అయోధ్య విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయండి.. | Plea Seeking Live Streaming of Proceedings in Ayodhya Case | Sakshi
Sakshi News home page

అయోధ్య విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పిటిషన్‌

Published Wed, Sep 11 2019 5:54 PM | Last Updated on Wed, Sep 11 2019 5:57 PM

Plea Seeking Live Streaming of Proceedings in Ayodhya Case - Sakshi

సాక్షి, ఢిల్లీ : అయోధ్య కేసులో రోజువారీ చేపడుతున్న విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలంటూ బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 16న విచారించనుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త కె.ఎన్‌ గోవిందాచార్య తరపున మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వికాస్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, అయోధ్యలోని రామ జన్మభూమి వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని మధ్యవర్తిత్వం వహించేందుకు నియమించింది. ఆ కమిటీ పరిష్కార మార్గాలను సూచించడంలో విఫలమవడంతో సుప్రీం కోర్టే రోజువారీ విచారణను చేపడతానని ప్రకటించింది. ఇందుకోసం జస్టిస్‌ ఎస్‌ఎ బోబ్డే, డివై చంద్రచూడ్‌, అశోక్‌ భూషణ్‌, ఎస్‌ఎ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement