద్తో పాటు తమ ముగ్గురు బంధువులు కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారని, వారు ముగ్గురూ మృతిచెందగా, తమ కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. రైలు ప్రమాదం గురించి తెలియగానే తాను, తన భార్య నేపాల్ నుంచి వచ్చామని,ముందుగా మా ముగ్గురు బంధువుల మృతదేహాలను గుర్తించామన్నారు. తన కుమారుడిని టీవీలో చూసి గుర్తుపట్టి, ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నడని తెలుసుకుని వచ్చామన్నారు. రామానంద్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. కాగా ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృత్యువాత పడ్డారు. చదవండి: చివరి నిముషంలో ప్రయాణం రద్దు చేసుకుని... -
ఒడిశా రైలు ప్రమాదం: ఒక్కరు తప్ప అందరూ సేఫ్
సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలోని రాష్ట్ర ప్రయాణికులు ఐదుగురిలో ఒక్కరే మృతిచెందారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి మరణించినట్లు గుర్తించామని.. ఒడిశాలో నివసిస్తున్న ఆయన, పెన్షన్ కోసం వచ్చి, తిరిగి వెళ్తూ కోరమాండల్ ఎక్కినట్లు తేలిందన్నారు. అతనితోపాటు అదే బోగీలో విశాఖకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారని, వీరు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు, రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నామని.. గాయపడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందన్నారు. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 342 మంది రిజర్వ్డ్ ప్రయాణికులు సేఫ్ కటక్, బాలాసోర్లోని సోరూ, గోపాలపురం ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రయాణికులతో పాటు, ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఊళ్లలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలుసుకుని మాట్లాడాం. అత్యవసర చికిత్స అవసరమైన వారిని హుటాహుటిన విశాఖకు తరలించడంతో పాటు, భువనేశ్వర్లోని అపోలో ఆస్పత్రిలో కూడా చేర్చాం. కోరమాండల్ ఎక్స్ప్రెస్లో రాష్ట్రం నుంచి బయల్దేరిన లేదా ఏపీలో దిగాల్సిన వారి వివరాలు సేకరించాం. ఆ రైలు రిజర్వేషన్ చార్ట్ ప్రకారం 309 మంది తెలుగువారు ఉన్నారు. యశ్వంత్పూర్–హౌరా ఎక్స్ప్రెస్లో 33 మంది ఉన్నారు. రెండు రైళ్లలో 342 మంది తెలుగువారు ప్రయాణిస్తున్నట్లు తేలింది. వారిలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా, 329 మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాం. ఒక్క ప్రయాణికుడు మాత్రం బంధువులతో ఉన్నట్లు తెలిసింది. చికిత్స పొందుతున్న వారిలో తొమ్మిది మందిని విశాఖకు తరలించి కేజీహెచ్లో ముగ్గురికి, సెవెన్హిల్స్ ఆస్పత్రిలో ఇద్దరికి, క్యూవన్ ఆస్పత్రిలో ఇద్దరికి, అపోలోలో ఒకరికి చికిత్స చేయిస్తుండగా, మరొకరు డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక సాయం అందజేత కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆరి్థక సాయానికి సంబంధించిన చెక్కులను మంత్రి అమర్నాథ్ సోమవారం అందించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ తక్షణ స్పందన ఇక ఈ ప్రమాదం గురించి తెలియగానే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారు. అదే రాత్రి ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే.. మర్నాటి ఉదయమే నాతో పాటు ముగ్గురు ఐఏఎస్లు, మరో ముగ్గురు ఐపీఎస్లు కలిసి రోడ్డుమార్గం ద్వారా అక్కడకు వెళ్లి వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మాతోపాటు, 27 మంది సపోర్టింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 108 సర్వీసులు 20, మరో 19 ప్రైవేటు అంబులెన్స్లు, 15 మహాప్రస్థానం వాహనాలను తీసుకెళ్లాం. రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ వద్ద ఐదు అంబులెన్స్లతో సేవలందించాం. ఇంకా సీఎం ఆదేశాల మేరకు ఇచ్ఛాపురం సరిహద్దులో కొన్ని అంబులెన్సులతో పాటు సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఇప్పటికీ మన రెస్క్యూ బృందాలు భువనేశ్వర్, కటక్, బాలాసోర్లో ఉన్నాయి. కేంద్ర మంత్రుల ప్రశంస.. ప్రమాదం గురించి తెలియగానే మనం శరవేగంగా స్పందించి రాష్ట్రంలో పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశాం. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర స్టేషన్లలో కంట్రోల్ రూంలకు అందిన సమాచారం ద్వారా ఎక్కడికక్కడ రిజర్వేషన్ల చార్టుల్లో ఉన్న ప్రయాణికుల కాంటాక్టు నంబర్ల ప్రకారం వారితో మాట్లాడి ఆచూకీ తెలుసుకున్నాం. సురక్షితంగా స్వస్థలాలకు చేరేవరకు అందరినీ అప్రమత్తం చేశాం. అక్కడ పరిస్థితుల్ని సమన్వయం చేస్తున్న కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లను కలిసి మన చర్యలను వివరించాం. మన ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా గురించి చెప్పగా కేంద్ర మంత్రులు అభినందించారు. చదవండి: అమ్మానాన్న క్షమించండి! -
ఒడిశా రైలు ప్రమాదం.. 3 నెలల ముందుగానే హెచ్చరిక
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికిగల కారణాలు దర్యాప్తు రిపోర్టు వచ్చిన తరువాత వెల్లడికానున్నాయి. అయితే ఈ విషయమై ఒక అధికారి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో ఆ రైల్వే అధికారి రాబోయే ప్రమాదాన్ని 3 నెలల ముందుగానే ఊహించి, ఉన్నతాధికారులకు తెలియజేశారు. సిగ్నల్ సిస్టమ్లోని లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. హరిశంకర్ వర్మ అనే ఈ రైల్వే అధికారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పనిచేశారు. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో దక్షిణ పశ్చిమ రైల్వేలో రైలు మరో లైనులో వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఇంటర్లాకింగ్ కోసం తయారు చేసిన సిస్టమ్ను బైపాస్గా మార్చినపుడు లొకేషన్ బాక్సులో జరిగిన గడబిడ గురించి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆయన రైల్వే బోర్డుకు తెలియజేశారు. అలాగే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ సిస్టమ్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, రైలు బయలుదేరిన తరువాత డిస్పాచ్ రూట్ మారిపోతున్నదని పేర్కొన్నారు. సిగ్నల్కు సంబంధించిన కీలకమైన పనులు కింది ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని, దీనివలన అనుకోని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం విషయానికి వస్తే రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రైన్ నంబర్12481 కోరమండల్ ఎక్స్ప్రెస్ బహన్గా బాజార్ స్టేషన్కు చెందిన మెయిన్ లైన్లోవెళుతోంది. ఇంతలో అది పట్టాలు తప్పి లూప్లైన్లో నిలిచివున్న గూడ్సు రైలును ఢీకొంది. ఆ సమయంలో రైలు ఫుల్ స్పీడులో ఉంది. ఫలితంగా ఆ రైలుకు సంబంధించిన 21 కోచ్లు పట్టాలు తప్పాయి. మూడు కోచ్లు డౌన్లైన్లోకి చేరుకున్నాయి. నిజానికి బహన్గా బాజార్ స్టేషన్లో ఈ ట్రైన్కు స్టాపేజీ లేదు. అందుకే ఈ రైలు స్పీడుగా వెళ్లి గూడ్సును ఢీకొన్నప్పుడు దాని మూడు కోచ్లో డౌన్లైన్లోకి చేరుకోగా.. అటువైపుగా వస్తున్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పట్టాలపై ఉన్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొన్నాయి. ఈ ప్రమాదం భువనేశ్వర్ రైల్వేస్టేషన్కు సుమారు 171 కిలోమీటర్లు, ఖగర్పూర్ రైల్వేస్టేషన్కు సుమారు 166 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ జిల్లాలోని బహన్గా బాజార్ స్టేషన్ వద్ద జరిగింది. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: అయినవారి ఆచూకీ తెలియక.. -
ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ చీరాల వాసులు
-
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే బయటకు..
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లా లాల్గౌన్ పాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్సీ అనే చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసి చెకప్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. बेटी की मां से फोन पर बात की है। यह जानकर संतोष और आनंद हुआ कि बेटी स्वस्थ है। उसे जनरल चेकअप के लिए अस्पताल ले जाया गया। मेरी शुभकामनाएं और आशीर्वाद बेटी के साथ हैं। मामा शिवराज सदैव तुम्हारे साथ हैं! https://t.co/KK9GdA7Qfz — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 26, 2023 కాగా నాన్సీ బోరుబావిలో సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు. వివిధ రకాల పరికరాలు, జేసీబీలు ఉపయోగించి పాపను కాపాడినట్లు వివరించారు. గతేడాది జూన్లో కూడా ఈ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐదేళ్ల బాలుడు పొలంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. సహాయక సిబ్బంది 8 గంటలు శ్రమించి అతడ్ని సురిక్షితంగా కాపాడారు. చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం -
ఉత్తరప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడి కథ సుఖాంతం
-
Viral Video: కారును ఢీకొన్న మరో కారు.. చిన్నారికి తప్పిన పెను ప్రమాదం ..!
-
లక్నవరం కేబుల్ బ్రిడ్జి సేఫెనా..?
-
పనిమనిషితో సహా జంట అనుమానాస్పద మృతి..కానీ రెండేళ్ల చిన్నారి....
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో ఒక జంటతో సహా వారి పనిమనిషి మృతి. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఆశోక విహార్ హోంలోని వారి నివాసంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సమీర్ అహుజ్, అతని భార్య షాలు, వారి పనిమనిషి సప్నతో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఐతే వారి రెండేళ్ల చిన్నారి మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. వారి పనిమనిషి ఆ దంపతుల ఇంటికి ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో వచ్చి ఉండవచ్చన్నారు పోలీసులు. ఈ ఘటన కూడా ఆ సమయంలో జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు . ఐతే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేయగా బైక్ మీద సుమారు ఐదుగురు వ్యక్తుల బైక్ మీద ఆ దంపతుల నివాసానికి వచ్చినట్లు కనిపిస్తుందని చెప్పారు. ఈ మేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య) -
క్షేమంగానే ఉన్నా.. కంగారుపడకండి
సాక్షి,తెర్లాం(విజయనగర): అమర్నాథ్లోని శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన తను క్షేమంగానే ఉన్నానని, భయపడవద్దంటూ తెర్లాం గ్రామానికి చెందిన కోల శ్రీనివాసరావు మంగళవారం ఫోన్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజుల కిందట ఆయన అమర్నాథ్ యాత్రకు వెళ్లాడు. అక్కడ కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లి సుమారు 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ వార్తలు టీవీల్లో ప్రచారం కావడంతో శ్రీనివాసరావు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అమర్నాథ్లో క్షేమంగానే ఉన్నట్టు తన ఫొటోను వాట్సప్లో పంపించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటివరకు 9 సార్లు అమర్నాథ్ యాత్రకు వెళ్లి మహా శివలింగాన్ని దర్శించుకున్నట్టు ఆయన ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. -
అమర్నాథ్ యాత్ర..ఏపీ వాసులు సురక్షితం
-
ఆ బాలుడు మృత్యుంజయుడు.. అయిదు రోజులు బోరుబావిలో ఉండి..
జనిగిరి: చుట్టూ చిమ్మ చీకటి, 68 అడుగుల లోతైన బోరుబావిలో పాము, తేళ్లు, కప్పలు తిరుగుతూ ఉంటే మానసిక వికలాంగుడైన 11 ఏళ్ల బాలుడు దాదాపు 5 రోజులు గడిపాడు. బావిలో ఆడుకుంటూ పడిపోయిన రాహుల్ సాహు అనే బాలుడు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఎట్టకేలకు 104 గంటల సేపు శ్రమించిన 500 మంది సహాయ సిబ్బంది రోబో సాంకేతికతో బయటకు తీసుకువచ్చారు. బావిలో ఉన్న పాము ఆ బాలుడిని ఏమీ చేయలేదని సహాయ సిబ్బంది వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని జహ్నగిరి–చంపా జిల్లాలోని పిర్హిడ్ గ్రామంలో రాహుల్ సాహు బోరు బావిలో పడిపోయిన ఘటన ఈ నెల 10న జరిగింది. రామ్కుమార్, గీతాసాహుల కుమారుడైన రాహుల్ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశాక ఆడుకోవడానికి పొలాల్లోకి వెళ్లాడు. బోరు తవ్వి నీళ్లు పడకపోవడంతో దానిపై ఒక షీట్ కప్పి ఉంచారు. రాహుల్ సాహు మానసికంగా పూర్తిగా ఎదగకపోవడంతో ఆ షీట్ చూసుకోలేదేమో ఏమో బావిలోకి జారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సమాంతరంగా మరో బోరు తవ్వినా మొదట్లో ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అయిదు రోజులు శ్రమించి రోబో టెక్నాలజీ సాయంతో ఆ బాలుడిని మంగళవారం అర్ధరాత్రి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్కి ప్రథమ చికిత్స చేసిన అనంతరం బిలాస్పూర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మానసిక వికలాంగుడైనప్పటికీ రాహుల్ సాహు మొదట్నుంచి పోరాటపటిమ ప్రదర్శించేవాడు. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేసేవాడు. తబలా కూడా బాగా వాయిస్తాడని తల్లిదండ్రులు చెప్పారు. -
Russia Ukraine War: విదేశీ నౌకలకు సేఫ్ కారిడార్
కీవ్/దావోస్: నల్ల సముద్రంలోని ఓడ రేవుల నుంచి విదేశీ నౌకలు భద్రంగా బయటకు వెళ్లేందుకు వీలుగా సేఫ్ కారిడార్ తెరుస్తామని రష్యా రక్షణ శాఖ హామీ ఇచ్చింది. మారియూపోల్ నుంచి నౌకలు వెళ్లడానికి మరో కారిడాన్ ప్రారంభించనున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మైఖేల్ మిజింజ్సెవ్ చెప్పారు. ఒడెసా, ఖేర్సన్, మైకోలైవ్తో సహా నల్లసముద్రంలోని ఆరు పోర్టుల్లో ప్రస్తుతం 16 దేశాలకు చెందిన 70 నౌకలు ఉన్నాయని అన్నారు. కారిడార్లు ప్రతిరోజూ తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. మారియూపోల్ పోర్టులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత పునఃప్రారంభమైనట్లు రష్యా సైన్యం తెలియజేసింది. నల్లసముద్రంలోని ఓడ రేవుల్లో రష్యా సైన్యం పాగావేసింది. నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీనివల్ల ఉక్రెయిన్ నుంచి విదేశాలకు ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో రష్యా దిగివచ్చింది. ఉక్రెయిన్ ఆయుధ సామగ్రి ధ్వంసం: రష్యా ఉక్రెయిన్లోని పొక్రోవ్స్క్లో ఓ రైల్వేస్టేషన్ వద్ద ఉక్రెయిన్ ఆయుధ సామగ్రిని తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధ విమానాలతో రైల్వేస్టేషన్పై దాడి చేసినట్లు చెప్పారు. మైకోలైవ్ రీజియన్లోని దినిప్రొవ్స్కీలో ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సెంటర్ను నేలమట్టం చేశామని వివరించారు. ఈ ఘటనలో11 మంది ఉక్రెయిన్ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మరణించారని పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్పై భీకర దాడులు జరిపినట్లు కొనాషెంకోవ్ వివరించారు. 500 టార్గెట్లపై విరుచుకుపడినట్లు తెలిపారు. లుహాన్స్క్, డొనెట్స్క్లో ప్రస్తుతం 8,000 మంది ఉక్రెయిన్ జవాన్లు తమ ఆధీనంలో ఉన్నారని వేర్పాటువాదుల ప్రతినిధి రొడియోన్ మిరోష్నిక్ చెప్పారు. వాస్తవాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి: పెస్కోవ్ క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని ఉక్రెయిన్ గుర్తిస్తుందని ఆశిస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం అన్నారు. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా పునఃప్రారంభం కావాలంటే రష్యాపై కొన్ని ఆంక్షలను పశ్చిమ దేశాలు సడలించాలని పెస్కోవ్ తెలిపారు. మళ్లీ వడ్డీ రేటు తగ్గించిన రష్యా సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి గాను రష్యా సెంట్రల్ బ్యాంకు రుణాలపై వడ్డీ రేటును 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేటును ఏకంగా 20 శాతం పెంచింది. అప్పటి నుంచి వడ్డీ రేటును మూడు పాయింట్లు తగ్గించడం ఇది మూడోసారి. -
మృత్యుంజయురాలు జిషిత డిశ్చార్జ్
తిరుపతి తుడా/రాజాం: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువును జయించిన జిషిత (2)ను ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ చేశారు. తిరుపతిలోని రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో 2 రోజులపాటు వైద్యులు చికిత్స అందించారు. ఆ బాలిక రెండు కాళ్లు, తొడ భాగంలో విరిగిన ఎముకలకు కట్టు వేశారు. బిడ్డను చూసుకునేందుకు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో బాలికను డిశ్చార్జ్ చేయాలని బంధువులు విజ్ఞప్తి చేశారు. తదుపరి చికిత్సను విశాఖలో అందించేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని వైద్యాధికారులకు నచ్చచెప్పడంతో జిషితను డిశ్చార్జ్ చేశారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రాయల్ రాత్రి 7.00 గంటల సమయంలో అంబులెన్స్లో చిన్నారి జిషితను రైల్వేస్టేషన్కు పంపించారు. -
దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!
Safe Diwali Tips In Telugu: దేశవ్యాప్తంగా పిల్లా పాపలతో కలిసి దీపావళి సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవు తున్నారు. కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. అయితే పలుదేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముంచు కొస్తున్న కాలుష్య భూతం కోరలకు చిక్కకుండా వీలైనంతవరకు క్రాకర్స్కు దూరంగా ఉండాలని కనీసం పర్యావరణ హితమైన గ్రీన్క్రాకర్స్ మాత్రమే వినియోగించాలంటున్నారు. దీంతోపాటు చిన్నపిల్లలు వృద్ధులను దృష్టిలో ఉంచుకుని భారీ శబ్దాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పెంపుడు జంతువులకు కూడా పెద్ద పెద్ద శబ్దాలు హానికరం. మరీ ముఖ్యంగా టపాసులు అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఉత్సాహంగా దూసుకుపోతూ వుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంగా దీపావళి జరుపు కోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం జాగ్రత్తలు పాటిద్దాం.. తద్వారా సర్వత్రా వెలుగు దివ్వెల పండుగ దీపావళి కాంతులు నింపుదాం. శానిటైజర్ల వినియోగంలో అప్రమత్తత దీపావళి పండుగలో కీలకమైన దీపాలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్ల వాడకాన్ని మానుకోండి. ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడకండి. ఎందుకంటే శానిటైజర్లు మండించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది తీవ్రమైన అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా నీరును, పేపర్ సబ్బులు బెటర్. అలాగే దీపాలను వెలిగించే ముందు టపాసులు వెలిగించిన తరువాత చేతులు సరిగ్గా కడుక్కోవాలి. దీపావళికి తగిన దుస్తులు ఉదయం నుంచి ఎథ్నిక్ వేర్, డిజైనర్ వేర్ ఎలాంటి దుస్తులు ధరించినా పరవాలేదు కానీ, టపాసులు కాల్చే సమయంలో షిఫాన్, జార్జెట్, శాటిన్, సిల్క్ ఫ్యాబ్రిక్స్కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా, కాటన్ సిల్క్, కాటన్ లేదా జ్యూట్ దుస్తులను ధరించడం మంచిది. ►టపాసులు కాల్చేటప్పుడు కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది. ►కాకరపువ్వొత్తులు, మతాబులు, పెద్ద పెద్ద బాంబులు వంటివి కాల్చేటప్పుడు చిన్న పిల్లలకు పెద్దలెవరైనా సహాయంగా ఉండటం మంచిది. ►టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను గృహసముదాయాల వద్ద కాకుండా దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. ►కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత ఆవి పూర్తిగా ఆరిపోయాయో లేదు తనిఖీ చేసుకోవాలి. పిల్లలు తొందరపాటుగా వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ►ఇంట్లో ఉన్న అందరూ రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి. ►దీపావళి టపాసులు కాల్చేటపుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్తల విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా వ్యవహరిస్తే.. హ్యాపీ అండ్ సేఫ్ దివాలి సొంతమవుతుంది. కరోనా సమయంలో సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తూ సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలి. ప్రతీ ఏడాది దీపావళి తరువాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పెరగడం మనం చూస్తున్నాం. దీంతో శ్వాసకోశ రుగ్మతలు, సంబంధిత బాధితులు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందులోనూ ప్రస్తుత కోవిడ్-19 సమయంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కాలుష్యమైన గాలి చాలా ప్రమాదకరమని పల్మనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. -
గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితం..
-
ఆ విషయంలో విశాఖ పోర్టు సురక్షితమే!
సాక్షి, విశాఖ పట్నం: లెబనాన్ రాజధాని బీరూట్లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 70 మందికి పైగా చనిపోగా, నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. అయితే పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్ అని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాక పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయం గురించి సందేహాలు మొదలయ్యాయి. ఇక విశాఖ పోర్టులో అమ్మోనియం నిల్వలు ఉండవని అక్కడ కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు. 20ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో పకడ్బందీగా అన్లోడ్ చేస్తామని, పేలుళ్లు జరిగే పరిస్థితుల లేవు అని నిపుణులు, అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ నౌకాశ్రయాలు సురక్షితం కానందువల్లే కేంద్ర ప్రభుత్వం విశాఖ పోర్టులో మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతికి అనుమతులు జారీచేసిందని అధికారులు తెలిపారు. దీని వల్ల నగరానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే విశాఖ నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నందున అమ్మోనియం నైట్రేట్తో విశాఖకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. విశాఖలో సురక్షితమనే కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఏయూ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కె.బసవయ్య మాట్లాడుతూ, ‘ఒకప్పుడు దేశంలోని అనేక పోర్టులకు వివిధ దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతయ్యేది. ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉంచేందుకు సురక్షితం కానందున, పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) దీని రవాణాపై పరిమితులతో కూడిన నిషేధం విధించింది. అమ్మోనియం నైట్రేట్కు ఏమైనా రసాయనాలు కలిస్తేనే పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దీని ఎగుమతి దిగుమతులపైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. సురక్షిత చర్యలు తీసుకుంటున్న విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ)కు మాత్రమే అనుమతులిచ్చింది. దీంతో 20 ఏళ్లుగా ఇక్కడ దిగుమతి జరుగుతోంది. ఇంతవరకూ ఇక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు’ అని తెలిపారు. ఇక విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ హరనాథ్ మాట్లాడుతూ, ‘అమ్మోనియం నైట్రేట్తో వచ్చిన నౌకకు పోర్టులో బెర్త్ ఇవ్వాలంటే స్థానిక పోలీస్ శాఖతో పాటు కస్టమ్స్, సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక శాఖ, పెసో మొదలైన శాఖల నుంచి అనుమతులుండాలి. అన్లోడ్ జరుగుతున్నంత సేపూ బెర్త్ వద్ద ఫైర్ టెండర్ని పోర్టు సిద్ధంగా ఉంచుతుంది. ఒక్క కిలో కూడా పోర్టులో నిల్వలేకుండా ప్రత్యేక గోడౌన్లకు తరలిస్తారు. నిర్దిష్ట సమయంలో అన్లోడ్ ప్రక్రియ పూర్తిచేస్తారు. అంతేకాక విశాఖ నుండి 35 రోజుల్లోపే ఆయా రాష్ట్రాలకు తరలిస్తారు. సురక్షితంగా హ్యాండ్లింగ్ చేసే సౌకర్యం ఉన్నందువల్లే విశాఖలో దిగుమతులు నిర్వహిస్తున్నాం. పోర్టులో ఏమాత్రం నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు. నౌక వచ్చిన కొద్దిసేపటిలోనే ఇక్కడి నుంచి ఏజెన్సీ ద్వారా గోడౌన్లకు వెళ్లిపోతుంటుంది అని తెలిపారు. వీరితో పాటు విశాఖ షిప్పింగ్స్ ఎండీ శ్రవణ్ మాట్లాడుతూ, విశాఖ పోర్టులో పేలుడు జరిగే పరిస్థితులు లేవు. భారత్లో అమ్మోనియం నైట్రేట్ను ఎక్కువగా ఎరువులకు, బొగ్గు గనుల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. పేలుడు జరగాలంటే ఏదైనా రసాయనంతో కలవాలి. ఇవన్నీ ఇక్కడ జరిగే ప్రసక్తేలేదు. డైరెక్టర్ నిబంధనల మేరకే 20 ఏళ్లుగా అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, హ్యాండ్లింగ్, ఎగుమతికి సంబంధించిన ఏజెన్సీగా వ్యవహరిస్తున్నాం. ఎలాంటి ప్రమాదం జరగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఒకేచోట ఎక్కువ కాలం ఉంటేనే పేలుడు సంభవిస్తుంది. కానీ, మా గోడౌన్ల నుంచి నెల రోజుల్లోనే అమ్మోనియం నైట్రేట్ మొత్తాన్ని తరలిస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: బీరూట్ విధ్వంసానికి అసలు కారణం ఇదేనా? -
సఫారీ ఆటగాళ్లంతా సేఫ్
జొహన్నెస్బర్గ్: భారత పర్యటనకు వచ్చి... మహమ్మారి దెబ్బకు ఒక్క మ్యాచ్ అయినా ఆడకుండానే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు గత నెల తిరుగుముఖం పట్టింది. అయితే భారత్ నుంచి స్వదేశం చేరిన సఫారీ ఆటగాళ్లలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఇక్కడ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ప్రొటీస్ ఆటగాళ్లు మార్చి 18న దక్షిణాఫ్రికా చేరారు. వీళ్లందరిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచగా... గురువారంతో ఈ స్వీయ నిర్బంధం ముగిసింది. అనంతరం కరోనా పరీక్షలు చేయగా రిపోర్టులన్నీ నెగెటివ్గానే వచ్చాయని శుక్రవారం జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ శుయబ్ మంజ్రా తెలిపారు. వీళ్ల నిర్బంధం ముగిసినా మరో రెండు వారాలు ఎక్కడికీ వెళ్లే అవకాశాల్లేవు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలోనూ 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 1400 మందికిపైగా కరోనా బారిన పడగా... ఐదుగురు మృతి చెందారు. -
ఊపిరాడని బతుకుకు..ఊపిరిపోశారు!
చంద్రశేఖర్ కాలనీ: వరద నీరు వెళ్లేందుకు నిర్మించిన డ్రైనేజీలో చెత్తను తొలగించేందుకు దిగిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు అందులో చిక్కుకు పోయాడు. సరిగా శ్వాస ఆడక గంటపాటు విలవిల్లాడాడు. స్థానికులు సకాలంలో స్పందించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన గురువారం నిజామాబాద్లో చోటుచేసుకుంది. మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని వర్ని రోడ్డులో దశాబ్దాల క్రితం స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మించారు. కోటగల్లి పరిసర ప్రాంతాలకు చెందిన మురుగునీరు ఈ డ్రైనేజీ ద్వారానే పూలాంగ్ వాగులోకి వెళుతోంది. అయితే, డ్రైనేజీలో చెత్త పేరుకు పోవడంతో మురుగు నీరు నిలిచి పోయింది. ఆ చెత్తను తొలగించేందుకు కార్పొరేషన్ సిబ్బంది గురువారం ప్రయత్నించారు. రోడ్డు కింద నిర్మించిన డ్రైనేజీ లోపలికి వెళ్లిన తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు గంగాధర్ (35) కర్ర సాయంతో చెత్తను తొలగిస్తుండగా, మురుగు నీరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ క్రమంలో గంగాధర్ కుడి చేయి కేబుల్ పైపులైన్లలో చిక్కుకోవడంతో అతడు డ్రైనేజీలో ఉండిపోయాడు. గంగాధర్కు పైపు ద్వారా గాలి అందిస్తున్న కార్మికులు శ్వాస సరిగా ఆడక విలవిల్లాడాడు. ఇది గమనించిన మరో కార్మికుడు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాడు. మరోవైపు గంగాధర్కు శ్వాస ఆడేందుకు ఇంట్లో వినియోగించే నీటి పైప్ను స్థానికులు అందించారు. అనంతరం జేసీబీతో రోడ్డును తవ్వి డ్రైనేజీ నీటిని వేరే వైపు మళ్లించారు. గంట పాటు డ్రైనేజీలో ఇరుక్కుని తల్లడిల్లిన గంగాధర్ను తోటి కార్మికులు బయటకు తీసి, జిల్లా ఆస్పత్రికి తరలించారు. గంగాధర్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సాజిద్ అలీ తెలిపారు. -
మన గాలి మంచిదే!
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం గురించి చెప్పక్కర్లేదు. దేశ రాజధాని ఢిల్లీ ఈ విషయంలో నిత్యం వార్తల్లో ఉంటోంది. అక్కడ కనీవినీ ఎరుగని రీతిలో వాయు కాలుష్యం జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి.. ఢిల్లీయే కాదు.. దేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఈ విషయంలో మన హైదరాబాద్ మాత్రం సేఫ్ జోన్లో ఉందని తేలింది. వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కోలకతా ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది. అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను రెడ్ జోన్లో, సాధారణ స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న నగరాలు/పట్టణాలను గ్రీన్ జోన్ పరిధిలో చేర్చి సీపీసీబీ ఓ జాబితా విడుదల చేసింది. వీటిలో మన భాగ్యనగరం గ్రీన్ జోన్ లో ఉంది. ఎలా విస్తరిస్తోంది? ఉత్తరాది రాష్ట్రాల్లోని నగరాల్లో వివిధ రూపాల్లో వెదజల్లుతున్న కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగ, మంచు సమ్మిళతమై కా లుష్యం విస్తృతంగా విస్తరిస్తోంది. ఈ ప రిస్థితుల్లో వాయు నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ వాయు ప్రమాణాల సూచి ప్రకారం.. 2.5 మైక్రాన్ల పరిమాణంలో 40 మైక్రోగ్రాముల (గాలిలో క్యూబిక్ మీటర్ పరిధిలో ఉన్న దుమ్ముధూళిని మైక్రోగ్రామ్స్లో కొలుస్తారు) దుమ్ముకణాలు ఉండాలి. అయితే, హైదరాబాద్లో అది 50 మైక్రోగ్రాములుగా ఉన్నట్లు తేలింది. పది మైక్రాన్ల పరిమాణంలో 60 మైక్రోగాములు ఉండాల్సి ఉండగా.. అది హైదరాబాద్లో 100 మైక్రోగ్రాములుగా ఉన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో అయితే ఇది అత్యంత ప్రమాదకరంగా 700 నుంచి 994 మైక్రోగ్రాములు ఉన్నట్టు గుర్తించారు. ఇక హైదరాబాద్లో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు ఎక్కువున్నట్టు తేలింది. దక్షిణాది నగరాలన్నీ సేఫ్జోన్లోనే... ముంబై సహా దక్షిణాది నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు ‘సేఫ్ జోన్’లో ఉన్నాయి. జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల కంటే కొంచెం అధికంగా మన రాష్ట్రంలో కాలుష్యం ఉన్నట్లు తేలడంతో ప్రభుత్వం ‘స్పెషల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటుచేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో వాయు నాణ్యతను మెరుగుపరిచేం దుకు ఈ కమిటీ ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది. హైదరాబాద్, నగర శివార్లలోని పటాన్చెరు పారిశ్రామికవాడ, నల్లగొండ జిల్లాలో గాలి నాణ్యత ప్రమాణాలకు మించి కాలుష్యం నమోదవుతున్నట్లు గుర్తించింది. హైదరాబాద్ ఎందుకు సురక్షితం? హిమాలయాలు సమీపంలో ఉండడం, చలిగాలులు పెరగడం, పొరుగు రాష్ట్రా ల్లో పంట వ్యర్థాలు, కోతల తర్వాత వాటిని తగలబెట్టడం వంటి అంశాలే ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలని గుర్తించా రు. ఎత్తైన ప్రాంతంలోని హిమాలయాల నుంచి ధూళి, దుమ్ముకణాలు గాలిలో ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా విపరీతమైన చలి కారణంగా మార్గం మధ్యలోనే నిలి చిపోతాయి. వాటికి పరిశ్రమలు, వాహన కాలుష్యం తోడు కావడంతో విష వా యువులుగా మారుతున్నాయి. హైదరాబాద్లో దీనికి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ స్థాయిలో ఇక్కడ కాలుష్యం విస్తరించే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ పెరుగుదల, పరిశ్రమల కాలుష్య ఉద్గారాలు, రోడ్డుపై ధూళి, దుమ్ము విస్తరించడం వంటి కారణాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ నగరాలు ఏ జోన్లో.. రెడ్జోన్ ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, లక్నో, బహదుర్ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, బులంద్షహర్, అంబాలా, అమృత్స ర్, రోహతక్, పటౌడి, కాన్పూర్. గ్రీన్జోన్ హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, విజ యవాడ, చెన్నై, బెంగళూరు, మైసూరు, కొచ్చి నగరాలు. -
ఐఐటీ విద్యార్థులు క్షేమం
సిమ్లా/సాక్షి ప్రతినిధి, చెన్నై: హిమాచల్ప్రదేశ్లో ట్రెక్కింగ్కు వెళ్లి అనూహ్యంగా చిక్కుకుపోయిన రూర్కీ ఐఐటీ విద్యార్థులను సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది ఉపాధ్యాయులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఐఐటీ రూర్కీకి చెందిన 45 మంది ఐఐటీ విద్యార్థులు రొహ్తంగ్ కనుమల్లో ట్రెక్కింగ్ కోసం రెండురోజుల క్రితం వచ్చారు. మంచు కురుస్తుండటంతో ట్రెక్కింగ్కు వెళ్లిన కొండ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న లాహౌల్– స్పిటి జిల్లా అధికారులు విద్యార్థులతోపాటు సుమారు 500 మందిని మంగళవారం సురక్షిత ప్రాంతానికి తరలించి, వసతి కల్పించారు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన సైన్యం హెలికాప్టర్ల దారా వారిని బయటకు తీసుకువచ్చింది. తమిళనాడులోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది టీచర్లు మనాలిలో సురక్షితంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మంచు కురుస్తుండటంతో లాహౌల్– స్పిటి జిల్లా కేంద్రం కీలాంగ్లో అత్యల్పంగా 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో అతలాకుతలమవుతున్న హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి మంగళవారం కాస్త మెరుగైంది. వరదలతో రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. -
సిటీ బస్సుల్లో ‘సేఫ్’ జర్నీ!
సాక్షి, సిటీబ్యూరో: బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఇక నుంచి ప్రత్యక్ష సమాచారం లభించనుంది. నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోక లపై ‘హైలైట్స్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారం అందజేస్తున్న తరహాలోనే బస్సుల రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసేందుకు ‘సేఫ్’ (సొసైటీ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్) అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రోడ్లపై నడిచే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు (వెహికల్ ట్రాకింగ్) చేయడంతో పాటు, బస్సుల రాకపోకలపైన ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తుంది. ఇందుకోసం అన్ని చోట్ల ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదట ఏసీ బస్షెల్టర్లతో ప్రారంభించి ఆ తరువాత క్రమంగా నగరంలోని అన్ని బస్టాపులకు ఈ ప్రత్యక్ష సమాచార బోర్డులను విస్తరిస్తారు. అలాగే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో సేఫ్ యాప్ ద్వారా కూడా బస్సుల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే తాను ఎక్కాల్సిన బస్సు ఇంకా ఎంత దూరంలో ఉన్నది, ఏ సమయానికి తాను ఉన్న చోటుకు వస్తుందనే వివరాలు ప్రయాణికుడికి తెలిసిపోతాయి. అలాగే సేఫ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించే డేటాను ‘టీ–సవారీ’లో అప్డేట్ చేస్తారు. దీంతో ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఓలా, ఊబర్ తదితర వాహనాలతో పాటు బస్సుల వివరాలు కూడా లభిస్తా యి. మెట్రో రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీలో 1200 బస్సులకు వీటీపీఐఎస్ (వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) టెక్నాలజీనీ అమలు చేస్తున్నారు. కానీ ఇది మొక్కుబడిగానే అమలవుతోంది. ప్ర యాణికులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు లభించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు సేఫ్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. మొదట నగరంలోని అన్ని ఏసీ, మెట్రో లగ్జరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులకు సేఫ్ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసి ఆ వివరాలను ప్రయాణికుల మొబైల్ ఫోన్కు, బస్టాపుల్లోని ఎల్ఈడీ బోర్డులకు అనుసంధానం చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3650 బస్సులకు ఈ టెక్నాలజీని అమలు చేసిన అనంతరం తెలంగాణలోని 10,093 బస్సులకు దీనిని విస్తరిస్తారు. హైలైట్స్ తరహాలో సమాచారం.... గ్రేటర్లో బస్షెల్టర్ల ఆధునీకరణకు అనుగుణంగా బస్సుల సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. నగరంలోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, సికింద్రాబాద్; నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి తదితర ప్రధాన స్టేషన్ల ద్వారా ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాకపోకలు సాగించే 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేసేందుకు ‘హైలైట్స్’ దోహదం చేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తాము ఎదురు చూస్తున్న రైల్వేస్టేషన్కు ఎంఎంటీఎస్ ఎంత దూరంలో ఉన్నదీ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిజ్ఞానం ద్వారానే బస్సుల రాకపోకలను ప్రయాణికులకు అప్డేట్ చేస్తారు. బస్టాపులను జియో ఫెన్సింగ్ చేస్తారు. ప్రధాన కార్యాలయంలోని సర్వర్ రూమ్ నుంచి ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తారు. మొదట నగరంలో అమలు చేసిన తరువాత హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ, మెట్టుపల్లి–కరీంనగర్, హైదరాబాద్–వరంగల్ వంటి ప్రధాన రూట్లకు విస్తరిస్తారు. టి–సవారీతో అనుసంధానం... మరోవైపు ఈ సమాచారాన్ని టి–సవారీతో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికుడికి ఒకే సమ యంలో అన్ని రకాల ప్రజారవాణా వాహనాల సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని బయలుదేరవచ్చు. ఉదాహరణకు మియాపూర్ నుంచి అమీర్పేట్ వరకు మెట్రో రైల్లో వచ్చిన వ్యక్తికి తాను ట్రైన్ దిగే సమయానికి అమీర్పేట్లో బస్సు, ఓలా, ఊబెర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బైక్స్ వంటి వాటిలో ఏది అందుబాటులో ఉంటే అందులో బయలుదేరవచ్చు. సేఫ్ సంస్థ నుంచి ఆర్టీసీకి లభించే ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితం. ఇందుకు ప్రతిగా వ్యాపార ప్రకటనలపైన ఆ సంస్థ ఆదాయాన్ని ఆర్జించనుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ ఆచరణలోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో కిడ్నాపైన పాప సురక్షితం
-
పీఎన్బీ స్కాం: బ్యాంకు కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) సోమవారం కీలక ప్రకటన చేసింది. దాదాపు రూ.13వేల కోట్ల స్కాం రేపిన ప్రకంపనల నేపథ్యంలో వినియోగదారులకు భరోసా ఇస్తూ ప్రకటన జారీ చేసింది. వినియోగదారుల సొమ్ము పూర్తి భద్రంగా ఉందనీ, ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరింది. కస్టమర్లు తమ సొమ్మును ఎపుడైనా ఉపసంహరణ, లేదా డిపాజిట్ యథావిధిగా చేసుకోవచ్చని హామీ ఇచ్చింది. అనైతిక ,అక్రమ పద్ధతులను తాము సహించబోమని స్పష్టం చేసింది. ఖాతాదారుల ఆందోళనలను పరిష్కరించాలని కోరుతూ తరచూ అడిగే ప్రశ్నలు(FAQs) పై వివరణాత్మక ప్రకటన ఇచ్చింది. అక్రమ పద్దతులను, మోసపూరిత లావాదేవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ స్కాంకు సంబంధించి నియంత్రణాధికారులు, చట్ట సంస్థలకు వెంటనే ఫిర్యాదు చేశామని వివరించింది. -
మత్స్యకారులు క్షేమం
తప్పిపోయిన వారి ఆచూకీ పరదీప్ లో లభ్యం కాకినాడ తీసుకొచ్చేందుకు ముగ్గురు సిబ్బంది ఒడిశా పయనం కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరాలు వెల్లడి కాకినాడ క్రైం: కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా పరదీప్లో ఉన్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేటకెళ్లి కనిపించకుండా పోయిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ విషయం తమకు గురువారం ఉదయం 10.30 గంటలకు తెలిసిందన్నారు. ఈ నెల 31న వేట నిషేద కాలంలో కాకినాడ పర్లోపేటకు చెందిన కొందు లక్ష్మణరావు ఐఎన్డీ– ఏపీ–ఈ3–ఎండీ–1260 నెంబర్ ఫైబర్ బోటుపై పొట్టి తాతారావు, చింతపల్లి అగ్గిపెటి, వాడమొదుల జగదీష్, చింతపల్లి రాజు, దుమ్ములపేటకు చెందిన సూరాడ రాజు, తిరిది అప్పారావు, మేడ శ్రీనులు చేపల వేట కోసం సముద్రంలో కెళ్లినట్లు తెలిపారు. సముద్రంలో రోజున్నర ప్రయాణం చేసిన ఇంజన్ మరమ్మతుకు గురైందన్నారు. ఇంజన్కి మరమ్మతులు నిర్వహించిన తర్వాత చేపలవేట కొనసాగించేందుకు ముందుకెళ్లగా మరొకసారి ఇంజన్ మరమ్మతుకు గురైందన్నారు. ఈ లోగా వాతావరణంలో సంభవించిన మార్పులతో సముద్ర కెరటాల ఉధృతి, వడి పెరగడంతో గాలికి ఫైబర్ బోటు ఉత్తర తీరం వైపు డీప్ సీలోకి వెళ్లిపోయిందన్నారు. బోట్ మరమ్మతుకు గురైందన సమాచారం తెలిపేలోగా డీప్సీలోకి వెళ్లిపోవడం, అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారాన్ని చేరవేయలేకపోయినట్టు తెలిపారు. బోటు ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ పోర్టు వద్ద డీప్ సీ లోనుంచి పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లిపోతుండగా, ఒడిశాకు చెందిన వేటగాళ్లకు గల్లంతైన బోటు, వేటగాళ్లు కనిపించడం, తెలుగు మాట్లాడే వేటగాడు అక్కడ ఉండటంతో మత్స్యకారుల ఆచూకీ లభించినట్లు తెలిపారు. బోటును పరదీప్ పోర్టుకి తీసుకొచ్చేందుకు వీలుగా ఒడిశాకు చెందిన బోటు సిబ్బంది 10 లీటర్ల డీసెల్, ఆహారాన్ని అందించినట్టు తెలిపారు. ఫైబర్బోటు తప్పిపోయినట్లు 12న తనకు యజమాని నుంచి ఫిర్యాదు వచ్చిన తక్షణమే కోస్ట్గార్డు, హెలికాప్టర్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. వేటగాళ్ల గాలింపు కోసం కాకినాడ తీరం నుంచి మూడు, విశాఖపట్నం నుంచి నాలుగు ఓడలు, చెన్నై నుంచి ప్రత్యేక విమానం 13 నుంచి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విశాఖపట్నం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పలుసార్లు హెలికాప్టర్ రెక్కీ నిర్వహించామన్నారు. వేటగాళ్ల ఆచూకీ కోసం రిలయన్స్, ఓఎన్జీసీ సహకారం తీసుకున్నట్టు తెలిపారు. వేటగాళ్ల గాలింపునకు సీఎం చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు తనతో సంప్రదింపులు చేసి మత్స్యకారులను సురక్షితంగా తీసుకు రావాలని ఆదేశించినట్టు తెలిపారు. బోటులో ఉన్న ఆహార పదార్థాలు 12వ తేదీ రాత్రితో అయిపోయినట్టు తెలిపారు. పరదీప్కు చేరుకున్న ఏడుగురు మత్స్యకారులు సుక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. వీరికి మెరుగైన వైద్య చికిత్స, ఆహారం అందించేలా ఒడిశా మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సమకూర్చామన్నారు. మత్స్యకారులతో స్వయంగా మాట్లాడానని అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఒడిశా నుంచి కాకినాడ తీసుకొచ్చేందుకు రెవెన్యూ నుంచి ఒకరు, మత్స్యశాఖ నుంచి ఇద్దరు అధికారులను పంపినట్టు తెలిపారు. వీరు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయానికి కాకినాడ చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.కోటేశ్వరరావు, అమలాపురం డీడీ పి.జయరావు పాల్గొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి సముద్రంలోకెళ్లే వేటగాళ్లు విధిగా భద్రత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా కోరారు. మోటరైజ్డ్, మెకనైజ్డ్, కంట్రీ క్రాఫ్ట్స్ బోట్లు, పడవలపై చేపల వేటలకు వెళ్లే వారు బోట్లలో లైఫ్ సేవింగ్, నేవిగేషన్ ఎక్విప్మెంట్, డాట్ మిషన్, లైఫ్ జాకెట్లు, లైఫ్ప్లోట్స్ వంటి ఎక్విప్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎంఎఫ్బీ బోట్లు, 471, మోటరైజ్డ్ బోట్లు 2,888, సీసీ–1.సీసీ–2 బోట్లు 253 బోట్లు ఉన్నట్లు తెలిపారు. వీటికి తప్పకుండా డాట్ మిషన్, నేవిగేషన్, సీసేఫిటీ ఎక్విప్మెంట్లు, రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. వీటితో పాటూ మిగతా అన్ని రకాల బోట్లకు సీసేఫిటీ ఎక్విప్మెంట్, రిజిస్ట్రేషన్ విధిగా ఉండాలన్నారు. రెండు వారాల వ్యవధిలో బోట్ల రిజిస్ట్రేషన్, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఎక్విప్మెంట్పై మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 28 ప్రధాన లేండింగ్ సెంటర్ల వద్ద మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లలో డాట్ మిషన్ల ఏర్పాట్లు, బోట్ల రిజిస్ట్రేషన్పై వారం పది రోజుల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
సీటు బెల్టు ధరిస్తేనే సురక్షితం
అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆల్కాట్తోట(రాజమహేంద్రవరం రూరల్) : ప్రస్తుతం సీటు బెల్టు ధరించకపోవడం వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అందువల్ల వాహనదారులు తప్పనిసరిగా ధరించాలని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఎన్.సాంబశివరావు ఆదేశాల మేరకు శనివారం అర్బన్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి ముఖ్య కూడళ్లలో, నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ఇతర ముఖ్య ప్రదేశాల్లో సీటుబెల్టు వాడకంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అర్బన్ ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది కారులో సీటు బెల్టు ధరించని వారికి అవగాహన కల్పించారు. మోరంపూడి జాతీయ రహదారి వద్ద సీటు బెల్టు ధరించిన వారికి తూర్పు మండల డీఎస్పీ రమేష్బాబు, ఇన్స్పెక్టర్ కనకారావులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 3,413 కార్లను ఆపి అవగాహన కల్పించారు. అర్బన్ జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.రజనీకాంత్, ఆర్.గంగాధర్, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రవాణా శాఖాధికారుల సైతం మోరంపూడి జాతీయరహదారి కూడలిలో రవాణాశాఖాధికారులు సీటు బెల్టుధరించడంపై అవగాహన కల్పించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు కార్లను ఆపి సీటు బెల్టు ధరించాలని సూచించారు. -
ప్లాస్టిక్ బాటిల్స్ సురక్షితమేనా..?
ఇకపై మీరు వాటర్ బాటిల్ కొని తాగడానికి ముందు దాని కిందభాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి? ఎప్పుడైనా పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా! వాటిలో ఏ తరహా ప్లాస్టిక్తో ఆ వాటర్ బాటిల్ తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్ కింద దానికి చెందిన లెటర్స్ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది మంచిదో, ఏది హానికరమో కింద చూడండి. పీఈటీఈ లేదా పీఈటీ - వాటర్ బాటిల్ కింద ఈ లెటర్స్ ప్రింట్ చేసి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన వాటర్ బాటిల్స్లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విషపదార్థాలు విడుదల అవుతాయట! ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మంచిది కాదట. హెచ్డీపీఈ లేదా హెచ్డీపీ - వాటర్ బాటిల్ కింద ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి. మనకు ఎలాంటి హాని కలిగించవు. పీవీసీ లేదా 3వీ - ఈ లెటర్స్ ఉన్నా జాగ్రత్తగా చూడాలి. ఎందకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరుతాయి. అవి మన శరీరంలో హార్మోన్ అసమతుల్యతను కలిగిస్తాయి. ఎల్డీపీఈ - ఈ ప్లాస్టిక్తో చేసిన వాటర్ బాటిల్స్ మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలో చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు. దీంతో ప్లాస్టిక్ బ్యాగ్స్ను తయారు చేస్తారు. పీపీ- పెరుగు కప్పులు, టానిక్లు, సిరప్లు ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్ను వాడుతారు. ఇది మనకు సురక్షితమే. పీఎస్ - ఈ తరహ ప్లాస్టిక్తో కాఫీ, టీ కప్పులు తయారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. కనుక ఈ తరహా ప్లాస్టిక్తో చేసిన వస్తువులను వాడరాదు. లేబుల్ ఏమీ లేకపోయినా లేదా పీసీ అని ఉన్నా ఈ ప్లాస్టిక్ చాలా డేంజర్. జాగ్రత్త పడండి మరి! -
తిరుమలలో కిడ్నాపైన పాప క్షేమం
-
మంత్రుల కాన్వాయ్కు ప్రమాదం
జంగారెడ్డిగూడెం / కామవరపుకోట : రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతల కాన్వాయ్ శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి వస్తుండగా, కామవరపుకోట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రులిద్దరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్ జంగారెడ్డిగూడెం వస్తుండగా, కామవరపుకోట సమీపంలో రోడ్డుకు అడ్డుగా మేకలు రావడంతో ముందుగా వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీనిని వెనుక వస్తున్న వాహనాల డ్రైవర్లు గమనించలేదు. ఫలితంగా ఎస్కార్ట్ జీపును ఒక కారు ఢీకొంది. వెంటనే దాని వెనుక ఉన్న కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలో ఉన్న ఆరుగురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రులిద్దరూ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుంచి మరో వాహనం ఢీకొనడంతో వెనుక వైపు ఉన్న డిక్కీ డోరు లోపలికి చొచ్చుకుపోయింది. పలు వాహనాల ముందుభాగాలు దెబ్బతిన్నాయి. -
అల..అలా చేరుకున్నారు
క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు పల్లిపాలెం (సఖినేటిపల్లి) : వర్దా తుపాను ధాటికి సముద్రంలో బోటు అదుపుతప్పి పశ్చిమగోదావరి జిల్లా సంబలదీవి చేరుకున్న కాకినాడ రూరల్ ఏరియాకు చెందిన మత్య్సకారులు ఐదుగురు మంగళవారం మెరై¯ŒS పోలీసులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది సాయంతో క్షేమంగా వెనుతిరిగారు. ఈ నెల 10న కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన చక్కా సత్తిబాబు, కుమారులు పెద్దరాజు, చిన్నరాజు, వీరబాబు, సోదరుడు బాబ్జీరాజు బోటుపై ఒడ్డున వేటాడుకునేందుకు సముద్రంపైకి వెళ్లారు. బోటు కొంత దూరం వెళ్లే సరికి సముద్రం గాలులకు అదుపుతప్పింది. బోటులో ప్రయాణిస్తూ మూడు రోజులు సముద్రంపైనే ఉండిపోయారు. అదృష్టవశాత్తూ బోటు అనుకూల వాతావరణంలో పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, సంబలదీవి ప్రాంతాల సమీపానికి చేరడంతో వారికి పెనుప్రమాదం తప్పింది. స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో పల్లిపాలెం చేపల రేవుకు చేరుకుని, వీఆర్వో పోతురాజు బాబు ద్వారా అంతర్వేది మెరై¯ŒS పోలీసులను ఆశ్రయించారు. మెరై¯ŒS పోలీసు, రెవెన్యూ సిబ్బంది సాయంతో వారు ఐదుగురు క్షేమంగా వెనుతిరిగారు. -
సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమం
నర్సాపురం(పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చినమైనవానిలంక వద్ద సముద్రంలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులు మంగళవారం ఉదయం క్షేమంగా ఒడ్డుచేరారు. మెరైన్ సిబ్బంది వారిని అంతర్వేది వద్ద ఒడ్డుకు చేర్చారు. గత సాయంత్రం చేపలవేటకు వెళ్లిన వారు వార్దాతుపాను కారణంగా సముద్రంలో చిక్కుబడిపోయారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు స్పందించిన మెరైన్ సిబ్బంది వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. విషయాన్ని వారి కుటుంబసభ్యులకు తెలియజేశారు. -
సముద్రంలో గల్లంతైన వ్యక్తి సురక్షితం
కాకినాడ రూరల్ /యానాంటౌన్ : వార్దా తుపానుతో ఆదివారం ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగలో బోటు తిరగబడి గల్లంతైన ఇద్దరిలో ఒకరు సురక్షితంగా Výæట్టుకు చేరారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటకు చెందిన ఇద్దరు సముద్రంలో బోటు తిరగబడడంతో గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో గంపల అచ్చారావు (25) అలల ఉధృతికి కొట్టుకుపోయి సుమారు ఆరు గంటల సేపు ఈదుతూ మడ అడవుల్లోకి వెళ్లిపోయాడు. అక్కడ చెట్టును పట్టుకొని ఉన్న అచ్చారావును సోమవారం పీతల వేటకు వెళ్లిన జాలర్లు చూశారు. ఆ విషయం మత్స ్యశాఖాధికారులకు వారు తెలియజేశారు. అధికారుల సాయంతో వారు అచ్చారావును భైరవపాలెం ఒడ్డుకు తీసుకువచ్చారు. నీటిలో నానిపోయిన అచ్చారావు ఒంటిపై గాయాలు ఉండడంతో అతనికి అక్కడ ప్రాథమిక చికిత్స చేసి యానాం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్టు మత్స్యశాఖ డీడీ ఎస్. అంజలి, ఏడీఏ కె. కనకరాజు, ఏఈ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. అచ్చారావు జాడ తెలియడంతో పెద్దలు వంకా సింహాద్రి, సూరాడ రాజు, మైలపల్లి జగన్నాథం, మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ యానాం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అచ్చారావును కలసి మనోధైర్యాన్ని కలుగజేశారు. కాగా సముద్రంలో గల్లంతైన ఓసుపల్లి మహేంద్ర (19) జాడ ఇంకా తెలియరాలేదు. స్థానిక ఇ¯ŒSచార్జి పరిపాలనాధికారి కాలే సాయినాథ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ గూటం శివగణేష్ సోమవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి అచ్చారావు ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అచ్చారావు బంధువులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. -
పిటిషన్ విత్ డ్రా చేసుకున్న ఆర్కే భార్య
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) క్షేమంగా ఉన్నారనే సమాచారం అందడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఏవోబీ ఎన్కౌంటర్ అనంతరం ఆర్కే కనిపించకుండా పోవడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆర్కే సమాచారం తెలియడంతో ఈ రోజు తన తరఫు న్యాయవాది ద్వారా న్యాయస్థానాన్ని పిటిషన్ విత్డ్రా అనుమతి కోరారు. -
మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమం
-
ఆర్కే క్షేమం
► విరసం నేత వరవరరావు వెల్లడి ► పది రోజుల ఉత్కంఠకు తెర ► మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా తెలిపారని వివరణ ► ఏఓబీలో కూంబింగ్ నిలిపివేయాలని డిమాండ్ ► నేడు ‘హెబియస్ కార్పస్ రిట్’ వెనక్కి... సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) క్షేమంగా ఉన్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు ఫోన్ ద్వారా ఆర్కే క్షేమ సమాచారాన్ని అందజేసినట్లు వివరించారు. హైదరాబాద్లో గురువారం రాత్రి వరవరరావు మీడియాతో మాట్లాడారు. జగబంధు ఇప్పటికే విడుదల చేసిన 14 నిమిషాల ఆడియోలో తాము క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నా... వారిలో ఆర్కే ఉన్నాడా లేదా అన్నదానిపై ఇప్పటివరకూ ఆందోళన నెలకొందన్నారు. జగబంధు తనకు ఫోన్ చేసి ఆర్కే కూడా క్షేమంగా ఉన్నారని తెలిపినట్లు వెల్లడించారు. ఏఓబీలో పోలీసు బలగాల గాలింపు వెంటనే నిలిపివేయాలని జగబంధు డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈ నెల 5, 6 తేదీల్లో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల ప్రతినిధులు ఎన్కౌంటర్పై నిజనిర్ధారణ కోసం మల్కన్ గిరికి రానున్నందున కూంబింగ్ను ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. పోలీసులు 31 మంది మావోయిస్టులను దారుణంగా హతమార్చారని, అందులో నిరాయుధులైన 9 మంది ఆదివాసీలున్నారని జగబంధు తనకు వివరించినట్లు వరవరరావు తెలిపారు. కాగా ఆర్కే ఆచూకీ కోసం తాము హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ రిట్ను శుక్రవారం ఉపసంహరించుకోనున్నట్లు చెప్పారు. సోదరుల హర్షం ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో దేశ వ్యాప్తంగా మావోయిస్టు సానుభూతిపరులు, వామపక్షాల అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇన్ని రోజులుగా ఆర్కే విషయంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్కే క్షేమంగా ఉండడంపై రాజేంద్రనగర్లో నివసిస్తున్న ఆయన సోదరులు సంతోషం వ్యక్తం చేశారు. -
గో గర్ల్.. బి అలర్ట్.. బి సేఫ్
► ఆపదలో ఉన్న మహిళల కోసం యాప్ ► రూపొందించిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య ► పాన్-ఇండియా యాప్ క్రియేషన్ పోటీల్లో జాతీయస్థాయి గుర్తింపు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేలా... అత్యవసర సమయంలో సైరన్ మోగేలా సరికొత్త యాప్... ‘గో గర్ల్’ను అందుబాటులోకి తెచ్చింది నగరంలోని ఇంజనీరింగ్ విద్యార్థిని పి.దివ్య. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఆటోమేటిక్గా రికార్డయ్యేలా రూపొందించిన ఈ యాప్కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇటీవల చెన్నైలో జరిగిన యాప్ క్రియేషన్ ఫైనల్స్లో తొలి బహుమతిని కై వసం చేసుకుంది. 17 రాష్ట్రాలకు చెందిన 700 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఇందులో పోటీపడ్డారు. నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న దివ్య... యాప్ విశేషాలను ‘సాక్షి’కి వివరించింది. త్వరలో గూగుల్ ప్లే స్టోర్లో.. కిడ్నాప్లు, బెదిరింపులు, అత్యాచారయత్నాలు, అల్లరి, ర్యాగింగ్లకు పాల్పడే వారి నుంచి తమను తాము రక్షించుకొనేందుకు మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పోలీస్ సైరన్ మోగుతుంది. సాక్ష్యాధారాలు కూడా రికార్డవుతాయి. ఫలితంగా నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాలేజీ అమ్మారుులు, రాత్రి విధులు నిర్వహించే ఐటీ, కాల్సెంటర్ తదితర మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అవస్థలకు ఈ ‘గో గర్ల్.. బి అలర్ట్... బి సేఫ్’ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. త్వరలోనే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి రానుంది. మహిళలు తమ వ్యక్తిగత భద్రత కోసం ఆండ్రారుుడ్ మొబైల్ ఫోనులో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేఫ్/అన్సేఫ్ ఇండికేషన్ యాప్లో ని ‘కాల్ కాంటా క్ట్’ ఆప్షన్లో ఐదు నంబర్లు యాడ్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో స్క్రీన్పై ‘హెల్ప్ మీ’ అనే బటన్ నొక్కితే చాలు.. వెంటనే ఆయా నంబర్లతో పాటు పోలీసు కంట్రోల్ రూమ్, ఉమెన్స హెల్ప్లైన్, ఎన్సీడబ్ల్యూ, యాంటీ స్టాకింగ్ కాల్స్, అంబులెన్స, ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్లకు ఆటోమేటిక్గా మెస్సేజ్ వెళ్తుంది. దీంతో బాధితురాలు ఏ లొకేషన్లో ఉందనే విషయం గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి ప్రమాదం నుంచి కాపాడే వీలుంది. ఆత్మరక్షణ కోసం పోలీసు సైరన్, కోర్టులో పక్కాగా సాక్ష్యం సమర్పించేందుకు ఆటోమేటిక్ వారుుస్ రికార్డింగ్ కూడా ఉంది. ఆపదలో ఉన్న మహిళలు ‘హెల్ప్ మీ’ ఆప్షన్ నొక్కడం ద్వారా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకొనే ఫీచర్ (సేఫ్/అన్సేఫ్ ఇండికేషన్స) దీని ప్రత్యేకత. ఆపదలో ఉంటే రెడ్ సిగ్నల్, లేదంటే గ్రీన్ సిగ్నల్ గూగుల్ మ్యాప్లో కనబడుతుంది. -
ఇథియోపియాలో తెలుగువారు సురక్షితం
సాక్షి, న్యూఢిల్లీ: ఇథియోపియాలోని బాలెరోబోలో చిక్కుకున్న దాదాపుగా 30 మంది తెలుగువారు క్షేమంగా ఉన్నారని, మాడవలబు వర్సిటీ లోపలి వారు సురక్షితంగా ఉన్నారని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఓరోమో వర్గీయులు తమ నిరసనలో భాగంగా బాలెరోబోకి వెళ్లే రహదారులను మూసివేయడంతో తెలుగు వారు బాలెరోబోలోని వర్సిటీలో చిక్కుకున్నారు. తమకు మరిన్ని హక్కులు కావాలని, ప్రజాస్వామ్యం నెలకొనాలని ఒరిమోలు నిరసనలు చేపట్టారు. ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు మాడవలబు వర్సిటీ అధ్యాపకులతో మాట్లాడారని, తెలుగువారు సురక్షితమని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు -
రైతుల సంక్షేమమే ధ్యేయం
–డీసీసీబీ డైరెక్టర్ ముత్తవరపు పాండురంగారావు నల్లగొండ టౌన్ : రైతుల సంక్షేమమే ధ్యేయమని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ప్రస్తుత ఖరీఫ్లో కొత్త రైతులకు రూ.20కోట్ల స్వల్ప కాలిక రుణాలు ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. బుధవారం స్థానిక డీసీసీబీలో జరిగిన బ్యాంక్ మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పే రివిజన్ చెల్లించాలని నిర్ణయించామని, అన్ని రుణాలపై రుణ పథకానికి అనుగుణంగా వ్యక్తిగత లోన్ పరిమితి పెంచనున్నామన్నారు. ఇప్పటి వరకు దీర్ఘకాలిక రుణాలకు వాటా దారుడిగా వున్న రూ.10వేలను రూ.15వేలకు పెంచనున్నట్లు చెప్పారు. బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల పిల్లల ఉన్నత విద్యకోసం కూడా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. సహకార సంఘాల మౌలిక వసతుల కల్పనకు రూ.కోటి 3లక్షల 88 వేలను మంజూరు చేశామన్నారు. రుణమాఫీ ప్రకటించినందున జూన్ 2016 నాటికి స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు 91.55 శాతం వసూలు చేసినట్లు వివరించారు. రైతులకు వ్యక్తిగత బీమా కల్పించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార సంఘాల్లోని సభ్యులుగా ఉన్న రైతులు ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాల కోసం రూ.10వేల చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో జిల్లా పరిధిలోని అన్ని బ్రాంచీలు, ఎన్నిక చేయబడిన సహకార సంఘాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అనంతరం ఎజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కె.మదన్మోహన్, డైరెక్టర్లు ముదిరెడ్డి రమణారెడ్డి, హనుమయ్య, చిన్నపరెడ్డి నరేందర్రెడ్డి, పాశం సంపత్రెడ్డి, కోటేశ్వర్రావు, ఎస్. రవీందర్రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, ముత్యపురావు, ఏర్పుల సుదర్శన్, వీరునాయక్, హర్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
23 మంది కార్మికులను రక్షించిన వాయుసేన
-
మెుక్కలకు రక్షణేది ?
సంరక్షణ మరిచిన అధికారులు ట్రీగార్డులు కరువు ఎండిపోతున్న మెుక్కలు పట్టించుకోని బల్దియా యంత్రాంగం కరీంనగర్ కార్పొరేషన్ : లక్ష్యం కోసం లక్షకు పైగా మెుక్కలు నాటారు. అయితే వాటి సంరక్షణమాత్రం మరిచారు. ఫలితంగా మెుక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. పచ్చగా పెరిగిన వాటికి ట్రీగార్డులు లేక పశువుల పాలవుతున్నాయి. జూలై 18న తెలంగాణకు హరితహరంలో భాగంగా నగరంలో లక్షకు పైగా మెుక్కలు నాటారు. పలు డివిజన్లలో నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, పందులు తినిశాయి. కొన్ని వాడిపోగా, మరికొన్ని ఎండిపోయి మెుండాలు ఎక్కిరిస్తున్నాయి. ట్రీగార్డుల కొనుగోలు జాప్యం నగరపాలక సంస్థ పరిధిలో ట్రీగార్డుల కొరత ఏర్పడింది. మొక్కలు నాటిన నెల రోజుల వరకు ట్రీగార్డులను సమకూర్చలేకపోయారు. దాతలు సహకారం అందించినా సరైన సమయానికి స్పందించకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. దాతల నుంచి సేకరించిన నిధులను బల్దియా అకౌంట్కు జమచేస్తే టెండర్ల ప్రాసెస్ ఆలస్యమవుతుందని, నేరుగా ట్రీగార్డుల తయారీకి ఉపయోగించారు. రెండు వేలకు మించి ట్రీగార్డులు కూడా అందించలేకపోయారు. మొక్కలు నాటిన తర్వాత అధికారులు మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నీరు లేక మొక్కలు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులే ట్రీగార్డులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటికి నీరు దొరకని పరిస్థితులు ఎదురయ్యాయి. నగరాన్ని జోన్లుగా విడదీసి అధికారులను బాధ్యులుగా నియమించినా మెుక్కల సంరక్షణ మాత్రం మరిచారు. ఆలస్యంగా వర్షాలు జూలైలో మొక్కలు నాటితే ఆగస్టు నెలంతా వర్షాలు లేకపోవడంతో మెజారిటీ మొక్కలు ఎండిపోయాయి. ఆలస్యంగా వర్షాలు కురుస్తున్నా, సరైన సమయంలో నీరు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. జియో ట్యాగింగ్తో మొక్కల లెక్కలు ఖచ్చితంగా చెబుతామని అప్లికేషన్ తయారు చేసినప్పటికీ దాని ఉపయోగం శూన్యం. గుంతల బిల్లులు స్వాహా మొక్కల పరిస్థితి ఇలా ఉంటే గుంతల తవ్వి వాటి బిల్లులు మాత్రం వెంటనే తీసేసుకున్నారు. కొన్ని డివిజన్లలో అసలు గుంతలు తవ్వకుండానే బిల్లులు నొక్కేశారు. 82 వేల గుంతలు తవ్వినట్టు లెక్కలు చూసి హడావిడిగా రూ.16.5 లక్షల బిల్లులు పొందారు. ఈ విషయం తెలిసిన పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో అసలు గుంతలే తవ్వలేదని, వందల సంఖ్యలో రికార్డు చేయడం విడ్డూరంగా ఉందని విస్తుపోయారు. హరితహారం మహోద్యమంలా సాగాలని ప్రభుత్వం భావిస్తే, కొందరి జేబుల్లోకి నిధుల వరద సాగింది. -
కుప్ప కూలిన వైమానిక విమానం
న్యూఢిల్లీ : భారత వైమానిక దళ విమానం మిగ్-21 కూలిపోయింది. రాజస్తాన్లోని బార్మర్ ప్రాంత సమీపంలో ఈ ఎయిర్క్రాప్ట్ కూలిపోయినట్టు డిఫెన్ అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయట పడ్డట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.బార్మర్ సమీపంలోని ఉత్తర్లాయ్ ఎయిర్బేస్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న ఈ ఎయిర్క్రాప్ట్ బార్మర్ సమీపంలోనే కూలిపోయింది. టీ-69 ట్రైనర్ ఈ ఎయిర్క్రాప్ట్ను టేక్ ఆఫ్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సివిల్ లేదా సర్వీసు ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీకి ఆదేశించినట్టు డిఫెన్స్ అధికారి వెల్లడించారు. -
''సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తా..''
బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ ఏం చెప్పినా అభిమానులకు సెక్సీగానే ఉంటుంది. ఒకప్పుడు అడల్ట్ స్టార్ గా ఉన్న సన్నీ లియోన్.. బాలీవుడ్ స్టార్ గా మారిపోవడమే కాదు ఇటీవల కొన్ని యాడ్స్ లోనూ తనదైన రీతిలో ప్రచారం చేస్తోంది. అవాంఛిత గర్భం నుంచి తప్పించుకొనేందుకు, లైంగిక వ్యాధులు నిరోధించేందుకు, కండోమ్ ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరమంటూ.. సురక్షిత సెక్స్ పై సన్నీ లియోన్ ఫ్యాన్స్ లో స్ఫూర్తిని నింపుతోంది. సురక్షిత సెక్స్ పై నాకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే నేను కండోమ్ బ్రాండ్ ప్రకటనను ఎంచుకున్నానని సన్నీలియోన్ చెప్తోంది. ప్రముఖ కండోమ్ బ్రాండ్ ప్రమోషన్ కు ఏమాత్రం సంకోచించకుండా ముందుకు వచ్చినవారిలో సన్నీలియోన్ ఒకరు. అవాంఛితన గర్భాలను నివారించేందుకు, వివిధ సుఖ వ్యాధులనుంచీ దూరంగా ఉండేందుకు కండోమ్ ను ఉపయోగించమని ఆమె తన అభిమానులను అభ్యర్థిస్తోంది. అంతేకాదు.. తాను సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెప్తోంది. కొందరు ఏ కేటగిరీ నటీమణులు కండోమ్స్ ను ప్రోత్సహించరెందుకని అడిగి ప్రశ్నకు.. అది వారి వ్యక్తిగత సౌకర్యం, స్థాయిలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కొందరు జీవితంలో ఎదగాల్సిన పరిస్థితులు, వారి గోల్స్ కు సంబంధించి కూడా వారు తీసుకునే నిర్ణయాలు ఉంటాయని సన్నీ చెప్పింది. ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని చిత్రించి, తాను స్వయంగా నటించిన ఓ ప్రత్యేక బికినీ క్యాలెండర్ ను సన్నీ లియోన్ ప్రారంభించిన సందర్భంలో సురక్షిత సెక్స్ పై ఆమె సదరు వ్యాఖ్యలు చేసింది. -
ఊపిరి పీల్చుకున్న అమర్నాథ్ యాత్రికులు
సురక్షితంగా ఇంటి మార్గం గజ్వేల్: అమర్నాథ్ యాత్రికలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణంలో.. కాశ్మీర్లో చెలరేగిన అల్లర్ల కారణంగా మూడు రోజులుపాటు భయానక పరిస్థితుల్లో ఉన్న విషయం విదితమే. శ్రీనగర్లోని లాల్చౌక్, బాల్టాక్ ప్రాంతాల్లో తలదాచుకున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇళ్లకు బయలుదేరారు. గజ్వేల్, రంగారెడ్డి జిల్లా అల్వాల, హైదరాబాద్లోని దిల్షుక్నగర్, మలక్పేట ప్రాంతాలకు చెందిన 105 మంది దిల్షుక్నగర్లోని రాణా ట్రావెల్స్ ద్వారా అమర్నాథ్ యాత్రకు వెవెళ్లారు. ఇందులో 39మంది లాల్చౌక్లోని ఓ లాడ్జిలో ఆశ్రయం పొందగా.. మిగిలిన వారు బాల్టాక్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. సోమవారం తెల్లవారుజామున లాల్చౌక్ ప్రాంతంలో ఉన్న వారంతా శ్రీనగర్ ఎరుుర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సైతం విమానంలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయాన్ని గజ్వేల్కు చెందిన అంతునూరి శివకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. మిగతా వారంతా బస్సుమార్గంలో ఢిల్లీకి బయల్దేరారు. యాత్రికులంతా సురక్షితంగా ఇంటిమార్గం పట్టడంతో వారి కుటుంబీకులు సంతోషంలో మునిగారు. -
సురక్షితంగా ఇంటి మార్గం
ఊపిరి పీల్చుకున్న అమర్నాథ్ యాత్రికులు గజ్వేల్ : అమర్నాథ్ యాత్రికలు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణంలో.. కాశ్మీర్లో చెలరేగిన అల్లర్ల కారణంగా మూడు రోజులుపాటు భయానక పరిస్థితుల్లో ఉన్న విషయం విదితమే. శ్రీనగర్లోని లాల్చౌక్, బాల్టాక్ ప్రాంతాల్లో తలదాచుకున్న గజ్వేల్ నియోజకవర్గంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇళ్లకు బయలుదేరారు. గజ్వేల్, రంగారెడ్డి జిల్లా అల్వాల, హైదరాబాద్లోని దిల్షుక్నగర్, మలక్పేట ప్రాంతాలకు చెందిన 105 మంది దిల్షుక్నగర్లోని రాణా ట్రావెల్స్ ద్వారా అమర్నాథ్ యాత్రకు వె ళ్లారు. ఇందులో 39మంది లాల్చౌక్లోని ఓ లాడ్జిలో ఆశ్రయం పొందగా.. మిగిలిన వారు బాల్టాక్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. సోమవారం తెల్లవారుజామున లాల్చౌక్ ప్రాంతంలో ఉన్న వారంతా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సైతం విమానంలో వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయాన్ని గజ్వేల్కు చెందిన అంతునూరి శివకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. మిగతా వారంతా బస్సుమార్గంలో ఢిల్లీకి బయల్దేరారు. యాత్రికులంతా సురక్షితంగా ఇంటిమార్గం పట్టడంతో వారి కుటుంబీకులు సంతోషంలో మునిగారు. -
దక్షిణ సూడాన్ లోని భారతీయులు క్షేమం
న్యూఢిల్లీ: దక్షిణ సూడాన్ లోని భారతీయులు క్షేమంగా ఉన్నారని ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. గత కొంత కాలంగా ఆదేశంలో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 270 మంది పౌరులు మరణించారు. దీంతో ఆదేశంలో ఉన్న భారతీయుల క్షేమంపై విదేశాంగ శాఖ దృష్టి సారించింది. సూడాన్ లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబారి శ్రీకుమార్ మీనన్ తెలిపారు. జరుగుతున్న ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
'సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దు'
హైదరాబాద్: నగరంలో ఐసీస్ ఉగ్రవాదుల ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. భద్రత విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం నేపథ్యంలో పాతబస్తీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో రెండు వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్టాడుతూ.. సిటీ అంతటా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు.. స్పెషల్ పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. సిటీ అంతా ప్రశాంతంగా ఉందని ఆయన తెలిపారు. -
'మోదీ తల్లి క్షేమంగా ఉన్నారు'
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హిరాబెన్ మోదీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను గాంధీ నగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తిరిగి ఇంటికి తీసుకొచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం పంకజ్ మోదీతో ఉంటున్న హిరాబెన్ సాధారణంగా ప్రతి రోజూ వైద్య పరీక్షలకు వెళ్లొస్తుంటారు. కానీ, బుధవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆమె కొంత ఎక్కువగా అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 'ఆమె ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. ఇంటికి పంపించాం. ఇవి వయోభారం వచ్చే సమస్యలు మాత్రమే. కొంత దగ్గు, శ్వాస సంబంధమైన సమస్యతో ఆమె బాధపడుతున్నారు' అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
20 రాష్ట్రాల్లో హాయిగా తిరిగాను...
చీకటిని చూసి భయపడితే ఎప్పటికీ భయంగానే ఉంటుంది...ఆ చీకట్లోకి వెళ్ళినప్పుడే అక్కడ ఏముందో తెలుస్తుంది. ఇంచుమించుగా ఇటువంటి అనుభవాన్నే ఆ మహిళ ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకుంది. భారత దేశంలో మహిళ ఒంటరి ప్రయాణం సురక్షితం కాదు.. అన్న అనుమానం నిజమా కాదా అన్నది నిరూపించాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజూ జరిగే భయంకరమైన ఘటనల గురించి విని, చదివి భయపడే వారికి భిన్నంగా ఆలోచించింది. దేశంలోని ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించి తన అనుభవాలను వివరించింది. ముఖ్యంగా అంతా భయపడే ప్రాంతమైన ఛత్తీస్గఢ్ బస్తర్ లో ఓ మహిళ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలనుకుంది స్వాతీ జైన్. అక్కడివారంతా తనను ఎంతో వింతగా చూస్తారని అభిప్రాయపడింది. కానీ వారు తనపై చూపిన ఆదరణ, సహాయ సహకారాలకు ఆశ్చర్యపోయింది. మొదటి 96 గంటలపాటు 1300 కిలోమీటర్లు గిరజన ప్రాంతంలో ప్రయాణించిన ఆమె.. దూరంగా చూసి ఏ విషయానికీ భయపడకూడదన్న సత్యాన్ని గ్రహించింది. ఏ ఒక్కరూ తనవైపు వింతగా చూడలేదని, ముట్టుకోడానికి ప్రయత్నించలేదని, భయపెట్టలేదని చెప్తోంది. నిజంగా అనుమానం పెనుభూతం అన్న సామెతకు ఇదే ఉదాహరణ అంటోంది. ఛత్తీస్గఢ్ లో తన ఒంటరి ప్రయాణం కోసం ముందుగా ట్రావెల్ వెబ్ సైట్లు, పుస్తకాలు సందర్శించిన ఆమె... బస్తర్ ప్రయాణంపై పర్యాటకులకు సలహాదారులు వ్యతిరేక సమాచారం ఇవ్వడాన్నే చూసింది. అయితే అక్కడి పార్కులు, గుహలు వంటి సందర్శనా స్థలాలతోపాటు... వారు జరుపుకునే దసరా వేడుకను చూడాలన్న ఉద్దేశ్యంతో బస్తర్ లో ప్రయాణించింది. అలాగే తాను రాజస్థాన్ ప్రాంతంలో ప్రయాణించేప్పుడు ఓ నిర్మానుష్య ప్రాంతంలో టాక్సీ ఆగిపోయినప్పుడు... ఓ దంపతులు ట్రాక్టర్ లో ఎక్కించుకొని తనకు అక్కడికి దగ్గరలోని ఓ సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించారని చెప్తోంది. ముందుగా తాను ఒంటరిగా వారితో ప్రయాణించేందుకు భయపడి... తనతోపాటు పెప్పర్ స్ప్రే వంటివి ఉంచుకున్నానని, అయితే వారు ఆ అర్థరాత్రి సమయంలో సహాయం అందించడమే కాక.. మరుసటిరోజు ప్రయాణానికి కూడా సహకరించారని తెలిపింది. అలాగే కార్గిల్ లోని జాన్స్ కర్ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు తన షేర్ టాక్సీలోని ఓ వ్యక్తి తన కజిన్ గెస్ట్ హౌస్ లో ఆశ్రయం కల్పించాడని, తన ఇల్లులాగే ఫీల్ అవ్వమంటూ ఎంతో మర్యాదగా చూశాడని ఆ ఒంటరి ప్రయాణీకురాలు తన అనుభవాలను వెల్లడించింది. ప్రతి విషయానికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ ప్రాంతంలోనైనా మహిళలు ఒంటరిగా ప్రయాణించవచ్చని అంటోంది. అంతేకాదు ప్రపంచంలో అన్ని ప్రదేశాలకన్నా భారత దేశంలోనే మహిళలు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితమని తాను భావిస్తున్నట్లు వివరిస్తోంది. ఇరవై రాష్ట్రాల్లో ఒంటరిగా ప్రయాణించిన ఆమె... ప్రతివారూ తమ జీవితంలో ఒక్కసారైనా ఒంటరి ప్రయాణం చేసి, ప్రత్యేక అనుభవాలను మూటగట్టుకోవాలని సలహా ఇస్తోంది. -
బస్లోనే మహిళ కాన్పు.. తల్లీ బిడ్డ క్షేమం
-
మాలి ఘటనలో 20 మంది భారతీయులు క్షేమం
మాలి రాజధానిలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు డాడి జరిపి 170 మందిని బందీలుగా తీసుకున్న ఘటనలో భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. దాడి సమయంలో హోటల్లో ఉన్నటువంటి సుమారు 20 మంది భారతీయులు.. భద్రతా బలగాలు, మాలి సైన్యంతో పాటు ఫ్రెంచ్ సైనికులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో క్షేమంగా బయటపడినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. హోటల్ లోపల భారీ ఎత్తున ఫైరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా 124 మంది టూరిస్టులతో పాటు 13 మంది హోటల్ సిబ్బంది ఉగ్రవాదుల అదుపులోనే ఉన్నారు. -
ఆ నటి క్షేమమేనట
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ , ఆదిత్య చోప్రా భార్య రాణి ముఖర్జీ ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. రాణి ఇటీవల దీపావళి సంబరాల సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో జరిగిన వేడుకల్లో రాణి ముఖర్జీ తీవ్రంగా అలసిపోయి, కళ్లు తిరిగి పడిపోయారనే వార్తలు బాలీవుడ్ లో షికారు చేశాయి. దీనిపై ఆమె ప్రతినిధి స్పందిస్తూ... ప్రస్తుతం రాణీ ముఖర్జీ క్షేమంగానే ఉన్నారని, అంతా బాగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు. ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సలహాపై గురువారం వరకు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారన్నారు. కాగా కుచ్ కుచ్ హోతా హై హీరోయిన్ గత ఏడాది దర్శకుడు ఆదిత్య చోప్రాని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాణి ముఖర్జీ గర్భవతి. 2016 జనవరిలో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. -
కిడ్నాపైన నవీన్ క్షేమం