pilot
-
భూముల లెక్కలు పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు, భూవివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రెవెన్యూ శాఖ పద్దుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే(Land digital survey)కు అనుమతివ్వాలని, నిధులు కేటాయిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 150 మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టు(pilot survey) చేపడతామని కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క... సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆలోచన చేసినా.. రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో సర్వే కోసం నిధులు కేటాయించారు. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. కానీ భూముల సర్వే ఆచరణలోకి రాలేదు. ఇటీవల భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల సర్వేకు మార్గం సుగమం అయినట్టేనని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు అవసరమైన నిధులు కోరామని, ప్రభుత్వం అంగీకరిస్తే భూముల పైలట్ సర్వే ప్రారంభం అమవుతుందని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. రూ.800 కోట్లపైనే అవసరం తెలంగాణలో భూముల సర్వే కోసం రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు అవసరమని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. గతంలో అంచనా వేసినప్పుడే రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసేందుకు రూ.560 కోట్లు కావాలని తేలిందని, ప్రస్తుతం అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కచ్చితమైన సర్వే చేసేందుకు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే భూముల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు చూపాల్సిన అవసరం లేదని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపి భూముల సర్వేకు సిద్ధమైతే కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులిస్తుందని చెబుతున్నారు.సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం... తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేను 3–6 నెలల్లో పూర్తి చేయవచ్చని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం భూముల సర్వే పెద్ద సమస్య కాబోదని భూచట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. కానీ భూముల సర్వే తర్వాత సెటిల్మెంట్ అవసరమని, భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్శిల్ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు.ఇందుకు నిధులతో పనిలేదని రాజకీయ నిబద్ధత, ప్రజల భాగస్వామ్యంతోపాటు రెవెన్యూ శాఖకు అవసరమైన సిబ్బంది కావాలని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గుజరాత్లో ప్రైవేటు సంస్థలతో భూముల సర్వే నిర్వహించినా.. ఇప్పటికీ సెటిల్మెంట్ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయని వివరిస్తున్నారు. అలా సర్వే పూర్తయిన తర్వాత సమస్యలు రాకుండా తెలంగాణలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈటీఎస్ విధానంలో... భూముల సర్వే కోసం రాష్ట్రంలో గతంలో చైన్, క్రాస్ టాప్ పద్ధతులను అనుసరించేవారు. గొలుసు పద్ధతిలో సర్వే నిర్వహించడం చాలా కష్టమన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మండల సర్వేయర్లు, రెవెన్యూ శాఖ ఇదే పద్ధతిలో అవసరమైన చోట భూముల సర్వే చేస్తున్నారు.అయితే ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) అందుబాటులోకి వచ్చాయని.. అన్నింటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా చేయవచ్చని.. వీటితో మైదాన ప్రాంతాల్లో 99.9 శాతం కచ్చితత్వంతో సర్వే చేయవచ్చని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అత్యాధునిక ‘రియల్టైమ్ కైనమాటిక్’ పద్ధతిలో లైడార్ స్కానింగ్, మొబైల్ మ్యాపింగ్ల ద్వారా డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అయితే రెవెన్యూ శాఖ చేసిన భూముల సర్వే ప్రతిపాదనపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలు.. కొన్ని సమస్యలు.. రాష్ట్రంలో భూముల సర్వేతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎప్పుడో నిజాం కాలంలో భూముల సర్వే జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు రీసర్వే జరగలేదు. నాటి రికార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో భూముల సర్వే జరిగితే రికార్డులు మరింత పకడ్బందీగా రూపొందుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. భూముల సర్వేతో దాదాపు అన్ని రకాల భూవివాదాలకు చెక్ పడుతుందని, ప్రతి భూకమతం హద్దులు పక్కాగా తేలుతాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు కూడా పక్కగా గుర్తించవచ్చని అంటున్నారు.సర్వే ద్వారా వ్యక్తులు, సంస్థల మధ్య ఉండే భూవివాదాలే కాకుండా.. ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూవివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఏ సర్వే నంబర్లో ఎవరికి ఎంత భూమి ఉందనే అంశం కూడా వెల్లడవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన భూభారతి చట్టంలో కూడా భూముల రీసర్వేకు అవకాశం కల్పించడంతోపాటు ప్రతి భూకమతానికి పక్కాగా భూదార్ నంబర్ ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ‘‘తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతుల భూమి ఒక సర్వే నంబర్లో ఉంటే.. వారి రికార్డుల్లో మరో సర్వే నంబర్ నమోదైంది. ఇలాంటి సమస్యలకు కూడా భూముల సర్వేతో పరిష్కారం లభించే అవకాశం ఉంది..’’ అని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. సిబ్బంది కొరతతో ఇబ్బంది భూముల సర్వేలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది కొరత భూముల సర్వేకు విఘాతంగా మారుతుందని.. కొన్ని సందర్భాల్లో రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నాయి. భూవిస్తీర్ణంలో తేడాలు, కబ్జాలోని తేడాలను రైతులు అంగీకరించే పరిస్థితి ఉండదని.. ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి, పక్కాగా లెక్కలు తేల్చగలిగితేనే భూముల సర్వే వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. -
సురభివారి గాలి మోటార్
కొల్లాపూర్: నేడు విమానాల్లో ప్రయాణించటం పెద్ద విషయమేమీ కాదు. సామాన్యులు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్నారు. కానీ, ఓ వందేళ్లు వెనక్కు వెళితే? అప్పుడప్పుడే గాల్లోకి ఎగురుతున్న విమానం సాధారణ ప్రజలకు ఒక వింత. డబ్బున్నవాళ్లకు దానిని సొంతం చేసుకోవాలన్న ఆరాటం. నాడు సొంత విమానాలు కలిగి ఉండటమంటే మామూలు విషయం కాదు. కానీ, తెలంగాణలోని ఓ సంస్థానాదీశులు ఆ ఘనతను సాధించారు. జటప్రోలు (కొల్లాపూర్) సంస్థానాన్ని పాలించిన సురభి వంశస్తులు దాదాపు 93 ఏళ్ల క్రితమే సొంత విమానాల్లో తిరిగారు. పైలట్లుగా శిక్షణ పొంది లైసెన్సులూ సంపాదించారు. ఐవీఆర్తో ప్రారంభం క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి కొల్లాపూర్ ప్రాంతాన్ని సురభి వంశస్తులు పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. 1507 సంవత్సరం నుంచి వారి పాలనకు సంబంధించిన ఆధారాలున్నాయి. 1840లో తమ సంస్థానాన్ని జటప్రోలు నుంచి కొల్లాపూర్కు మార్చారు. 1884 నుంచి 1929 వరకు నిజాం నవాజ్వంత్ బహదూర్గా పిలిచే రాజా వెంకటలక్ష్మారావు కొల్లాపూర్ను పాలించారు. ఆయన తర్వాత రాణి వెంకటరత్నమ్మ రాజ్యపాలన చేపట్టారు. వెంకటలక్ష్మారావు కుమార్తె సరస్వతీ దేవిని బొబ్బిలి రాజ్యంలోని తిరుపాచారు జమీందారు ఇనుగంటి వెంకటకృష్ణారావు (ఐవీఆర్) వివాహం చేసుకున్నారు.ఆయన విమానాలు నడపాలనే కోరికతో పైలట్గా శిక్షణ కూడా పొందారు. 1931 నవంబర్ 11న ఆయన ఢిల్లీలో పైలట్గా లైసెన్స్ తీసుకొన్నారు. తమ అల్లుడు ఐవీఆర్ కోసం సురభి రాజులు ఇద్దరు ప్రయాణించగల విమానాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో మద్రాసు ప్రావిన్సులో మాత్రమే ఒక రాజ కుటుంబానికి సొంత విమానం ఉండేది. దక్షిణ భారతదేశంలో సొంత విమానం కొనుగోలు చేసిన రెండో కుటుంబం సురభి రాజులదే. దీనికి వేంకట అనే పెట్టారు. విమానాన్ని నిలిపేందుకు కొల్లాపూర్లోని జఫర్ మైదానాన్ని ఎయిర్పోర్టుగా వినియోగించారు. హకీంపేటలో నిర్వహించిన విమానాల పోటీల్లో జేఆర్డీ టాటాతోపాటు ఐవీఆర్ కూడా పాల్గొన్నారు.మద్రాసు నుంచి బెంగళూరు వరకు 1,800 అడుగుల ఎత్తులో విమానాన్ని నడిపి ఐవీఆర్ రికార్డు సృష్టించారు. ఇంతటి ప్రతిభావంతుడైన ఐవీఆర్.. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలోనే 1935 ఆగస్టు 25న మరణించారు. ఆయన స్మారకార్థం జఫర్ మైదానం సమీపంలోనే (ఆర్ఐడీ బాలుర జూనియర్ కళాశాల పక్కన, వాలీ్మకి గుడి వద్ద) స్తూపం ఏర్పాటుచేశారు. -
ఎయిరిండియా పైలెట్ సృష్టి తులి కేసులో ట్విస్ట్!
ముంబై : ఎయిరిండియా పైలెట్ 25ఏళ్ల సృష్టి తులి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి తులిపై ఆమె స్నేహితుడు ఆదిత్య పండిట్ పెంచుకున్న అసూయే ఆమె మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆమె మరణంలో మరో యువతి ప్రమేయం ఉన్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆశ్రయించనున్నారు. కమర్షియల్ పైలెట్ సృష్టి తులి సోమవారం ముంబైలోని మరోల్ ప్రాంతంలో తన స్నేహితుడు ఆదిత్య పండిట్ రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి ఆదిత్య పండిట్ వేధింపులే కారణమని తెలుస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఆదిత్య పండిట్ పోలీసుల అదుపులో ఉన్నాడు.సృష్టి తులి మరణానికి ముందు ఏం జరిగిందో ఆమె మేనమామ వివేక్ తులి మీడియాతో మాట్లాడారు. ‘‘ఆమె చనిపోవడానికి 15 నిమిషాల ముందు తన తల్లి, అత్తతో ఉల్లాసంగా మాట్లాడింది. అలాంటి నా కోడలు ఆత్మహత్య చేసుకుంది అంటే నేను నమ్మను. ఇది కచ్చితంగా హత్యే. సృష్టి ఎంతో ధైర్యవంతురాలు. చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్ తీసుకుంది. గతేడాది లైసెన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఎయిరిండియాలో పైలెట్గా విధులు నిర్వహిస్తుంది. ఆదిత్య పండింట్ ఆమె బ్యాచ్మెట్. కమర్షియల్ ట్రైనింగ్లో ఫెయిలయ్యాడు. ఈ విషయంలో సృష్టి మీద అసూయ పెంచుకున్నాడు. తీవ్రంగా వేధించాడు. ఈ విషయం ఆమె స్నేహితులే చెప్పారు.మా అమ్మాయి మరణం గురించి తెలిసిన వెంటనే ఏం జరిగిందో ఆమె స్నేహితులతో మాట్లాడాను. నా మేనకోడలు సృష్టిని ఆదిత్య.. ఎంతగా వేధించాడో చెప్పారు. నాన్వెజ్ తినొద్దని తిట్టేవాడు. కొట్టేవాడు. బహిరంగంగా అరిచేవాడు. సమయం, సందర్భం లేకుండా కార్లో ప్రయాణించే సమయంలో నడిరోడ్డులో వదిలేసి వెళ్లేవాడు. ఏడుస్తూ తన రూమ్కి వచ్చేది. సృష్టి బ్యాంక్ అకౌంట్లను చెక్ చేశాం. ఆమె ఒక నెల స్టేట్మెంట్లో రూ.65 వేలు ఆదిత్య అకౌంట్కు పంపింది. డబ్బులు కావాలని ఆదిత్య బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోయి ఉండొచ్చని’’ వివేక్ తులి అన్నారు.ఆ అమ్మాయి ఎవరు?సృష్టి మరణంలో మరో మహిళా పైలెట్ ప్రమేయం ఉందని వివేక్ తులి అనుమానం వ్యక్తం చేశారు. ‘‘సృష్టి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఉన్న ఓ యువతి కీమేకర్ సాయంతో తలుపు తెరిచింది. సృష్టిని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పైలెట్ శిక్షణ తీసుకున్న వాళ్లు.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్లాట్లోకి వెళ్లకూడదనే విషయం తెలియదా? కీ మేకర్ ప్లాట్ బయటి నుంచి తలుపు ఎందుకు తెరుస్తాడ?’ని ప్రశ్నించారు.సృష్టికి న్యాయం జరిగేలా సృష్టి మరణంలో న్యాయం జరిగేలా ఆమె కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆశ్రయించనున్నారు. "సృష్టిది ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం కోసం సీఎం యోగీని కలవనున్నాం" అని వివేక్ తులి మీడియాకు వివరించారు. సృష్టి తులి ఎవరు?ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్కు చెందిన సృష్టి తులికి పైలెట్ అవ్వాలనేది ఆమె కల. ఆ కల నెరవేర్చుకునేందుకు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వచ్చింది. అప్పటి నుంచి కమర్షియల్ పైలెట్ శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ సమయంలో సహచరుడు ఆదిత్య పండిట్ పరిచయమయ్యాడు. ఆ స్నేహం కాస్త ప్రేమకు దారి తీసింది.అయితే, చిన్నప్పటి నుంచి పైలెట్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్న సృష్టి తులి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. కమర్షియల్ పైలెట్ అయ్యింది. కానీ ఆదిత్య పండిట్ కమర్షియల్ పైలెట్ ట్రైనింగ్లో ఫెయిల్ అయ్యాడు. ప్రేమ ముసుగులో ఆమెను చిత్రవధ చేశాడు. చికెన్ తినొద్దని, డబ్బులు కావాలని వేధించాడు. అందరిముందు తిట్టే వాడు. ప్రయాణంలో ఎక్కడ ఉండే అక్కడ ఒంటరిగా వదిలేసేవాడు. ఓ విషయంలో సృష్టి తులి.. ఆదిత్య పండిట్తో గొడవ పడింది. చివరికి అతని ఫోన్ కేబుల్ వైర్తో ప్రాణాలు తీసుకుంది. -
నాన్వెజ్ తినొద్దని వేధించి..
ఎయిరిండియా పైలట్ అనుమానాస్పద కలకలం రేపింది. దీనికి ఆమె బాయ్ ఫ్రెండే కారణమని బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు..ఎయిరిండియాలో పైలట్గా పనిచేస్తున్న 25ఏళ్ల సృష్టి తులి ఈనెల 25న ముంబైలోని అంధేరీ ఈస్ట్లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆదిత్య పండిట్ తరచూ ఆమెను వేధించేవాడని, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. నాన్ వెజ్ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని తెలిపింది. అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు పండిట్ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది. పోలీసుల సమాచారం ప్రకారం ఆమె మృతదేహానికి సమీపంలో లేదా ఆమె ఫ్లాట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సృష్టి కమర్షియల్ పైలట్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆమె గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగ నిమిత్తం ముంబైలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో సృష్టి, పండిట్లు ఢిల్లీలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ట్రైనింగ్లో ఆదిత్య పండిట్ పైలట్గా ఎంపిక కాలేదు.ఘటనకు ముందు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు పండిట్ సృష్టితో కలిసి అంధేరి ఫ్లాట్లో ఉన్నాడు. సోమవారం (నవంబర్ 25) అర్ధరాత్రి దాటిన తర్వాత అతను కారులో ఢిల్లీకి బయలుదేరాడు. ఈ సమయంలో సృష్టి అతనికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అతడు ముంబైకి తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు ఉర్వి పంచల్ను సంప్రదించి, కీమేకర్ సాయంతో తలుపు తెరిచారు. కానీ అప్పటికే కేబుల్ వైర్తో ఉరి వేసుకుంది. అంధేరీ ఈస్ట్లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.సృష్టి మామ ఆరోపణలు'పండిట్ను సృష్టి చాలా గాఢంగా ప్రేమించింది. కానీ అతడు ఆమెను బాగా వేధించేవాడు. బహిరంగంగా దుర్భాషలాడేవాడు. మాంసాహారం తినడం మానేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఆమె పట్ల పండిట్ అసభ్యంగా ప్రవర్తించడం ఇతర బంధువులు కూడా చూశారు. అలాగే ఒక పార్టీలో మాంసాహారం తిన్నందుకు అందరిముందూ అరిచాడు. ఆమె కారును పాడు చేసి, రోడ్డుపై ఒంటరిగా వదిలేసివెళ్లిపోయాడు. ఇటీవల పండిట్ సోదరి నిశ్చితార్థం ఫంక్షన్కు సృష్టి వెళ్లలేకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు మాట్లాడలేదు. దీంతో సృష్టి మానసికంగా కృంగి పోయింద'ని సృష్టి మామ ఆరోపించారు. -
లేవద్దు.. ఇది నీ సింహాసనం!
ఈ ఫొటోలో కూర్చుని ఉన్న అమ్మాయి జోయా అగర్వాల్. ఎయిర్ ఇండియా కెప్టెన్. ఆమె పక్కనే నిలబడి ఉన్నది రతన్ టాటా. న్యూయార్క్ నుండి ఢిల్లీ వస్తున్న బోయింగ్ 777 విమానాన్ని అప్పుడు ఆమె నడుపుతున్నారు. అదే ఫ్లయిట్ లో రతన్ టాటా ఉన్నారు. ఫ్లయిట్ ఢిల్లీ లో దిగగానే ఆయనతో ఒక ఫొటో కావాలని అడిగారు జోయా. ఆయన అంగీకరించారు. ఫొటో కోసం ఆమె లేవబోతుంటే ఆయన వారించారు. ‘ఇది నీ సింహాసనం కెప్టెన్. నువ్వు సంపాదించుకున్నది‘ అని అన్నారు. అలా ఆమె కూర్చొని ఉండగా, ఆమె పక్కన ఆయన నిలబడి ఉన్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఈ అపురూపమైన జ్ఞాపకాన్ని జోయా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఆ సంఘటన తనను ఎలా ఇన్స్పైర్ చేసిందో రాశారు. -
Ratan Tata: వ్యాపారవేత్తే కాదు.. యుద్ద విమానాలు నడిపిన పైలట్ కూడా!
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం ప్రతి ఒక్కరినీ షాక్కు గురి చేసింది. బుధవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా వ్యాపారవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా.. ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే రతన్కు వైమానిక రంగంపై కూడా ఆసక్తి ఎక్కువే. ఆయన హెలికాప్టర్లు, విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. వీటిని నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంది.2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. 69 ఏళ్ల వయసులో ఫైటర్ జెట్ను నడిపి రికార్డు సృష్టించారు. 2007లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అమెరికా రక్షణ రంగ సంస్థ లాక్హీడ్ మార్టిన్ F-16 ఫైటర్ జెట్ను నడిపేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ సమయంలో పైలట్ సాయంతో కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఓ సందర్భంలో వీరి విమానం భూమికి కేవలం 500 అడుగుల ఎత్తులో 600 నాట్స్ వేగంతో దూసుకుపోయింది. ఆయనకు ఓ రెప్లికాను కూడా లాక్హిడ్ గిఫ్ట్గా ఇచ్చింది. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు. అంతేగాక యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఆయనను గైడ చేసిన లాక్హీడ్ మార్టిన్ పైలట్ కూడా చెప్పుకొచ్చారు.అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన బోయింగ్ సంస్థకు చెందిన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో విహరించారు. అమెరికా ఎయిర్క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట. ఇదిలా ఉండగా దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి రతన్ టాటా హయాంలోనే మాతృ సంస్థకు చేరుకొన్న విషయం తెలిసిందే. -
పట్టాలపై ఇసుక పోసి.. రైలు ప్రమాదానికి మరో కుట్ర
లక్నో: ఉత్తరప్రదేశ్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్రలు ఆగడంలేదు. తాజాగా ఇటువంటి ఘటన రాయ్బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఖీరూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను చూసిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు.ఖీరోన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) దేవేంద్ర భడోరియా మాట్లాడుతూ డంపర్ నుండి రైల్వే ట్రాక్పై ఇసుక పోశారని, దానిని తొలగించిన తరువాత రైలు ముందుకు సాగిందన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. స్థానికంగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, దీనిలోభాగంగా మట్టిని రవాణా చేసే పని రాత్రిపూట జరుగుతున్నదన్నారు. ఈ నేపధ్యంలోనే ఓ డ్రైవర్ డంపర్ నుంచి ఇసుకను రైల్వే ట్రాక్పై పోసి అక్కడినుంచి పరారయ్యాడన్నారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత రాయ్ బరేలీ- రఘురాజ్ సింగ్ స్టేషన్ మధ్య నడుస్తున్న షటిల్ రైలు ఈ రూట్లో వచ్చిందన్నారు. అయితే ఆ రైలు లోకో పైలట్ రైల్వే ట్రాక్పై మట్టిని గమనించి, రైలును ఆపాడని దేవేంద్ర భడోరియా తెలిపారు. లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని, రైల్వే ట్రాక్పై మట్టిని తొలగించిన తర్వాత రైలు నెమ్మదిగా ముందుకు కదిలిందన్నారు. ఈ సమయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గేట్మెన్ శివేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ రైలు వేగం తక్కువగా ఉన్నకారణంగానే ప్రమాదం తప్పిందని, ఒకవేళ వేగం ఎక్కువగా ఉంటే రైలు పట్టాలు తప్పేదన్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎయిర్పోర్టు వెలుపల పేలుడు.. ఇద్దరు మృతి -
వన్ స్టేట్.. వన్ కార్డు
సాక్షి,హైదరాబాద్: ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో కాలనీలోనూ సర్వే జరుగుతోంది. ఇంతకీ ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం జరుపుతున్న సర్వేలో ఏమేం సేకరిస్తారు? దీని వల్ల ప్రయోజనమేమిటి? తదితర అంశాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం వ్యక్తిగత గుర్తింపుగా ఎక్కడైనా ఆధార్ను అంగీకరిస్తున్నారు. కానీ ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ఎలాంటి కార్డులు లేవు. ఈ ఫ్యామిలీ కార్డుల ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు. అంటే రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ‘వన్ స్టేట్– వన్ కార్డ్’గా ఈ కార్డు ఉపకరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులున్నాయి. రాజస్థాన్లో జన్ ఆధార్ స్కీమ్ కింద 10 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీలు, 11 అంకెలతో కూడిన వ్యక్తిగత ఐడీలు ఇచ్చారు. హరియాణాలో పరివార్ పెహచాన్ పాత్ర (పీపీపీ) కింద 8 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీ కార్డులిచ్చారు. కర్ణాటకలో 12 అంకెలతో కూడిన ‘కుటుంబ’ ఐడీలను జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లో 12 అంకెలతో కూడిన డిజిట్ ఫ్యామిలీ కార్డును వినియోగిస్తున్నారు. అక్కడ రేషన్కార్డుగా దాన్నే వినియోగిస్తున్నారు. వ్యక్తిగత ఐడీలు.. తెలంగాణలో కుటుంబాన్ని ఒక యూనిట్గా గుర్తించేందుకు ఫ్యామిలీకార్డు ఉపకరిస్తుంది. కుటుంబంలోని అందరికీ ఒకే ఐడీ నంబర్ ఉండటంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా వేర్వేరు ఐడీలిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా దేశంలోని అందరికీ ఆధార్ కార్డులిచ్చినట్లే రాష్ట్రంలోని అందరికీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తారు. కుటుంబంలోని మహిళల్లో పెద్ద వారిని కుటుంబ పెద్ద(హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ)గా గుర్తిస్తారు. వ్యక్తిగత ఐడీలు జారీ అయ్యాక మారవు. శాశ్వతంగా అవే ఉంటాయి. కుటుంబంలోని కుమారుల పెళ్లిళ్లు జరిగి కోడళ్లు వస్తే కుటుంబంలో కొత్త సభ్యులుగా చేర్చేందుకు, మరణించిన వారిని తొలగించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబాలుగా విడిపోతే కొత్త కుటుంబంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటో తీసుకుంటారు. నగరంలో 8వ తేదీ వరకు సర్వే జరిపి, 9న స్రూ్కటినీ చేసి 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఒకే చోట అన్ని వివరాలు.. ప్రస్తుతం ఒక కుటుంబంలోని వారు వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ ఆ వివరాలు ఒకే చోట లేవు. ఈ డిజిటల్ కార్డులు వచ్చాక అన్ని వివరాలు ఒక్క మౌజ్ క్లిక్తో తెలియనున్నాయి. ప్రభుత్వానికి చెందిన 30 శాఖల సమాచారం సంబంధిత శాఖల ఉంది తప్ప ఒకదానికొకటి అనుసంధానంగా లేవు. కొత్త కార్డుల వల్ల ప్రజలకెదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని, ఈ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ పనుల ప్రారం¿ోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సీఎం రిలీఫ్ఫండ్తో సహ ఒక కుటుంబం ఏ పథకాలు వినియోగించుకుంటుందో తెలుస్తుందన్నారు. అంతేకాదు.. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా గతంలో చేయించుకున్న ఆరోగ్యపరీక్షల వంటి వివరాలు కూడా ఉండటం వల్ల మరోసారి ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. -
న్యూజిలాండ్ పైలట్కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
వంట గది నుంచి పంట పొలాల్లోకి...
‘అయిదు వేళ్లు కలిస్తేనే ఐకమత్యం’ అనేది ఎంత పాత మాట అయినా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోదగ్గ మాట. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో ఎంతోమంది మహిళలు ‘ప్రకృతి’ పేరుతో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడుతున్నారు. ‘ప్రకృతి’ చేసిన మహత్యం ఏమిటంటే... వంటగదికి మాత్రమే పరిమితమైన వారిని పంట నొలాల్లోకి తీసుకువచ్చింది. డ్రోన్ పైలట్గా మార్చి కొత్త గుర్తింపు ఇచ్చింది. జెండర్ ఈక్వాలిటీ నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ వరకు రకరకాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసింది. పిల్లలు పెద్ద చదువులు చదివేలా చేసేలా చేసింది.సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడూ చూడని విమానంలో ప్రయాణం చేయించింది....‘మీ గురించి చెప్పండి’ అని సుధా దేవదాస్ను అడిగారు ప్రధాని నరేంద్ర మోది. తన వ్యక్తిగత వివరాలతో పాటు తమ స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ గురించి ప్రధానికి వివరంగా చెప్పింది సుధ.మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ‘లఖ్పతి దీదీస్’ కార్యక్రమంలో పాల్గొనడానికి కేరళ నుంచి వచ్చింది సుధ. ‘లఖ్పత్ దీదీస్’ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు కేరళ నుంచి ఎంపికైన ఇద్దరు మహిళల్లో సుధ ఒకరు. సుధ త్రిసూర్లోని కుఝూర్ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్. కేరళ నుంచి ‘డ్రోన్ పైలట్’ అయిన తొలి మహిళా పంచాయతీ మెంబర్గా సుధ ప్రత్యేక గుర్తింపు సాధించింది.‘ఈ శిక్షణా కార్యక్రమాల పుణ్యమా అని డ్రోన్లను ఎగరవేయడం మాత్రమే కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి, పంట పొలాల్లో ఉపయోగించే ఎరువులు, మందులు... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం’ అంటుంది సుధ.‘ఇప్పుడు నన్ను అందరూ డ్రోన్ పైలట్ అని పిలుస్తున్నారు’ ఒకింత గర్వంగా అంటుంది సుధ. సుధలాంటి ఎంతో మంది మహిళల జీవితాలను మార్చిన స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ విషయానికి వస్తే... ‘ప్రకృతి’లో 30 సంవత్సరాల వయసు మహిళల నుంచి 63 సంవత్సరాల వయసు మహిళల వరకు ఉన్నారు. ‘ప్రకృతి’లోని పన్నెండు మంది సభ్యులు ‘గ్రామిక’‘భూమిక’ పేరుతో విధులు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు గృహ నిర్మాణం, పిల్లల చదువు, పెళ్లిలాంటి ఎన్నో విషయాలలో ప్రజలకు సహాయపడతారు.‘ప్రకృతి వల్ల మా జీవన విధానం పూర్తిగా మారి΄ పోయింది’ అంటుంది 51 సంవత్సరాల సుధ. ఆమె పెద్ద కుమారుడు ఎం.టెక్., చిన్న కుమారుడు బీటెక్. చేశారు. ‘పై చదువుల కోసం పెద్ద అబ్బాయి కెనడా, చిన్న అబ్బాయి ΄ పోలాండ్ వెళుతున్నాడు’ సంతోషం నిండిన స్వరంతో అంటుంది సుధ. కొన్ని నెలల క్రితం ‘ప్రకృతి’ బృందం కేరళ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి వెళ్లింది. ఆ బృందంలోని ప్రతి ఒక్కరికి ఇది తొలి విమాన ప్రయాణం. అది వారికి ఆకాశమంత ఆనందాన్ని ఇచ్చింది.సాధారణ గృహిణి నుంచి గ్రామ వార్డ్ మెంబర్గా, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ‘కుటుంబశ్రీ’లో రకరకాల విధులు నిర్వహిస్తున్న కార్యకర్తగా, జెండర్ ఈక్వాలిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్లకు సంబంధించి మహిళలకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్గా, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో) డైరెక్టర్గా, డ్రోన్ పైలట్గా రకరకాల విధులు నిర్వహిస్తున్న సుధ ఎంతోమంది గృహిణులకు రోల్మోడల్గా మారింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడినప్పుడు ఎంతో ఆత్మస్థైర్యం వస్తుంది. అది ఎన్నో విజయాలను అందిస్తుంది. ఎవరు ఏమనుకుంటారో అనే భయాలు మనసులో పెట్టుకోకుండా మనకు సంతోషం కలిగించే పని చేయాలి’ అంటుంది సుధా దేవదాస్. -
హెలికాప్టర్ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్నాథ్కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
ఎయిర్షోలో అపశృతి.. సముద్రంలో కుప్పకూలిన విమానం
ప్యారిస్: ఫ్రాన్స్లో ఓ ఎయిర్షోలో అపశృతి దొర్లింది. 65 ఏళ్ల పైలట్ ఓ ట్రైనింగ్ విమానంలో ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతిచెందారు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్ జెట్ విమానం వరల్డ్వార్ 2 తర్వాత తయారైంది కావడం గమనార్హం. ఈ విమానాన్నిఫ్రాన్స్ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది. విమానంలో ఎజెక్షన్ సీటు లేకపోవడమే పైలట్ మృతికి కారణమని చెబుతున్నారు. -
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు.. 77 మంది మహిళా పైలట్ల నియామకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండిగో తన ఎయిర్బస్, ఏటీఆర్ విమానాల కోసం 77 మంది మహిళా పైలట్లను నియమించుకుంది. కొత్తగా చేరిన వారితో కలిపి సంస్థలోని మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 800కు పెరిగింది.ఇండిగో సంస్థ నియమించుకున్న 77 మందిలో ఎయిర్బస్ ఫ్లీట్కు 72 మందిని, ఏటీఆర్ ఫ్లీట్కు 5 మంది మహిళా పైలట్లను విభజించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పైలట్లలో మహిళలు సగటున 7-9 శాతంగా ఉన్నారని సంస్థ తెలిపింది. అదే ఇండిగోలోని మొత్తం పైలట్లలో మహిళా సిబ్బంది 14 శాతంగా ఉన్నారని సంస్థ ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషిమ్ మిత్రా పేర్కొన్నారు. మార్చి 31, 2024 నాటికి ఇండిగోలో 5,038 పైలట్లు, 9,363 క్యాబిన్ సిబ్బందితో సహా 36,860 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. సంస్థలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు -
ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ
ఇంజినీర్లకు నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ సంస్థ ప్రత్యేక అకాడమీ ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, అకౌంటబుల్ మేనేజర్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ అకాడమీ కోసం రూ.50 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘దేశంలోని విమానయాన సంస్థలకు శిక్షణ పొందిన మానవ వనరుల కొరత ఎదురవుతోంది. ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణలో భాగంగా భవిష్యత్తులో ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది. వారికి నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఆధ్వర్యంలో జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ను ఏర్పాటు చేస్తున్నాం. జులై నెలలో కోర్సులు ప్రారంభించాలని ఇన్స్టిట్యూట్ యోచిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్తో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. కొత్త అకాడమీను హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నాం. కోర్సులో భాగంగా రెండు సంవత్సరాలపాటు అకడమిక్ స్టడీ ఉంటుంది. మరో రెండేళ్లు ఉద్యోగ శిక్షణ అందిస్తాం. ఇండిగో, ఎయిరిండియా, ఆకాసా వంటి విమానయాన సంస్థలు ఇప్పటికే 1,200 కంటే ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్లను ఆర్డర్ చేశాయి. పరిశ్రమల అంచనా ప్రకారం, వచ్చే ఐదేళ్లలో భారతదేశానికి దాదాపు 5,000 మంది ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు అవసరం’ అన్నారు. దిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను జీఎంఆర్ నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణఇదిలాఉండగా, పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ఎయిరిండియా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసిన వారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకుంటామని ప్రకటించింది. -
సిటీ స్కై డ్రోన్స్ ఫ్లై
సాక్షి, హైదరాబాద్: ఎంటర్టైన్మెంట్ నుంచి ఫంక్షన్ల షూటింగ్ దాకా.. మందుల అత్యవసర సరఫరా నుంచి రోడ్డుపై ట్రాఫిక్ను పర్యవేక్షించేదాకా.. డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. మరెన్నో రంగాలు, అవసరాలకూ డ్రోన్లు విస్తరిస్తున్నాయి. పదులు, వందల్లో కాదు.. రోజూ వేల సంఖ్యలో డ్రోన్లు గ్రేటర్ హైదరాబాద్వ్యాప్తంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. సరదాగా వాడే చిన్న చిన్న కెమెరా డ్రోన్ల నుంచి ఓ స్థాయిలో బరువులు, వస్తువులు మోసుకెళ్లే భారీ డ్రోన్ల దాకా దూసుకుపోతున్నాయి. దీంతో వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగైతే తప్పనిసరో అలా డ్రోన్లను ఎగరవేసేందుకు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. అధికారికంగా, అనధికారికంగా రాష్ట్రంలో సుమారు 3 వేల డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అధికారుల అంచనా.యాచారంలో డ్రోన్ అకాడమీ..ఇప్పటివరకు డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ (టీఎస్ఏఏ) త్వరలోనే డ్రోన్ల తయారీ, నిర్వహణ సేవలను సైతం అందించనుంది. నగర శివార్లలోని యాచారం మండలంలో డ్రోన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం 20 ఎకరాల భూమి ని కేటాయించింది. భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.మరో ఏడాదిలో డ్రోన్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఆపరేషనల్ మేనేజర్ సామల రాహుల్రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఇంధనంతో నడుస్తూ, 150–200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యమున్న భారీ డ్రోన్లను నడిపే పైలట్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. వీటిని రక్షణ, నేవీ రంగాల్లో భద్రత కోసం వినియోగిస్తారని తెలిపారు. ఈ డ్రోన్లు 120 నుంచి 150 కిలోల వరకు బరువు ఉంటాయని వివరించారు.డ్రోన్లతో ట్రాఫిక్ నిర్వహణ..జంక్షన్లు, రద్దీ సమయంలో ట్రాఫిక్ను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ‘మావిక్ 3 పీఆర్ఓ’ డ్రోన్ను సైబరాబాద్ పోలీసులు వినియోగిస్తున్నారు. దీనికి ఉండే నాలుగు అత్యాధునిక కెమెరాల సాయంలో ఏరియల్ ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తూ రియల్ టైమ్లో ప్రసారం చేసే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. దీంతో ట్రాఫిక్ పోలీసు బృందాలు ఆయా సమస్యలను వేగంగా పరిష్కరించే వీలు కలుగుతుంది. వాహనదారులు సులభంగా, వేగంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు.ఔషధాల సరఫరా కోసంనగర శివార్లలోని బీబీనగర్లో ఉన్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెండు డ్రోన్లను వినియోగిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్షయవ్యాధి మందులను, టీబీ పరీక్షల కోసం కఫం నమూనాలను సైతం డ్రోన్లతో తరలిస్తున్నారు. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రెండు గంటలకుపైగా సమయం పడితే.. డ్రోన్తో కేవలం పది, ఇరవై నిమిషాల్లోపే అత్యవసర ఔషధాలను చేరవేస్తున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్ క్యాంపస్లోని హ్యాంగర్ నుంచి యాదాద్రి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు 8 కిలోల బరువు మోసే సామర్థ్యమున్న డ్రోన్తో మందులను సరఫరా చేస్తున్నారు.వ్యవసాయ పనుల్లోనూ ఎంతో లాభంవ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యావంతులైన కొందరు రైతులు డ్రోన్ల వినియోగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ల వినియోగం, నిర్వహణ సేవలపై పలు డ్రోన్ తయారీ సంస్థలు, రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ డ్రోన్ అకాడమీ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. సాధారణంగా ఎకరం పొలంలో పురుగు మందు పిచికారీకి ఒక రోజు సమయం పడుతుంది.పైగా రూ.700–1,000 వరకు ఖర్చు అవుతుంది. డ్రోన్తో పిచికారీ రూ.500–600 ఖర్చుతోనే 10 నిమిషాల్లో పూర్తవుతుంది. పైగా పురుగు మందు వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. పైగా డ్రోన్కు అమర్చే కెమెరాలతో పంటలను ఫొటో తీయడం, చీడ పురుగుల స్థాయిని గుర్తించడం తేలికవుతుంది. ఇక్రిశాట్ సంస్థ పంట రకాలను, దశలను అధ్యయనం చేయడానికి డ్రోన్లను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్ లెరి్నంగ్ టెక్నాలజీల సాయంతో విశ్లేషిస్తోంది.వాతావరణ మార్పుల పరిశీలనకూ..నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) వాతావరణ పరిశోధన, అంచనాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. వివిధ సెన్సర్లతో కూడిన డ్రోన్తో ఆకాశంలో అంతెత్తు వరకు వెళ్లి.. భూమి ఉపరితలం, వాతావరణ పరిస్థితుల డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేస్తున్నారు.అటవీశాఖ పరిధిలోనూ..అటవీ ప్రాంతాలు, తోటలు, నీటి మట్టం పర్యవేక్షణకు అటవీ శాఖ డ్రోన్లను వినియోగిస్తోంది. కాగజ్నగర్ అటవీ డివిజన్లో ఏనుగు ఇద్దరు రైతులను తొక్కి చంపిన ఘటనలో ఆ ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగించారు. అలాగే పులుల సంచారాన్ని గుర్తించేందుకూ డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలిలైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం నేరంవాహనాలు నడిపేందుకు ఎలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలో అలాగే డ్రోన్ను ఎగరవేసేందుకు కూడా సర్టిఫికెట్ కావాల్సిందే. వాణిజ్య అవసరాల కోసం డ్రోన్ వినియోగించే ప్రతీ ఒక్కరికీ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ అనుమతి పొందిన సంస్థ నుంచి డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆ లైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ సర్టిఫికెట్కు పదేళ్ల కాల పరిమితి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి.ఫీజు రూ. 38వేలు...నాలుగేళ్లలో తెలంగాణ డ్రోన్ అకాడమీ నుంచి 600 మందికిపైగా విద్యార్థులు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందారు. ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు రూ.38 వేలు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ శిక్షణ కోసం వస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందినవారిలో 30 మందికిపైగా మహిళా డ్రోన్ పైలట్లు ఉండటం గమనార్హం.డ్రోన్లతో స్టార్టప్లు పెడుతున్నారువయసు,లింగ భేదాలతో సంబంధం లేకుండా చాలా మందిడ్రోన్ పైలట్ శిక్షణపై ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, నిర్వహణ ఎలా అనే అంశాలపై నైపుణ్యం కోసం మా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. తర్వాత సొంతంగా డ్రోన్లతో స్టార్టప్లను ప్రారంభిస్తున్నవారూ ఉన్నారు. -
పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణ
ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసినవారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకోనున్నారు.ఏటా విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. దానికితోడు విమానయాన సంస్థలు ఎయిర్క్రాఫ్ట్లను పెంచుతున్నాయి. దాంతోపాటు దేశీయంగా టైర్2, 3 నగరాలకు కూడా విమాన సేవలను విస్తరించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. అయితే కంపెనీలు భావించినట్లు ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్యను పెంచితే వాటిని నడిపేందుకు పైలట్ల అవసరం ఏర్పడనుంది. ఈ సమస్యను ముందే ఊహించిన టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా పైలట్లుగా స్థిరపడాలనుకునేవారికి ట్రెయినింగ్ ఇవ్వనుంది. శిక్షణ పూర్తిచేసుకున్నాక నేరుగా సంస్థలో ఉద్యోగం కల్పించాలని యోచిస్తోంది.ఇండిగో, స్పైస్జెట్ వంటి భారత విమానయాన సంస్థలు విదేశాల్లోని స్వతంత్ర పైలట్ ట్రయినింగ్ అకాడమీలతో అనుబంధంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇండిగో సంస్థ విదేశాల్లోని ఏడు ఫ్టైట్ స్కూళ్లతో అనుబంధం కలిగి ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అమెరికన్ కంపెనీ పైపర్, యూరోపియన్ సంస్థ డైమండ్ నుంచి దాదాపు 30 సింగిల్ ఇంజిన్, నాలుగు మల్టీ ఇంజిన్ విమానాల డెలివరీకి ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో విదేశీ అకాడమీలతో అనుబంధంగా ఏర్పడి పైలట్లును నియమించుకోనుంది.ఎయిరిండియా మాత్రం పైలట్ల కొరత తీర్చుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్న 40శాతంపైగా అభ్యర్థులు విదేశాలకు వెళ్తున్నారు. దాంతో స్థానికంగా పైలట్ల కొరత పెరుగుతోందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఎయిరిండియా శిక్షణలో భాగంగా పైలట్లకు టైప్-రేటెడ్ ట్రైనింగ్ అందించేందుకు ఆరు సిమ్యులేటర్లను కలిగి ఉన్న ఎయిర్బస్, ఎల్3 హారిస్(యూఎస్ ఆధారిత కంపెనీ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకోసం గుర్గావ్లోని తన సొంత శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎయిర్బస్ A320 లేదా బోయింగ్ 737 వంటి నిర్దిష్ట విమానాలను నడిపేందుకు టైప్-రేటెడ్ శిక్షణ అవసరం అవుతుంది.ఇదీ చదవండి: విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. 2024లో ప్రతి ఆరు రోజులకు ఒక కొత్త విమానాన్ని ప్రవేశపెడతామని గతంలో కంపెనీ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్స్ తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాసా కంపెనీలు రానున్న రోజుల్లో డెలివరీ ఇచ్చేందుకు వీలుగా దాదాపు 1,250 విమానాలను ఆర్డర్ చేశాయి. ఎయిర్ఏషియా ఇండియా మాజీ సీఈఓ సునీల్ భాస్కరన్ ప్రస్తుతం ఎయిరిండియా ఏవియేషన్ అకాడమీకి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. -
ఆకాశమే హద్దుగా..
దేవరకొండ : శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుందన్న మాటను వంట బట్టిచ్చుకున్నాడు ఆ యువకుడు. అందరిలా కాకుండా తాను తనలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పుడే తన తండ్రి దూరమైనా ఏ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా 24 ఏళ్ల వయస్సులోనే లెఫ్టినెంట్ పైలెట్ హోదా దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవరకొండ మండలం ఉమ్మడి ముదిగొండ గ్రామం సీతారాంతండాకు చెందిన కొర్ర కుమార్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు అరవింద్ చౌహాన్. శనివారం హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఫ్లయింగ్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్లో అరవింద్ చౌహాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ విఆర్.చౌదరి చేతుల మీదుగా ఆయన లెఫ్టినెంట్ పైలెట్ హోదా పొందారు. దీంతో గ్రామస్తులు అరవింద్ను అభినందిస్తున్నారు.అంచెలంచెలుగా ఎదిగి..అరవింద్ చౌహాన్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దేవరకొండలో పూర్తి చేశారు. 2013లో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించాడు. 2016లో యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీయే) పరీక్షలో 175వ ర్యాంకు సాధించాడు. అనంతరం మూడేళ్లు పూణేలో శిక్షణ పొందుతూనే బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం నావల్ అకాడమీలో శిక్షణ తీసుకొని 2021మేలో ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్గా ఎంపికయ్యాడు. అనంతరం ఇటీవల ఇండియన్ ఏవియేషన్ బ్రాంచిలో నిర్వహించిన పరీక్షలో ఆయన పైలెట్గా ఎంపికై లెఫ్టినెంట్ హోదా పొందారు. అరవింద్కు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి దూరమైనా తల్లి అన్నీ తానై చదివించింది. వారికి కుటుంబ సభ్యులైన బాబాయి విజయ్, మేనమామలు నేనావత్ రంగానాయక్, నేనావత్ జైపాల్ తోడ్పాటు అందించారు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుయువత పట్టుదలతో సాధించలేనిది ఏమిలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నేడు నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఇందుకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎనలేనిది. దేవరకొండ ప్రాంతానికి చెందిన యువత ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలపై దృష్టి సారించాలి. దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తలంపుతో యువత ముందుకు రావాలి. – అరవింద్ చౌహాన్ -
బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్.. మహిళా పైలట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా పైలట్ బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలైంది. దీంతో టాటా గ్రూపు విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్పై కఠిన చర్యలు తీసుకుంది. మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బోయింగ్ 787 విమానం ఫస్ట్ ఆఫీసర్గా మహిళా పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఇంతలో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలై విధులకు దూరమైంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు మంగళవారం(ఏప్రిల్ 9) ధృవీకరించారు. సస్పెన్షన్కు గురైన మహిళా పైలట్ సోషల్ మీడియాలో పాపులర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూల్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకున్న పైలట్లను విమానం నడిపేందుకు అనుమతించరు.ఎవరైనా ఆల్కహాల్ ఉన్న మౌత్వాష్లు,టూత్ జెల్ మందులు తీసుకుంటే ముందుగా సమాచారమివ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్ చేస్తారు. ఇదీ చదవండి.. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ,ఈడీ సోదాలు -
తొలిసారి కుటుంబాన్ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్.. తల్లి కంటతడి
విమానంలో ప్రయాణించడం ప్రతి ఒక్కరి కల. కొంతమందికి ఇది తేలికైన విషయమే కావచ్చు. కానీ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య అనేకం. వీరిలో చాలామందికి ఈ ఆశ నిరాశగానే మిగిలిపోయిన సందర్బాలూ ఉన్నాయి. తాజాగా ఓ పైలట్ తన కుటుంబాన్ని మొదటిసారి విమానం ఎక్కించాడు. దీంతో ఆనందంతో తల్లి కంటతడి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రదీప్ కృష్ణన్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో పైలట్గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబాన్ని తొలిసారి విమానం ఎక్కించాడు. తన తల్లి, బామ్మ, తాతను చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న విమానం ఎక్కించి సర్ప్రైజ్ చేశాడు. ‘మావాళ్లు మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇది నాకేంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు తాత తన స్కూటర్పై నన్ను తిప్పేవాడు. ఇప్పుడు నా డ్రైవింగ్లో తాతను విమానంలో తీసుకెళ్తున్నా’ అంటూ టేకాఫ్కు ముందు విమానంలోని ప్రయాణికులకు ప్రత్యేక అనౌన్స్మెంట్ ద్వారా తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో పైలట్ తల్లి భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. అనంతరం విమానంలో ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టి ఆ కుంటుబానికి వెల్కమ్ చెప్పారు. View this post on Instagram A post shared by Pradeep Krishnan (@capt_pradeepkrishnan) -
పైలెట్ల రాజీనామా.. విస్తారా ఎయిర్లైన్స్ సేవల్లో అంతరాయం
విస్తారా-ఎయిరిండియా విలీన ప్రక్రియ నేపథ్యంలో వేతనాల సవరణ అంశంపై పైలట్లు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫలింతగా విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరో 38 విస్తారా విమాన సేవలు నిలిచిపోయాయి. ముంబయి నుంచి 15, దిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి 11 విమాన సర్వీసులు రద్దయినట్లు విస్తారా ప్రకటించింది. ఈ తరణంలో ఆ సంస్థకు చెందిన 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకు ముందు వైడ్ బాడీ బోయింగ్ 787 విమానాల నిర్వహణ కోసం విస్తారా పైలెట్లు శిక్షణ పొందారు. ట్రైనింగ్ తర్వాత సుమారు సుమారు 800 మంది పైలట్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడంతో కలవరం మొదలైంది. 70 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమాన సర్వీసులు అందించే విస్తారా ఎయిర్లైన్స్లో ఇప్పుడు పైలెట్ల కొరత మరిన్ని ఇబ్బందులు గురి చేస్తోంది. -
Teena Goswami: ఆడపిల్లే అదృష్టదేవత
పైలట్ టీనా గోస్వామి ఆసక్తికరమైన వీడియోలను ‘పైలట్ మమ్మీ’ శీర్షికతో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఒక బామ్మ వీడియో వైరల్గా మారింది. గ్రామీణత ఉట్టిపడే ఆహార్యంతో కనిపిస్తున్న ఒక బామ్మ అయోధ్యధామ్కు వెళ్లే విమానంలోకి మెట్లకు నమస్కరిస్తూ ఎక్కింది. విమానంలో కనిపించిన పైలట్ టీనా గోస్వామిని ఆ΄్యాయంగా పలకరించింది. ‘మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్ల.. మన లక్ష్మి’ అంటూ టీనాను ఆశీర్వదించింది. బామ్మ కాళ్లకు గౌరవంగా నమస్కరించింది టీనా. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ముప్ఫై లక్షల వ్యూస్ దక్కించుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా పైలట్!
కమోరా ఫ్రీలాండ్ న్యూయార్క్ స్టేట్లో అతి పిన్న వయస్కురాలైన ఆఫ్రికన్ మహిళా పైలట్. 17 ఏళ్ల వయసులోనే పైలెట్గా లైసెన్స్ పొందిన మహిళగా రికార్డు సృష్టించింది. దీంతో న్యూయార్స్ ఏవియేషన్ ఆమెకు సుమారు 12 మంది ప్రయాణికులతో కూడిన విమానాన్ని నడిపేందుకు అనుమతిస్తూ లైసెన్స్ జారీ చేసింది. ఆమె ఎల్లప్పుడూ సముద్ర జీవశాస్త్రంపై దృష్టి పెట్టేది. అయితే అనుకోని విధంగా ఏవియేషన్ వైపుకి దృష్టి మళ్లించింది. ఆమె 15 ఏళ్ల వయసులోనే విమానం నడపడం నేర్చుకుంది. అయితే కమోరా తానెప్పుడూ పైలట్ కావాలని అనుకోలేదని చెబుతోంది. కానీ తొలిసారిగా విమానం నడిపాక కచ్చితంగా జీవనోపాధికి దీన్నే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాను అంటోంది కమోరా. 2019లో మిల్టన్ డేవిస్, క్లెట్ టైటస్ అనే అధికారులు ఈ యునైటెడ్ యూత్ ఏవియేటర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో విమాన శిక్షకులుగా 13 నుంచి 18 ఏళ్ల వారికి అవకాశం ఇస్తుంది. అయితే విమానం నడపేందుకు లైసెన్స్ మాత్రం 16 ఏళ్లు నిండితేనే ఇస్తారు. కమోరా కూడా ఈ కార్యక్రమంలో 12 ఏళ్ల వయసు నుంచే విమానా పాఠాలు నేర్చుకుంది. యూనైట్ యూత్ ఏవియేషన్ అధికారుల మాత్రం ఆమెకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడూ విమానం నడిపేందుకు అంగీకరించంది. చాలా చకచక వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం, కాక్పీట్లో ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయాలపై అవగాహన ఏర్పరచుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు బెల్జియన్ సంతతి బ్రిటిష్ జాతీయుడు రూథర్ఫోర్డ్పై పేరిట ఉంది. ఆయన కేవలం 15 ఏళ్ల వయసులోనే పైలట్గా విమానం నడిపే లైసెన్స్ పొందాడు. ఇక కమోరా ఆ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. పైగా న్యూయార్క్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలైన పైలట్గా ఘనత సాధించింది. అంతేగాదు రూథర్ఫోర్డ్ మాదిరిగానే రెండు గంటల క్రాస్ కంట్రీ సోలో ఫ్లైట్ను కూడా పూర్తి చేసింది. ఈ మేరకు కమోరా మాట్లాడుతూ..ఈ ఘనత సాధించినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఏదీ అసాధ్యం కాదని నమ్మండి. సాధించాలనే తప్పన ఉంటే ఎంతటి అడ్డంకినైనా అధిగమించొచ్చు అని పేర్కొంది కమోరా. ఇక్కడ కమోరా డ్రైవింగ్ లైసెన్స్ కంటే ముందే పైలట్గా లైసెన్స్ పొందడం విశేషం View this post on Instagram A post shared by United Youth Aviators (@united_youth_aviators) (చదవండి: ఇలాంటి తల్లలు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..) -
Sharmila Yadav: డ్రోన్ దీదీ
హరియాణాకు చెందిన షర్మిల యాదవ్ పెద్ద చదువులు చదువుకోవాలని కల కన్నది. అయితే ఇంటర్మీడియేట్ పూర్తికాగానే ‘ఇక చాలు’ అన్నారు తల్లిదండ్రులు. పెళ్లి అయిన తరువాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలైనప్పటికీ షర్మిలకు చదువుపై ఉన్న ఇష్టం మాత్రం పోలేదు. ‘డ్రోన్ సిస్టర్’ ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుసుకున్న షర్మిల ట్రైనింగ్ కోర్సులో చేరింది. ఫస్ట్ టెస్ట్లో ఫెయిల్ అయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ‘మరో ప్రయత్నం చెయ్యి’ అని ప్రోత్సహించారు. సెకండ్ టైమ్ టెస్ట్ పాస్ అయిన షర్మిల ఇప్పుడు సర్టిఫైడ్ డ్రోన్ పైలట్గా గుర్తింపు పొందింది. ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మాస్టరింగ్ కంట్రోల్స్, హైట్ అండ్ స్పీడ్ రీడింగ్, స్మూత్ టేక్–ఆఫ్, ల్యాండింగ్స్...మొదలైన సాంకేతిక విషయాలపై అవగాహన ఏర్పర్చుకుంది. ఇప్పుడు ఆమెను అందరూ ‘డ్రోన్ దీదీ’ అని పిలుస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో డ్రోన్ పైలట్గా చేతి నిండా పనితో మంచి ఆదాయన్ని అర్జిస్తోంది. వ్యవసాయ భూముల్లో షర్మిల యాదవ్ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
విమానంలో మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్
విమానం గాల్లో ఉండగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పైలెట్ డెలివరీ చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న వీట్జెట్కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఎంతో ధైర్యంగా. సమయస్పూర్తితో వ్యవహరించి గర్భిణీకి పురుడు పోసినపైలెట్ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. వివరాలు.. వీట్ జెట్కు చెందిన విమానం తైపీ(తైవాన్) నుంచి థాయ్లాండ్లోని బ్యాంకాక్ వెళ్తోంది. విమానంలో ఓ గర్భిణి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బాత్రూమ్లో ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన సిబ్బంది విషయాన్ని పైలట్ జకరిన్ సరార్న్రక్స్కుల్కు తెలియజేశారు. విమానం ల్యాండింగ్కు కూడా సమయంలో ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కెప్టెన్ జకరిన్ తన బాధ్యతలను కో పైలట్కు అప్పగించి కాక్పిట్ నుంచి బయటకు వచ్చాడు. విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అడిగాడు. కానీ సమయానికి వైద్యులు కూడా లేకపోవడంతో వేరే మార్గం లేక తానే రంగంలోకి దిగాడు. మొబైల్ ద్వారా వైద్యులను సంప్రదించి.. వారి సూచనలతో మహిళకు పురుడు పోశాడు. ఇదంతా గమనించిన విమానంలోని ప్రయాణికులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. క్లిష్ట సమయంలో ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించిన పైలెట్ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. అనంతరం విమానం ల్యాండ్ అయ్యాక తల్లి, శిశువును ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బిడ్డకు ముద్దుగా స్కై బేబబీ’ అని పేరు పెట్టారు. మరోవైపు 18 ఏళ్లుగా పైలట్గా వ్యవహరిస్తున్న జాకరిన్ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు. చదవండి: గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్కు.. అంతలోనే -
Indigo: పైలట్ కళ్లలోకి లేజర్ లైట్.. గాల్లో 171 మంది ప్రాణాలు
కోల్కతా: బెంగళూరు నుంచి కోల్కతా వచ్చిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోల్కతాకు చేరుకుని ల్యాండింగ్కు సిద్ధమైన సమయంలో అప్రోచ్ ఫన్నెల్ నుంచి విమానం కాక్పిట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్ వేశారు. ఈ కిరణాలు పైలట్ కళ్లలో పడ్డాయి. ఈ నెల 23న రాత్రి 7.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసేపట్లో ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన ఆపరేషన్ చేస్తున్న సమయంలో పైలట్ కళ్లలో లేజర్ లైట్ పడటంతో అతడి కళ్లు కాసేపు కనిపించలేదు. దీంతో విమానం రన్ వే వైపు నిమిషానికి 1500 నుంచి 2000 అడుగుల వేగంతో కిందకు దూసుకువచ్చింది. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్యాసింజర్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. చివరకు విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఇలాంటి ఘటనలు జరిగినపుడు విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ ఆకాశంలోకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇండిగో సంస్థతో పాటు నేతాజీ సుభాష్చంద్రబోస్ ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టేక్ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో పైలట్ల దృష్టి మరలితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. గూడ్సు రైలు కలకలం.. డ్రైవర్ లేకుండానే ముందుకు వెళ్లి -
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో విభేదాలు
-
పైలట్ తప్పిదం.. రన్వే అనుకొని నదిపై ల్యాండ్ అయిన విమానం
రష్యాలో ఘోర ప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం రన్వే అనుకొని పొరపాటున గడ్డకట్టిన నదిపై ల్యాండ్ అయ్యింది. అయితే నదిలోని నీరంతా పూర్తిగా గడ్డుకట్టుకుపోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జగరలేదు. ఈ ఘటన జిర్యాంగ ఎయిర్పోర్టు సమీపంలో జరిగింది. వివరాలు.. పోలార్ ఎయిర్లైన్స్కు చెందిన సోవియెట్ కాలం నాటి ఏఎన్-24 విమానం రష్యాలోని యాకుత్స్క్ నుంచి గురువారం బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం జిర్యాంక ఎయిర్పోర్టులో దిగాల్సి ఉంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మానాశ్రయంలోని రన్వేపై మంచు పేరుకుపోయింది. విపరీతమైన మంచు కారణంగా పక్కనే నది కూడా గడ్డకట్టి ఉంది. దీంతో పైలట్ గందరగోళానికి గురై ఎయిర్పోర్టు సమీపంలోని కోలిమా నదిపై విమానాన్ని ల్యాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలట్ తప్పిదం కారణంగానే విమానం నదిపై ల్యాండ్ అయ్యిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గడ్డకట్టిన నదిపై విమానం ల్యాండ్ అవడం, అందులోని ప్రయాణికులను బయటకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. The AN-24 aircraft of Polar Airlines was flying on the route #Yakutsk - Zyryanka - Srednekolymsk. But, having arrived at Zyryanka airport, it landed on Kolyma river. There were 30 passengers and 4 crew members on board. No one was injured and the aircraft was not damaged.… pic.twitter.com/MFM85AKSJ6— WarMonitoreu (@WarMonitoreu) December 28, 2023 -
డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్
నాగ్పూర్: ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేసే సిక్కు పైలట్ ఆనంద్సింగ్ డ్యూటీలో తన వెంట కిర్పన్(చిన్నకత్తి)ని తీసుకెళ్లేందుకు అనుమతివ్వాలని కోర్టుకెక్కారు. కిర్పన్ను క్యారీ చేయడం సిక్కు సంప్రదాయంలో ఒక భాగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద కిర్పన్ తీసుకెళ్లడం తన ప్రాథమిక హక్కు అని నాగ్పూర్ హైకోర్టు బెంచ్ ముందు వేసిన పిటిషన్లో తెలిపారు. ఈ మేరకు తనకు అనుమతిచ్చేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని పైలట్ కోరారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ నితిన్ సాంబ్రే, అభయ్ మంత్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రప్రభుత్వంతో పాటు ఇండిగో ఎయిర్లైన్స్కు నోటీసులు పంపింది. ‘విమానాల్లో కిర్పన్ను తీసుకెళ్లడానికి ప్రయాణికులకు అనుమతిస్తూ విమానయాన శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులకు మాత్రం కిర్పన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని అందులో తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి విరుద్ధం’ అని పైలట్ న్యాయవాది చెప్పారు. సంప్రదాయంలో భాగంగా సిక్కులు ధరించే వాటిలో కిర్పన్ కూడా అతి ముఖ్యమైనది. చిన్న సైజులో ఉన్న కిర్పన్ను సిక్కులు తమ వెంటే ఉంచుకుంటారు. ఇదీచదవండి..గణతంత్ర వేడుకలకు బైడెన్ దూరం.. కారణం అదేనా? -
కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు?
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తేలగా, కొన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు గెలుపు ఓటములు రెండూ కాంగ్రెస్కు కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి. గత కొన్నేళ్లుగా రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరుకు పునాది సీఎం కుర్చీ. ప్రస్తుత ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రాజస్థాన్లో ఒకవేళ కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరోమారు ముఖ్యమంత్రి పదవి కోసం యుద్ధం మొదలుకానున్నదని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే మరోసారి 2018 ఎన్నికల ఫలితాల తరహా పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు పార్టీలోని ఒక వర్గం సచిన్ పైలట్కు మద్దతు ఇచ్చింది. అయితే పార్టీలో అశోక్ గెహ్లాట్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మరోమారు సీఎం అయ్యే అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆయన రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండాలనే ఆప్షన్ను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆ దిరిమిలా 2020లో సచిన్ పైలట్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్పై ఒత్తిడి తెచ్చి, తిరుగుబాటుకు దిగారు. ఈ నేపధ్యంలో పైలెట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ గెహ్లాట్, పైలట్ల మధ్య టెన్షన్ కాస్త తగ్గినట్లు కనిపించినా, ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడం ఖాయం అని పలువురు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలైనా గెహ్లాట్-పైలట్ అంశం కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అప్పుడు ఆటంతా ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తిరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోతే.. పార్టీ మళ్లీ వారిని బుజ్జగించే పని చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కాంగ్రెస్కు 86 నుంచి 106 సీట్లు వస్తాయని, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి. ఇది కూడా చదవండి: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం -
ట్రాఫిక్లో పైలట్.. ఫ్లైట్ లేట్..! వీడియో వైరల్
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణను తప్పుపట్టారు. ఇందుకు సంబంధించి శర్మ తన ఎక్స్ ఖాతాలో తాజాగా జరిగిన సంఘటన గురించి షేర్ చేశారు. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 29న చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన 6ఈ 5149 నంబర్ ఇండిగో విమానం దాదాపు గంటకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. ఇది షెడ్యూల్ ప్రకారం రాత్రి 8:00 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాత్రి 9:55 గంటలకు ముంబై చేరుకోవాలి. అయితే గూగుల్ ఫ్లైట్స్ డేటా ప్రకారం దాదాపు నాలుగు గంటలు ఆలస్యం అవుతుందని సూచిస్తూ విమాన బయలుదేరే సమయం నవంబర్ 30 ఉదయం 12:10కు మారింది. అప్పటికే అందులో ఎక్కిన ప్రయాణికులు దాదాపు 180 మంది ఆందోళన చేపట్టారు. వెంటనే సమస్యకు చర్య తీసుకోవాలని కోరినా మేనేజ్మెంట్ సరిగా స్పందించలేదని ఆయన తెలిపారు. ఆ ప్రయాణికుల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. అయితే వారిని వేరే విమానం ఎక్కిస్తామని నమ్మించి మళ్లీ సెక్యూరిటీ వింగ్కు తరలించినట్లు చెప్పారు. విమానం ఆలస్యం అయినందుకు కారణం అడుగుతున్న ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడంటూ ఇండిగో సిబ్బంది సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ తెలిపారు. ఇండిగో సీనియర్ అధికారితో మాట్లాడాలని కోరుతూ ఎయిర్లైన్ గ్రౌండ్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన వీడియోలను శర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. Dear @IndiGo6E first you made us wait in the bus for 50 minz, and now your team is saying pilot is stuck in traffic, what ? Really ? we supposed to take off by 8 pm n it’s 9:20, still there is no pilot in cockpit, do you think these 180 passengers will fly in indigo again ? Never… — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 ఇదీ చదవండి: సెల్ఫ్మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ 2023 లిస్ట్ విడుదల.. ఆయనే టాప్.. ‘ప్రియమైన ఇండిగో, మీరు మమ్మల్ని బస్సులో 50 నిమిషాలు వేచి ఉండేలా చేశారు. ఇప్పుడు మీ సిబ్బంది.. పైలట్ ట్రాఫిక్లో చిక్కుకున్నాడని అంటున్నారు. మేము రాత్రి 8 గంటలకు బయలుదేరాలి. ప్రస్తుతం రాత్రి 9:20 అవుతుంది. ఇప్పటికీ కాక్పిట్లో పైలట్ లేడు. ఈ 180 మంది ప్రయాణికులు మళ్లీ ఇండిగోలో ప్రయాణిస్తారని అనుకుంటున్నారా?’ అంటూ తన పోస్ట్లో తెలిపారు. Now they r de boarding all the passengers n saying we will send you in another aircraft but again we have to go back to terminal for security check 👏👏👏👏👏 #indigo👎 pic.twitter.com/NdqbG0xByt — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 People r suffering bcoz of you @IndiGo6E lying lying n lying, there r some old passengers on wheel chairs, not in a very good health condition. Shame on you #indigo 👎 pic.twitter.com/87OZGcUlPU — Kapil Sharma (@KapilSharmaK9) November 29, 2023 -
గుండెపోటుతో ఎయిర్ ఇండియా పైలట్ మృతి.. 100 రోజుల్లో మూడో ఘటన
న్యూఢిల్లీ: ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో మృత్యుతపడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఓ యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్ హిమ్మనీల్ కుమార్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పైలట్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సీనియర్ కమాండర్ పైలట్ అయిన హిమ్మనీల్ కుమార్, పెద్దవైన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లను ఆపరేట్ చేసేందుకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఆగస్టు 23న జరిగిన వైద్య పరీక్షల్లో ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆయన మరణించడంపై ఎయిర్ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు నెలలో ముగ్గురు పైలట్లు మృతువాతపడ్డారు. గత ఆగస్టులో ఇండిగో ఎయిర్లైన్కి చెందిన పైలట్ పూణేకు విమానం టేకాఫ్ అయ్యే ముందు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయాడు. అతడికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేకపోయారు. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న స్పైస్జెట్ కెప్టెన్ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తుండగా విమానంలోనే మరణించాడు. చదవండి: సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు.. -
యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!
YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్లో ఫ్లైయింగ్ బీస్ట్గా ఫిట్నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్ఇన్ పోస్ట్తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్గా మారాయి. ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా ♦ 2008లో ఐఐటీ ఖరగ్పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా. ♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్ఎల్బీ చేస్తున్నాడు. ♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు . ♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన. ♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు I was terminated from airasia for raising safety issues! Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye — Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020 కాగా 2020జూన్లో AirAsia ఇండియా గౌరవ్ను పైలట్గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్గా, యూట్యూబర్గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్మీడియాలో పాపులర్ స్టార్గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్లో 80 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు, ట్విటర్లో దాదాపు 900k, ఇన్స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. -
నిజం కాబోతున్న సినిమా కథ.. ప్రాణాలకు ముప్పు తప్పదా?
సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. మన నిజ జీవితంలో జరగని వాటిని ఎక్కువగా సినిమాల్లో చూస్తూంటాం. ఎంజాయ్ చేస్తుంటాం. కమర్షియల్ చిత్రాలు కాకుండా మనం ఆశ్చర్యపోయేలా కొన్ని మూవీస్ వస్తుంటాయి. టెక్నాలజీ స్టోరీతో తీసే చిత్రాలన్నీ ఈ కేటగిరీలో ఉంటాయని చెప్పొచ్చు. అలా అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం ఓ హాలీవుడ్ మూవీ వచ్చింది. ఇందులోని స్టోరీని పోలినట్లు.. రియల్ లైఫ్ లో ఓ సంఘటన జరిగింది. ఇక్కడవరకు బాగానే ఉంది కానీ ఓ విషయం మాత్రం కాస్త భయపెడుతోంది. మన జీవితంలో టెక్నాలజీ అనేది ఇప్పుడు భాగమైపోయింది. ఫోన్, ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరగట్లేదు. ఇక ఈ మధ్య ఏఐ (కృత్రిమ మేధ) అని కొత్తగా వచ్చింది. మనిషి అవసరం లేకుండా ఇది అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అయితే దీనివల్ల ప్రస్తుతానికైతే అంతా బాగానే నడుస్తోంది. కానీ భవిష్యత్తులో ఇలానే ఉంటుందా లేదా అనేది చూడాలి. సరే ఇదంతా పక్కనబెడితే అసలు విషయానికొచ్చేద్దాం. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్లో నిజమెంత?) 2005లో హాలీవుడ్లో 'స్టెల్త్' అనే సినిమా తీశారు. ఈ స్టోరీలో భాగంగా విమానాన్ని నడిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని తయారు చేస్తారు. దాన్ని యుద్ధ రంగాలోకి పంపిస్తారు. కానీ సిస్టమ్లో అనుకోని పొరపాట్ల వల్ల టార్గెట్తో పాటు సొంత మనుషులపైనా ఇది దాడి చేసి చంపేస్తుంది. చివరకు దీన్ని ఎలా ఆపారనేది సినిమా స్టోరీ. అయితే తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీ వాళ్లు.. ఏఐతో నడిచే కో-పైలెట్ని సృష్టించారు. సాధారణంగా ఓ విమానంలో ఇద్దరూ పైలెట్స్ ఉంటారు. ఒకవేళ ఏఐ పైలెట్ అందుబాటులోకి వస్తే.. ఓ మనిషి అవసరం తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ 'స్టెల్త్' సినిమాలో జరిగినట్లు ఏఐ పైలెట్ ఏమైనా రివర్స్ అయితే మాత్రం ఘోర ప్రమాదం తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
యుద్ధ విమాన పైలెట్గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!
ఇటీవలే చంద్రముఖి-2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తేజస్. వైమానిక దళం పైలట్గా ఈ చిత్రంలో కంగనా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తాజాగా తేజస్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇవాళ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. (ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!) ట్రైలర్ చూస్తే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్లో కంగనా రనౌత్ని శక్తివంతమైన వైమానిక దళ పైలట్గా కనిపించారు. ఈ చిత్రంలో దేశం కోసం పోరాడుతూ వైమానిక దళంలో పని చేస్తున్న కంగనా వైమానిక యుద్ధ విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రవాదంపై పోరాడే కథనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఈ చిత్రాన్ని సర్వేశ్ మెవారా దర్శకత్వంలో రూపొందించగా.. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ యుద్ధ విమానాన్ని పైలెట్ గాలిలో ఎలా వదిలేశాడు? నిజంగా ఏం జరిగింది?
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ జెట్ ఎఫ్-35 గత ఆదివారం తప్పిపోయింది. ఒక రోజు తర్వాత దాని ఆచూకీ లభ్యమయ్యింది. ఈ విషయాన్ని మిలటరీ అధికారులు ధృవీకరించారు. ఫైటర్ జెట్ అదృశ్యమైన తర్వాత దానిని కనుగొనేందుకు స్థానికులు సాయం చేయాలని సంబంధిత అధికారులు కోరారు. సౌత్ కరోలినాలోని నార్త్ చార్లెస్టన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన తరువాత దాని జాడ తెలియరాలేదు. నివేదిక ప్రకారం విమానం ఎగురుతున్నప్పుడు దానిలో లోపం తలెత్తగా పైలట్ దానిని ఎజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఫైటర్ జెట్ నుండి పైలట్ తనను తాను ఎజెక్ట్ చేసినప్పుడు, అతను యుద్ధ విమానాన్ని ఆటో-పైలట్ మోడ్లో ఉంచాడు. విమానం నుంచి బయటకు వచ్చిన పైలట్ను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అదే సమయంలో గాలిలో ఎగురుతున్న రెండవ ఎఫ్-35 సురక్షితంగా స్థావరానికి తిరిగి వచ్చింది. సైనిక అధికారులు అదృశమైన యుద్ధవిమాన శకలాలను గుర్తించారు. 100 మిలియన్ డాలర్ల విలువైన విమానానికి సంబంధించిన శకలాలు గ్రామీణ విలియమ్స్బర్గ్ కౌంటీలో లభ్యమైనట్లు మిలిటరీ అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికతరహాలోని అమెరికాకు చెందిన మొట్టమొదటి స్టెల్త్ ఫైటర్ జెట్ విమానం. ఈ విమానం రహస్య మిషన్లను అత్యంత వేగంగా పూర్తి చేయగలదు. ఈ ఫైటర్ జెట్ పూర్తి పేరు ఎఫ్-35 లైట్నింగ్ 2. ఇది ఆల్-వెదర్ స్టీల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఈ యుద్ధ విమానం అదృశ్యమైనప్పుడు, దాని భాగాలు అమెరికా శత్రు దేశాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందారు. విమానాన్ని కనుగొనడంలో స్థానికుల సహాయాన్ని కోరుతూ, జాయింట్ బేస్ చార్లెస్టన్ ట్విట్టర్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అయితే అతని విజ్ఞప్తి అనంతరం అతనిపై ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఈ సంఘటన ఇంకా విచారణలో ఉంది. దర్యాప్తు ప్రక్రియ సమగ్రతను కాపాడటానికి మేము అదనపు వివరాలను అందించలేకపోతున్నామని తెలిపారు. BREAKING: The pilot ejected out of the $100 million F-35 jet that went missing due to "bad weather" according to the pilot (allegedly). One of the most advanced fighter jets in the world crashed because of bad weather... they think you are dumb. “He’s unsure of where his plane… pic.twitter.com/PNZShVok3M — Collin Rugg (@CollinRugg) September 20, 2023 కాగా ఎఫ్-35 జెట్ యుద్ధ విమానం ఖరీదు 100 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో 830 కోట్ల రుపాయలు. పైలెట్ తెలిపిన వివరాల ప్రకారం అననుకూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. పైలెట్ తాను నడుపుతున్న విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేక పోయాడని, ఈ విషయాన్ని అతను చార్లెస్టన్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాల్లో చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలియజేసింది. కాగా అంతకుముందు ఆగస్టు చివరి వారంలో అమెరికాకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఆగస్టు 27న ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న టీవీ దీవుల్లో శిక్షణ సమయంలో విమానం కూలి ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించారు. అంతకుముందు యూఎస్ మెరైన్ కార్ప్స్ ఎఫ్/A-18 హార్నెట్ ఫైటర్ జెట్ పైలట్ శాన్ డియాగో సమీపంలో ప్రమాదంలో మరణించాడు. ఇది కూడా చదవండి: మెన్స్ అండర్వేర్ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి? -
పాక్ బాంబు దాడికి బలైన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది?
ఆయన గుజరాత్ రెండో ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ పితామహునిగానూ పేరొందారు. ఆయనే బల్వంత్ రాయ్ మెహతా. భారత్- పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికుల చేతిలో హతమైన ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతి గడించారు. 1965వ సంవత్సరంలో ఆయన మరణించారు. 1965, సెప్టెంబరు 19 న ఇండో-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో నాటి గుజరాత్ సీఎం బల్వంత్రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ బీచ్క్రాఫ్ట్ భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లోని కచ్ మీదుగా వెళుతోంది. ఈ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం సీఎం ప్రయాణిస్తున్న ఛాపర్పై బాంబు దాడి చేసింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు మరో ఏడుగురు మరణించారు. వీరిలో ఆయన భార్య సరోజ్బెన్, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారు. ఆ రోజు సీఎం బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న ఛాపర్ మిథాపూర్ నుండి కచ్కి బయలుదేరిన వెంటనే, దానిని పాకిస్తాన్ ఫైటర్ పైలట్ కైస్ హుస్సేన్ అడ్డగించాడు. పాకిస్తాన్ ఛాపర్ అడ్డగించడం చూసిన భారత పైలెట్ బీచ్క్రాఫ్ట్ ఫ్యాన్ రెక్కలను కదిలించాడు. ఇది దయ చూపించి, విడిచిపెట్టాలని కోరుతూ చేసిన సూచన. అయితే అప్పటికి పాక్ పైలట్ గాలిలోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. అవి బల్వంత్ రాయ్ మెహతా ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను తాకాయి. అంతే.. హఠాత్తుగా బీచ్క్రాఫ్ట్ పేలిపోయి, నేల మీదకు ఒరిగిపోయింది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం 25 ఏళ్ల వయసు కలిగిన పాకిస్తాన్ పైలెట్ హుస్సేన్ ఆ రోజు 20 వేల అడుగుల ఎత్తులో తన ఛాపర్తో భారత గగనతలంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నాటి గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న బీచ్క్రాఫ్ట్ను గుజరాత్ ప్రభుత్వ చీఫ్ పైలట్ జహంగీర్ నడుపుతున్నారు. ఆయన భారత వైమానిక దళంలో పైలట్, కో-పైలట్గా పనిచేశారు. ఈ ఘటన జరిగిన 46 ఏళ్ల తర్వాత పాక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ పైలెట్ హుస్సేన్ ఒక లేఖలో దివంగత సీఎం బల్వంత్ రాయ్ మెహతా కుమార్తెకు క్షమాపణలు తెలిపారు. ఈ లేఖకు ఆమె సమాధానమిస్తూ, తాను తన తండ్రి హంతకుడిని క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్కు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా 1963 జూన్ నుండి 1965 సెప్టెంబర్ 1965 వరకు పదవిలో ఉన్నారు. ఇది కూడా చదవండి: సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు? -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు చేతులూ లేవు..పైలట్గా రికార్డ్! ఈమె గురించి తెలిస్తే, గూస్బంప్స్ ఖాయం!
The Success Story Jessica Cox శరీరంలో ఏదైనా ఒక అవయవ లోపం ఉంటేనే కృంగిపోతారు చాలామంది. కానీ కొందరు మాత్రం ఎలాంటి లోపం ఉన్నాదాన్ని చాలెంజ్గా స్వీకరిస్తారు. అద్బుతమైన కృషితో పట్టుదలతో తామేంటే నిరూపించుకుంటారు. అలా రెండు చేతులు లేకపోయినా పైలట్గా రాణిస్తోంది. జెస్సికా ప్రపంచంలోనే తొలి చేతులు లేని లైసెన్స్ పొందిన తొలి పైలట్గా చరిత్ర సృష్టించింది.వండర్ విమెన్ అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. అరుదైన పుట్టుకతో వచ్చే లోపం కారణంగా జెస్సికాకు పుట్టుకతోనే నుండే రెండు చేతులు లేవు. అయినా ఆమె తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు.అలాగే జెస్సికా కూడా రెండు చేతులు లేకపోయినా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. లేని చేతుల గురించి బాధపడుతూ కూర్చోలేదు. తన రెండు కాళ్లే చేతులుగా మార్చుకుంది.రెండు కాళ్లతో సాధారణ ప్రజలు ఎలాంటి పనులు చేసుకుంటారో అంతే సునాయాసంగా తానూ అలవాటు చేసింది. కొన్నాళ్లపాటు కృత్రిమ చేతులు ధరించినా ఆ తరువాత వాటిని కూడా తీసివేసింది. అరిజోనాలోని సియెర్రా విస్టాలో 1983లో జన్మించిన జెస్సికా తన పాదాలతో తన జీవితాన్ని గడపడం నేర్చుకుంది. చిన్నతనంలో, ఆమె తన సొంత పట్టణంలో నృత్యం అభ్యసించింది. 14 సంవత్సరాలు నృత్యం కొనసాగించింది. (ఉద్యోగానికి అప్లయ్ చేస్తే.. ఇదేందయ్యా ఇది, ఎక్కడా సూడ్లా!) 22 ఏళ్ల వయసులో పైలెట్గా శిక్షణ పొందింది. లెట్గా శిక్షణ పొందింది.కేవలం మూడు సంవత్సరాల్లో పైలెట్గా పూర్తి చేసింది. అంతేకాదు ఈత కొట్టడం, డ్రైవింగ్ చేయడం (కారు), విమానం నడపడంలో ప్రావీణ్యం సంపాదించింది. 2008, అక్టోబరు 10న జెస్సికా తన పైలట్ సర్టిఫికేట్ను పొందింది. ఆమె 10,000 అడుగుల ఎత్తులో తేలికపాటి క్రీడా విమానాన్ని నడిపేందుకు అర్హత పొందింది.2004లో, జెస్సికా మొదటిసారిగా రైట్ ఫ్లైట్ ద్వారా సింగిల్ ఇంజిన్ విమానాన్ని నడిపింది. రెండు ముఖ్యమైన అవయవాలు లేనప్పటికీ టైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్లను కూడా సంపాదించింది. 2019లో, కాక్స్ నాల్గవ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించింది. అమెరికన్ టైక్వాండో అసోసియేషన్లో బ్లాక్ బెల్ట్ సంపాదించిన చేతులు లేని తొలి వ్యక్తి. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) జెస్సికా కాక్స్ అచీవ్ మెంట్స్ ♦ జెస్సికా యునైటెడ్ స్టేట్స్లోని అరిజోనా విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ♦బ్రాండ్లారేట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ పర్సనాలిటీ అవార్డు ♦AOPA LIVE పైలట్స్ ఛాయిస్ అవార్డ్ 2010: జెస్సికా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మహిళా ఏవియేటర్గా మారింది. ♦ఫిలిపినో ఉమెన్స్ నెట్వర్క్: 2009లో అమెరికాలో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన ఫిలిపినో మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ♦ది సక్సెస్ స్టోరీ జెస్సికా కాక్స్ 2009లో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్లో కూడా పబ్లిష్ అయింది. ఇదీ చదవండి: క్షీణిస్తున్న బంగారం, వెండి ధరలు: ఈ వివరాలు చూడండి! ♦ ఫిలిపినో అమెరికన్ జర్నల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ , 2008లో అత్యుత్తమ ఫిలిపినో అవార్డు లభించింది. ‘♦ ‘వైకల్యం అంటే అసమర్థత కాదు" అని రైట్ఫుటెడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మిషన్ను ప్రచారం చేయడానికి తాను విమానాన్ని ఉపయోగిస్తానని ఆమె పేర్కొంది ♦ 2015లో కాక్స్ తన జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా స్వంత సవాళ్లను అధిగమించడానికి ప్రజలను ప్రేరేపించేలా డిసార్మ్ యువర్ లిమిట్స్ అనే పుస్తకాన్ని రచించారు. దాదాపు 26 దేశాల్లో మోటివేషనల్ స్పీకర్ కూడా -
చేతివాచీని పోగొట్టుకున్న పైలట్.. ఐదు నిముషాల్లో దక్కిందిలా!
హనా మొహ్సిన్ ఖాన్ అనే కమర్షియల్ పైలట్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తన రిస్ట్వాచీని పోగొట్టుకున్నారు. అయితే దానిని సురక్షితంగా అందజేసిన ఎయిర్పోర్టు సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు. హనా మొహ్సిన్ ఖాన్ దుబాయ్ నుంచి తిరుగు ప్రయాణంలో విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపును సందర్శించారు. భద్రతా తనిఖీ సమయంలో తన చేతి గడియారాన్ని తీసినప్పుడు.. అక్కడే మరచిపోయారు. కొద్దిసేపటి తరువాత తన గడియారం మిస్సయిన సంగతి గ్రహించారు. తన గడియారం పోయినట్లేనని, ఇక దొరకదని మొదట్లో అనుకున్నారు. అయితే మిస్సయిన చేతివాచీ కోసం ఒకసారి ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో ఆమె దుబాయ్లోని గ్రౌండ్ స్టాఫ్ను సంప్రదించారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్కి ఈ-మెయిల్ పంపారు. ఈ నేపధ్యంలో ఆ డిపార్ట్మెంట్ బృందం ఆమె రిస్ట్వాచీని కనుగొంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆమె తన వాచీని తిరిగి తీసుకోగలిగారు. దీంతో లాస్ట్ అండ్ ఫౌండ్ డిపార్ట్మెంట్ బృందాన్ని ఆమె అభినందించారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె తన పోస్ట్ను ముగించారు. ఈ పోస్టును చూసిన యూజర్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తాము మిస్సయిన, తిరిగి పొందిన వస్తువుల గురించిన వివరాలను షేర్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్తో 14 ఏళ్ల బాలుడు మృతి! Last month while operating a Dubai back flight I had gone to the duty free. During the security check I had taken my watch off and forgot to pick it up. I had thought it was forever lost when I was flying back and discovered that I no longer had it. I contacted my ground staff in… pic.twitter.com/GDP2vpBcsO — Hana Mohsin Khan | هناء (@girlpilot_) September 4, 2023 -
30 వేల అడుగుల ఎత్తులో స్పెషల్ రాఖీ వేడుక: వీడియో వైరల్
రక్షా బంధన్ అనేది తోబుట్టువుల మధ్య ప్రత్యేకమైన బంధానికి సంబంధించిన వేడుక. ఈ శుభ సందర్భాన్ని దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే చాలా మంది సోదర సోదరీమణులు ఒకరికొకరు ఈ రోజు కలవడం కుదరకపోవచ్చు. వృత్తి పరమైన ఇబ్బందులతోపాటు అనేక కారణాల రీత్యా తమ సోదరులను మిస్ అవుతూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ పండుగ రోజున అనూహ్యంగా కలుసుకొని, రాఖీ వేడుక చేసుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభకు అలాంటి అదృష్టం వరించింది. ఇండిగో విమాన పైలట్గా ఉన్న తన సోదరుడు గౌరవ్తో కలిసి రక్షాబంధన వేడుక జరుపుకోవడం ముచ్చటగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. (రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో) విమానం టేకాఫ్కి ముందు ప్రయాణికులకు శుభ ప్రత్యేక ప్రకటనతో వీడియో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక క్షణాలను జరుపుకోవడం అన్ని సార్లూ సాధ్యపడదు. ముఖ్యంగా మాకు..ఎందుకంటే మీ ప్రియమైన వారితో కలిసి వేడుకు జరపుకునేలా మిమ్మల్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లడం ముఖ్యం కాబట్టి అంటూ ఫ్లైట్ ఇంటర్ఫోన్ సిస్టమ్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నాకు అన్నకెప్టెన్ గౌరవ్కు చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఏళ్ల తర్వాత కలిసి రక్షా బంధన్ జరుపుకుంటున్నాం అని ప్రకటించారు. అందరి అన్నాచెల్లెళ్లలాగానే మేమూ కొట్టుకుంటాం,తిట్టుకుంటాం,నవ్వుకుంటాం..ఏడుస్తాం... కానీ నాకు మాత్రం నా అన్న రాక్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు పెద్ద ఆలంబన అంటూ అంటూ శుభ సోదరుడికి రాఖీ కట్టి, అన్న ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో ప్రయాణీకులు అందరూ ప్రయాణికులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. 30వేల అడుగల ఎత్తున ఉన్నా, భూమి మీద ఉన్న ఎక్కడున్నా బ్రదర్ అండ్ సిస్టం బాండింగ్ స్పెషల్ అంటూ ఈ వీడియోను ఇండిగో చేసిన ట్వీట్ చేసింది. At 30,000 feet or on the ground, the bond of a brother and sister remains special. A heartwarming moment on board today as our Check Cabin Attendant Shubha celebrates Rakhi with her brother Capt. Gaurav. #HappyRakshaBandhan2023 #HappyRakhi #goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/WoLgx8XoIa — IndiGo (@IndiGo6E) August 30, 2023 -
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘోరప్రమాదం తప్పింది
ఢిల్లీ: బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘోరప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్లైన్స్కే చెందిన రెండు విమానాలు ఒకే రన్వేలో ఎదురెదురుగా వచ్చాయి. కాస్తుంటే అవి రెండూ ఢీ కొట్టుకుని పెను విషాదం చోటు చేసుకునేది. అయితే ఓ విమానంలోని మహిళా పైలట్ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన విస్తారా విమానం.. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పర్యవేక్షణలో పార్కింగ్ బే వైపు చేరుకునేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ-బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) విస్తారా విమానానికి అదే రన్వే నుంచి టేకాఫ్కు అనుమతిచ్చారు. అయితే రెండు విమానాలు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అహ్మదాబాద్-ఢిల్లీ ఫ్లైట్లో ఉన్న కెప్టెన్ సోనూ గిల్(45) జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో.. ఘోర ప్రమాదం తప్పింది. ఆ వెంటనే టేకాఫ్ రద్దు చేసి.. ఢిల్లీ-బాగ్డోగ్రా విమానాన్ని తిరిగి పార్కింగ్ వైపు మళ్లించారు. రెండు విమానాల్లో కలిపి 300 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. అది ఈ మధ్యే ప్రారంభమైన రన్వే. ఒకవేళ ఆమె(సోనూ గిల్) గనుక అప్రమత్తం చేయకుండా ఉండి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఏటీసీ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని డీజీసీఏ(పౌర విమానయాన శాఖ) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు సంబంధిత అధికారిని విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది. A potentially catastrophic incident was narrowly averted at #Delhiairport on Wednesday morning when a #Vistara Airlines plane was cleared for take-off while another aircraft was in process of landing. The incident involved Flight UK725 en route from #Delhi to #Bagdogra,… pic.twitter.com/5GnT7RixLF — Thomas Nahar (@Thomasnahar_gfx) August 23, 2023 -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్లైన్స్లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్లైన్స్కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
ఆపరేషన్ డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు.. ఈ మూవీని డిసెంబర్ 8 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్పై ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలను చూపే యాక్షన్ మూవీ ఇది. శక్తి ప్రతాప్ సింగ్, అమిర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈ చిత్రకథ రాశారు. హిందీ, తెలుగులో రూపొందిస్తున్నాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నందకుమార్ అబ్బినేని. -
నేరుగా సముద్రంలోనే విమానం ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే
మార్సెయిల్(ఫ్రాన్స్): ఇంజిన్ వైఫల్యం చెందడంతో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్లో లోపం ఏర్పడింది. దీంతో, పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు. ‘ఫ్రెజుస్ బీచ్లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్లో అత్యవసర ల్యాండింగ్ వారికి అపాయం కలుగుతుందని పైలట్ భావించాడు. దీంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్ చేశాడు. ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి. అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది. -
తన్నులు తిన్న మహిళాపైలట్పై చర్యలు
ఢిల్లీ: ఇండిగోకు చెందిన ఓ మహిళా పైలట్ను, ఆమె భర్తను కొందరు చితకబాదిన వీడియో నిన్నంతా విపరీతంగా వైరల్ అయ్యింది. తమ ఇంట్లో పని చేసే పదేళ్ల చిన్నారిని వేధిస్తున్నారని, శారీరకంగా గాయపర్చానే కారణంతో ఆ చిన్నారి బంధువులే ఆ పని చేశారు. అయితే.. ఈ ఘటన వైరల్ కావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు పైలట్ను విధుల నుంచి పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. సదరు ఘటనపై దర్యాప్తు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో తాజాగా ఇది చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆ చిన్నారిని వాళ్లు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె భర్త కూడా అదే ఎయిర్లైన్స్లో పని చేస్తుండగా.. ఆయన విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ద్వారకా పోలీస్ స్టేషన్లో ఆ జంటపై కేసు నమోదు అయ్యింది. Injuries of the minor that she was beaten and brunt by the couple pic.twitter.com/jYVwWzbfTx — । अतुल । (@atulamist7) July 19, 2023 ఇదీ చదవండి: సెల్ఫోన్ వాడుతోందని తిడితే.. జలపాతంలో దూకింది -
షాకింగ్ వీడియో.. మహిళా పైలట్ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళా పైలట్తోపాటు ఆమె భర్తపై కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై చితకబాదారు. 10 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో దాడికి పాల్పడ్డారు. పైలట్ యూనిఫాంలో ఉన్న మహిళ, ఆమె భర్తను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లి మరీ కొట్టారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కాగా పైలట్ దంపతులు గత రెండు నెలల క్రితం ఓ మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకున్నారు. అంతేగాక ఆమెను వేధిస్తూ దారుణంగా కొట్టేవారు. ఈ విషయం తాజాగా బాలిక బంధువుకు తెలియడంతో ఆమె మిగతా బంధువులను, ఇరుగుపొరుగు వారిని పైలట్ నివాసం వద్దకు తీసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. గొడవ పెరిగడంతో మహిళ జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాకొచ్చి కొట్టారు. ఆమె భర్తపై కూడా దాడి చేశారు. తనను క్షమించాలని మహిళా పైలట్ వేడుకున్నా వినిపించుకోకుండా చితకబాదారు.చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పైలట్ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె ముఖం, కళ్ల మీద దాడి చేసిన గాయాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తన బంధువు ద్వారా ఉద్యోగంలో చేరిందని, ఆమె కూడా సమీపంలోని ఇంట్లో పని చేస్తుందని పేర్కొన్నారు. కాగా నిందితురాలైన మహిళా ప్రైవేటు ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నట్లు, తన భర్త మరో ప్రైవేటు విమానయాన సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. చదవండి: తండ్రితో గొడవ.. పిల్లలను చంపడానికి కారుతో గుద్దించేశాడు.. #WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi's Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her. The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z — ANI (@ANI) July 19, 2023 -
గాల్లో ఉండగా పైలట్కు అస్వస్థత..ఆ టైంలో 65 ఏళ్ల మహిళ..
ప్రమాదాలు అనుకోకుండా వస్తాయి. అయినా ఎవ్వరూ ఊహించం కదా అనారోగ్యానికి గురవ్వుతామని. సరిగ్గా అలాంటి సమయంలో మన పక్కను ఉన్నవాళ్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తే కొన్ని ప్రమాదాల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. అందుకు ఉదాహరణ ఆ బామ్మ. 2006లో జరిగిన ఓ ప్రమాద ఘటనలో ఆమె చేసిన సాహసం ఆమెను అందరిచే ప్రశంసలు అందుకునేలా చేసింది. వివరాల్లోకెళ్లే.. న్యూయార్క్లో వెస్ట్చెస్టర్ కౌంటీ నుంచి పైపర్ మెరిడియన్ మినీ విమానం వైన్యార్డ్కు బయలుదేరింది. ద్రాక్ష తోట సమీపంలోని రన్వేపై విమానం ల్యాండింగ్లో ఉండగా పైలట్(79) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానంలోని 65 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు సత్వరమే స్పందించి..ఆ విమానాన్ని అదుపు చేసే యత్నం చేసింది. ఐతే ఆమె సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేసే క్రమంలో విమానం ఓ వైపుకి రన్వే సమీపంలో కుప్పకూలింది. దీంతో విమానం ఎడమ రెక్క సగానికి విరిగిపోయింది. ఎమర్జెన్సీ రెస్క్యూ టీం వెంటనే అక్కడకు చేరుకుని పైలట్ తోపాటు, మహిళా ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించింది. ఐతే పైలట్ ఆరోగ్యం విషమంగా ఉనట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే సదరు మహిళ ప్రయాణికురాలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ మహిళ ఏ మాత్రం గాబరాపడినా సమస్యల్లో చిక్కుపోయింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగి వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. (చదవండి: ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే) -
డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు
జైపూర్: లండన్ నుండి ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ పైలెట్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందన్న కారణంతో ప్రయాణం మధ్యలోనే ప్రయాణికులను విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. లండన్ నుండి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని జైపూర్లో ల్యాండ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి విమానానికి క్లియరెన్స్ లభించినప్పటికీ ఎయిరిండియా పైలెట్లు తమ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సుమారు 350 మంది ప్రయాణికులను చాలాసేపు నిరీక్షణ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి తరలించారు. పైలెట్ల చర్యపైనా, ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా చిర్రెత్తిపోయిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు విజ్ఞప్తి చేస్తూ.. జైపూర్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తమను ఎదో ఒక విధంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK — Adit (@ABritishIndian) June 25, 2023 -
వయసు 18 వృత్తి పైలెట్
సాక్షి కొచ్చర్కు ఇప్పటి దాకా స్కూటర్ నడపడం రాదు. కారు నడపడం రాదు. కాని ఏకంగా విమానం నడపడం నేర్చుకుంది. ప్రస్తుతానికి యంగెస్ట్ కమర్షియల్ పైలెట్ రికార్డ్ సాక్షి పేరున ఉంది. సంకల్పించాను... సాధించాను అంటోంది సాక్షి. మన దేశంలో అత్యంత చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించిన రికార్డు మైత్రి పటేల్ పేరున ఉంది. ఆమె 19 ఏళ్ల లైసెన్స్ పొందింది. ఇప్పుడు 18 ఏళ్లకే సాక్షి కొచ్చర్ ఈ లైసెన్స్ పొంది మైత్రి రికార్డును బద్దలు కొట్టింది. సరిగ్గా ఆమె 18వ పుట్టిన రోజున ఈ లైసెన్స్ పొందడం విశేషం. పదేళ్ల వయసు నుంచే సాక్షి కొచ్చర్ది హిమాచల్ ప్రదేశ్కు ముఖద్వారం వంటిదైన పర్వాను టౌన్. అక్కడ తండ్రి లోకేష్ కుమార్ కొచ్చర్కు ఫుట్వేర్ వ్యాపారం ఉంది. పదేళ్ల వయసు నుంచి కుమార్తె పైలెట్ కావాలని కోరుకుంటూ ఉంటే అతడు ్ర΄ోత్సహిస్తూ వచ్చాడు. ‘పదో క్లాసు పరీక్షలు అయ్యాక నేను పైలెట్ కావాలని మళ్లీ ఒకసారి గట్టిగా చె΄్పాను. అయితే నాకు కామర్స్ లైన్లో చదవాలని ఉండేది. లెక్కలు పెద్దగా ఇష్టం లేదు. కాని పైలెట్ కావాలంటే ఎంపీసీ చదవాలని తెలిసి ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను’ అని చెప్పింది సాక్షి. ఇంటర్ అయిన వెంటనే ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో పీపీఎల్ (ప్రైవేట్ పైలెట్ లైసెన్స్)కు కావలసిన థియరీ క్లాసులను నాలుగున్నర నెలల పాటు చదవింది సాక్షి. ఈ క్లబ్లోనే కెప్టెన్ ఏ.డి.మానెక్ దగ్గర ఏవియేషన్ పాఠాలు నేర్చుకుంది మైత్రి పటేల్. సాక్షి కూడా కెప్టెన్ మానెక్ దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత సీపీఎల్ (కమర్షియల్ పైలెట్ లైసెన్స్) కోసం అమెరికా వెళ్లింది. 70 లక్షల ఖర్చు అమెరికాలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందాలంటే దాదాపు 70 లక్షలు ఖర్చు అవుతుంది. అయినా సరే సాక్షి కుటుంబం ఆ ఖర్చును భరించి సాక్షిని అమెరికా పంపింది. అక్కడ మూడు నెలల పాటు సాక్షి ట్రైనింగ్లో పాల్గొంది. ‘ఇన్స్ట్రక్టర్ సహాయంతో విమానం నడపడంలో ఒక రకమైన థ్రిల్ ఉంది. కాని ట్రైనింగ్లో భాగంగా మొదటిసారి సోలో ఫ్లయిట్ (ఇన్స్ట్రక్టర్ లేకుండా) ఒక్కదాన్నే విమానం నడిపినప్పుడు కలిగిన థ్రిల్, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ఆ క్షణం నా జీవితంలో అలాగే ఉండి ΄ోతుంది’ అని చెప్పింది సాక్షి. ‘అయితే పైలెట్ కావడం అనుకున్నంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉంటాయి. నా ట్రయినింగ్లో ఒకసారి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయింది. మరోసారి రేడియో ఫెయిల్ అయింది. నేను కంగారు పడకుండా అలాంటి సమయంలో ఏం చేయాలో అది చేసి సేఫ్ లాండింగ్ చేశాను’ అని తెలిపింది సాక్షి. పైలెట్గా ఉద్యోగం ‘మా ఊళ్లో నేను పైలెట్ అవుతానని అంటే మా బంధువులు చాలామంది ఎయిర్ హోస్టెస్ అనుకున్నారు. అమ్మాయిలు పైలెట్లు కావచ్చునని వారికి తెలియదు. ఇవాళ మన దేశంలో ఎక్కువమంది మహిళా పైలెట్లు ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. నాకు పైలెట్గా ఉద్యోగం రాగానే నా కోర్సు కోసం అయిన ఖర్చు మొత్తం అణాపైసలతో సహా మా అమ్మానాన్నలకు చెల్లిస్తాను’ అంది సాక్షి. ఇంత చిన్న వయసులో లైసెన్స్ పొందిన సాక్షికి ఉద్యోగం రావడం ఎంత సేపనీ. -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
డ్రోన్ పైలట్ అవుతారా? శిక్షణ కోర్సులు అందించనున్న ఎయిర్బస్
ముంబై: యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్బస్ భారత్లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్సులను అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఈ సర్టిఫికెట్ కోర్సులు అయిదు రోజుల పాటు ఉంటాయి. సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్బస్ ట్రైనింగ్ సెంటర్లో జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్ శిక్షణతో పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ పాఠాలు కూడా ఉంటాయని వివరించింది. 10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ఫిట్నెస్ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Palm Payment: ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ -
స్పైసీజెట్ పైలట్స్ కి గుడ్ న్యూస్
-
దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!..పాపం ఆ ప్రయాణికుడు..
విమానం గమ్యస్థానానికి చేరకోగానే ప్రయాణికులు దిగిపోవడం సర్వసాధారణం. ఐతే ఓ విమానంలో చివరిగా దిగుతున్న ప్రయాణికుడు దిగే సమయంలో సడెన్గా డోర్లు లాకయ్యాయి. ఆ విమానం తిరిగి మరో జర్నీకి రెడీ అవతుండగా అసలు విషయం బయట పడింది. పాపం ఆ ప్రయాణికుడుని బయటకు తీసుకొచ్చేందుకు పైలట్ కాక్పీట్ విండో గుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశయంలో శాక్రమెంటోకు వెళ్లే సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఓ ప్రయాణికుడు అనుకోకుండా ఇరుక్కుపోయాడు. నిజానికి సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ శాన్ డియాగో విమానాశ్రయం చేరుకోగానే ప్రయాణికులంతా దిగిపోతున్నారు. సరిగ్గా అదే సమయంలో బోర్డింగ్ ప్రక్రియలో ఇతర ప్రయాణికులు, ఫ్లైట్ అటెండెంట్లు ఆన్బోర్డ్లో ఉండగా.. చివరగా దిగుతున్న ప్రయాణికుడు ఫార్వార్డ్ లావేటరీ డోర్ని తెరిచాడు. అంతే ఒక్కసారిగా విమానం డోర్ లాక్ అయ్యిపోయింది. దీంతో ఆప్రయాణికుడు ఆ విమానంలో అలానే ఉండిపోయాడు. ఇంతలో మరో ట్రిప్కి విమానం సిద్దమయ్యే నిమిత్తం పైలట్లు ఆ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పైలట్ డెక్ కాక్పీట్ వద్ద ఉండే విండో గుండా వెళ్లి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక్కడే ఆ విమానం నుంచి చివరిగా బయటకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను అదే విమానంలో ప్రయాణించేందుకు వెళ్తున్న రెక్స్ రోడ్ అనే మరో ప్రయాణికుడు ఆ దృశ్యాలను నెట్టింట షేర్ చేయడంతో ఈ విషమం నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ అనుహ్య ఘటనతో తాము తొమ్మది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలిపాడు. ప్రతిస్పందనగా సదరు ఎయిర్లైన్స్ ట్విట్టర్లో మీరు ఎప్పుడూ చూడని అరుదైన దృశ్యం అని పేర్కొంది. No joke… yesterday last passenger got off plane with no one else on board, he shut the door. Door locked. Pilot having to crawl through cockpit window to open door so we can board. @SouthwestAir pic.twitter.com/oujjcPY67j — Matt Rexroad ✌🏼🇺🇸 (@MattRexroad) May 25, 2023 (చదవండి: తొలిసారిగా సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనున్న చైనా!) -
కాక్పిట్లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్.. రూ.30లక్షల ఫైన్!
తన స్నేహితురాలిని కాక్పిట్లో కూర్చోబెట్టుకున్న పైలెట్పై ప్రముఖ దేశీయ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియా కఠిన చర్యలు తీసుకుంది. పైలెట్ను మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాలిని కాక్పిట్లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అంతేకాదు తన స్నేహితురాలికి సపచర్యలు చేయాలని సిబ్బందిని ఆదేశించాడు. అందుకు ఒప్పుకోని సిబ్బందిపై దుర్భాషలాడాడు. చేయి చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏ (Directorate General of Civil Aviation)ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన డీజీసీఏ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను చర్యలు తీసుకోవాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా పైలెట్కు రూ.30లక్షల ఫైన్ వేసింది. 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ను విరుద్ధంగా విధులు నిర్వహించిన 3 నెలల పాటు పైలెట్ లైసెన్స్ (పీఐసీ) క్యాన్సిల్ చేసింది. -
AP: కొత్త కొలువు.. డ్రోన్ పైలెట్!
సాక్షి, అమరావతి: గ్రామీణ యువతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బృహత్తర బాధ్యతలు అప్పజెబుతోంది. వ్యవసాయ, ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంలో వారిని భాగస్వాములను చేస్తోంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో లక్షలాది యువతకు ఉద్యోగాలు కల్పించారు. ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చి, యువతకు చదువుతోపాటే వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి లభించేలా తీర్చి దిద్దుతున్నారు. ఇప్పుడు గ్రామాల్లోని చదువుకున్న యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చి, గ్రామీణ ప్రాంత కార్యకలాపాల్లో పాలుపంచుకొనేలా చేస్తున్నారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. 80 వేల మంది అవసరం ఒక్క వ్యవసాయ అవసరాలకే 20 వేల మంది డ్రోన్ పైలెట్లు అవసరమవుతారని అంచనా. ఇతర అవసరాల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటే 80 వేల మందికి పైగా డ్రోన్ పైలెట్లు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో గ్రామీణ నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలెట్లుగా శిక్షణనిచ్చి ప్రొఫెషనల్స్గా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా 12 రోజుల సరి్టఫికెట్ కోర్సును రూపొందించింది. 12 రోజుల పాటు ఉచిత శిక్షణ వ్యవసాయ కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో 10 వేల ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. తొలి దశలో జూలైలోగా 500 ఆర్బీకేల పరిధిలో, డిసెంబర్ కల్లా మరో 1500 ఆర్బీకేల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సీహెచ్సీ గ్రూపుల్లో చదువుకున్న రైతులకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రం సెంటర్ ఫర్ అప్సరా ద్వారా సంప్రదాయ వ్యవసాయ డ్రోన్ల రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజులు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 8 బ్యాచ్లలో 135 మంది రైతులకు శిక్షణనిచ్చారు. మిగిలిన వారికి జూలైకల్లా శిక్షణ ఇస్తారు. ఇప్పుడు యువతకూ ఈ శిక్షణ ఇస్తారు. ఇది కూడా చదవండి: ఏపీలో నాలుగో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ గ్రీన్సిగ్నల్ 3 ఏళ్లపాటు ఆర్బీకేల్లో పనిచేయాలి వ్యవసాయ డిప్లొమా, లేదా ఏదైనా ఇంజినీరింగ్ పట్టభద్రులైన యువతకు ఈ శిక్షణ ఇస్తారు. కనీసం 3 ఏళ్ల పాటు ఆర్బీకేల్లో పని చేసేందుకు ముందుకొచ్చే వారికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఉచితంగా ఇస్తారు. ఇతర రంగాల్లో డ్రోన్స్పై శిక్షణ పొందాలంటే ఫీజులు చెల్లించాలి. జూలై నుంచి దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు కొత్తగా అప్సరా కేంద్రంతో పాటు తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో శిక్షణ ఇచ్చేందుకు 20 మంది మాస్టర్ ట్రైనీలను నియమించనున్నారు. ఇప్పటికే 10 మంది శాస్త్రవేత్తలతో పాటు వర్సిటీలో వ్యవసాయ డిప్లొమా చదువుతున్న 125 మందికీ అప్సరా ప్రత్యేక శిక్షణనిచి్చంది. డ్రోన్లదే కీలక పాత్ర వ్యవసాయ రంగంలో ఇప్పుడు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర అవసరాలకు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ రంగంలో 22 రకాల పనులు చేసేందుకు వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా ఆర్బీకేల పరిధిలో కిసాన్ డ్రోన్లను అందుబాటులోకి తెస్తోంది. వీటి వినియోగానికి ఇప్పటికే రైతులకు డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తోంది. ఆర్బీకేలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కిసాన్ డ్రోన్స్ నిర్వహణ కోసం ఏపీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సహకారంతో చదువుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఈ శిక్షణ ఇస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా గ్రామీణ నిరుద్యోగ యువతకు కూడా డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన శిక్షణలో ఎన్నో నేర్చుకున్నాం ఎన్జీ రంగా వర్సీటీ ఇచ్చిన శిక్షణలో ఎంతో నేర్చుకున్నాం. డ్రోన్స్ ఫ్లై చేయగలమన్న నమ్మకం ఏర్పడింది. పొలంలో సూక్ష్మ ఎరువులు, పురుగుల మందులు నేరుగా పిచికారీ చేయగలిగే సామర్థ్యం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల్లో కిసాన్ డ్రోన్స్ ఏర్పాటు చేస్తోంది. వ్యవసాయ అవసరాలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. –కొప్పుల బ్రహా్మనందరెడ్డి, నంద్యాల చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోగలం 3 రోజుల థియరీ క్లాసెస్, డ్రోన్ అసెంబ్లింగ్, డిస్ అసెంబ్లింగ్.. ఒక రోజు సెమిలరీ ప్రాక్టీస్, ఫీల్డ్ లెవల్లో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ నుంచి దృఢమైన నమ్మకంతో వెళ్తున్నాం. డ్రోన్ ఫ్లై చేయగలను. చిన్న చిన్న రిపేర్లు వచ్చినా సరిచేయగలను. – యు.కామేశ్వరరావు, సీతారాంపురం, ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు శిక్షణ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా వ్యవసాయ, సంప్రదాయ డోన్లపై నిరుద్యోగ యువతను డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ఇందుకోసం వ్యవసాయ శాఖతో కలిసి కార్యాచరణ సిద్ధం చేశాం. గుంటూరు లాంతో పాటు మరో నాలుగు చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. – ఆదాల విష్ణువర్ధన్రెడ్డి, - వీసీ, ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ. ఇది కూడా చదవండి: దేశానికి గొప్ప బహుమతి సీఎం జగన్ -
ఎయిరిండియా పైలెట్ ఘనకార్యం..కాక్పిట్లో స్నేహితురాలితో ముచ్చట్లు!
పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఎయిరిండియా (ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో భద్రతా లోపాలపై ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతికి ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎయిరిండియాకు చెందిన ఓపైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాల్ని కాక్పిట్లో కూర్చోబెట్టుకున్నాడు. దీనిపై ఎయిరిండియా సకాలంలో స్పందిచకపోవడంపై డీజీసీఏ మండిపడింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియా విమానంలో అసలేం జరిగింది ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి కాక్పిట్లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏని ఆశ్రయించారు. దీంతో డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎయిరిండియా 915 విమానం పైలెట్ కమాండ్ కెప్టెన్ హర్ష్ సూరీ, కేబిన్ క్రూ, కాక్పిట్లో కూర్చున్న ఎకానమీ క్లాస్ ప్రయాణికురాలికి సమన్లు అందించింది. కాగా, సకాలంలో జోక్యం, చర్యలు తీసుకోకపోవడం విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని డీజీసీఏకి చెప్పాల్సి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మహిళా సిబ్బందిపై వేధింపులు సీఈవో క్యాంప్బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతి హెన్రీ డోనోహోకు పంపిన నోటీసులో ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. కమాండర్ని బెదిరించడం, అవమానించడం, తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడంపై చింతిస్తున్నాను. షాక్కు గురయ్యాను. మహిళా ప్రయాణీకురాలిని కాక్పిట్లోకి అనుమతించడాన్ని పైలట్ ఉల్లంఘించడమే కాకుండా, తాను చెప్పినట్లు చేయలేదనే అకారణంగా మహిళా సిబ్బందిని వేదించినట్లు మైలెట్ చేసింది. కాగా, విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో డీజీసీఏ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి👉 జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే! -
జరిమానా నుంచి తప్పించుకోవాలని..ఏకంగా చనిపోయిన పైలట్..
ఒక మహిళ విచిత్రమైన మోసానికి పాల్పడింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి ఐడెంటీటిని ఉపయోగించి మోసగించే ప్రయత్నంలో పట్టుబడింది. దీంతో ఆమెకు కోర్టు శిక్ష విధించనుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియన్ మహిళ 33 ఏళ్ల స్టెఫానీ లూయిస్ బెన్నెట్ కారు డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడంతో పట్టుబడింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు ఆమెకు దాదాపు రూ. 88 వేలు జరిమానా విధించారు. ఐతే ఆమె ఈ ట్రాఫిక్ జరిమానా నుంచి తప్పించుకునేందుకు తాను ఎలాంటి నేరం చేయలేదంటూ ఆన్లైన్లోనే సదరు ట్రాఫిక్ సంస్థకు తెలిపింది. ఆ సమయంలో తన కారుని నడిపింది యాష్ జెంక్సిన్గా పేర్కొంది. అతను సీ వరల్డ్ పైలంట్. అతని ఐడెంట్ని ఉపయోగించి.. అతన డెత్ రిపోర్ట్ ఉన్న పూర్తి పేరు, పుట్టిన తేదీని వినియోగించింది. వాస్తవానికి అతను జనవరి 2న గోల్డ్ కోస్ట్ బ్రాడ్వాటర్లో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా మరో హెలికాప్టర్ ఢీ కొట్టడంతో..అతను సిడ్నీ మహిళ వెనెస్సాటాడ్రోస్, బ్రిటీష్ జంట రాస్, డయాన్ హ్యైస్ అనే ముగ్గురు ప్రయాణికులతో కలసి స్పాట్లో చనిపోయాడు. జెంక్సిన్ మరణించిన కొన్ని వారాల తర్వాత అతని భార్యకు జరిమాన నోటీసులు అందాయి. ఆమె ట్రాఫిక్ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు సదరు మహిళ బెన్నెట్ తతమను తప్పుదారి పట్టించి మోసం చేసిందని గుర్తించారు. ఈ మేరకు సదరు మహిళను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమె నేరం చేసినట్లు కోర్టు ఎదుట అంగీకరించింది. తాను ఆ మరుసటి రోజు తన వ్యాఖ్యలను ఆన్లైన్లో వెనక్కి తీసుకునేందుకు యత్నించినా..అందుకు సదరు వెబ్సైట్ అంగీకరించలేదని వాపోయింది. తాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొనడం వల్లే ఇలా చేశానిని కోర్టుకి వివరించింది. ఈ మేరకు బెన్నెట్ చేసిన నేరానికి గాను మే 19న శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. (చదవండి: ఉక్రెయిన్కు నాటో భారీ ఆయుధ సాయం) -
గర్ల్ ఫ్రెండ్ను కాక్పిట్లోకి తీసుకెళ్లిన ఎయిరిండియా పైలట్..
న్యూఢిల్లీ: విమానాల్లో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తోటి ప్రయాణికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్తలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రయాణికులే అనుకుంటే తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ పెలైట్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దుబాయి-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తున్న తన స్నేహితురాలిని పైలట్ కాక్పిట్లోకి తీసుకెళ్లడమే గాక.. ప్రయాణ సమయమంతా ఆమెను పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఫిబ్రవరి 27 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. దుబాయి నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో పైలట్ స్నేహితురాలు కూడా ప్రయాణిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి తన స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించాడు. చదవండి: వ్యక్తి ప్రాణాలు తీసిన వందేభారత్-ఆవు ప్రమాదం.. చూస్తుండగానే.. అంతేగాక విమానం ఢిల్లీకి చేరుకునేంతవరకు అంటే.. దాదాపు మూడు గంటల పాటు ఆ మహిళను కాక్పిట్లోనే ఫస్ట్ అబ్జర్వర్ సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అయితే ఈ విషయంపై క్యాబిన్ సభ్యుల్లో ఒకరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. దీంతో మహిళా స్నేహితురాలిని పైల్ కాక్పిట్లోకి అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం దర్యాప్తును చేపట్టింది. పైలట్ చర్యలు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడమే కాకుండా, విమాన ప్రయాణికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, దాని బట్టి పైలట్పై సస్పెన్షన్ లేదాలైసెన్స్ను రద్దు చేయడంతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీకే శివకుమార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ -
ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్
నేల మీద సాగే కథలను మనం వెండితెరపై చాలానే చూశాం.. చూస్తున్నాం. నింగి నేపథ్యంలో సాగే కథలు అరుదుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్లో కొన్ని సినిమాల కథలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ♦ బాలీవుడ్ కిలాడీ అక్షయ్కుమార్ నటించిన ‘ఎయిర్లిఫ్ట్’, ‘బేబీ’ వంటి సినిమాల్లో విమానంలో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఏడాది సెట్స్పైకి వెళ్లనున్న ‘స్కై ఫోర్స్’లో అక్షయ్ కుమార్ పైలట్గా నటించనున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా దినేష్ విజన్ నిర్మాతగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాతో సందీప్ కెల్వానీ, అభిషేక్ కపూర్లు దర్శకులుగా పరిచయం కానున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అలాగే ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా సూర్య హీరోగా నటించిన చిత్రం ‘శూరరై పో ట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) హిందీ రీమేక్లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని ఎయిర్ఫోర్స్ సీన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ తమిళ వెర్షన్కు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే హిందీ వెర్షన్కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న సూర్య, ఇందులో ఓ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ♦ ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి హిట్ ఫిల్మ్స్ తర్వాత బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొం దుతున్న సినిమా ‘ఫైటర్’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ క΄ాడియా, అనిల్ కపూర్ కీ రోల్స్ చేస్తున్నారు. దాదాపు యాభై శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ జెట్ పైలట్గా నటిస్తున్నారని సమాచారం. జ్యోతీ దేశ్΄ాండే, అజిత్ అంధరే, మమతా ఆనంద్, రామన్, అంకు ΄ాండే, సిద్ధార్థ్ ఆనంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 25న విడుదల కానుంది. ♦ పూర్తిగా ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో రూపొం దుతున్న సినిమా ‘ది క్రూ’. ఎయిర్లైన్ సెక్టార్లో ఉద్యోగాలు చేసే ముగ్గురు మహిళల జీవితాల ఆధారంగా రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టబు, కరీనా కపూర్, కృతీ సనన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. కాగా ఏక్తా కపూర్, రేఖా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘‘ఎయిర్లైన్ ఇండస్ట్రీలో పని చేసే ముగ్గురు మహిళలు ఊహించని ఘటనలు జరిగినప్పుడు ఎలా రియాక్టయ్యారు? అనే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ♦ ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ముంబైకి వెళ్తున్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో హీరోయిన్ మానుషీ చిల్లర్ తెలుగుకి వస్తున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పైలట్గా కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో సోనీ పిక్చర్స్ ఇంటర్ నేషనల్ప్రొడక్షన్స్ సహకారంతో నందకుమార్ అబ్బినేని, సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ఇవే కాదు... మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో రూపొం దుతున్నాయి. -
గాల్లో విమానం.. పైలట్ సీట్లోకి నాగు పాము.. తర్వాత ఏం జరిగిందంటే!
జోహన్నెస్బర్గ్: గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన దర్శనమిచ్చింది. పామును గమనించిన పైలట్ భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో సోమవారం చోటు చేసుకుంది. విమానంలో పామును చూసిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. సోమవారం నలుగురు ప్రయాణికుతో చిన్న విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ రుడోల్ఫ్ ఎరాస్మస్కు తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. అయితే పాముని చూసి బెంబేలెత్తకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈ విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్బర్గ్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రాయణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానంలోని వారిని దింపేసి తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పాము చుట్టుకొని ఉండటాన్ని గుర్తించారు. వాస్తవానికి ప్రయాణానికి ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం వార్సెస్టర్ ఎయిర్పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు వారు ప్రయత్నించినా దాని ఆచూకీ లభించకపోవడంతో బయటకు వెళ్లిపోయిందని భావించారు. అనూహ్యంగా మర్నాడు కాక్పిట్లో ప్రత్యక్షమైంది. మరోవైపు సంయమనం పాటించి, విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన పైలెట్ను అభినందిస్తూ అతని ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్
కూతురు పైలెట్.. తండ్రి ప్రయాణికుడు. మరి కాసేపట్లో విమానం గాల్లో ఎగరాలి. కూతురు కాక్పిట్ నుంచి బయటికొచ్చి తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. తండ్రి ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మరిచి నేను ఏ పనీ చేయను అంటున్న భారతీయ పైలెట్ కృతద్న్యా సోషల్ మీడియాలో మెటికలు విరిచే ఆశీర్వాదం పొందుతోంది. ‘ఈ రోజు కోసం నేను 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ఇన్స్టాలో రాసుకుంది పైలెట్ కృతద్న్యా హాలె తన తండ్రితో పాటు ఉన్న తన ఫొటోను పోస్ట్ చేస్తూ. ‘నేను పైలెట్ అవ్వాలని కలలు కంటున్నప్పుడు మా నాన్న తప్ప ఎవరూ నా మీద విశ్వాసం ఉంచలేదు. నా కెరీర్ మొదలెట్టి 13 ఏళ్లు అయింది. ఇవాళ మా నాన్నను ఆకాశం మీదుగా గమ్యాన్ని చేర్చే అవకాశం వచ్చింది’ అని కూడా రాసుకుంది కృతద్న్యా. ముంబై నుంచి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్కి ఎయిర్బస్ 320 తరచూ నడిపే కృతద్న్యా తన తండ్రిని బహుశా స్వదేశం తీసుకు వస్తూనో లేదా స్పెయిన్ తీసుకువెళుతూనో ఒక వీడియో పోస్ట్ చేసింది. విమానం ఎగిరే ముందు కాక్పిట్ నుంచి బయటకు వచ్చి పాసింజర్ సీట్లో కూచుని ఉన్న తండ్రి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ఆయన్ను హత్తుకుంది. తబ్బిబ్బవుతూ తండ్రి ఆమెను ఆశీర్వదించాడు. ఆ వీడియోను కృతద్న్యా పోస్ట్ చేస్తూ ‘తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా నేను ఏ పని చేయను. ఒక్కోసారి డ్యూటీకి నేను తెల్లవారుజాము మూడుకో నాలుక్కో ఇంటి నుంచి బయట పడాల్సి వచ్చినా నా తల్లిదండ్రులు గాఢనిద్రలో ఉన్నా వారి పాదాలు తాకి వెళ్లడం అలవాటు’ అని రాసింది. ఈ వీడియోను ఆమె పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దానికి దాదాపు ఐదు లక్షల లైకులు వచ్చాయి. ఇన్స్టాలో చాలామంది నెటిజన్లు ఉద్వేగానికి లోనయ్యారు. ‘నిన్ను, మీ నాన్నను చూసి కన్నీరు ఆగడం లేదు’ అని ఒకరు రాస్తే ‘ఇది అసలు సిసలు భారతీయ సంస్కృతి’ అని మరొకరు రాశారు. ‘నీలాంటి అమ్మాయిలే మాకు రోజూ స్ఫూర్తినిస్తున్నారు’ అని మరొక మహిళ కామెంట్ చేసింది. భారతీయ కుటుంబాల్లో తండ్రీ కూతురు అనుబంధం ప్రత్యేకమైనది. కొందరు కూతుళ్లు అమ్మ కూచిలుగా కాకుండా నాన్న బిడ్డలుగా ఉంటారు. నాన్నతో క్లోజ్గా ఉంటారు. నాన్నలు వారి కోసం ప్రాణం పెడతారు. కృతద్న్యా, ఆమె తండ్రిలో అలాంటి తండ్రీ కూతుళ్లు తమను తాము పోల్చుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో యమా వైరల్గా మారింది. చదవండి: Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?! Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు! View this post on Instagram A post shared by Capt. Krutadnya Hale✈️ (@pilot_krutadnya) -
నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..
నేపాల్ విమాన ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడక పోవడం అందర్నీ తీవ్రంగా కలిచి వేసింది. ఐతే ఈ ఘటనలో చనిపోయిన కో పైలెట్ అంజు ఖతివాడ విషాద గాథ అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. ఆమె 2006లో పైలట్ అయిన తన భర్తను ఇదే విమాన ప్రమాదంలో పోగొట్టకుంది. అయినా ఆ బాధను దిగమింగుకుని తన భర్త మాదిరిగా పైలట్ అవ్వాలని 2010లో ఎయిర్లైన్స్లో చేరింది. అందుకోసం ఎంతో ప్రయాసపడి ఏదోలా కో పైలట్ ఉద్యోగం సాధించింది. ఇంకా కొద్దిగంటల్లో పైలట్ అయిపోతుంది అనంగా ఈ ఘోర ప్రమాదం బారినపడింది. వాస్తవానికి నేపాల్ నిబంధనల ప్రకారం కోపైలట్ పైలట్ అవ్వాలంటే సుమారు 100 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉండాలి. అందులో భాగంగా ఈ ప్రమాదం జరిగిన యతి ఎయిర్లైన్స్ విమానంలో పయనించింది. ఈ మేరకు 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న యతి ఎయిర్లైన్స్ ఏటీఆర్ 72 విమానానికి కమల్ కేసీ పైలట్గా ఉండగా..అంజు ఖతివాడ కో పైలట్గా వ్యవహరించారు. అంతేగాదు అంజుకి కోపైలట్గా ఇది చివరి విమానం. ఇప్పటివరకు అంజు నేపాల్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో కోపైలట్గా.. విజయవంతంగా అన్ని విమానాలను ల్యాండ్ చేశారు. ఇంకొద్దిసేపులో తన కల నెరవేరుతుందనంగా విధికి ఆమెపై కన్నుకుట్టిందేమో! తెలియదుగానీ ఆమె కలల్ని కల్లలు చేస్తూ..ఆమెను చిదిమేసింది. నాడు అంజు భర్త 16 ఏళ్ల క్రితం ఇదే యతి ఎయిర్లైన్స్లో కోపైలట్ విధులు నిర్వర్తిస్తూ..ఎలాగైతే మరణించారో ఆమె కూడ అలానే మరణించడం బాధకరం. అంజు భర్త 2006లో కోపైలట్గా యతి ఎయిర్లైన్స్ విమానంలో ఉండగా.. నేపాల్గంజ్ నుంచి జుమ్లా వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. నాడు భర్త లాగే..నేడు భార్యను కూడా విధి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఐతే ఈ ఘటనలో పైలట్ కమల్ కేసి మృతదేహాన్ని గుర్తించామని, కానీ కోపైలట్ అంజు మృతదేహనికి సంబంధించిన అవశేషాలను ఇంకా గుర్తించలేదని ఎయిర్లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. ఇదిలా ఉండగా, ఆదివారం నేపాల్ యతి ఎయిర్లైన్స్ ఏటీఆర్-72 విమానం దుర్ఘటనలో విమానం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు అటు ఇట్లు దొర్లినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. అలాగే విమానంలోని కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవి క్రాష్ కావడానికి కారణమేమిటో గుర్తించడంలో సహాయపడవచ్చునని చెబుతున్నారు. (చదవండి: వీధి కుక్కులకి ఆహారం పెడుతుండగా..ర్యాష్గా దూసుకొచ్చిన కారు) -
అలా చేసి ఉండాల్సింది కాదు: మిశ్రా పక్క సీటు వైద్యుడు షాకింగ్ వ్యాఖ్యలు
ఎయిర్ ఇండియాలో జరిగిన మూత్ర విసర్జన ఘటనపై నిందితుడు శంకర్ మిశ్రా పక్కసీటు ప్రయాణికుడు చాలా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు మిశ్రా పక్కసీటు వ్యక్తి ఆమెరికాకు చెందిన ఆడియాలజీ వైద్యుడు సుగతా భట్టాచార్జీ నాటి దురదృష్టకర ఘటనను గుర్తు చేసుకుంటూ...ఆ రోజు ఆ వృద్ధ మహిళ పట్ల పైలెట్ అలా వ్యవహరించి ఉండకూడదన్నారు. ఆయన ఆ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసి బాధితురాలికి ఉపశమనం కలిగించేలా ఏదైనా చేసి ఉంటే ఇంతలా చర్చనీయాంశంగా మారేది కాదన్నారు. ఐతే నిందితుడి తండ్రి ఆ రోజు ఎలాంటి అనుచిత ఘటన జరగలేదంటూ.. వాదించిన నేపథ్యంలోనే సుగతా భట్టాచార్జీ నాటి ఘటన గురించి వివరించారు. ఆ రోజు బాధిత మహిళ చాలా మర్యాదగా వ్యవహరించిందన్నారు. తాను బిజినెస్ క్లాస్లో 8A సీటులో కూర్చొన్నాని, మిశ్రా 8Cలో కూర్చొన్నారని చెప్పారు. ఆ రోజు భోజనం చేసిన కొద్దిసేపటికి లైట్లు ఆరిపోయాయని చెప్పారు. ఆ తర్వాత నిందితుడు శంకర్ మిశ్రా వృద్ధురాలి సీటు9A వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేశాడు. వాస్తవానికి వాష్ రూమ్ అతని సీటుకి నాలుగు సీట్ల వెనకాల ఉంది. ఈ హఠాత్పరిణామానికి 9A, 9Cలలో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు ఇబ్బంది పడటం చూశానని అన్నారు. భట్టాచార్జీ తాను ఆ సమయంలో వాష్రూమ్కి వెళ్తుండగా.. మిశ్రా తనపై తూలితే.. ఫ్లైట్ వేగంగా వెళ్లడంతో అలా పడ్డాడనుకున్నాం, గానీ ఆ తర్వాత అతను చాలా మత్తులో ఉన్నట్లు గమనించి షాక్ అయ్యాం అన్నారు. పాపం ఆ బాధిత మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా..వారు వచ్చి కేవలం సీటును క్లీన్ చేసి, షీట్లు మార్చి.. మళ్లీ అక్కడే కూర్చొమన్నారని చెప్పుకొచ్చారు. దీంతో తనకు తన నైతిక బాధ్యత గుర్తుకొచ్చి..మరోక సీటు ఇవ్వాల్సిందిగా సీనియర్ హోస్ట్కి చెప్పినట్లు పేర్కొన్నారు. ఐతే ఆమె పైలెట్ అనుమతి తీసుకోవాలని, తాను అలా చేయాలనని చెప్పినట్లు తెలిపారు. ఆ రోజు ఆ సీటు క్లీన్ చేసేంత వరకు రెండు గంటల పాటు ఆ మహిళ అలా నిలబడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను వెళ్లి సిబ్బందితో చెప్పడంతో ఆమెకు ఒక సిబ్బంది సీటును కేటాయించారు. ఆ రోజు బిజినెస్ క్లాస్లో సీటులు ఖాళీగా ఉన్నా కూడా పైలెట్ ఆమెకు మరో సీటు కేటాయించకపోగా..కాసేపటి తర్వాత అదే సీటుకి రావాల్సిందిగా కోరారు. ఐతే ఆమె అందుకు నిరాకరించి..సిబ్బందికి కేటాయించే.. చిన్న సీటులోనే ఉండిపోయిందని చెప్పారు. ఆ సమయంలో పైలెట్ సరైన రీతిలో నిర్ణయం తీసుకుని స్పందించి ఉంటే... ఇదంతా జరిగి ఉండేది కాదన్నారు. విమాన సిబ్బంది ఒక స్త్రీ పరువుతో ఆడుకుని, ఎయిర్ ఇండియా పరువు దిగజార్చరన్నారు. ఇదిలా ఉండగా, ముంబై సమీపంలోని బొయిన్సర్లో ఉంటున్న నిందితుడు మిశ్రా తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడని, తన తల్లి వయసు ఉన్న ఆమెతో అలా వ్యవహరించడంటూ వాదించడం గమనార్హం. కాగా నిందితుడు శంకర్ మిశ్రాను శనివారం ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. అంతేగాదు అతని కస్టడీ కోసం పోలీసుల చేసిన విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. పైగా బెయిల్ దరఖాస్తును జనవరి 11న పరిశీలిస్తామని ఢిల్లీ కోర్టు పేర్కొంది. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
ప్రయాణికుడి ఓవరాక్షన్.. ఈడ్చి పడేసిన పైలట్
వైరల్: విమానంలో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం, వికృత చేష్టలకు పాల్పడుతున్న నానాటికీ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజా ఎయిర్ ఇండియా ఘటనలు మాత్రమే కాదు.. ప్రపంచంలో దాదాపు ప్రతీ మూలా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అలాంటి ప్రయాణికుల పట్ల వాళ్ల కఠినంగా వ్యవహరించాలని భారత విమానయాన నియంత్రణ విభాగం డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘వర్జిన్ ఆస్ట్రేలియా’ విమానంలో జరిగిన ఘటన వైరల్గా మారింది. బుధవారం టౌన్స్విల్లే-సిడ్నీ విమానం టౌన్స్విల్లే నుంచి టేకాఫ్ అయ్యాక.. ఓ ప్యాసింజర్ ఎందుకనో సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో పైలట్ జోక్యం చేసుకోగా.. ఆ వ్యక్తి పైలట్ను సైతం తులనాడాడు. కాలర్ పట్టుకుని అడ్డమైన బూతులు తిట్టాడు. దీంతో.. పైలట్కు చిర్రెత్తుకొచ్చింది. నడువు.. అంటూ అతన్ని ఈడ్చుకుంటూ ఎగ్జిట్ డోర్ దాకా తీసుకెళ్లాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించాలని సిబ్బందికి పైలట్ సూచించడంతో ఆ వ్యక్తి గమ్మున అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రయాణికుడు అలా గొడవ ఎందుకు పడ్డాడన్నది తెలియరాలేదు. అలాగే అతనిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వర్జిన్ ఆస్ట్రేలియా సైతం ప్రకటించలేదు. An unruly passenger was kicked out from the aircraft by Virgin Australia's pilot on flight between Townsville to Sydney. 🎥 ©Ben Mckay/TikTok#VirginAustralia #Australia #aviation #AvGeek #avgeeks #flights #Travel #traveler #pilotlife #pilot pic.twitter.com/vBtbmV7tKe — FlightMode (@FlightModeblog) January 5, 2023 -
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరు
-
ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
-
విమానం టేక్ అఫ్ టైంలో ఫోన్ మిస్సింగ్.. పైలెట్ కిటికిలోంచి వంగి మరీ..
ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు తన ఫోన్ని మర్చిపోయాడు. ఐతే ఇంతలో విమానంలో ప్రయాణికులంతా ఎక్కేశారు. ఇక బయలుదేరుతుంది అనేలోపు ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని డల్లాస్ చెందిన ఎయిర్లైన్ ఫేస్బుక్లో పేర్కొంది. వివరాల్లోకెళ్తే...కాలిఫోర్నియాలోని లాంట్ బీజ్ ఎయిర్పోర్ట్లో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ విమానం ప్రయాణికులంతా ఎక్కేయడంతో టేకాఫ్కి రెడీ అయ్యింది. ఇంతలో గ్రౌండ్ సిబ్బంది గేట్ వద్ద ఒక ప్రయాణికుడు ఫోన్ మర్చిపోవటాన్ని గుర్తించారు. దీంతో వారు వెంటనే అప్రమత్తమై టేకాఫ్ అవుతున్న విమానం దగ్గరకు వచ్చి ప్రయాణికుడి ఫోన్ ఇచ్చేందుకు వస్తారు. విషయం గ్రహించిన ఫైలెట్ కిటికిలోంచి వంగి మరీ సిబ్బంది నుంచి ఫోన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణకుడికి అతను మర్చిపోయిన ఫోన్ని అందజేశారు. అందుకు సంబంధించిన వీడియోని డల్లాస్ ఎయిర్లైన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...మా సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ని ప్రేమించండి. ఇలా మా సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులకు సాయం చేయడాన్ని కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అంటారు అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. When our Employees at @LGBairport noticed a Customer's phone left behind in a gate area after a flight that was already boarded and pushed back from the gate, they didn't hesitate. #WorldKindnessDay pic.twitter.com/cf3gJy8Nmy — Southwest Airlines (@SouthwestAir) November 13, 2022 (చదవండి: వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్) -
Aafrin Hirani: ఆదిలాబాద్ అమ్మాయికి రెక్కలొచ్చాయి
అవును. ఇండిగో రంగు రెక్కలు. ఆకాశంలో దూసుకువెళ్లే రెక్కలు. ఆ రెక్కలు ఇకపై ఎందరినో గమ్యానికి చేర్చనున్నాయి. ఆదిలాబాద్ నుంచి మొదటి మహిళా పైలెట్ అయిన స్వాతి రావు స్ఫూర్తితో అదే అదిలాబాద్ జిల్లా నుంచి రెండో పైలెట్ అయ్యింది ఆఫ్రిన్ హిరానీ. ఇంద్రవెల్లిలో డిపార్ట్మెంటల్ స్టోర్ నడిపే ఆమె తండ్రి ఆఫ్రిన్కు ఆపాయింట్మెంట్ లెటర్ రావడంతోటే తన దగ్గర పని చేసే 15 మంది గిరిజన ఉద్యోగులను విమానం ఎక్కించి తిరుపతి తీసుకెళ్లడం విశేషం. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను విమానంలో తీసుకెళ్తున్న ఆఫ్రీన్ తండ్రి ఆఫ్రిన్ హిరానీకి కొంత దారి ముందే పడింది.ఆ దారి వేసింది అదే జిల్లా నుంచి మొదటిసారి కమర్షియల్ పైలెట్ అయిన స్వాతి రావు. 2005లో స్వాతి రావు కమర్షియల్ పైలెట్ అవ్వాలని అనుకున్నప్పుడు వెనుకబడిన జిల్లా కావడం వల్ల ఆమెకు ఏ సమాచారం దొరకలేదు. ఇంటర్నెట్ లేదు. కోర్సు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. తండ్రికి కూడా పెద్దగా వివరాలు తెలియలేదు. కాని అదే సమయంలో ఆమె తమ్ముడు బిట్స్ పిలానిలో చేరడంతో అక్కడి నుంచే వివరాలు తెలుసుకుని అక్కకు చెప్పాడు. దాంతో స్వాతి రావు మొదట హైదరాబాద్లో చదివి ఆ తర్వాత ఫిలిప్పైన్స్ వెళ్లి ‘కమర్షియల్ పైలెట్ లైసెన్స్’ (సి.పి.ఎల్) చేసింది. ఇండియా తిరిగొచ్చి పైలెట్ అయ్యింది. ‘నేను పైలెట్ అవ్వాలనుకున్నప్పుడు ఆమె నుంచే స్ఫూర్తి పొందాను’ అంది ఆఫ్రిన్ హిరానీ. ‘మా జిల్లా నుంచి ఆమె పైలెట్ అయినప్పుడు నేనెందుకు కాకూడదు అని గట్టిగా అనుకున్నాను’ అంటుంది ఆఫ్రిన్. 28 ఏళ్ల ఆఫ్రిన్ ఇప్పుడు ఇండిగో పైలెట్. మనం ఏ చెన్నైకో, ఢిల్లీకో ఇండిగోలో వెళుతున్నప్పుడు మనం ఎక్కిన ఫ్లయిట్ను ఆఫ్రిన్ నడపవచ్చు. ‘నేను మీ పైలెట్ ఆఫ్రిన్ని’ అని మైక్రోఫోన్లో మనకు గొంతు వినిపించవచ్చు. ఆదిలాబాద్ జిల్లా నుంచే మరో అమ్మాయి పైలెట్ కావడం అంటే చిన్న విషయం కాదు. చిల్లర అంగడి నుంచి నింగికి ఆఫ్రిన్ తండ్రి అజిజ్ హిరానీకి ఇంద్రవెల్లిలో పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది. అతను స్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. భార్య నవీన హిరాని గృహిణి. వారి కుమార్తె ఆఫ్రిన్ పైలెట్ కావాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు మద్దతు పలికారు. ‘నా కూతురికి ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను’ అంటాడు అజిజ్. అతను ఇంద్రవెల్లిలోని గిరిజనేతర పిల్లలతో పాటు గిరిజన పిల్లలకు కూడా సమాన చదువు అందాలని ‘ఇంద్రవెల్లి పబ్లిక్ స్కూల్’ పేరుతో ఒక స్కూల్ కూడా నడుపుతున్నాడు. ఆఫ్రిన్ తన ప్రాథమిక విద్యను అక్కడే చదివింది. హైదరాబాద్లో ఇంటర్ చేసి మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో రెండళ్ల ఫ్లయింగ్ కోర్సు చేసింది. 2020 సంవత్సరం నాటికి పూర్తి యోగ్యతతో ఆమె ఇండియా తిరిగి వచ్చింది. అయితే కోవిడ్ వల్ల ఆమె అపాయింట్మెంట్ ఆలస్యమైంది. ఇటీవలే ఇండిగోలో జాయిన్ అయ్యింది. ‘ఎప్పుడెప్పుడు నా దేశంలో విమానం ఎగరేద్దామా అన్న నా కోరిక ఇన్నాళ్లకు తీరింది’ అంటుంది ఆఫ్రిన్. మత సామరస్యం ఆఫ్రిన్కు పైలెట్గా అపాయింట్మెంట్ రాగానే ఆమె తల్లిదండ్రులతో పాటు స్టోర్లో పని చేసే సిబ్బంది కూడా ఆనందించారు. వారంతా చుట్టుపక్కల పల్లెలకు చెందినవారు. చిరు సంపాదనాపరులు. ఆఫ్రిన్ తండ్రి వారి కోసమని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెంట ఉండి మరీ అందరినీ మొదటిసారి హైదరాబాద్ నుంచి విమానంలో తిరుమల యాత్రకు తీసుకెళ్లాడు. జీవితంలో మొదటిసారి విమానం ఎక్కినందుకు వారు ఆనందించారు. ఆఫ్రిన్ అంతటి విమానాన్ని నడపబోతుందా అని ఆశ్చర్యపోయారు. ఏమో... రేపు ఈ సిబ్బంది పిల్లల నుంచి మరో స్వాతి, మరో ఆఫ్రిన్ రావచ్చు. ఆడపిల్లలను స్కూల్ మాన్పించడం, చిన్న వయసులో వివాహం చేయడం వంటివి మానుకుని వారికి తగిన సపోర్ట్ ఇస్తే ఆకాశమే హద్దు. -
ఉత్తరాఖండ్ క్రాష్: భార్యకు చివరి కాల్లో ఆ పైలట్..
ముంబై: ఉత్తరాఖండ్ ఘోర విమాన ప్రమాదంలో పైలట్లు, యాత్రికులు మృత్యువాత పడ్డారు. ప్రతికూల వాతావరణంతోనే మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ఓ అంచనాకి వచ్చారు. అయితే.. ప్రమాదానికి ముందు కల్నల్(రిటైర్డ్), పైలట్ అనిల్ సింగ్(57) భార్యతో మాట్లాడిన మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. తూర్పు ఢిల్లీకి చెందిన అనిల్ సింగ్.. కుటుంబంతో పాటు ముంబై(మహారాష్ట్ర) అంధేరీలోని ఓ హౌజింగ్ సొసైటీలో గత పదిహేనుళ్లుగా ఉంటున్నారు. ఆయనకు భార్య షిరిన్ ఆనందిత, కూతురు ఫిరోజా సింగ్ ఉన్నారు. భార్య షిరిన్ ఫిల్మ్ రైటర్.. గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు కూడా. ఇక కూతురు ఫిరోజా.. మీడియాలో పని చేస్తోంది. అయితే.. ప్రమాదం కంటే ముందు రాత్రి అంటే సోమవారం రాత్రి ఆయన తన భార్యకు ఫోన్ చేసి పలు జాగ్రత్తలు సూచించినట్లు ఆనందిత తెలిపారు. ఆనందిత మాట్లాడుతూ.. గత రాత్రి ఆయన మాకు ఫోన్ చేశారు. ఫిరోజాకు ఆరోగ్యం బాగోలేదని ఆరా తీశారు. బిడ్డ జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశారు. అవే ఆయన చివరి మాటలు అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఇది ప్రమాదంగానే భావిస్తున్నామని, కుట్ర కోణంతో ఫిర్యాదు చేసే ఆలోచనలో లేమని ఆమె వెల్లడించారు. కూతురితో పాటు ఢిల్లీలో జరగబోయే భర్త అంత్యక్రియలకు ఆమె బయలుదేరారు. 2021 నవంబర్లో మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో గాయపడ్డ పోలీస్ సిబ్బందిని తరలించడంలో అనిల్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. మరోవైపు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఆర్యన్ ఏవియేషన్కు చెందిన చాపర్ బెల్ 407(VT-RPN) కేదర్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి యాత్రికులను తీసుకెళ్లే క్రమంలో దేవ దర్శిని(గరుడ్ ఛట్టి) వద్ద ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణంతో కొండ ప్రాంతాల్లో అది పేలిపోయి ప్రమాదానికి గురై ఉంటుందని రుద్రప్రయాగ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై డీజీసీఏ తోపాటు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సైతం దర్యాప్తు చేపట్టింది. -
చీతా హెలికాప్టర్ క్రాష్ ...పైలెట్ మృతి
న్యూఢిల్లీ: చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ కూలిపోయినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్, మృతి చెందగా, కో పైలెట్ తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం తవాంగ్ ప్రాంతంలో ఉదయం 10 గం.ల సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ చీతా హెలీకాప్టర్లో ఇద్దరు పైలెట్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఇద్దరు పైలెట్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే లెఫ్టినెంట్ సౌరభ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కో పైలెట్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇదే ఏడాది మార్చిలో మరో చీతా హెలికాప్టర్ జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో కూలిన సంగతి విధితమే. ఆఘటనలో కూడా పైలెట్ మృతి చెందగా, కోపైలెట్కి తీవ్ర గాయాలపాలయ్యాడు. (చదవండి: ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు) -
పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు
కరోనా మహమ్మారి దెబ్బకి డీలా పడ్డ రంగాల్లో ప్రధానంగా ఏవియేషన్ రంగం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం విమానయాన సంస్థలకు తీరని నష్టాలు తీసుకొచ్చాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఊపిరి పీల్చుకోవచ్చని భావించిన సంస్థలకు.. ఆపై ఇంధన ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆర్థికంగా మరిన్ని కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ వరుసలో ముందు స్పైస్ జెట్ సంస్థ నిలిచింది. అకస్మాత్తుగా తన కంపెనీలోని 80 మంది పైలట్లను 3 నెలల సెలవుపై పంపించింది. ఈ సమయానికి వారికి సాలరీ కూడా ఇవ్వరంటూ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనిపై ఓ పైలెట్ స్పందిస్తూ.. స్పైస్జెట్ ఆర్థిక సంక్షోభం గురించి మాకు తెలుసు, కానీ సంస్థ 3 నెలల పాటు పైలట్లని ఇంటికి పంపాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం మాలో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మూడు నెలల తర్వాత కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వస్తుందని అనుకోవడంలేదు. ఇది ప్రస్తుతం తాత్కాలిక చర్య అని కంపెనీ చెబుతున్నప్పటికీ, తిరిగి పైలట్లను విధుల్లోకి తీసుకోవడం కష్టమేనన్నాడు. చదవండి: AirAsia: బంపర్ ఆఫర్, ఏకంగా 50 లక్షల టికెట్లు ఫ్రీ -
భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్
అమెరికా నెవాడాలో వార్షిక ఎయిర్ రేస్ పోటీలు జరుగుతుంటాయి. అందులో భాగంగా చివరి రోజు జరుగుతున్న ఛాంపియన్షిప్ పోటీల్లో అనుహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నటుండి ఒక జెట్ విమానం ఒక్కసారిగా భూమిని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో సైతం విమానం ఎగురుతూ దూరంగా ఒక చోట ఆగిపోయింది. ఈ ఘటనలో పైలెట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా జెట్ విమానాలన్నీ సురక్షితంగానే ల్యాండ్ అయ్యాయి. ఈ భయానక ప్రమాదం కారణంగా మిగతా ఈవెంట్లన్నింటిని రద్దు చేశారు. ఐతే మిగతా పైలెట్ల ఎవరూ ప్రమాదం బారిన పడలేదని తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్లో నెవాడాలోని రెనో స్టెడ్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ రేస్లు జరుగుతుంటాయి. ఈ మేరకు ఎయిర్ రేస్ల చైర్మన్ ఫ్రెడ్ టెల్లింగ్ మాట్లాడుతూ... నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు(ఎన్టీఎస్బీ), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినస్ట్రేషన్ ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరణాత్మక దర్యాప్తును జరుపుతాయని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వీడియో: 'ఆమె ఎవరసలు?'.. రాణి అంత్యక్రియల కవరేజ్పై బ్రిటన్ ప్రజల ఆగ్రహం) -
శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
కాబూల్: అప్గనిస్తాన్లో కాబూల్ శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక అనుభవం లేని తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగనట్లు ధృవీకరించింది. ఈ ఛాపర్ని శిక్షణా విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ అదనంగా ఐదుగురు చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ 2002 నుంచి 2017 మధ్య సుమారు రూ. 2 లక్షల కోట్లు విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థలతో సహా అఫ్గాన్ ప్రభుత్వానికి రక్షణాయుధాలను పంపింది. (చదవండి: ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్వే యూనియన్ నాయకుడిగా రికార్డు) -
ఫ్లైట్ చోరీ చేసి కూల్చేస్తానని పైలట్ బెదిరింపులు.. ఊరంతా ఖాళీ!
వాషింగ్టన్: ఓ మినీ విమానాన్ని చోరీ చేసిన పైలట్..నగరంపై చక్కర్లు కొడుతూ హల్చల్ సృష్టించాడు. రద్దీ ప్రాంతంలో విమానాన్ని కూల్చేస్తానని బెదిరింపు సందేశం పంపించాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రం ఈశాన్య నగరం ‘టుపెలో’లో జరిగింది. నగరంలోని వాల్మార్ట్ స్టోర్స్పై కూల్చేస్తాని హెచ్చరించాడని, దాంతో స్టోర్స్ను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. పైలట్తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ప్రజలకు సూచించాం. ఆ విమానం మొబిలిటీ ప్రకారం డెంజర్ జోన్ టుపెలో కంటే పెద్దగా ఉంటుంది.’ అని టుపెలో పోలీస్ విభాగం ఓ ప్రకటన చేసింది. ప్రజలు వాల్మార్ట్ స్టోర్స్ నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించారు. అన్ని అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. టుపెలో ఎయిర్పోర్ట్ నుంచి ‘బీచ్క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90’ అనే మినీ ఎయిర్క్రాఫ్ట్ను పైలట్ ఎత్తుకెళ్లినట్లు తెలిసిందన్నారు. ఆ విమానం డబుల్ ఇంజిన్ 9 సీటర్గా తెలిపారు. Currently we have a 29yr old who stole this plane & is threatening to crash it into something. Polices ,ambulances ,& fire trucks are everywhere. Everything is shutdown rn pic.twitter.com/AzebdIa3tP — City King (@CityKing_Gank_) September 3, 2022 ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్లో ఎయిర్హెస్టెస్.. ఆమె ఏం చేసిందంటే? -
డ్రగ్ టెస్టులో పైలట్ ఫెయిల్.. విధుల నుంచి ఔట్
న్యూఢిల్లీ: డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్ను ఫ్లైట్ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు. విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్ సెంటర్కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు. -
ప్రపంచం చుట్టేశాడు.. రెండు గిన్నిస్ రికార్డులు పట్టేశాడు
మాక్ రూథర్ఫర్డ్. వయసు 17 ఏళ్లు. బెల్జియం–బ్రిటిష్.. రెండు పౌరసత్వాలు ఉన్నాయి. చిన్న వయసులోనే రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించాడు. చిన్న విమానంలో ఒంటరిగా ప్రపంచమంతా చుట్టేశాడు. ఐదు నెలల క్రితం మొదలైన ఈ ప్రయాణం బుధవారం బల్గేరియా రాజధాని సోఫియాలోని ఎయిర్స్ట్రిప్లో ముగిసింది. ఎవరూ తోడులేకుండా భూగోళాన్ని చుట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా, మైక్రోలైట్ ప్లేన్లో ప్రపంచమంతా తిరిగి అత్యంత పిన్నవయస్కుడిగా రెండు రికార్డులు రూథర్ఫర్డ్ పరమయ్యాయి. ఇదీ చదవండి: ఇదేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది! -
Zoya Agarwal: అబ్బురపరిచే సాహసికి... అరుదైన గౌరవం
మ్యూజియం అంటే వస్తు,చిత్ర సమ్మేళనం కాదు. అదొక ఉజ్వల వెలుగు. అనేక రకాలుగా స్ఫూర్తిని ఇచ్చే శక్తి. అలాంటి ఒక మ్యూజియంలో కెప్టెన్ జోయా అగర్వాల్ సాహసాలకు చోటు దక్కింది... శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లోని ఏవియేషయన్ మ్యూజియం వైమానికరంగ అద్భుతాలకు వేదిక. అక్కడ ప్రతి వస్తువు, ప్రతి చిత్రం, పుస్తకం...ప్రపంచ వైమానికరంగ వైభవానికి సంబంధించి ఎన్నో విషయాలను చెబుతుంది. అలాంటి మ్యూజియంలో ఇప్పుడు మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటుదక్కింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలో చోటు సంపాదించిన తొలి భారతీయ మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది జోయా. ఇప్పుడు ఆమె అద్భుత సాహసాన్ని చిత్రాల నుంచి వస్తువుల వరకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. స్ఫూర్తి పొందవచ్చు. దిల్లీలో జన్మించిన జోయాకు చిన్నప్పటి నుంచి సాహసాలు అంటే ఇష్టం. పైలట్ కావాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రులు భయపడ్డారు. ‘పైలట్ కావడానికి చాలా డబ్బులు కావాలి. అంత స్తోమత మనకు ఎక్కడ ఉంది తల్లీ’ అని కూడా అన్నారు. అయితే అవేమీ తన మనసును మార్చలేకపోయాయి.ఏవియేషన్ కోర్స్ పూర్తయినరోజు తన ఆనందం ఎంతని చెప్పాలి! మొదటి అడుగు పడింది. ఒక అడుగు అంటూ పడాలేగానీ దారి కనిపించడం ఎంతసేపని! తొలిసారిగా దుబాయ్కి విమానాన్ని నడిపినప్పుడు జోయా సంతోషం ఆకాశాన్ని అంటింది. పైలట్ కావాలనుకొని అయింది. ఆ తరువాత కెప్టెన్ కూడా అయింది....ఇక చాలు అని జోయా అక్కడితో ఆగిపోయి ఉంటే ప్రపంచ వైమానికరంగ చరిత్రలో ఆమెకు అంటూ ఒక పుట ఉండేది కాదు. కోవిడ్ కోరలు చాచిన కల్లోల సమయంలో ‘వందే భారత్ మిషన్’లో భాగంగా విమానం ద్వారా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఇక అతిపెద్ద సాహసం గత సంవత్సరం చేసింది. నలుగురు మహిళా పైలట్లను కూర్చోబెట్టుకొని ఉత్తరధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జోయాను ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా నియమించడం అరుదైన గౌరవం. ‘అంకితభావం మూర్తీభవించిన సాహసి కెప్టెన్ జోయా అగర్వాల్. ఆమె విజయాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తాయి. వారి కలను నెరవేర్చుకునేలా చేస్తాయి. మ్యూజియంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చరిత్ర, విజయాలు ఈ తరానికే కాదు, భవిష్యత్తరాలకు కూడా ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి’ అంటున్నారు శాన్ఫ్రాన్సిస్కో ఎవియేషన్ మ్యూజియం అధికార ప్రతినిధి. ‘ఇది కలా నిజమా! అనిపిస్తుంది. ఈ గుర్తింపు నా దేశానికి, నాకు గర్వకారణం’ అంటుంది జోయా. జోయా అగర్వాల్ ప్రతిభ, సాహసం కలగలిసిన పైలట్ మాత్రమే కాదు యువతరాన్ని కదిలించే మంచి వక్త కూడా. ‘రాత్రివేళ ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అడిగేతే, తాను కచ్చితంగా పైలట్ కావాలనుకుంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. అయితే అలాంటి బాలికలు తమ కలను నెరవేర్చుకోవడానికి జోయాలాంటి పైలట్ల సాహసాలు ఉపకరిస్తాయి. తిరుగులేని శక్తి ఇస్తాయి. -
ఇన్స్టాగ్రామ్లో పైలట్గా ప్రొఫైల్.. 30మంది మహిళలకు టోకరా!
గురుగ్రామ్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు సైతం మీతో స్నేహం చేస్తామంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తారు. అలా ముక్కు మొహం తెలియని వారిని చాలా మంది ఆహ్వానిస్తారు. అయితే.. ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. 25 ఏళ్ల ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో పైలట్గా ప్రొఫైల్ పిక్ పెట్టి 30 మంది మహిళలను మోసం చేశాడు. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్లో వెలుగు చూసింది. ఓ యువతి ఫిర్యాదుతో ఢిల్లీ శివారులోని సెక్టార్ 43 ప్రాంతంలో నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి డెబిట్ కార్డు, మొబైల్ ఫోన్, రెండు సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హేమంత్ శర్మగా గుర్తించారు పోలీసులు. బుధవారం సిటీ కోర్టులో హాజరుపరచగా.. జుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇన్స్టాగ్రామ్లో పైలట్గా చెప్పుకుని తనకు స్నేహితుడిగా మారాడని, మోసపూరితంగా తన ఖాతా నుంచి రూ.1 లక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్హెచ్ఓ బిజేంద్ర సింగ్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసినట్లు తేలింది. ‘సుమారు 150 మంది యువతులకు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించాడు. విమానయాన సంస్థలో ఉద్యోగిగా చెప్పుకున్నాడు. వారిని మాటల్లో దింపి నిజమైన పైలెట్గానే నమ్మించేవాడు. ఆ తర్వాత తన ఖాతాకు డబ్బులు పంపించాలని కోరేవాడు. అలా చేసిన తర్వాత వారి ఖాతాలను బ్లాక్ చేస్తాడు. ఇప్పటి వరకు సుమారు 30 మందిని అలా మోసం చేసినట్లు తెలిసింది. మోసం చేసేందుకు ఇంటర్నెట్లో ఫొటోలు డౌన్లోడ్ చేసి ప్రొఫైల్ పిక్గా పెట్టుకునేవాడు.’ ఏసీపీ ప్రీత్ పాల్ సింగ్ సంగ్వాన్ తెలిపారు. ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్ -
ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో అనూహ్య ఘటన!... దూకేశాడా? పడిపోయాడా!
న్యూయార్క్: యూఎస్లోని నార్త్ కరోలినాలో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో కో పైలెట్ కిందపడి మృతి చెందాడు. ఐతే అతను విమానం అత్యవసర ల్యాండింగ్ టైంలో దూకేశాడా? లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియరాలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పారాచూట్ లేకుండా ఎలా దూకేశాడు అంటూ అధికారులు పలు అనుమానాలు లేవనెత్తారు. మృతి చెందిన సదరు కోపైలెట్ 23 ఏళ్ల చార్లెస్ హ్యూ క్రూక్స్గా గుర్తించారు అధికారులు. అతడి మృతదేహం విమానాశ్రయానికి దక్షిణంగా సుమారు 48 కిలోమీటర్లు దూరంలో లభించిందని అధికారులు తెలిపారు. అంతేకాదు విమానంలో మరో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ సేఫ్టి బోర్డు ఈ ఘటనకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రమాదానికి ముందు విమానం కుడివైపు ఉన్న చక్రం కోల్పోవడంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయం కోరినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం)