'మన్మోహన్ నోరు విప్పితే దేశానికి మేలు' | subrahmanyam suggests to Manmohan singh to tell truths | Sakshi
Sakshi News home page

'మన్మోహన్ నోరు విప్పితే దేశానికి మేలు'

Published Wed, Jan 21 2015 4:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'మన్మోహన్ నోరు విప్పితే దేశానికి మేలు' - Sakshi

'మన్మోహన్ నోరు విప్పితే దేశానికి మేలు'

న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నోరు విప్పితే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మన్మోహన్ నిజాయితీపరుడిగా పేరుందని, ఆయన నిజాలు మాట్లాడితే దేశానికి ఉపకారం చేసినట్టు అవుతుందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

బొగ్గు కుంభకోణంలో సీబీఐ మన్మోహన్ సింగ్ను ప్రశ్నించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి పైవిధంగా స్పందించారు. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో 2 జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల కేటాయింపు సహా పలు కుంభకోణాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement