తుపాకీతో బెదిరించి పదో తరగతి బాలికపై గ్యాంగ్రేప్ | Teenaged girl gang-raped at gunpoint in Delhi | Sakshi
Sakshi News home page

తుపాకీతో బెదిరించి పదో తరగతి బాలికపై గ్యాంగ్రేప్

Jul 29 2014 7:43 PM | Updated on Aug 1 2018 4:24 PM

తుపాకీతో బెదిరించి పదో తరగతి బాలికపై గ్యాంగ్రేప్ - Sakshi

తుపాకీతో బెదిరించి పదో తరగతి బాలికపై గ్యాంగ్రేప్

ఐదుగురు దుండుగులు పదో తరగతి విద్యార్థిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఐదుగురు దుండుగులు పదో తరగతి విద్యార్థిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి పాల్పడ్డ వారందరూ ఆ అమ్మాయికి తెలిసినవారే.

వారం రోజుల క్రితం బాధితురాలు స్కూల్కు వెళ్తున్న సమయంలో నిందితులు ఓ ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. మొబైల్ ఫోన్లో వీడియా తీశారు. ఈ సంఘటన గురించి బయటకే చెప్పరాదంటూ తుపాకీతో ఆ అమ్మాయిని బెదిరించారు. బాధితురాలు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఈ సంఘటన గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తుపాకీ, ఫోన్ రికార్డును కూడా స్వాధీనం చేసుకోవాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement